నిజంనిప్పులాంటిది

Jun 04 2023, 09:44

పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం..

పల్నాడు జిల్లా:

దాచేపల్లి దగ్గర ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీ ని ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు ఢీ కొట్టింది.

ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి ఒంగోలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది...

నిజంనిప్పులాంటిది

Jun 04 2023, 09:42

Tirupathi: తిరుమలలో భక్తుల రద్దీ..

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం రోజున భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు.

టోకెన్ రహిత సర్వదర్శనానికి క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

కాగా నిన్న శనివారం శ్రీవారికి నాలుగు కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. 85,366 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 48,183 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.........

SB NEWS

నిజంనిప్పులాంటిది

Jun 03 2023, 22:07

Encounter ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌, మావోలకు మధ్య ఎదురుకాల్పులు

ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌ డివిజన్‌లోని నక్సల్స్‌ ప్రభావిత సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది..

ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నుంచి నలుగురు మావోయిస్టులు గాయపడ్డట్లుగా భద్రతా బలగాలు తెలిపాయి..

ఎన్‌కౌంటర్‌ను జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ ధ్రువీకరించారు. జిల్లాలోని ఎర్రబోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారాయిగూడ-రేగడగట్ట ప్రాంతంలో కోట ఏరియా కమిటీ కమాండర్ మంగడు, వెట్టి భీమాతో పాటు పలువురు మావోలు ఉన్నట్లు సమాచారం అందిందని తెలిపారు. ఈ మేరకు డీఆర్‌జీ బృందం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిందని పేర్కొంది..

అటవీ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తుండగానే.. రేగడగట్ట గ్రామ సమీపంలోకి జవాన్లను చూసిన మావోలు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన డీఆర్‌జీ జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఎన్‌కౌంటర్‌ ప్రాంతంలో నలుగురైదుగురు గాయపడ్డారని భద్రతా దళం ప్రకటించింది. ఘటనా స్థలంలో రక్తపు మరకలు మాత్రమే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయని వివరించారు..

నిజంనిప్పులాంటిది

Jun 03 2023, 20:34

పదేళ్లలో సీఎం కేసీఆర్ సాధించింది ఏమీ లేదు : వైయస్ షర్మిల

పదేండ్లలో సీఎం కేసీఆర్ సాధించింది అప్పులు, ఆత్మహత్యలు, కమీషన్లేనని శనివారం మీడియా సమావేశంలో వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. కేసీఆర్ ప్రసంగమంతా అబద్ధాలమయం, అరచేతిలో వైకుంఠమని విమర్శించారు.

రాష్ట్రాన్ని చూసి దేశం నివ్వెరపోతుందో లేదో తెలియదు కానీ కేసీఆర్ కమీషన్లు, కబ్జాలు, దందాలు చూసి దేశమే నవ్వుకుంటుందని చెప్పారు. రెండు సార్లు ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోలేదన్నారు.

రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.17 లక్షలకు పెరిగితే .. ఒక్కొక్కరి మీద రూ.1.50లక్షల అప్పు ఎందుకు ఉన్నట్లని షర్మిల ప్రశ్నించారు. 2014లో రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రం.. 2023 నాటికి 5 లక్షల కోట్ల అప్పులకు ఎందుకు చేరుకున్నట్లని నిలదీశారు.

జలయజ్ఞం ప్రాజెక్టులను సొంత ప్రాజెక్టులుగా చెప్పుకోడానికి కేసీఆర్ కు సిగ్గుండాన్నారు. డిజైన్ మార్చి లక్ష కోట్లకు పెంచి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేని కాళేశ్వరం కట్టి మోసం చేసిన చరిత్ర కేసీఆర్ దని విమర్శించారు. ..

నిజంనిప్పులాంటిది

Jun 03 2023, 20:32

గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదు.. రైతు దినోత్సవ వేడుకల్లో కవిత

కామారెడ్డిజిల్లా:

సదాశివనగర్ మండలం పద్మాజి వాడిలో జరిగిన రైతు దినోత్సవం వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదని.. తెలంగాణ ఏర్పడక ముందు రైతుల ఆత్మహత్యలు ఉండేవన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో నకిలీ విత్తనాలు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నమన్నారు కవిత. ఫేక్ సీడ్స్ సరఫరా చేసే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నామన్నారు.

