madagoni surendar

Apr 17 2023, 23:27

నల్గొండ జిల్లా ::ఏప్రిల్ 28న పూలే అంబేద్కర్ జాతరను జయప్రదం చేయండి.కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున.

ఏప్రిల్ 28న పూలే అంబేద్కర్ జాతరను జయప్రదం చేయండి.

మహాత్మ జ్యోతిబాపూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనకై నల్లగొండలోనీ (ఎస్ బి ఆర్ ఫంక్షన్ హాల్) బోయవాడ లో ఏప్రిల్ 28న ఉదయం 10 గంటలనుండి సాయంత్రం వరకు పూలే అంబేడ్కర్ జన జాతరను జయప్రదం చేయవలసిందిగా రిటైర్డ్ ఐఏఎస్ చోల్లేటి ప్రభాకర్ కోరారు.

నల్లగొండలో ఈరోజు అంబేద్కర్ భవనంలో పూలే అంబేడ్కర్ సన్నాహక సమావేశం కొండేటి శ్రీను గంజి మురళీధర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ పూలే అంబేడ్కర్ తమ జీవితాంతం కష్టించి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని భావితరాలకు రాజ్యాంగాన్ని అందించారని చదువు సమాజ అభివృద్ధికి పాటు పడ్డారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్బండా కులాలలో నీ సాంస్కృతిక బృందాలు డప్పులు కోలాటం భజన యక్షగానం చిందువేషాలు గోసంగి ఒగ్గు కథలు గంగిరెద్దులు, చెంచుల కాటికాపరుల ఎరుకల సోది అనేక రకాల కళారూపాలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ ఏప్రిల్ 19న నల్లగొండ పూలే విగ్రహం వద్ద కరపత్రాల ఆవిష్కరణ 20న నకరికల్లు నల్లగొండ మునుగోడులో సమావేశాలు కరపత్రం ఆవిష్కరణ 21న మిర్యాలగూడ నాగార్జునసాగర్ దేవరకొండలో కరపత్రాల పంపిణీ సామాజిక సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలను కలవనున్నట్లు తెలిపారు. 23 24 తేదీలలో నియోజకవర్గ కేంద్రాలలో సైకిల్ మోటార్ యాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 25న నల్లగొండ పట్టణ పురవీధులలో సైకిల్ మోటార్ యాత్రలు నిర్వహించాలని తెలిపారు. పూలే అంబేడ్కర్ జాతరలకు ముఖ్యఅతిదులుగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ మరియు నల్లగొండ ప్రముఖులు మేధావులు కవులు సాహితీవేతలు దళిత గిరిజన మైనారిటీ బిసి వృత్తి సంఘాల జిల్లా స్థాయి నాయకులు అంబేద్కర్ సంఘాలు స్వచ్ఛంద సంఘాలు నాయకులు పాల్గొంటారు సన్నాహక సమావేశంలో వృత్తిదారుల జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్ వైద్యుల సత్యనారాయణ కత్తుల షణ్ముఖ అవుట రవీందర్ ఎస్సీ ఉద్యోగుల సంఘం నాయకులు బిక్షపతి కత్తుల జగన్ మిరియాల యాదగిరి పిడిఎస్యు సాగర్ తెలగమల్ల యాదగిరి బొల్లూరి నరసింహ అవిశెట్టి శంకరయ్య చెరుకు పెద్దలు వనం నారాయణ గాదె నరసింహ మురారి మోహన్ కట్టెల శివకుమార్ బొల్లు రవీందర్ తదితర సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు.

పలడుగు నాగార్జున

గంజి మురళీధర్

madagoni surendar

Apr 17 2023, 21:06

నల్గొండ జిల్లా :నకిరేకల్::అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

నకిరేకల్ పురపాలిక ప్రధాన రహదారి విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధికారులను కోరారు. రహదారి విస్తరణ పనులను సోమవారం సాయంత్రం పరిశీలించారు ఈ పనులకు స్థానిక దుకాణాల యజమానులు సంపూర్ణ సహకారం అందించాలని అభివృద్ధిలో నకిరేకల్ ను ఆదర్శంగా తీర్చిదిద్దే కృషిలో భాగస్వాములు కావాలని కోరారు. మధ్య నుంచి ఇరువైపులా 50 అడుగుల మేర రహదారి విస్తరణ పనులు చేపట్టినందున భవిష్యత్ అవసరాల దృష్ట్యా సహకరించాలన్నారు. విస్తరణలో భాగంగా రహదారిపైకి వచ్చిన దుకాణాలు, ఇళ్ల శ్లాబుల ముందు భాగాలను తొలగించేందుకు పుర సిబ్బందికి విస్తరణ పనుల కాంట్రాక్టర్ సిబ్బందికి వ్యాపారస్తులు సహకరించాలని ఎమ్మెల్యే చిరుమర్తి కోరారు.

madagoni surendar

Apr 17 2023, 20:12

నల్గొండ జిల్లా :నకిరేకల్ ::ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

*ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకొని ప్రభుత్వం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నకిరేకల్ పట్టణంలోని శకుంతల ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన దావత్- ఏ- ఇఫ్తార్ విందులో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ...

ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు ఐక్యతకు చిహ్నం ఇఫ్తార్ అన్నారు.

ఉపవాసాలతో పేదల ఆకలి బాధలు తెలిపిన మహమ్మద్ ప్రవక్త చూపిన దారిలో మంచి పనులు చేయడం గొప్ప విషయమన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలు కులాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారని దసరా సందర్బంగా చీరల పంపిణి, క్రిస్మస్ సందర్బంగా కానుకలు , రంజాన్ కు తోఫా అందిస్తున్నారని పేర్కొన్నారు.

రంజాన్ పవిత్ర మాసంలో ఎంతో నిష్ఠతో ఉపవాసాలు ఉంటున్న ముస్లింలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో.నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్,నకిరేకల్ మండల కో ఆప్షన్ నెంబర్ డాక్టర్ ఖాసింఖాన్,మైనార్టీలు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 17 2023, 18:09

నల్గొండ జిల్లా ::నార్కట్ పల్లి ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతా. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

నార్కట్ పల్లి ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతా   

ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య    

Streetbuzz news. నల్గొండ జిల్లా :

నార్కట్ పల్లి పట్టణంలో సకల సౌకర్యాలు కల్పించి మోడల్ సిటీగా తీర్చిదిద్దుతానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం పట్టణంలో 5వ వార్డులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు త్వరలో పట్టణంలోని రోడ్డు విస్తరణ పనులు ప్రారంభిస్తామన్నారు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు.

madagoni surendar

Apr 17 2023, 18:58

సూర్యాపేట జిల్లా ::జాన్ పహాడ్ దర్గాలో భక్తులను నిలువునా..దోచేస్తున్నారు.

జాన్ పహాడ్ దర్గాలో భక్తులను నిలువునా..దోచేస్తున్నారు

ఏప్రిల్ 17 : సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్ పహాడ్ గ్రామంలో సైదులు స్వామి దర్గా వద్ద మొక్కులు తీర్చుకొనేందుకు వచ్చిన భక్తులను నిలువునా దోచేస్తున్నారు.

దర్గాలోనికి వెళ్లాలంటే 700 రూపాయలు, దర్గాలోపల మరోచోట 1100 రూపాయలు చెల్లించకపోతే దర్గాలోనికి అనుమతించడం లేదు.

దర్శనానికి వెళ్ళితే అదనంగా మరో 100 రూపాయలు వసూలు చేస్తున్నారు.

ఇన్ని జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు వాపోతున్నారు.

దేవుని దర్శనానికి వచ్చి మొక్కులు తీర్చుకోవాలంటే దర్గా లోపలా, బయట కలిపి మొత్తం దాదాపు 5వేల రూపాయల ఖర్చు అవుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

madagoni surendar

Apr 17 2023, 16:43

నల్గొండ జిల్లా. నకిరేకల్ ::హత్ జోడో అభియాన్ యాత్ర సన్నాక సమావేశానికి హాజరైన. మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య.

హత్ జోడో అభియాన్ యాత్ర సన్నాక సమావేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య.

నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మండలంలోనీ జేపీ ఫంక్షన్ హాల్ లో జరిగిన హత్ సే హత్ జోడో అభియాన్ యాత్ర సన్నాక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య. ఈ సందర్భంగా. మాజీ ఎమ్మెల్యే వెంకయ్య మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రామన్నపేట మండలం నుంచి భారీ ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ,యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు .పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపాముల శేఖర్ .మాజీ మండల అధ్యక్షుడు శరత్ చంద్ర. యూత్ కాంగ్రెస్ నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షులు గుండా జలంధర్ రెడ్డి. మైనార్టీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యూసుఫ్ జానీ .కిసాన్ సెల్ రాష్ట్ర కో_ఆర్డినేటర్ అల్గుబెల్లి మహేందర్ రెడ్డి . రామన్నపేట మండల చేనేత విభాగం అధ్యక్షులు సాయిబాబు. కేతపల్లి మాజీ మండలాధ్యక్షుడు కోట పుల్లయ్య . నకిరేకల్ మాజీ వార్డ్ మెంబర్ గుణగంటి రాజు గౌడ్ .ఐ.యన్. టి.యు.సి. జిల్లా జనరల్ సెక్రెటరి తాటిపాముల కిరణ్ కుమార్. ఐ.యన్.టి .యు.సి. అధ్యక్షుడు లింగం గౌడ్. ఎస్సీ సెల్ రామన్నపేట మండల అధ్యక్షుడు గురక శివ. నకిరేకల్ మండలం అధ్యక్షుడు కొత్తపెళ్లి సైదులు .నకిరేకల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొంబాయి శీను. బయ్య ముత్తయ్య.మరియు రామన్నపేట మండలంలోని వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 17 2023, 15:55

