madagoni surendar

Mar 28 2023, 10:35

పాలమూరు జిల్లాలో ఎండుతున్న పంటలు

పాలమూరు జిల్లాలో ఎండుతున్న పంటలు

మహబూబ్​నగర్​, : యాసంగి పంటలకు కష్టాకలం వచ్చింది. సాగునీరు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. కెనాల్స్​కు నీటి విడుదల లేకపోవడం, ఎండలు ముదరడంతో గ్రౌండ్​ వాటర్​ తగ్గిపోయి బోర్లు వట్టిపోతున్నాయి. దీని ప్రభావంతో పాలమూరు జిల్లాలో పంటలు ఎండిపోయే దశకు చేరుకుంటున్నాయి. మరో నెల రోజుల పాటు నీరు అవసరం ఉండడంతో, రైతులు పంటలను కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. మహబూబ్​నగర్​ జిల్లాలో ఈ యాసంగిలో 3 లక్షల ఎకరాల్లో వరి, మక్కలు, పత్తి, కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. ఇందులో 1.20 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. మిడ్జిల్ మండలానికి మహత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీం (ఎంజీకేఎల్ఐ) ద్వారా, దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లోని కొన్ని ఏరియాలకు కోయిల్​సాగర్​ కెనాల్స్​ ద్వారా సాగు నీరందుతుంది. మహబూబ్​నగర్, భూత్పూర్, అడ్డాకుల, మూసాపేట, బాలానగర్, నవాబ్​పేట, జడ్చర్ల, రాజాపూర్, కోయిల్​కొండ మండలాల్లో బోర్ల ఆధారంగానే వరి వేసుకున్నారు. అయితే, వానాకాలం వడ్ల కొనుగోళ్లు లేట్​ కావడంతో యాసంగి రెండు నెలలు ఆలస్యమైంది. అక్టోబరులో వరి నార్లు పోసుకోవాల్సి ఉండగా, జనవరిలో నార్లు పోసుకున్నారు. కొందరు రైతులు అక్టోబరులో నార్లు పోసుకున్నా.. వరి పైర్లపై చలి ప్రభావంతో పంటలు ఎదగలేదు. దీంతో వీరు కూడా పంటను తీసేసి, జనవరిలో మరోసారి వరి నాట్లు వేసుకున్నారు. ప్రస్తుతం ఈ పంటలన్నీ కంకి పట్టే దశలో ఉన్నాయి. పాల దశకు చేరుకోవడానికి మరో రెండు వారాల టైం పడుతుంది. ఇంకా నెల రోజులు సాగునీరు అందించాల్సి ఉంది.

కాల్వలకు నీళ్లు బంద్..​

ఎంజీకేఎల్ఐ కాల్వ కింద సాగు చేసిన వరి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. వారబందీ ప్రకారం నీళ్లు వదులుతుండడంతో మిడ్జిల్​ మండలంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కెనాల్​ ఎండిపోయింది. ఈ కెనాల్​లో అక్కడక్కడా నీరు నిల్వ ఉండగా, రైతులు మోటార్లతో ఎత్తిపోసుకొని పంటలను కాపాడుకుంటున్నారు. కోయిల్​సాగర్​ కింద రైట్, లెఫ్ట్​ మెయిన్​ కెనాల్స్​​ద్వారా పంటలకు పది రోజులకోసారి నీటిని విడుదల చేస్తున్నా.. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. మరో పది రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే ఈ కెనాల్స్​ పరిధిలోని వరి, తోటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది.

బోర్లు పోస్తలేవు..

యాసంగిలో జిల్లాలో బోర్ల ఆధారంగానే రైతులు పంటలు సాగు చేస్తున్నారు. 2018 తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎండలు ముదరడంతో బోర్లపై ఎఫెక్ట్​ పడింది. ఫిబ్రవరిలో పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల నుంచి 36 డిగ్రీలుగా నమోదమయ్యాయి. మార్చి రెండో వారం నుంచి ఎండలు మరింత పెరగడంతో బోర్లు వట్టిపోతున్నాయి. దాదాపు 80 వేల ఎకరాలు బోర్ల కింద సాగవుతుండడం, అందరూ ఒకేసారి మోటార్లను ఆన్​ చేస్తుండడంతో గ్రౌండ్​ వాటర్​ త్వరగా పడిపోతోంది. ఇప్పటికే జిల్లాలో 1.16 మీటర్ల లోతుకు నీరు పడిపోగా రానున్న రెండు వారాల్లో గ్రౌండ్​ వాటర్​ మరింత లోతుకు పడిపోయే ప్రమాదం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు.

