madagoni surendar

Mar 28 2023, 16:00

ఐపీల్ 2023: ఐపీఎల్ నయా రూల్స్.. జట్లన్నీ కొత్తగా.

ఐపీల్ 2023: ఐపీఎల్ నయా రూల్స్.. జట్లన్నీ కొత్తగా.

Streetbuzz news ::

పోయిన ఏడాది వరకు ఒక లెక్క.. ఈ ఏడాది ఇంకో లెక్క అన్నీ రీతిలో ఐపీఎల్ 2023 సీజన్ ఉండనుంది. ఈసారి జట్లన్నీ కొత్తగా కనిపించనున్నాయి. చాలా జట్లు తమ కీలక ప్లేయర్లను ఈ సీజన్లో వదిలేశాయి. టీ20 ప్రపంచకప్ లో రాణించిన కొంతమంది ప్లేయర్లు ఈ సీజన్ లో భారీ ధరకు అమ్ముడుపోయారు. పంజాబ్.. శామ్ కరన్ రూ.18.5 కోట్లకు దక్కించుకోగా, బెన్ స్ట్కోక్స్ ను చెన్నై రూ.16.25 కోట్లకు దక్కించుకుంది. పోయిన ఏడాది సన్ రైజర్స్ కెప్టెన్ గా ఉన్న విలియమ్సన్.. ఇప్పుడు గుజరాత్ తరుపున ఆడనున్నాడు. ఢిల్లీకి వార్నర్, సన్ రైజర్స్ కు మార్ క్రమ్, పంజాబ్ కు ధవన్, కోల్ కతాకు నితిష్ రాణా కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.

మళ్లీ ఇంటా, బయటా…

లీగ్ స్టేజ్ లో మ్యాచ్ లన్నీ ఇంటా, బయట విధానంలో జరగడం కొత్తేమీ కాదు. అయితే. 2019 కరోనా తర్వాత ఆ రూల్ ని తీసేశారు. ప్రస్తుతం మళ్లీ ఐపీఎల్ 2023లో ఈ రూల్ ని తీసుకొచ్చారు. ప్రతి జట్టు సొంతగడ్డపై 7 మ్యాచులు, ప్రత్యర్థి మైదానంలో 7 మ్యాచులు ఆడుతుంది. ఈసారి మొత్తం 12 వేదికల్లో ఐపీఎల్ మ్యాచులు జరుగుతాయి. రాజస్థాన్‌, ధర్మశాల, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, ముంబై, కోల్‌కతా, లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్‌, జైపుర్‌, మొహాలీలో మ్యాచ్‌లు జరుగుతాయి.

madagoni surendar

Mar 28 2023, 15:52

ఏపీ :అనంతపురం జిల్లా::రమాదేవి హత్యలో పోలీసులు నిర్లక్ష్య వైఖరి స్పష్టమని పిర్యాదు

కణేకల్ మండలం లో పిడిఎసుయు అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు : మల్లెల ప్రసాద్ మాట్లాడుతూ

ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం,

Stretubuzz news.

అనంతపురం జిల్లా లో సోమవారం నార్పల మండల పరిధిలోని బొందలవాడ గ్రామంలో దారుణ హత్యకు గురైన కడపల రమాదేవి మరియు మరీ ఎందరో గత వైసీపీ పాలన లో S.C S.T లు పై దౌర్జన్యం. దాడులు,హత్యలు మాన భంగాలు జరిగావి మాకు రక్షణ కల్పించలేరాని..?రమాదేవి ఫ్యామిలీ నిలదీశారు.రమాదేవి హత్యలో పోలీసులు నిర్లక్ష్య వైఖరి స్పష్టమని పిర్యాదు చేయడానికి పోయిన తల్లి, దండ్రులను పోలీసులు బెదిరించడం సరికాదన్నారు.హంతుకుడు జాఫర్ వలికే వత్తాసు పలకడం సిగ్గు చేటన్నారు. ఎస్సీ,ఎస్టీల ప్రాణాలంటే ఎందుకు అంత చులకన్నారు. ఎస్సీ,ఎస్టీల పై దాడులను అరికట్టాలి,స్నేహ లత,నల్లపు రమ్య,టేకు లక్ష్మి,ప్రీతి నాయక్ ఇలా సబ్బండ కులాల అడ బిడ్డలను ఎంత మందిని పోగొట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన చెందారు.మా గోడు,ఉసురు తగలక పోదాని శపించారు. రమాదేవి కిరాతకంగా హత్య చేసిన జాఫర్ వలిని పాస్ట్ ట్రాక్ కోర్టు ద్వార విచారణ జరిపి ఉరి తీయాలని,కేసు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని,ఈ వైసీపీ ప్రభుత్వం మృతురాలు కుటుంబానికి 50లక్షల ఎక్షగ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.లేని పక్షంలో పోరాడి సాధించు కుంటామన్నారు. రమాదేవి నీ కిరాతకంగా హత్య చేసిన జాపర్ వలిని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని శిక్ష వేయాలని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము,

