నిజంనిప్పులాంటిది

Jun 06 2023, 18:52

సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు పర్యటన

ఏలూరు జిల్లా:జూన్06

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటించారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించి.. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ముందుగా పోలవరం ప్రాజెక్ట్‌ ప్రాంతంలో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే చేపట్టారు. ఏరియల్‌ సర్వే ద్వారా పోలవరం పనులను పరిశీలించారు.

పోలవరం పనుల పురోగతిపై అధికారులు ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం జగన్‌ తిలకించారు. వరదల సమయంలో ఎగువ కాఫర్‌ డ్యాం పెంచిన ఎత్తు తీరును, పూర్తైన పనుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ దగ్గరకు చేరుకున్న సీఎంకు డయాఫ్రం వాల్ పరిస్థితిని అధికారులు వివరించారు.

మరో తుపాను దూసుకొస్తోంది, ఈ సారి ముంబైని వణికించనున్న సైక్లోన్ బైపార్జోయ్, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ

పోలవరం తొలిదశకు కేంద్రం రూ.12,911 కోట్లు మంజూరు చేసింది. బిల్లుల చెల్లింపులో విధించిన పరిమితుల తొలగింపునకు అంగీకారం తెలిపింది. 2013-14 ధరలు కాకుండా తాజా ధర మేర నిధులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రానికి కేంద్ర ఆర్థికశాఖ లేఖ రాసింది. కేంద్ర ఆర్థికమంత్రి ఆమోదించినట్లు లేఖలో స్పష్టం చేసింది. రూ. 10 వేల కోట్లు అడ్‌హక్‌గా ఇచ్చి ప్రాజెక్ట్‌ పూర్తికి సహాకారం అందించాలని కోరారు. సీఎం జగన్‌ విజ్ఙప్తిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. నిధులు విడుదల చేయాలని జలశక్తి శాఖకు ఆదేశాలిచ్చారు..,......

నిజంనిప్పులాంటిది

Jun 06 2023, 18:50

నాగర్ కర్నూల్ లో సీఎం కేసీఆర్ పర్యటన

నాగ‌ర్‌క‌ర్నూల్:జూన్ 06

నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా లో బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం సాయంత్రం ప్రారంభించారు. అంతకుముందు పార్టీ కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో బీఆర్ఎస్ పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్క‌రించారు.

తెలంగాణ త‌ల్లికి పూల‌మాల వేసి దండం పెట్టారు. పార్టీ ఆఫీసు ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి, గువ్వ‌ల బాల‌రాజు, బీరం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి, జైపాల్ యాద‌వ్‌తో పాటు ప‌లువురు ప్రజాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

రూ.52 కోట్లతో నిర్మించిన జిల్లా కలెక్టరేట్‌, రూ.35 కోట్లతో చేపట్టిన పోలీసు భవన సముదాయాల‌ను కేసీఆర్ మ‌రికాసేప‌ట్లో ప్రారంభించ‌నున్నారు.

అనంత‌రం వెల‌మ ఫంక్ష‌న్ హాల్ స‌మీపంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 06 2023, 17:20

తెలంగాణ బిజెపి నేతలకు కీలక పదవులు : బీజేపీ అదిరిపోయే స్కెచ్..

కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత తెలంగాణ బీజేపీ సైలెంట్ అయిపోయింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వరమైతే పెద్దగా ఎక్కడా కూడా వినిపించిందే లేదు. ఇక కొందరు నేతలు మాట్లాడుతున్నా కూడా తెలంగాణలో బీజేపీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదని.. మూడో స్థానానికి పడిపోయిందని.. ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఇటీవలి కాలంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పలువురు ప్రముఖ నేతలు చేరబోతున్నట్టు కూడా వార్తలొచ్చాయి.

ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. నేతలెవరకూ వేరొక పార్టీలోకి వెళ్లకుండా అదిరిపోయే స్కెచ్ వేసింది. మరి ఆ స్కెచ్ ఏంటి? ఇప్పటి వరకూ బీజేపీలో తమకు ఏమాత్రం ప్రాధాన్యం లేదని పలువురు నేతలు కలత చెందుతూ వచ్చారు. బీజేపీ అధిష్టానం బండి సంజయ్ మినహా తమను దగ్గరికి రానివ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారనే టాక్ కూడా నడిచింది. దీంతో రాష్ట్రంపై బీజేపీ సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. కీలక నేతలందరికీ బీజేీపీ అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

ఢిల్లీకి రావాలంటూ బీజేపీ నేతలకు పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. పార్టీ పిలుపు మేరకు నేడో రేపో హస్తినకు కమలనాథులు వెళ్లనున్నారు. అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం చేయనుంది. తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం స్పెషల్ పోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఈ నెలలో తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా రానున్నారు. 15న ఖమ్మంలో అమిత్ షా, 25న నాగర్ కర్నూల్ లో జేపీ నడ్డాల బహిరంగ సభలు జరగనున్నాయి.