రైతు సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగుచేసుకున్నామన్న ఆమె.. తెలంగాణ వచ్చాకే గ్రౌండ్ వాటర్ పెరిగిందన్నారు.

కాళేశ్వరం 22 వ ప్యాకేజీ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. వరిసాగులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని .. తెలంగాణ రైతులు లాభదాయకమైన పంటలవైపు దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు...

నిజంనిప్పులాంటిది

Jun 03 2023, 20:29

ఆకస్మాకంగా మంటలు చెలరేగి స్కార్పియో వాహనం దగ్ధం

నిజాంబాద్ :

అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఓ స్కార్పియో వాహనం దగ్ధమైంది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఎడపల్లి మండలం జాన్కంపేట్ నుండి నిజామాబాద్ వెళ్తుండగా ఈరోజు మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.

కారులో నుంచి పొగలు రావడం గమనించిన ప్రయాణికులు వెంటనే కిందగి దిగడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం కొద్దిసేపటికే మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదిలావుంటే, దేశంలో ఎండలు భగభగా మండిపోతున్నాయి. ఈ సమయంలో కార్లలో ప్రయాణించే వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన సమయంలో వాహనాన్ని కాసేపు ఆపి మరలా ప్రయాణించండి.

అలాగే ఎక్కువ సేపు ఎండలో పార్క్ చేసి ఉంచకండి. వీలైనంత వరకూ ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణించేలా ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.....,......

నిజంనిప్పులాంటిది

Jun 03 2023, 20:27

నేటి నుంచి ఏపీలో గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్షలు

అమరావతి :

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలు ఈరోజు నిర్వహించారు ఇవి ఈ రోజు నుంచి జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 6,455 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 జిల్లాల్లో ఈ పరీక్ష సెంటర్లను కేటాయించారు.

11 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు జూన్ 10 వరకు జరగనున్నట్లు ఏపీపీఎస్సీ సెక్రటరీ ప్రదీప్కుమార్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటలలోపు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఈ సారి బయోమెట్రిక్ తో పాటు.. తొలిసారి ఫేస్ రికగ్నైజేషన్ విధానం అమలు చేస్తున్నామని సెక్రటరీ ప్రకటించారు. దీని కోసం మొత్తం 70 బయో మెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షల నిర్వహిస్తామన్నారు. పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం చేశామని పేర్కొన్నారు. ఈ పరీక్ష రాసే దివ్యాంగుల కొరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 290 మంది దివ్యాంగ అభ్యర్థులు ఉన్నట్లు చెప్పారు. వారికి గంట అదనపు సమయం ఇస్తామన్నారు. పరీక్షను పూర్తిగా ఆఫ్ లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రశ్నాపత్రాలతో పాటు జవాబు పత్రాల బుక్ లెట్ ఇస్తామన్నారు. మాల్ ప్రాక్టీస్ కు ఆస్కారం ఉండదన్నారు. పేపర్ లీకేజీకి అవకాశం లేకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జనవరి 8 న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించింది. పరీక్షలు నిర్వహించిన కేవలం 19 రోజులకే ఫలితాలను విడుదల చేసి రికార్డు సృష్టించింది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మొత్తం 92 పోస్టులకు నిర్వహించిన ఈ పరీక్షకు 1,26,449 మంది అప్లై చేసుకోగా.. మెయిన్స్ కు 6,455 మంది అర్హత సాధించారు. జులైలో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు, ఆగస్టులో ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు ప్రణాళిలకు రూపొందిస్తున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ ఇటీవల వెల్లడించారు....

నిజంనిప్పులాంటిది

Jun 03 2023, 17:12

Train Accident: కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 178 మంది ఏపీ ప్రయాణికులు: వాల్తేరు డీఆర్‌ఎం

విశాఖపట్నం: ప్రమాదానికి గురైన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఏపీకి చెందిన 178 మంది ప్రయాణికులు ఉన్నట్లు వాల్తేరు డీఆర్‌ఎం వెల్లడించారు..