             ఇట్లు

       మల్లెల ప్రసాద్

ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం

పిడిఎసుయు అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు

madagoni surendar

Mar 28 2023, 15:42

ఏపీ:ఎస్సీ సబ్ ప్లాన్ పనుల కోసం రూ.13112 కోట్ల వ్యయం.ఫిబ్రవరి మాసాంతానికి 70.81% నిధుల ఖర్చు • 100% నిధులు ఎస్సీలకు చేరేలా అధికారులు పని చేయాలి.

ఎస్సీ సబ్ ప్లాన్ పనుల కోసం రూ.13112 కోట్ల వ్యయం

• ఫిబ్రవరి మాసాంతానికి 70.81% నిధుల ఖర్చు

• 100% నిధులు ఎస్సీలకు చేరేలా అధికారులు పని చేయాలి

• నోడల్ ఏజెన్సీ సమావేశంలో మంత్రి మేరుగు నాగార్జున.

Stretbuzz news:

అమరావతి, మార్చి 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన రూ.18518.29 కోట్ల లో గత ఫిబ్రవరి మాసాంతానికి నాటికి 70.81శాతం నిధులు ఖర్చు కావడం జరిగిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. సబ్ ప్లాన్ నిధుల వినియోగం మరింతగా పెరగాలని , ఎస్సీల కోసం కేటాయించిన నిధులన్నీ వారి సంక్షేమానికే ఉపయోగపడేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన ఎస్సీ సబ్ ప్లాన్(ఎస్సీ కాంపొనెట్)కు చెందిన 30వ నోడల్ ఏజెన్సీ సమావేశంలో నాగార్జున సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ శాఖల్లో 43 శాఖలకు చెందిన అధికార ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని తమ శాఖల ద్వారా ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల వ్యయం గురించి వివరించారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రధానమైన శాఖలకు ప్రభుత్వం రూ.18518.29 కోట్లను ఎస్సీ సబ్ ప్లాన్ కోసం కేటాయించిందని చెప్పారు. అయితే రాష్ట్రంలోని కొన్ని శాఖలు సబ్ ప్లాన్ ద్వారా తాము ప్రతిపాదించిన పనుల కోసం అదనపు బడ్జెట్ కావాలని కోరడం, ప్రభుత్వం ఆ విధంగానే అదనపు బడ్జెట్ ను కేటాయించడంతో ఈ మొత్తం రూ.20605.44 కోట్లకు చేరిందని తెలిపారు. సబ్ ప్లాన్ నిధుల వినియోగం విషయంలో కొన్ని శాఖలు అంచనాలకు మించి ప్రగతిని సాధిస్తుండగా కొన్ని శాఖలు మాత్రం వెనుకబడి ఉన్నాయని గుర్తించామన్నారు. ఆయా శాఖల పనితీరు ఆధారంగా గ్రేడ్లను నిర్ణయించామన్నారు. 76% నుంచి 100% నిధులను వినియోగించిన శాఖలు ఏ-గ్రేడ్ గాను, 51% నుంచి 75% దాకా నిధులను వినియోగించిన శాఖలను బీ-గ్రేడ్ గానూ,26% నుంచి 50% దాకా నిధులను వాడుకున్న శాఖలను సీ-గ్రేడ్ గాను, 25% వరకూ మాత్రమే నిధుల వినియోగం ఉన్న శాఖలను డీ-గ్రేడ్ గాను గుర్తించామని, ఈ గ్రేడ్ల ఆధారంగానే సబ్ ప్లాన్ నిధుల వినియోగాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుందని నాగార్జున వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన సబ్ ప్లాన్ నిధుల్లో రూ.13112.36 కోట్లు ఫిబ్రవరి మాసాంతానికి ఖర్చు అయ్యాయని వెల్లడించారు. సబ్ ప్లాన్ నిధుల్లో అత్యధికశాతం ఖర్చు చేసిన విద్యుత్, సివిల్ సప్లయిస్, ప్రజారోగ్యం, పరిశ్రమలు, వైద్య విద్య, ఎస్సీ గురుకులాలు, రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ, భూ పరిపాలన, వ్యవసాయం, బలహీనవర్గాల గృహనిర్మాణం, పంచాయితీరాజ్ తదితర శాఖల పనితీరును ప్రశంసించారు. నిధుల వినియోగంలో వెనుకబడిన శాఖల పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. సబ్ ప్లాన్ ద్వారా కేటాయించిన నిధుల్లో వినియోగించుకోని నిధులను మరొక ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేసే అవకాశం లేదని గుర్తించాలని అధికారులకు సూచించారు. ఈ కారణంగానే సబ్ ప్లాన్ ద్వారా కేటాయించిన నిధుల్లో ప్రతి రుపాయి కూడా ఎస్సీల ప్రగతికి ఉపయోగపడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.జయలక్ష్మి, డైరెక్టర్ కే.హర్షవర్ధన్, అడిషనల్ డైరెక్టర్ రఘురామ్, డిప్యుటీ డైరెక్టర్ లక్ష్మీ సుధ తో పాటుగా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