ఒక బోరు​లో నీళ్లు వస్తలే..

నాకు ఆరు ఎకరాల పొలం ఉంది. రెండు బోర్లు ఉన్నాయి. బోర్ల ఆధారంగా ఆరెకరాల్లో డిసెంబరులో వరి వేసిన. ఇప్పుడు కంకి దశలో ఉంది. ఈ టైంలో బోర్లల్లో నీళ్లు వస్తలేవు. ఇప్పటికే ఒక బోరు బంద్​ అయింది. ఉన్న ఒక్క దాంతోనే పంటను కాపాడుకోవాలి.

–పి.రాములు, అమ్మాపూర్​

వంకాయ తోట వదిలేసిన..

నాకు ఎకరా పొలం ఉంది. బోరు ఉందని అర ఎకరంలో టమాట, మిగిలిన అర ఎకరంలో వంకాయ తోట పెట్టిన. పది రోజుల నుంచి బోరు పోస్తలేదు. దీంతో వంకాయ తోటను వదిలేసిన. టమాట తోటకు అరకొరగా నీరు అందిస్తున్న. వారం రోజులు అయితే ఈ బోరు కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది.

–కొత్తకోట గోవర్ధన్​, చిన్నచింతకుంట.

madagoni surendar

Mar 28 2023, 10:28

భద్రాద్రికొత్తగూడెం::గల్లీలు మాయం.. దర్జాగా కబ్జా చేస్తున్న బడాబాబులు.

గల్లీలు మాయం.. దర్జాగా కబ్జా చేస్తున్న బడాబాబులు

 

 

గల్లీలు మాయం.. దర్జాగా కబ్జా చేస్తున్న బడాబాబులు

భద్రాద్రికొత్తగూడెం,  జిల్లా కేంద్రంగా ఏర్పడ్డాక కొత్తగూడెంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గజం స్థలాన్ని కూడా వదలడం లేదు. పట్టణంలోని ప్రధాన వ్యాపార కూడళ్లు అయిన పెద్ద బజార్, చిన్నబజార్, ఎంజీరోడ్​, లేపాక్షి రోడ్, సూర్యాప్యాలెస్​ వెనుక వైపు గల గల్లీలను అధికార పార్టీ నేతల అండదండలతో బడాబాబులు కొందరు దర్జాగా ఆక్రమించుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో గజం భూమి ధర రూ.40 వేల నుంచి రూ. లక్ష వరకు పలుకుతోంది. ఫలితంగా రాజకీయ ప్రోద్బలంతో అధికారులకు మామూళ్లు ఇస్తూ యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. లేపాక్షి రోడ్డు–మార్కెట్–ఎంజీ రోడ్డుకు మధ్యలో పలు గల్లీలు ఆక్రమణలతో మాయమయ్యాయి.

సూర్యాప్యాలెస్​వెనెక గల గల్లీలో ఓ బడా వ్యాపారిదే రాజ్యం. ఎంజీ రోడ్​ నుంచి చిన్నబజార్, పెద్ద బజార్​లకు వెళ్లేందుకు పలు గల్లీలను గతంలో ఏర్పాటు చేయగా అవన్నీ ఇప్పుడు కబ్జాల పాలయ్యాయి. కొన్ని చోట్ల గల్లీల దారులు ఆక్రమణలతో కనుమరుగయ్యాయి. కింద గల్లీ రోడ్ పై అక్రమ నిర్మాణాలు చేపడితే మరి కొందరేమో గల్లీలనే మూసేసి వ్యాపారాలు మొదలెట్టారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం కళ్లు మూసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. గల్లీల ఆక్రమణలతో తమ ఇళ్లకు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని పలువురు అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గల్లీలను కబ్జా కోరల నుంచి కాపాడాలని కోరుతున్నారు.

madagoni surendar

Mar 28 2023, 10:17

అల్లు అర్జున్ : చరణ్ కి దూరంగా బన్నీ… విష్ లేదు, విజిట్ లేదు..