ఇక ప్రధాని మోదీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన మల్కాజ్‌గిరిలో ఈ నెల 30న జరిగే సభలో పాల్గొంటారని సమాచారం. త్వరలో బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. డీకే అరుణ, ఈటల, రాజగోపాలరెడ్డి, కొండా విశ్వేశ్వరెడ్డి లాంటి నేతలకు బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం, అలాగే నేతలు పార్టీ మారకుండా చూసుకోవడమే లక్ష్యంగా అధిష్టానం అడుగులు వేస్తోంది. మొత్తానికి నేతలకు కీలక బాధ్యతలు అప్పగిస్తే మాత్రం వారు పార్టీ మారే అవకాశమే ఉండకపోవచ్చని తెలుస్తోంది...

నిజంనిప్పులాంటిది

Jun 06 2023, 17:18

తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ దాడులు

నిజామాబాద్: జూన్06

నిజామాబాద్ యూనివర్సిటీలో ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. యూనివర్సిటీలో గత కొంత కాలంగా అక్రమాలపై వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి.

యూనివర్సిటీలో ఫైళ్లను అధికారులు పరిశీలిస్తున్నారు. యూనివర్సిటీలో అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగాయని ఈసీ చర్యలకు దిగింది.

వీసీ రవీందర్ గుప్తా అక్రమాలకు పాల్పడ్డారని రిజిస్ట్రార్‌ను మారుస్తామని ఈసీ ప్రకటించింది. దీనికి వ్యతిరేకంగా కొత్త రిజిస్ట్రార్‌ను నియమిస్తూ వీసీ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో యూనివర్సిటీలో పాలన గందరగోళంగా మారింది. ఈసీ సభ్యులకు, వీసీకి మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ దాడులతో మరోసారి కలకలం చెలరేగింది......

నిజంనిప్పులాంటిది

Jun 06 2023, 16:33

చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి : తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్:జూన్ 06

నగరంలో చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మృగశిర 9వ తేదీన వస్తుందని.. ఆరోజు ఉదయం నుంచే చేప ప్రసాదం ప్రారంభం అవుతుందని తెలిపారు.

బత్తిన కుటుంబం 60 సంవత్సరాలుగా చేప ప్రసాదం పంపిణీ చేస్తోందని... చేప ప్రసాదానికి తెలంగాణ నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా లక్షలాధిగా వస్తున్నారన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

హరినాథ్ గౌడ్ కుటుంబం ఈ చేప ప్రసాదాన్ని వేస్తున్నారని అన్నారు. జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, పోలీస్ డిపార్ట్‌మెంట్ సమన్వయంతో పని చేస్తున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు వారి సేవ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

రాష్ట్ర వ్యాప్తంగా 30 స్టాల్ లు ఏర్పాటు చేశామని.. సీసీ కెమెరాలు, ఫైర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 250 మంది బత్తిని కుటుంబ సభ్యులు, వాలంటీర్‌లు పని చేస్తున్నారన్నారు. 3 సంవత్సరాలుగా కరోనాతో ఈ కార్యక్రమం జరగలేదన్నారు.

చేప ప్రసాదంతో పాటు ఇంటికి తీసుకెళ్లాడానికి కార్తీ కౌంటర్లు కూడా పెంచినట్లు చెప్పారు. గోషామహల్ ప్రజలు సహకరించాలని కోరారు. ఆర్టీసీ బస్సులు, మెట్రో సర్వీసులు, నాంపల్లి నుంచి రైల్వే సర్వీసులు అందుబాటులో ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు............

నిజంనిప్పులాంటిది

Jun 06 2023, 16:30

ఎన్టీఆర్‌ భవన్‌కు చేరుకున్న చంద్రబాబు... బాణాసంచాతో ఘనస్వాగతం

హైదరాబాద్:జూన్ 06

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు.

టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన సంధర్భంగా టీటీడీపీ అధ్యక్షుడు కాసాని ఆధ్వర్యంలో చంద్రబాబుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పాలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖరరెడ్డి, బక్కిన నరసింహులు, అర్వింద్ కుమార్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీడీపీ అధినేత రాకతో తెలంగాణ టీడీపీ నేతల్లో నూతనోత్సహం వచ్చి చేరింది. సన్మాన వేడుక అనంతరం నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, రానున్న ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ జతకట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు.. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చర్చలు జరపడం ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఈ క్రమంలో బీజేపీతో పొత్తు సహా.. తెలంగాణలో పార్టీ పరిస్థితులపై రాష్ట్ర నేతలతో టీడీపీ అధినేత చర్చించే అవకాశం ఉంది......

నిజంనిప్పులాంటిది

Jun 06 2023, 16:05

కాంగ్రెస్ గూటికి పొంగులేటి, జూపల్లి

ఖమ్మం జిల్లా :జూన్ 06

బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లు కాంగ్రెస్‌ లో చేరికకు ఆపార్టీ అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో హైకమాండ్‌ చర్చలు జరిపింది. కాంగ్రెస్‌ అగ్రనేతల సమక్షంలో పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే అభిమానులకు ఆ ఇద్దరు నేతలు సంకేతాలిచ్చారు.