• ఫోటోవార్త: ఎస్సీ సబ్ ప్లాన్ నోడల్ ఏజెన్సీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి మేరుగు నాగార్జున.

madagoni surendar

Mar 28 2023, 14:38

ఏపీ ::ఎన్టీఆర్ జిల్లా /జుజ్జూరు లో వైయస్ఆర్ ఆసరా మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు.

ఎన్టీఆర్ జిల్లా / జుజ్జూరు :

జుజ్జూరు లో వైయస్ఆర్ ఆసరా మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .

ఆసరాతో అక్క చెల్లెమ్మలకు అండగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ..

వీరులపాడు మండల పరిధిలో 1055 పొదుపు సంఘాలకు 10550 మంది అక్కచెల్లెమ్మలకు రూ.8 కోట్ల 74 లక్షల రుణమాఫీ ..

డ్వాక్రా మహిళలను సైతం మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు ది ..

టిడిపి నేతలు నిజమైన సైకోలుగా వ్యవహరిస్తున్నారు ..

జుజ్జూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వీరులపాడు మండల పరిధి వైయస్సార్ ఆసరా మూడో విడత కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు చెక్కును పంపిణీ చేశారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంక్షేమమే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య ఆశయమని, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత, అమ్మఒడి, 45 సంవత్సరాల వయసు వారికి రూ.18,750, సున్నా వడ్డీ పథకం డ్వాక్రా రుణాల మాఫీతో మహిళలను ఆర్థికంగా నిలబెట్టిన ఘనత ఒక్క జగన్ కే దక్కిందని చెప్పారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామన్న ఆలోచనతో టిడిపి వైయస్సార్ సిపి ఎమ్మెల్యేలకు డబ్బు ఎరచూపి ఎమ్మెల్సీ గెలవడం గొప్ప అని ఎద్దేవా చేశారు, తామొస్తే పథకాలు రద్దు చేస్తామని చెబుతున్న చంద్రబాబు పొత్తులు లేకుండా పోటీ చేసే దమ్ము ఉందా అని అనడంతో .. లేదు.. లేదంటూ మహిళలు బదులిచ్చారు .. ప్రజాసంకల్ప పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు గతంలో రెండు విడతలుగా రుణమాఫీ నగదు అందించామని, మూడో విడత సైతం పంపిణీ చేసినట్లు తెలిపారు, మహిళల జీవన ప్రమాణాలు మార్చాలనదే సీఎం జగన్ లక్ష్యంమని, కులమతాలు, పార్టీలకతీతంగా డ్వాక్రా మహిళలందరికీ ఆసరా పథకం ద్వారా రుణమాఫీ చేస్తున్నామన్నారు, గత టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు డ్వాక్రా మహిళల బకాయిలు రద్దు చేస్తామని చెప్పి మోసం చేశారని గుర్తు చేశారు, టిడిపి నేతలు నిజమైన సైకోలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు .. అనంతరం మహిళలంతా థాంక్యూ సీఎం సార్ అంటూ నినదించడంతో సభా ప్రాంగణం మార్మోగింది ..

ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు, ఎంపీపీ కోటేరు లక్ష్మీ ముత్తారెడ్డి, జడ్పిటిసి అమర్లపూడి కీర్తి సౌజన్య, వైస్ ఎంపిపి ఆదాం, నాగుల్ మీరా, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ బేగం, మార్కెట్ యార్డ్ చైర్మన్ కోటేరు మల్లీశ్వరి సూర్యనారాయణ, మండల కన్వీనర్ ఆవుల రమేష్ బాబు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బొమ్మిశెట్టి భాస్కరరావు, స్థానిక గ్రామ సర్పంచ్ కోటి మరియు పలు గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..

madagoni surendar

Mar 28 2023, 14:28

ఏడాది కాలం దమ్ము ధూళిలో చాలా కష్టాలు :హీరో నాని

ఏడాది కాలం దమ్ము ధూళిలో చాలా కష్టాలు : నాని

 

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దసరా’. సుధాకర్ చెరుకూరి నిర్మాత. కీర్తి సురేష్ హీరోయిన్‌‌‌‌. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మార్చి 30న రిలీజ్ కానుంది. ఆదివారం సాయంత్రం అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈసందర్భంగా నాని మాట్లాడుతూ ‘ఇన్ని రోజులు మిమ్మల్ని మెప్పించే మాస్ చూసి ఉంటారు. ‘దసరా’తో మీ మనసుకు హత్తుకునే మాస్ చూపిస్తాను. ఇది నా ప్రామిస్. కళ్ళల్లో చిన్న గ్లిట్టర్‌‌‌‌‌‌‌‌తో విజిల్స్ వేసే ఆనందం దసరాతో ఎక్స్‌‌‌‌పీరియన్స్ చేస్తారు. దసరా నా మనసుకు దగ్గరైనా సినిమా. ఏడాది కాలం దమ్ము ధూళిలో చాలా కష్టాలు పడి టీం అంతా హార్డ్ వర్క్ చేశాం. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌‌‌‌ని రూపొందించిన నిర్మాత సుధాకర్, దర్శకుడు శ్రీకాంత్‌‌‌‌కి థ్యాంక్స్’ అని చెప్పాడు.

కీర్తి సురేష్ మాట్లాడుతూ ‘నాని, నేను కలిసి ‘నేను లోకల్’ సినిమా చేశాం. కానీ నాకు ‘దసరా’నే లోకల్ అనిపిస్తుంది. నాని నా బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ కో యాక్టర్. ఈ సినిమాతో అందరికీ వెన్నెలగా గుర్తుంటాను’ అని చెప్పింది. నటుడు దీక్షిత్ శెట్టి, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా, లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.

madagoni surendar

Mar 28 2023, 13:52

హైదరాబాద్ : మహిళలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల ఎత్తులు.. ఇంట్లో కూర్చోబెట్టే లక్షలు దోచేస్తున్న కేటుగాళ్లు..

హైదరాబాద్ : మహిళలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల ఎత్తులు.. ఇంట్లో కూర్చోబెట్టే లక్షలు దోచేస్తున్న కేటుగాళ్లు..

మహిళలే లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్ల ఎత్తులు రోజురోజుకూ సృతి మించుతున్నాయి. తాజాగా తెలంగాణలోని అబిడ్స్‌లో ఓ యువతి వీరి మాయలోపడి రూ.5 లక్షలు పోగొట్టుకుంది. బీటెక్‌ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్న యువతి మొబైల్‌ ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. ఇంటి వద్ద ఉంటూనే రోజూకు అరగంట పని చేసుకుని రూ.700ల నుంచి 900ల వరకు సంపాదించొచ్చంటూ ఆశ చూపారు. అందుకు ముందుగా రూ.2,000 రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద కట్టించుకున్నారు. నెల తర్వాత డిజిటల్‌ ఖాతాలో రూ.28 వేల ఆదాయం చూపారు. ఆ మొత్తం సొమ్ము విత్‌డ్రా చేసుకునేందుకు అదనంగా రూ.50 వేలు డిపాజిట్‌ చేయాలనే షరతు పెట్టారు. సంపాదన పెరుగుతున్న కొద్దీ డిపాజిట్‌ పెంచుతూ వచ్చారు. ఈ క్రమంలో రూ.5 లక్షలు డిపాజిట్‌ చేయించుకొని చెప్పాపెట్టకుండా ఖాతా రద్దు చేశారు. మోసపోయానని తెలుసుకున్న యువతి పోలీసులను సంప్రదించింది.