అల్లు అర్జున్ : చరణ్ కి దూరంగా బన్నీ… విష్ లేదు, విజిట్ లేదు…

‘చెప్పను బ్రదర్’ అని అల్లు అర్జున్ నోటి నుంచి వచ్చిన ఒక మాట ఎంత దుమారం లేపిందో, ప్రశాంతంగా ఐకమత్యంగా ఉండే మెగా అభిమానుల్లో ఎంత కల్లోలం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫాన్స్ అంటే చిరు ఫాన్స్, చరణ్ ఫాన్స్, సాయి ధరమ్ తేజ్ ఫాన్స్, పవన్ కళ్యాణ్ ఫాన్స్, వరుణ్ తేజ్ ఫాన్స్ కానీ అల్లు అర్జున్ ఫాన్స్ కాదు అనే స్థాయికి వెళ్లిందీ గొడవ. దీన్ని సారి చెయ్యడానికి, అందరం కలిసే ఉన్నాం అని చెప్పడానికి, చూపించడానికి మెగా హీరోలు అప్పుడప్పుడూ కలిసి కనిపిస్తూ ఉంటారు. దీంతో ఫాన్స్ మళ్లీ మా హీరోలంతా ఒకటే అనుకుంటూ ఉంటారు. అభిమానులు అలా అనుకునే లోపే కాదు కాదు అల్లు అర్జున్ వేరు మెగా హీరోలు వేరు అనిపించేలా ఒక సంఘటన జరుగుతుంది. మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టిన రోజు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి నార్త్ సెలబ్రిటీల వరకూ చాలా మంది చరణ్ ని విష్ చేశారు.

అల్లు అర్జున్ మాత్రం విష్ చెయ్యలేదు, పర్సనల్ గ ఫోన్ చేసి విష్ చేసాడో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం పోస్ట్ చెయ్యలేదు. నైట్ వరకూ వెయిట్ చేసిన ఫాన్స్, అల్లు అర్జున్ నుంచి ట్వీట్ రాకపోవడంతో మరోసారి మెగా ఫ్యామిలీ వేరు అల్లు అర్జున్ వేరు అనే కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ట్వీట్ చెయ్యకపోవడం ట్విట్టర్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఫాన్స్ అందరికీ ఇదే విషయంపై చర్చ జరుగుతుంది. చరణ్ ఇంట్లో నిన్న నైట్ వరకూ బర్త్ డే పార్టీ జరిగింది. ఈ పార్టీకి ఇండస్ట్రీ వర్గాలందరూ వచ్చారు కానీ అల్లు అర్జున్ మాత్రం రాలేదు. దీంతో రాత్రి నుంచి మెగా ఫాన్స్ అల్లు అర్జున్ పై మరింత నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ మెగా అల్లు హీరోల మధ్య గ్యాప్ ఎప్పుడు సెటిల్ అవుతుందో చూడాలి.

madagoni surendar

Mar 28 2023, 10:10

మహబూబాబాద్ జిల్లా ::ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే ఫొటో ఎక్కడ? కేసముద్రంలో ప్రోటోకాల్ లొల్లి.

ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే ఫొటో ఎక్కడ? కేసముద్రంలో ప్రోటోకాల్ లొల్లి.

నెల్లికుదురు (కేసముద్రం), మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఆఫీసర్లు ప్రొటోకాల్‌‌‌‌ పాటించడం లేదని, ఫ్లెక్సీలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌‌‌‌ ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. కేసముద్రం అగ్రికల్చర్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ కమిటీ ప్రమాణస్వీకారాన్ని సోమవారం స్థానికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్‌‌‌‌, శాసనమండలి వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ బండ ప్రకాశ్‌‌‌‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

అయితే స్టేజీపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఫొటో లేదని గమనించిన ఆయన అనుచరులు స్టేజీ కింద బైఠాయించారు. సీనియర్‌‌‌‌ లీడర్‌‌‌‌ను కావాలనే అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు ఫ్లెక్సీలో ఎమ్మెల్యే లేకపోవడంతో తాము ప్రమాణస్వీకారం చేయబోమని, ప్రోగ్రామ్‌‌‌‌ను వాయిదా వేయాలని వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ రాంపల్లి రవి, కొందరు డైరెక్టర్లు నేలపై కూర్చొని నిరసన తెలిపారు. చివరికి స్టేజీపైన ఎమ్మెల్యే ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో నిరసన విరమించారు.

madagoni surendar

Mar 28 2023, 10:06

మహబూబాబాద్ జిల్లా ::ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే ఫొటో ఎక్కడ? కేసముద్రంలో ప్రోటోకాల్ లొల్లి.

ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే ఫొటో ఎక్కడ? కేసముద్రంలో ప్రోటోకాల్ లొల్లి.

నెల్లికుదురు (కేసముద్రం), మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఆఫీసర్లు ప్రొటోకాల్‌‌‌‌ పాటించడం లేదని, ఫ్లెక్సీలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌‌‌‌ ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. కేసముద్రం అగ్రికల్చర్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ కమిటీ ప్రమాణస్వీకారాన్ని సోమవారం స్థానికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్‌‌‌‌, శాసనమండలి వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ బండ ప్రకాశ్‌‌‌‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

అయితే స్టేజీపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఫొటో లేదని గమనించిన ఆయన అనుచరులు స్టేజీ కింద బైఠాయించారు. సీనియర్‌‌‌‌ లీడర్‌‌‌‌ను కావాలనే అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు ఫ్లెక్సీలో ఎమ్మెల్యే లేకపోవడంతో తాము ప్రమాణస్వీకారం చేయబోమని, ప్రోగ్రామ్‌‌‌‌ను వాయిదా వేయాలని వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ రాంపల్లి రవి, కొందరు డైరెక్టర్లు నేలపై కూర్చొని నిరసన తెలిపారు. చివరికి స్టేజీపైన ఎమ్మెల్యే ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో నిరసన విరమించారు.

madagoni surendar

Mar 28 2023, 09:56

న్యూడిల్లీ :కనీస ఉమ్మడి వివాహ వయసుపై పిటిషన్ ​కొట్టివేత

కనీస ఉమ్మడి వివాహ వయసుపై పిటిషన్ ​కొట్టివేత

 

Stretbuzz news.

 

కనీస ఉమ్మడి వివాహ వయసుపై పిటిషన్ ​కొట్టివేత..

న్యూఢిల్లీ : స్త్రీ, పురుషులకు కనీస ఉమ్మడి వివాహ వయసును నిర్ణయించాలంటూ అడ్వకేట్​ అశ్వినీ ఉపాధ్యాయ్​ దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఇటువంటి అంశాలు పార్లమెంటు పరిధిలోకి వస్తాయని.. వాటిలో కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్​ డి.వై.చంద్రచూడ్​ నేతృత్వంలోని బెంచ్​ ఈ వ్యాఖ్యలు చేసింది.స్త్రీ, పురుషులకు కనీస ఉమ్మడి వివాహ వయసును నిర్ణయిస్తూ చట్టం చేయాలని తాము పార్లమెంటుకు మాండమస్​(ఎక్స్​ట్రాడినరీ రిట్) ను జారీ చేయలేమని బెంచ్​ స్పష్టం చేసింది.

ఒకవేళ తాము ఈ పిటిషన్​ను విచారణకు స్వీకరిస్తే.. దానికి అనుగుణంగా కనీస ఉమ్మడి వివాహ వయసును నిర్ణయిస్తూ చట్టం చేయాలని పార్లమెంటును ఆదేశించినట్లు అవుతుందని పేర్కొంది. ప్రస్తుతం మన దేశంలో పురుషుల కనీస వివాహ వయసు 21 ఏళ్లు, మహిళల కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. అయితే ఇందుకు అనుగుణంగా మహిళల కనీస వివాహ వయసును కూడా 21 ఏళ్లకు పెంచాలని పిటిషనర్​ అశ్వినీ ఉపాధ్యాయ్​ కోరారు. పురుషాధిక్య దృక్పథంతోనే మనదేశంలో పురుషుల వివాహ వయసును ఎక్కువగా, మహిళల వివాహ వయసును తక్కువగా ఉంచారని పిటిషన్ లో​ పేర్కొన్నారు.

madagoni surendar

Mar 28 2023, 09:00

తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు: ఉరుములుమెరుపులు, ఈదురుగాలులు.

తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు: ఉరుములుమెరుపులు, ఈదురుగాలులు..

