madagoni surendar

Mar 27 2023, 13:08

నకిరేకల్ పట్టణాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతా.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

నకిరేకల్ పట్టణాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతా.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య   

Streetbuzz news. నల్గొండ జిల్లా :

నకిరేకల్ పట్టణంలో సకల సౌకర్యాలు కల్పించి మోడల్ సిటీగా తీర్చిదిద్దుతానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.సోమవారం నకిరేకల్ పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులలో భాగంగా విద్యుత్ స్థంబాలు ఏర్పాటు మరియు డ్రైనేజి పనులను పరిశీలించారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. అనంతరం.

నకిరేకల్ పట్టణానికి చెందిన గంధమల్ల సత్తయ్య కి రూ.53 వేల ఐదువందల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కును నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,అందజేశారు. ఈ కార్యక్రమంలో. నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, జెడ్పిటిసి మాద ధనలక్ష్మినగేష్ గౌడ్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Mar 27 2023, 12:57

చందర్లపాడు..ఏప్రిల్ 5న ఢిల్లీలో జరుగు కార్మిక కర్షక ర్యాలీని జయప్రదం చేయండి. చనుమోలు సైదులు

27-03-2023 చందర్లపాడు

ఏప్రిల్ 5న ఢిల్లీలో జరుగు కార్మిక కర్షక ర్యాలీని జయప్రదం చేయండి చనుమోలు సైదులు

Streetbuzz news.

ఈరోజు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ గోడపత్రికను చందర్లపాడు సెంటర్ నందు ఆవిష్కరించడం జరిగినది.

ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు మాట్లాడుతూ

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 65% ప్రజల పై ఆధారపడి న వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లు అప్ప చేసేందుకు తెచ్చిన మూడు నల్ల చట్టాలను విద్యుత్తు బిల్లలు రద్దుకై రైతులు సంవత్సరం పైగా నడిపిన చారిత్రాత్మక ఉద్యమానికి తలగిన ప్రభుత్వం చట్టాలు రద్దు ప్రకటించింది

బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సంపద నంత పెట్టుబడిదారులు కార్పొరేట్లకు దోచిపెట్టింది దేశ ప్రజలు కూడబెట్టుకున్న ప్రభుత్వ రంగ ఆస్తులను తగనంపుకుంటుంది కార్మికులు హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోళ్లను తెచ్చి కార్మికుల రక్త మాంసాలను రైతుల హక్కులను చట్టాలను నిర్వీర్యం చేస్తుంది అన్నారు వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి షేక్ హుస్సేన్ మాట్లాడుతూ

జాతీయ ఉపాధి హామీ పథకంలో 200 రోజులు పని దినాలు కల్పించి రోజుకు 600 రూపాయలు కనీస వేతనం అమలు చేయాలని రైతులకు ఇచ్చే వ్యవసాయ పరికరాల మీద జిఎస్టిని ఎత్తివేయాలని పెట్రోల్ డీజిల్ గ్యాస్ పై సంకలు తగ్గించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వేల్పుల ఏసోబు, తోటరామారావు, ఉద్దండు తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Mar 27 2023, 12:43

వైఎస్ వివేకా హత్య కేసులో సిబిఐ తీరుపై సుప్రీం ఆగ్రహం..

వైఎస్ వివేకా హత్య కేసులో సిబిఐ తీరుపై సుప్రీం ఆగ్రహం..

ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగేళ్ల క్రితం జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు అంతకంతకు ఆలస్యం అవుతుంది. ఈ నాలుగేళ్లలో కరోనాతో పాటు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న సిబిఐ..

ఇప్పటికీ దర్యాప్తును కొలిక్కి తీసుకురాలేకపోతుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా కేసులో సీబీఐ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.

విచారణ అధికారిని తక్షణమే మార్చివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు స్టేటస్ రిపోర్ట్ లో ఎలాంటి పురోగతి లేదని, దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని ఆదేశించింది. అలాగే విచారణ అధికారి రాంసింగ్ ను మార్చివేయాలని జస్టిస్ ఎం ఆర్ షా సిబిఐకి సూచించారు..

madagoni surendar

Mar 27 2023, 12:39

ఏపీ.దాతృత్వాన్ని చాటుకున్న నందిగామ సిఐ కే సతీష్.

దాతృత్వాన్ని చాటుకున్న నందిగామ సిఐ కే సతీష్

భార్యా పై భర్త బీరు సీసాతో దాడి చేసిన ఘటనలో గాయపడ్డ బాధితురాలికి అండగా నిలిచి సొంత ఖర్చులతో అంబులెన్స్ ఏర్పాటు చేసిన.నందిగామ సీఐ

సీఐ స్పందించిన తీరుకు హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు స్థానికులు

Streetbuz news.

నందిగామాలో దారుణం.