ఇలా ఫోన్లకు తొలుత పార్ట్‌టైం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అంటూ మెసేజ్‌లను పంపించి ఆశల వల విసురుతున్నారు. గతంలో దీపాల వత్తులు, కరక్కాయ పొడి, బుక్స్‌ పీడీఎఫ్‌గా మార్చి రూ.లక్షలు సంపాదించమంటూ సామాజిక మాధ్యమాల వేదికగా మోసగాళ్లు చెలరేగారు. వీరి వలలో గృహిణులు, యువతులు అధికంగా చిక్కుకుంటున్నారు. నగరంలో సైబర్‌ క్రైమ్‌కు వస్తున్న ఫిర్యాదుల్లో అధిక శాతం ఉద్యోగం, పెట్టుబడులకు సంబంధించిన మోసాలే ఉంటున్నాయి. బాధితుల్లో విద్యార్థినులు, ఉన్నత విద్యావంతులు, గృహిణులు అధికంగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ముఖ్యంగా ఉద్యోగ వేటలో ఉన్న యువతులు తేలికగా బుట్టలో పడుతున్నారు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఖాళీ సమయాల్లో 2-3 గంటలు కష్టపడితే చాలనే ఉద్దేశంతో బాధితులు అవతలి వారి మాటలను నమ్ముతూ ఉచ్చులో చిక్కుతున్నారు. ఇంట్లో ఉంటూ సంపాదించే అవకాశం ఉందనగానే తేలికగా నమ్మి సామాజిక మాధ్యమాలు, ఫోన్లకు వచ్చే ఇటువంటి ప్రకటనలు నమ్మొద్దు. మోసపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండంటూ హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ డీసీపీ నేహా మెహ్రా సూచించారు.

madagoni surendar

Mar 28 2023, 13:37

జగ్గయ్యపేట నియోజకవర్గ అభివృద్ధి నియోజకవర్గ ప్రజల త్రాగునీటి సమస్య పరిష్కారం కొరకు 1కోటి 7లక్షల 50 వేల రూపాయల నిధులను కేటాయించిన విజయవాడ ఎంపీ.

జగ్గయ్యపేట నియోజకవర్గ అభివృద్ధి మరియు నియోజకవర్గ ప్రజల త్రాగునీటి సమస్య పరిష్కారం కొరకు 1కోటి 7లక్షల 50 వేల రూపాయల నిధులను కేటాయించిన విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)

25 మంచినీటి ట్యాంకర్లను నియోజకవర్గ ప్రజల అవసరార్థం కేటాయించారు

Streetbuzz news :

బండిపాలెం, తక్కెళ్లపాడు , ఇందుగుపల్లి, కాకరవాయి, ముక్త్యాల, వెంగనాయకునిపాలెం, శివాపురం, శెనగపాడు, ముంగొల్లు, భీమవరం, వత్సవాయి, కంభంపాడు, వేమవరం, కొండూరు, తొర్రగుడిపాడు, మాగల్లు, కొణతమాత్మకూరు, గొల్లమూడి, పెనుగంచిప్రోలు, అనిగండ్లపాడు, వెంకటాపురం, పోచవరం, , జయంతిపురం, ఎస్.ఎం. పేట, చిల్లకల్లు గ్రామ పంచాయితీల ప్రజల త్రాగునీటి అవసరాల కొరకు వాటర్ ట్యాంకర్లను మరయు 

జగ్గయ్యపేట మండలం, పోచంపల్లి గ్రామంలో రూ.45:00 లక్షలతో కమ్యూనిటీ హాల్, బాత్రూమ్స్, టాయిలెట్స్ నిర్మాణానికి

విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్ (నాని) తమ ఎంపి నిధుల నుండి నిధులు మంజూరు చేసారు

madagoni surendar

Mar 28 2023, 13:14

దేశంలో కొవిడ్‌ కేసుల పెరుగుదల.. మాస్క్‌ తప్పనిసరి ..*

దేశంలో కొవిడ్‌ కేసుల పెరుగుదల.. మాస్క్‌ తప్పనిసరి ..

 కరోనా మహమ్మారి ముప్పు మళ్లీ పెరుగుతున్నది. ఇటీవల కొద్దిరోజులుగా వరుసగా రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 14 రాష్ట్రాల్లోని 29 జిల్లాల్లో ఇన్‌ఫెక్షన్‌ రేటు 10శాతం దాటింది. అదే సమయంలో 59 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 5-10 మధ్య ఉన్నది.