వందమందికి పైగా విశాఖకు రిజర్వేషన్‌ చేయించుకున్నట్లు చెప్పారు. వీరితోపాటు జనరల్‌ బోగీలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు.

బాలేశ్వర్‌ నుంచి ప్రత్యేక రైలు మరో 2 గంటల్లో విశాఖ రానున్నట్లు చెప్పారు. మరోవైపు విశాఖ నుంచి మరమ్మతు సిబ్బందితో ఒక రైలు బాలేశ్వర్‌ వెళ్తోందని చెప్పారు. యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఎంతమంది ఏపీ వాసులున్నారో తేలాల్సి ఉందని అన్నారు..

SB NEWS

నిజంనిప్పులాంటిది

Jun 03 2023, 17:11

Avinash CBI Enquiry: కొనసాగుతున్న అవినాశ్ విచారణ.. సీబీఐ ప్రశ్నలు ఇవే..

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) కడప ఎంపీ అవినాశ్ రెడ్డి (MP Avinash Reddy) సీబీఐ విచారణ కొనసాగుతోంది..

ఎంపీని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10 గంటలకు అవినాశ్ సీబీఐ ఎదుట హాజరయ్యారు. సాయంత్రం 5 గంటలకు విచారణ సాగనుంది. వాట్సప్ కాల్స్, నిందితులతో పరిచయాలపై సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం.

అడిషనల్ ఎస్పీ స్థాయిలో అధికారి సమక్షంలో విచారణ కొనసాగుతోంది. విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియోలు సీబీఐ అధికారులు చిత్రీకరిస్తున్నారు. వివేకా హత్యకు వాడిని గొడ్డలిపై కూడా సీబీఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సునీల్ యాదవ్ గొడ్డలి దాచిన విషయంపై ఆరా తీస్తోంది.

వివేకా మరణంపై జగన్ మోహన్ రెడ్డికి (AP CM YS Jaganmohan Reddy) ముందుగా ఎవరు చెప్పారన్న విషయాన్ని సీబీఐ లేవనెత్తింది. అయితే తనకు, ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని అవినాశ్ సీబీఐ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. అవినాష్ స్టేట్‌మెంట్‌ను సీబీఐ అధికారులు రికార్డ్ చేస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 03 2023, 13:27

ఐదు రాష్ట్రాల ఎన్నికలు : పార్టీలకు సవాల్ గా మారనున్నాయా ❓️

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు కేంద్రం ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. అధికారుల బదిలీ విషయంలో మార్గదర్శకాలు సూచిస్తూ ఆయా రాష్ట్రాల చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లకు లేఖలు రాసింది.

మరో ఆరు,ఏడు నెలల్లో ఐదు రాష్ట్రాలలో ఎన్నికల సందడి మొదలుకానుంది,

తెలంగాణలో 16-1-2024,

రాజస్థాన్ లో 14-01-2024,

మధ్యప్రదేశ్ లో 06-01-2024,

మిజోరాం లో 17-12-2023,

ఛత్తీస్‌గడ్ లో 03-01-2024,

తేదీల ప్రకారం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. అధికారులను వారి సొంత జిల్లాల్లో విధులు నిర్వహించకూడదని, అంతేకాకుండా మూడేళ్లపాటు ఒకేచోట ఉద్యోగం చేస్తున్న అధికారులను సైతం కొనసాగించవద్దని పేర్కొంది. ఈ కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు తెలుపుతూ రాష్ట్రాల చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లకు లేఖలు రాసింది.

ఎన్నికల డ్యూటీలో పాల్గొనే అధికారులు క్రిమినల్ కేసులు లేవని డిక్లరేషన్ తీసుకోవాలని తెలిపింది. అభ్యర్థుల్లో తమ బంధువులు లేరని కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని, బదిలీలు, పోస్టింగ్‌లపై జూలై 31లోగా నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం లేఖలో పేర్కొంది.