 భార్యపై బీరు సీసాతో దాడి భర్త...

నందిగామ బీసీ కాలనీలో నివాసముంటున్న పల్లెపు శ్రీలక్ష్మి నీ ఆమె భర్త ఆంజనేయులు బీరు సీసాతో విచక్షణ రహితంగా గాయపరిచాడు...

భార్యాభర్తల మధ్య గొడవలు కారణంగా గత ఆరు నెలల నుంచి విడిగా ఉంటున్న శ్రీలక్ష్మి...

ఉదయం ఇంట్లో ఉన్న భార్యపై విచక్షణ రహితంగా దాడి చేసిన భర్త...

 నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలింపు.. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రధమ చికిత్స అనంతరం విజయవాడ తరలించాలని వైద్యులు తెలపడంతో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న శ్రీ లక్ష్మీ కుటుంబ సభ్యుల ఆవేదన గమనించిన సిఐ కె సతీష్ వెంటనే సొంత ఖర్చులతో ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడి విజయవాడ తరలించిన వైనం..

సిఐ కే సతీష్ స్పందించిన తీరుకు హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు కుటుంబ సభ్యులు...

madagoni surendar

Mar 27 2023, 12:27

ఏపీ :ఆదాయం విషయంలో వాల్తేరు రైల్వే డివిజన్‌ సరికొత్త రికార్డు సృష్టించింది.2022-23 ఆర్థిక సంవత్సరం ఇంకా పూర్తికాక ముందే

విశాఖపట్నం;

ఆదాయం విషయంలో వాల్తేరు రైల్వే డివిజన్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. 

2022-23 ఆర్థిక సంవత్సరం ఇంకా పూర్తికాక ముందే మార్చి 25వ తేదీ నాటికి రూ.9 వేల కోట్ల ఆదాయం సాధించింది. 

Streetbuzz news.

గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో 61.17 మిలియన్‌ టన్నుల సరకు రవాణా చేయగా రూ.8,498.86 కోట్ల ఆదాయం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో మార్చి 25వ తేదీ నాటికి 68.12 మిలియన్‌ టన్నుల సరకు రవాణా చేసి రూ.9 వేల కోట్ల ఆదాయం సాధించింది. డివిజన్‌లో ఇంత ఆదాయం రావడం ఇదే తొలిసారి అని డీఆర్‌ఎం అనూప్‌ కుమార్‌ శెత్పథి ప్రకటించారు.

madagoni surendar

Mar 27 2023, 12:23

ఏపీ:గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన వైద్య సేవలు దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది.డిప్యూటీ సీయం ముత్యాలనాయుడు.

గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన వైద్య సేవలు దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది.. డిప్యూటీ సీయం ముత్యాలనాయుడు.  

 104 అంబులెన్స్ లను ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి 

దేవరాపల్లి, 27, మార్చి. 

రాష్ట్రంలో వైద్య సేవలకు వైఎస్సార్ హయంలో ఉన్న వైభవం తిరిగి తీసుకుని వచ్చే దిశగా సేవలు అందించడమే లక్ష్యమని, గత ప్రభుత్వం విస్మరించిన వైద్య సేవలను వైసిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి గతం కన్నా ఎక్కువ అంబులెన్స్ లను ఏర్పాటు చేశామనని, గ్రామీణ ప్రాంతాలలో నిర్దిష్ట సమయంలో మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి అన్నారు.

 మండలం లోని తారువ గ్రామం క్యాంప్ కార్యాలయంలో పంచాయతీ రాజ్ మంత్రి బూడి ముత్యాలనాయుడు మాడుగుల, కోటపాడు, దేవరాపల్లి మండలాల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించిన అంబులెన్స్ లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపిపి కీలపర్తి భాస్కరరావు, కోటపాడు జెడ్పీటీసి అనురాధ, వైద్యాధికారి సబ్రమణ్యం, MPHEO రాజశేఖర్, TSN మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Mar 27 2023, 12:16

దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ. బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత.

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఎమ్మెల్సీ కవిత, ఏపీకి చెందిన వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిలకు చెందిన బినామీలు అరుణ్‌రామచంద్రపిళ్లై, ప్రేమ్‌రాహుల్‌లు సౌత్‌గ్రూప్‌ ద్వారా ఆప్‌ లీడర్లకు రూ.100 కోట్ల ముందస్తు ముడుపులు చెల్లించి మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా ఉండేలా ప్రభావితం చేశారన్నది ఈడీ అభియోగం. దీనిపై ఈ నెల 11న కవితను తొలిసారి విచారించిన ఈడీ.. 16న మరోసారి హాజరుకావాలని సమన్లు జారీచేసింది. చట్టప్రకారం మహిళలను వారి ఇంటిదగ్గరే విచారించాల్సి ఉన్నప్పటికీ ఈడీ కార్యాలయానికి పిలవడాన్ని సవాల్‌చేస్తూ కవిత ఈ నెల 14న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. దానిపై అత్యవసర విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాదులు 15న సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు మెన్షన్‌ చేశారు. సీజేఐ అందుకు తిరస్కరించి ఈ నెల 24న విచారిస్తామని చెప్పారు. కానీ ఆరోజు ఈకేసు విచారణకు రాలేదు. 27 నాటికి జస్టిస్‌ అజయ్‌రస్తోగి, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందు లిస్ట్‌చేశారు. దీనిపై ఇప్పటికే ఈడీ కెవియట్‌ దాఖలు చేసింది. ఈ రెండు అంశాలూ సోమవారం ధర్మాసనం ముందు విచారణకు రానున్నాయి.