గత వారంలో అనేక జిల్లాల్లో 40శాతానికిపైగా నమూనాలు పాజిటివ్‌గా తేలాయి. ఈ క్రమంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ మహమ్మారిని నివారించేందుకు రద్దీ ప్రాంతాల్లో మాస్క్‌లను తప్పనిసరి చేయాలని సూచించింది.

madagoni surendar

Mar 28 2023, 12:02

ఏపీ ::దొంగలందరూ మీ ఇళ్ల పక్కనే ఉన్నారు.. వారు చెప్పింది విని జగన్‌కు వ్యతిరేకంగా ఓటెయ్యొద్దు: ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.

*దొంగలందరూ మీ ఇళ్ల పక్కనే ఉన్నారు.. వారు చెప్పింది విని జగన్‌కు వ్యతిరేకంగా ఓటెయ్యొద్దు: ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు (నిజాయితీ గల నాయకుడు )

జగన్‌కు వ్యతిరేకంగా ఓటేసి మీ చేతులు మీరే నరుక్కోవద్దన్న ధర్మాన

ఎన్నికల్లో ఇంకొకరికి ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని హెచ్చరిక

ఓటు ద్వారా వైసీపీకి మరోమారు అవకాశం ఇవ్వాలని అభ్యర్థన

ప్రభుత్వ ధనాన్ని దోచుకున్న దొంగలందరూ మీ ఇళ్ల పక్కన, మీ వీధుల్లో, మీ ఊరిలోనే ఉన్నారని, వారు చెప్పింది విని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేసి మీ చేతులు మీరే నరుక్కోవద్దని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా గారలో నిన్న వైఎస్సార్ ఆసరా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

తరతరాలుగా ఉన్న ఆధిపత్యం పోయిందన్న ధర్మాన.. ఎన్నికలకు ఇంకో సంవత్సరం సమయం ఉందని, ఆ తర్వాత ఇంకొకరికి ఓటు వేస్తే ఈ కార్యక్రమాలన్నీ అగిపోతాయని అన్నారు. ఓటు ద్వారా మరోమారు వైసీపీకి అధికారం ఇవ్వాలన్నారు. ప్రస్తుతం అందుకుంటున్న పథకాలు, పొందుతున్న గౌరవం, కుటుంబ హోదా పెరగడం, పిల్లలు హాయిగా చదువుకోవడానికి కారణమైన వ్యక్తి, పార్టీ, ఆ పార్టీ గుర్తు మీకు జ్ఞాపకం ఉండాలని అన్నారు. మీ కుటుంబం పొందుతున్న గౌరవం, ఆనందానికి కారణమైన వ్యక్తిని పిచ్చోడని, సైకో అనే అంటే నమ్ముతారా? అని ధర్మాన ప్రశ్నించారు. ప్రయోజనం పొందుతున్న పార్టీని నిలబెట్టాలని కోరారు.

madagoni surendar

Mar 28 2023, 10:35

పాలమూరు జిల్లాలో ఎండుతున్న పంటలు

పాలమూరు జిల్లాలో ఎండుతున్న పంటలు

మహబూబ్​నగర్​, : యాసంగి పంటలకు కష్టాకలం వచ్చింది. సాగునీరు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. కెనాల్స్​కు నీటి విడుదల లేకపోవడం, ఎండలు ముదరడంతో గ్రౌండ్​ వాటర్​ తగ్గిపోయి బోర్లు వట్టిపోతున్నాయి. దీని ప్రభావంతో పాలమూరు జిల్లాలో పంటలు ఎండిపోయే దశకు చేరుకుంటున్నాయి. మరో నెల రోజుల పాటు నీరు అవసరం ఉండడంతో, రైతులు పంటలను కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. మహబూబ్​నగర్​ జిల్లాలో ఈ యాసంగిలో 3 లక్షల ఎకరాల్లో వరి, మక్కలు, పత్తి, కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. ఇందులో 1.20 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. మిడ్జిల్ మండలానికి మహత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీం (ఎంజీకేఎల్ఐ) ద్వారా, దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లోని కొన్ని ఏరియాలకు కోయిల్​సాగర్​ కెనాల్స్​ ద్వారా సాగు నీరందుతుంది. మహబూబ్​నగర్, భూత్పూర్, అడ్డాకుల, మూసాపేట, బాలానగర్, నవాబ్​పేట, జడ్చర్ల, రాజాపూర్, కోయిల్​కొండ మండలాల్లో బోర్ల ఆధారంగానే వరి వేసుకున్నారు. అయితే, వానాకాలం వడ్ల కొనుగోళ్లు లేట్​ కావడంతో యాసంగి రెండు నెలలు ఆలస్యమైంది. అక్టోబరులో వరి నార్లు పోసుకోవాల్సి ఉండగా, జనవరిలో నార్లు పోసుకున్నారు. కొందరు రైతులు అక్టోబరులో నార్లు పోసుకున్నా.. వరి పైర్లపై చలి ప్రభావంతో పంటలు ఎదగలేదు. దీంతో వీరు కూడా పంటను తీసేసి, జనవరిలో మరోసారి వరి నాట్లు వేసుకున్నారు. ప్రస్తుతం ఈ పంటలన్నీ కంకి పట్టే దశలో ఉన్నాయి. పాల దశకు చేరుకోవడానికి మరో రెండు వారాల టైం పడుతుంది. ఇంకా నెల రోజులు సాగునీరు అందించాల్సి ఉంది.