నల్గొండ జిల్లా :నకిరేకల్ ::పేద ముస్లింలకు ప్రభుత్వం సరఫరా చేసిన దుస్తులను పంపిణీ చేసిన.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి*

పేద ముస్లింలకు ప్రభుత్వం సరఫరా చేసిన దుస్తులను పంపిణీ చేసిన.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

Streetbuzz news. నల్గొండ జిల్లా :

రామన్నపేట మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో రంజాన్ మాసం సందర్బంగా పేద ముస్లింలకు ప్రభుత్వం సరఫరా చేసిన దుస్తులను సోమవారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి.మాట్లాడుతూ...సర్వ మతాల సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అని ఆయన తెలిపారు.వారి ఉన్నతికి అనేక సంక్షేమ పధకాలను తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కింది అని ఆయన అన్నారు.సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు బాగుంటే నే అది మంచి సమాజం అవుతదని నమ్మిన నేత కేసీఆర్ అన్నారు.అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం పలు పథకాలను అమలుపరుస్తున్నది.

madagoni surendar

Apr 16 2023, 19:04

నల్గొండ జిల్లా :నకిరేకల్:: ఎల్ ఓ సి. చెక్కును అందజేసిన.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

ఎల్ ఓ సి చెక్కును అందనేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

రామన్న పేట మండలం లక్ష్మ పురం గ్రామానికి చెందిన నీల లింగయ్య. ఆనారోగ్యంతో బాధపడుతూ అత్యసవర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి పధకం కింద మంజూరైన రూ. 2 లక్షల రూపాయల ఎల్ ఓ సి.ని ఆదివారం నార్కట్ పల్లి క్యాంపు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,అందజేశారు. అనంతరం. చిన్నారి ని అశిర్వదించిన.ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

కట్టంగూర్ ఉప సర్పంచ్ అంతటీ శీనుగౌడ్ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశిన.ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.ఈ కార్యక్రమంలో.గ్రంథాలయ చైర్మన్ మల్లికార్జున, నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నరసింహ్మ గౌడ్,నాయకులు రాచకొండ శ్రవణ్ గౌడ్,పోగుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 15 2023, 12:51

నల్గొండ జిల్లా ::నకిరేకల్ :మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి.

పేద ముస్లింలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం.

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.శనివారం నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రంజాన్ పండుగ సందర్బంగా పేద ముస్లిం కుటుంబాలకు బట్టల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై పంపిణి చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ.....సర్వ మతాల సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అని ఆయన తెలిపారు.వారి ఉన్నతికి అనేక సంక్షేమ పధకాలను తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కింది అని ఆయన అన్నారు.సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు బాగుంటే నే అది మంచి సమాజం అవుతదని నమ్మిన నేత కేసీఆర్ అన్నారు.అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం పలు పథకాలను అమలుపరుస్తున్నది. ఈ కార్యక్రమంలో. నకిరేకల్ మున్సిపాలిటీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ జడ్పీటీసీ మాద ధనలక్ష్మినాగేష్,మండల కో ఆప్షన్ నెంబర్ డాక్టర్ ఖాసీం ఖాన్,కౌన్సిలర్లు,మైనార్టీలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు,

madagoni surendar

Apr 14 2023, 19:58

నల్గొండ జిల్లా :నకిరేకల్ పట్టణ కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

నకిరేకల్ పట్టణ కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

నకిరేకల్ పట్టణ కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో డా. బీ.ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి సందర్బంగా నాయకులతో కలిసి బస్టాండ్ దగ్గర విగ్రహానికి పులామాల వేసి నివాళులు అర్పించి. పట్టణ బూత్ లలో జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బి జె కే యమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడుగుంట్ల సాయన్న,పట్టణ అధ్యక్షులు పల్స శ్రీనుగౌడ్ మాట్లాడుతూ..అంబేద్కర్ ఆలోచనలకు అనుకూలంగా భారత ప్రధాని నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అంబేద్కర్ దళితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఇస్తా అన్నా మూడు ఎకరాల భూమి ఇవ్వలేదని,డబుల్ బెడ్రూం ఇవ్వలేదు,ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు,దళితులకు దళిత బంధు ఇస్తా అని ఇవ్వకుండా వీటిని మభ్యపరిచేందుకు 125 అడుగుల విగ్రహం కట్టిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ మనసుకు శాంతి చేకూరదని తెలంగాణ ప్రజలు బి ఆర్ ఎస్. ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో పాలడుగు నగేష్,మైల శ్రీనివాస్,అప్పం అంజయ్య,నిమ్మల ఉమ,నడికుడి నవీన్,వంగురి సైదులు,ఏర్పుల నరేష్,శ్యామ్ రెడ్డి,జాల వెంకన్న,రాపోలు ఉపేంద్రా,ప్రవీణ్,తదితర మిత్రులు పాల్గోన్నారు.*