Streetbuzz News. నల్గొండ జిల్లా:

హైదరాబాద్ : తూర్పు తెలంగాణ జిల్లాల్లో మంగళవారం అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఇదే సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వీస్తాయని తెలిపింది. రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మంగళవారం ఉదయం నుంచి పలు ప్రాంతాలు మేఘావృతమై ఉన్నాయి. కాగా, ఇప్పటికే కురిసిన వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ఆరుగాలం శ్రమించిన రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. చేతికందిన పంట అకాల వర్షంతో పూర్తిగా ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమపై మరింత ఆర్థిక భారం పెరిగిపోయిందని వాపోయారు.

madagoni surendar

Mar 27 2023, 21:16

ఏపీ ::సియం జగన్ మంత్రివర్గ ప్రక్షాళన కు రెడీ అయ్యరా.కొడాలి నానీ కీ మల్లి ఛాన్స్

సియం జగన్ మంత్రివర్గ ప్రక్షాళన కు రెడీ అయ్యరా??

కొడాలి నానీ కీ మల్లి ఛాన్స్

ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం పట్ల జగన్ అంతర్గతంగా చాలా ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీలో టాక్ నడుస్తుంది. ఇక ఇదే సమయంలో ప్రత్యర్థిలో ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న సమయంలో మంత్రులలో చాలామంది కౌంటర్లు ఇవ్వకపోవడం పట్ల కూడా అధినాయకుడు అసహనంగా ఉన్నారట. దీంతో క్యాబినెట్లో ఐదుగురు మంత్రులను పక్కన పెట్టడానికి జగన్ డిసైడ్ అయినట్లు టాక్. పైగా వాళ్లకు కేటాయించిన శాఖలో వాళ్ళ పనితీరు కూడా సరిగ్గా లేకపోవడంతో… మంత్రివర్గ ప్రక్షాళన చేయటానికి

నిర్ణయం తీసుకున్నట్లు దీంతో త్వరలోనే గవర్నర్ తో జగన్ భేటీ కానున్నట్లు సమాచారం. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ఆ ఐదుగురు మంత్రుల ప్లేసులోకి ఎమ్మెల్యే కొడాలి నానిని మంత్రిగా తీసుకోవడానికి జగన్ పెద్ద స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ టైం లో ఎమ్మెల్యే కొడాలి నాని మంత్రిగా వ్యవహరించారు. ఇక రెండోసారి.. మంత్రివర్గ విస్తరణ చేపట్టిన టైంలో కొడాలి నానిని… పక్కన పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఐదుగురు మంత్రులను పక్కన పెడుతున్న నేపథ్యంలో కొడాలి నాని తో పాటు పేర్ని నాని మరి కొంతమంది కౌంటర్లు ఇచ్చే పార్టీ వాయిస్.. తోపాటు ప్రభుత్వం చేసే మంచి పనులను తెలియజేసే వారికి అవకాశం కల్పించడానికి సీఎం జగన్ రెడీ అయినట్లు సమాచారం.

madagoni surendar

Mar 27 2023, 21:06

ఏపీ:వీల్స్ ఇండియాలో 261 మంది పాలిటెక్నిక్ విద్యార్ధులకు ఉద్యోగాలు.సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి*

వీల్స్ ఇండియాలో 261 మంది పాలిటెక్నిక్ విద్యార్ధులకు ఉద్యోగాలు 

 సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి 

Streetbuzz news.