కాగా ఈనెల 12న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రియాంక రాహుల్ గాంధీ లతో సమావేశం కానున్నారు.

ఈనెల 20వ తేదీ లేదా 25న ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రాహుల్‌ అమెరికా పర్యటన తర్వాత ఖమ్మం సభపై నిర్ణయం తీసుకోనున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది...

నిజంనిప్పులాంటిది

Jun 06 2023, 16:03

శ్రీవారిని దర్శించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్

తిరుపతి:జూన్ 06

రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీవారిని దర్శించుకున్నాడు. ఈరోజు ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నాడు. ప్రభాస్ తో పాటు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు, ఆదిపురుష్ టీమ్ సభ్యులు కొంతమంది ఈ సేవలో పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం ఆదిపురుష్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్, తిరుపతిలో గ్రాండ్ గా జరగనుంది.

ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో ఈ ఫంక్షన్ కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇందులో పాల్గొనేందుకు, నిన్ననే తిరుపతి చేరుకున్న ప్రభాస్, ఈరోజు పొద్దున్నే స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాడు. రామాయణంలో కొంత భాగాన్ని ఆదిపురుష్ సినిమాగా తీసిన సంగతి తెలిసిందే. అందుకే యూనిట్ లో సభ్యులంతా భక్తిభావంతో కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రభాస్, శ్రీవారిని దర్శించుకున్నాడు.

ఆదిపురుష్ సినిమా ప్రభాస్ కెరీర్ కు చాలా కీలకం. సాహో, రాధేశ్యామ్ డిజాస్టర్ల తర్వాత వస్తున్న ఈ సినిమా కచ్చితంగా హిట్టవ్వాలి. లేదంటే అతడి మార్కెట్ పై ఆ ప్రభావం పడుతుంది. అందుకే ఆదిపురుష్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు ఈ హీరో.

ఇక ప్రీ-రిలీజ్ ఫంక్షన్ హైలెట్స్ విషయానికొస్తే.. ఈ వేడుకలో 50 అడుగుల ఆదిపురుష్ హోలోగ్రామ్ ను విడుదల చేయబోతున్నారు. ఇక ఆధ్యాత్మిక ప్రవచనకర్త చినజీయర్ స్వామి, ఈ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా వస్తున్నారు. ఇదే వేదిక పైనుంచి అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారీ విరాళం ప్రకటించబోతోంది ఆదిపురుష్ యూనిట్.....,

నిజంనిప్పులాంటిది

Jun 06 2023, 13:06

1500 కి.మీ. మైలురాయికి చేరుకున్న నారా లోకేష్‌ యువగళం

జనగళమే యువగళమై 5కోట్ల మంది రాష్ట్రప్రజల ఆశీస్సులతో మహోజ్వలంగా సాగుతున్న యువగళం పాదయాత్ర ఈరోజు కడపలో 1500 కి.మీ. మజిలీకి చేరుకోవడం సంతోషంగా ఉందని పోస్ట్‌ పెట్టారు నారా లోకేష్‌.

ఈ సందర్భంగా కడపనగరంలో మెరుగైన డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటుకు అలంఖాన్ పల్లె వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించానని తెలిపారు.

అధికారంలోకి వచ్చాక కడప నగర ప్రజలకు మురుగునీటి బెడద నుంచి విముక్తి కలిగించే ఈ కార్యక్రమాన్ని పూర్తిచేస్తానని యువగళం సాక్షిగా మాట ఇస్తున్నానని పేర్కొన్నారు లోకేష్‌.

SB NEWS

నిజంనిప్పులాంటిది

Jun 06 2023, 07:46

Adipurush: నేడే తిరుపతిలో "ఆదిపురుష్" ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్యఅతిథిగా చిన్న జీయర్ స్వామి..!!

తిరుపతిలో వేడుక జరగబోతుందని స్పష్టం చేశారు. “ఆదిపురుష్” వాస్తవానికి జనవరి నెలలో విడుదల కావాల్సిన సినిమా.

కానీ ప్రారంభంలో సినిమాలో గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ సరిగ్గా లేకపోవడంతో… చాలా నెగెటివిటీ రావటం జరిగింది. “ఆదిపురుష్” ట్రైలర్ విడుదలైన సమయంలో భయంకరంగా ట్రోలింగ్ జరిగింది.

దీంతో సినిమాని జూన్ నెలకి వాయిదా వేసి గ్రాఫిక్స్ వర్క్ మొత్తం మార్చి.. సరికొత్త మార్పులతో ఎఫెక్ట్స్ తో విడుదల చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో “ఆదిపురుష్” రెండో ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారట. ఈ ట్రైలర్ లో రాముడు… రావణుడు మధ్య యుద్ధ సన్నివేశాలను చూపించనున్నట్లు సమాచారం.