కాల్వలకు నీళ్లు బంద్..​

ఎంజీకేఎల్ఐ కాల్వ కింద సాగు చేసిన వరి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. వారబందీ ప్రకారం నీళ్లు వదులుతుండడంతో మిడ్జిల్​ మండలంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కెనాల్​ ఎండిపోయింది. ఈ కెనాల్​లో అక్కడక్కడా నీరు నిల్వ ఉండగా, రైతులు మోటార్లతో ఎత్తిపోసుకొని పంటలను కాపాడుకుంటున్నారు. కోయిల్​సాగర్​ కింద రైట్, లెఫ్ట్​ మెయిన్​ కెనాల్స్​​ద్వారా పంటలకు పది రోజులకోసారి నీటిని విడుదల చేస్తున్నా.. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. మరో పది రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే ఈ కెనాల్స్​ పరిధిలోని వరి, తోటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది.

బోర్లు పోస్తలేవు..

యాసంగిలో జిల్లాలో బోర్ల ఆధారంగానే రైతులు పంటలు సాగు చేస్తున్నారు. 2018 తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎండలు ముదరడంతో బోర్లపై ఎఫెక్ట్​ పడింది. ఫిబ్రవరిలో పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల నుంచి 36 డిగ్రీలుగా నమోదమయ్యాయి. మార్చి రెండో వారం నుంచి ఎండలు మరింత పెరగడంతో బోర్లు వట్టిపోతున్నాయి. దాదాపు 80 వేల ఎకరాలు బోర్ల కింద సాగవుతుండడం, అందరూ ఒకేసారి మోటార్లను ఆన్​ చేస్తుండడంతో గ్రౌండ్​ వాటర్​ త్వరగా పడిపోతోంది. ఇప్పటికే జిల్లాలో 1.16 మీటర్ల లోతుకు నీరు పడిపోగా రానున్న రెండు వారాల్లో గ్రౌండ్​ వాటర్​ మరింత లోతుకు పడిపోయే ప్రమాదం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు.

ఒక బోరు​లో నీళ్లు వస్తలే..

నాకు ఆరు ఎకరాల పొలం ఉంది. రెండు బోర్లు ఉన్నాయి. బోర్ల ఆధారంగా ఆరెకరాల్లో డిసెంబరులో వరి వేసిన. ఇప్పుడు కంకి దశలో ఉంది. ఈ టైంలో బోర్లల్లో నీళ్లు వస్తలేవు. ఇప్పటికే ఒక బోరు బంద్​ అయింది. ఉన్న ఒక్క దాంతోనే పంటను కాపాడుకోవాలి.

–పి.రాములు, అమ్మాపూర్​

వంకాయ తోట వదిలేసిన..

నాకు ఎకరా పొలం ఉంది. బోరు ఉందని అర ఎకరంలో టమాట, మిగిలిన అర ఎకరంలో వంకాయ తోట పెట్టిన. పది రోజుల నుంచి బోరు పోస్తలేదు. దీంతో వంకాయ తోటను వదిలేసిన. టమాట తోటకు అరకొరగా నీరు అందిస్తున్న. వారం రోజులు అయితే ఈ బోరు కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది.

–కొత్తకోట గోవర్ధన్​, చిన్నచింతకుంట.