పాలిటెక్నిక్ విద్యార్ధులకు తక్షణ ఉపాధి చూపాలన్న ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా చేపడుతున్న ప్రత్యేక జాబ్ మేళాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి అన్నారు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి వీల్స్ ఇండియా సంస్ధలో ఉద్యోగాలు పొందిన 261 మంది విద్యార్ధులకు సోమవారం నాగరాణి నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నాగరాణి మాట్లాడుతూ క్యాంపస్ ప్లేస్ మెంట్స్ ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్ధానాలకు ఎదిగేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారెవ్వరూ నిరుద్యోగులుగా మిగలరాదన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సాంకేతిక విద్యా శాఖలో ఉపాధి కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. మూడు దశలలో విద్యార్ధులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు. క్యాంపస్ ప్లేస్ మెంట్స్ కోసం కళాశాల యూనిట్ గా తొలిదశ, క్లస్టర్ స్ధాయిలో మలిదశ, రాష్ట్ర స్ధాయిలో తుదిదశ విభాగాలు పనిచేస్తున్నాయని నాగరాణి తెలిపారు. అయా సంస్ధలు, విద్యార్ధుల మధ్య సమన్వయం కోసం అనుభవం ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించామన్నారు. విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లో మొత్తం 335 మంది చివరి సంవత్సరం విద్యార్థులు హాజరు కాగా, 261 మంది విద్యార్ధులు 2.32 లక్షల సాంవత్సరిక వేతనంతో ఎంపికయ్యారన్నారు. వీరిలో 236 మంది విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ నుండి, 25 మంది సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల నుండి ఉన్నారన్నారు. మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెటలర్జీ బ్రాంచ్‌ల నుండి వీరు ఎంపిక అయ్యారన్నారు. కార్యక్రమంలో ట్రైనింగ్ ప్లేస్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎంఏవీ రామకృష్ణ, వీల్స్ ఇండియా మానవవనరుల విభాగం నుండి దివాకర్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం విజయ సారధి, ఉఫాధి అధికారి డాక్టర్ కె విజయ భాస్కర్, సిబ్బంది, విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు. వీల్స్ ఇండియాతో పాటు ప్రతిష్టాత్మక టాటా ప్రాజెక్ట్స్ కు మరో 11 మంది ఎంపిక కాగా వారికి కూడా కమీషనర్ నియామక పత్రాలు పంపిణీ చేసారు. 

 హెచ్‌ఎల్ మండో ఆనంద్ ఇండియాలో 19 మందికి అవకాశం: 

మరోవైపు హెచ్‌ఎల్ మండో ఆనంద్ ఇండియాలో 19 మందికి అవకాశం లభించింది. ఉత్తీర్ణత సాధించిన డిప్లొమా విద్యార్థులు ఈ సంస్దలో టెక్నీషియన్ అప్రెంటీస్‌లుగా ఎంపికకాగా, ఒంగోలు డిఎ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఇటీవల సాంకేతిక విద్యా శాఖ నిర్వహించిన జాబ్ మేళాలో ఈ ఎంపికలు జరిగాయి.

madagoni surendar

Mar 27 2023, 18:27

ఏపీ :వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం–తాడేపల్లి. బాబు నోటు రాజకీయం"పై విచారణ జరగాలిః ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్.

ఏపీ :వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం–తాడేపల్లి.

బాబు నోటు రాజకీయం"పై విచారణ జరగాలిః ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్.

శాసనమండలి సభ్యులు శ్రీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ప్రెస్ మీట్ః

- నాటి వైశ్రాయ్‌ నుంచి నిన్నటి ఎమ్మల్యేల కొనుగోలు వరకూ బాబుది అదే తీరు

- సీబీసీఐడీ, ఈడీలు జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

- ఈడీలాంటి సంస్థలు ఇంత డబ్బు ఎలా ప్రయాణం చేసిందో వెలికితీయాలి

- మొన్న తెలంగాణ, నేడు ఏపీలో ఓటుకు నోటు వ్యవహారాలకు మూలం చంద్రబాబే

 - శాసనమండలి సభ్యులు శ్రీ డొక్కా మాణిక్యవరప్రసాద్

- శ్రీదేవి స్క్రిప్ట్‌ బాబుదే..

- మీ బాగోతాన్ని కప్పిపుచ్చుకునేందుకే సజ్జల గారిపై ఆరోపణలు

- ఇక్కడ నీ గురించి ఎవరూ ఆలోచించడం లేదు...భయపడాల్సిన పనిలేదు

- పెద్దవాడిగా చెప్తున్నా...కులాన్ని వాడుకోవద్దు

- వచ్చినప్పటి నుంచీ రాజకీయాల్లో నువ్వు వివాదమే చేసుకున్నావ్‌

- నువ్వు చేసుకున్న దానికి ఇప్పుడు అందర్నీ బాధ్యులను చేయడం సరికాదు

- జగన్మోహన్‌రెడ్డి గారి నాయకత్వంలో దళితులంతా చాలా గౌరవంగా ఉన్నారు

-శ్రీ డొక్కా మాణిక్యవరప్రసాద్

శాసనమండలి సభ్యులు శ్రీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:

- నిన్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ ఒక ప్రత్యేక విషయాన్ని ప్రస్తావించారు

- తనకు డబ్బులివ్వడానికి ఒక ఎమ్మెల్యే ద్వారా చంద్రబాబు మనుషులు కొందరు సంభాషించారని చెప్పాడు

- ఆ ఆఫర్‌ను తాను రిజెక్ట్‌ చేశానని కూడా రాపాక వరప్రసాద్‌ చెప్పారు..

- నేను మాట్లాడిన మాట వాస్తవమేనని ఎమ్మెల్యే రామరాజు కూడా ఒప్పుకున్నారు

- ఇంతటి దుర్మార్గానికి పాల్పడినందుకు ఆ వ్యక్తులపై వెంటనే కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది

- గతంలో తెలంగాణా రాష్ట్రంలోనూ ఇలాంటి ప్రయత్నాలు చేసి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికారు

- మళ్లీ మన రాష్ట్రంలో అటువంటి ప్రయత్నాలే చేయడం దుర్మార్గమైన విషయం

- ఈ వ్యవహారంపై.. వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలి

- ఒక్కొక్క ఎమెల్యేకి రూ.10 నుంచి 20 కోట్లు ఇస్తామన్నారని రాపాక, మద్దాళి గిరి కూడా తెలిపారు

- వీటన్నిటిపై వెంటనే సీబీసీఐడీ విచారణ జరపాలి...దీనికి సంబంధించిన వారిని అరెస్ట్‌ చేయాలి

- ప్రజాస్వామ్యంలో ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నా

- తెలంగాణాలో జరిగిన ఓటుకు నోటు కేసును కూడా దీనితో కలిపి విచారించాలి

- ఈడీ లాంటి సంస్థలు ఇంత డబ్బు ప్రయాణం చేసిన ఈ సందర్భాన్ని, ఎలా డబ్బు తరలింది అనేది విచారించి కఠిన చర్యలు తీసుకోవాలి

- తెలుగు రాష్ట్రాల్లోనే ఎమ్మెల్యేల కొనుగోలు ఒకే వ్యక్తి వద్ద నుంచి ప్రారంభం అయ్యింది.

వైశ్రాయ్‌ నుంచి నిన్నటి వరకూ మారని బాబు తీరు:

- ఇలాంటి అనైతిక చర్యలను ప్రోత్సహిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి

-1995లో వైశ్రాయ్‌ క్యాంపు దగ్గర నుంచి నిన్నటి ఓటుకు నోటు వరకూ గమనించండి

- ఇప్పుడు వరప్రసాద్, గిరితో మాట్లాడటం చూడండి..ఇవన్నీ ఒకే సోర్స్‌ నుంచి జరుగుతున్నాయి

- ఆ సోర్స్‌ను పట్టుకుని ఆపగలిగితే ప్రజాస్వామ్యానికి మంచింది..భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి

- విచారణ సంస్థలకు ఎక్కడ పట్టుకుంటే ఇది ఆగిపోతుందో నేను క్లూ ఇస్తున్నా..

అమరావతి అన్నావంటే స్క్రిప్ట్‌ ఎక్కడిదో అర్ధం కావడం లేదా..?:

- ఉండవల్లి శ్రీదేవి గారు తన మార్గంలో ప్రయాణం చేస్తున్నారు...వెళ్లిపోయారు

- ఆమె ఒక్కదాన్నే కాదు నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారు

- పార్టీ ఆదేశాలను ధిక్కరించి ఇతర పార్టీలతో కలిసిపోయారనేది పార్టీ నమ్మింది

- దానిపై వెంటనే చర్యలు తీసుకుని సస్పెండ్‌ చేశారు

- ఎందుకు ఆమె కంగారుపడి అమరావతి నినాదాన్ని ఎత్తుకున్నారు..?

- నువ్వు తెలుగుదేశం వారితో వెళ్లావని చెప్పడానికి ఇంతకంటే ఆధారం అవసరం లేదు

- నిన్న నువ్వు మాట్లాడిన స్క్రిప్ట్‌ అంతా యథాతథంగా టీడీపీదే.

- నువ్వు తెలుగుదేశానికి సహకరించుకోవాలి అనుకుంటే సహకరించుకో

- నీ బాగోతాన్ని కప్పిపుచ్చుకునేందుకు, నీ వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవాలని సజ్జల గారితో నాకుప్రాణ హాని అనడం సరైంది కాదు

- అంత పెద్ద వారి గురించి ఎందుకు..? నీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారని అంతటి పెద్ద పెద్ద మాటలు..?

పెద్దవాడిగా చెప్తున్నా...కులాన్ని వాడుకోవద్దు:

- మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయరు...మీ మార్గం మీరు ఎంచుకున్నారు..దయచేసి మీ పని మీరు చేసుకోండి

- ఒక పెద్దగా, సీనియర్‌గా, మీ నాన్నకు స్నేహితుడిగా చెప్తున్నా...ఒక కుల పెద్దగా కూడా చెప్తున్నా

- ఇలాంటి విషయాల్లో కులాన్ని వాడుకోవద్దు...మీ నాన్న ప్రతిష్టను పాడుచేయవద్దు

- పెద్ద పెద్ద పేర్లు వాడటం వల్ల నీకు ఏమీ మంచి పేరు రాదు

- వచ్చినప్పటి నుంచీ రాజకీయాల్లో నువ్వు వివాదమే చేసుకున్నావ్‌

- ఎన్నిసార్లు చెప్పినా నీ ప్రవర్తనలో మార్పు రాలేదు

- నువ్వు చేసుకున్న దానికి ఇప్పుడు అందర్నీ బాధ్యులను చేయడం సరికాదు

- పెద్ద పెద్ద వాళ్ల పేర్లు చెప్పడం వల్ల పేపర్లో ఒక రోజు పేరు వస్తుందేమీ కానీ నీకు ఒరిగేది ఏమీ లేదు

- ఇలాంటి చర్యల వల్ల సమాజం హర్షించదు..వాస్తవం ఏం జరిగిందో ప్రజలకు తెలుసు

- నీకు బంధువుగా, కులపెద్దగా చెప్తున్నా...కులాన్ని తీసుకురావద్దు...పెద్ద వాళ్ల పేర్లు వాడొద్దు

ప్రభుత్వం నీకు కావాల్సిన రక్షణ కల్పిస్తుంది:

- నీ రాజకీయ భవిష్యత్తు నువ్వు చూసుకో..నీకు ఎలాంటి భయం లేదు

- ప్రభుత్వం నీకు ఏం రక్షణ కావాలో అది కల్పిస్తారు..ఎక్కడైనా నువ్వు స్వేచ్ఛగా తిరగొచ్చు

- ఎవరిమీదా వైల్డ్‌ ఎలిగేషన్స్‌ చేయవద్దు...చేసి మీనాన్న ప్రతిష్టకు, కుల ప్రతిష్టకు భగం కలిగించవద్దు

- సజ్జల చంపాలని చూస్తున్నాడంటూ అంత పెద్ద మాటలు మాట్లాడతావా అమ్మా..?

- నేను రిక్వెస్ట్‌ చేస్తున్నా...అలాంటి పొరపాట్లు భవిష్యత్తులో చేయవద్దు

- కొన్ని మీడియా వాళ్లు, రాజకీయ పార్టీలు నిన్ను రెచ్చగొడతారు...

- రాజకీయంగా నీ ప్రయాణం నువ్వు చేసుకో...దానికి మేమేం అడ్డు చెప్పడం లేదు

- కానీ కులాన్ని వాడుకోవద్దని మాత్రం ఒక పెద్దవాడిగా చెప్తున్నా

జగన్‌ గారి నాయకత్వంలో దళితులంతా గౌరవంగా ఉన్నారు:

- జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో దళితులంతా చాలా గౌరవంగా ఉన్నారు

- ఎమ్మెల్యే శ్రీదేవి ని కూడా ఆయన చాలా గౌరవంగా చూసుకున్నారు

- ఇక ఇలాంటి వివాదాలు క్లోజ్‌ చేసి రాజకీయంగా నువ్వు ఎటు వెళ్తావో అటు వెళ్లు

- అనవరంగా వివాదాస్పద విషయాలు మాట్లాడి వ్యక్తిగత ఆరోపణలు చేయవద్దు

- కులాన్ని అడ్డుపెట్టుకుని ఎలాంటి ప్రయోగాలు చేయవద్దని నా మనవి.