madagoni surendar

Mar 27 2023, 11:58

నేడు గవర్నర్‌తో సీఎం భేటీ- త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం.

నేడు గవర్నర్‌తో సీఎం భేటీ- త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం!

సీఎం జగన్‌ ఇవాళ గవర్నర్‌తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని రోజులుగా వినిపిస్తున్న మంత్రివర్గ విస్తరణ అంశంపైనే భేటీ జరగనుందని టాక్ నడుస్తోంది.

ముఖ్యమంత్రి జగన్ ఇవాళ సాయంత్రం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో సమావేశం కానున్నారు. ప్రకాశం, విశాఖలోనూ జగన్ పర్యటించనున్నారు. ప్రకాశం జిల్లా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత గవర్నర్‌తో సమావేశం కానున్నారు. 

త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అందుకే ముందస్తుగా గవర్నర్‌తో సీఎం సమావేశంకానున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. ఈ మధ్యే ఆ ప్రక్రియ ముగిసింది. ఇప్పుడున్న జట్టులోంచి కొందర్ని తప్పించి కొత్తవాళ్లకు స్థానం కల్పిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకట్రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

గత ఏప్రిల్‌లోనే మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇందులో చాలా మందిని కొత్తవాళ్లనే తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి మార్పులు చేర్పులు చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి శాఖాల్లో మార్పులు ఉండవచ్చేమోగానీ, జట్టులో ముగ్గురినే మార్చే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కులసమీకరణాలు, పనితీరు ఆధారంగా ఈ ఛేంజెస్ ఉంటాయంటున్నారు. 

ఇప్పటికే మార్చి 14నే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై సంకేతాలు ఇచ్చారు. కొత్తగా జట్టులోకి ముగ్గురు లేదా నలుగురిని తీసుకొని ఉన్న వారిలో కొందరిని బైబై చెప్పనున్నారని సమాచారం. ఈ మధ్యే ఎమ్మెల్సీగా ఎన్నికైన మర్రి రాజశేఖర్‌తోపాటు తోట త్రిమూర్తులు, కౌరు శ్రీనివాస్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడం గ్యారెంటీ అంటున్నారు. అయితే ఎవర్ని తప్పిస్తారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విడదల రజిని, దాడిశెట్టి రాజా తప్పించి ఛాన్స్ ఉందటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

దాడిశెట్టి రాజా స్థానంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును జగన్ మూడో దఫా కేబినెట్ లోకి ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. తోట త్రిమూర్తులు 14 జూన్ 2021లో గ‌వ‌ర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులు కాగా, అదే నెల 21న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. చిలకలూరిపేటకు చెందిన మంత్రి విడదల రజిని బీసీ ఎమ్మెల్యే కాగా, ఆమెను కేబినెట్ నుంచి తప్పించి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ కు అవకాశం ఇస్తారా అనేది డౌట్‌గానే ఉంది. ఒకే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలకు కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశం లేదు. కనుక తప్పని పరిస్థితుల్లో సీఎం జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

అసలే ఈ మధ్య కాలంలో అసంతృప్తులు పెరిగిపోతున్న టైంలో కేబినెట్ విస్తరణకు వెళ్తారా అనేది కూడా ఇంకొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అలా వెళితే మార్పులు చేర్పుల్లో పదవులు రాని వారిని సైతం బుజ్జగించాల్సి ఉంటుంది. ఇంకా ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో రిస్క్‌ చేస్తారా లేదా అనేది మరికొందరు చర్చించుకుంటున్నారు. అయితే పాదయాత్ర టైంలో చాలా మంది నేతలకు చట్టసభల్లోకి తీసుకెళ్లి మంత్రులుగా చేస్తానంటూ ప్రజల ముందు మాట ఇచ్చారు జగన్. అలాంటి వ్యక్తుల్లో మర్రి రాజశేఖర్ ఒకరు. ఇన్నాళ్లకు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన్ని ఈ దఫా మంత్రిని చేస్తారా లేకుంటే వచ్చే టెర్మ్‌కు వాయిదా వేస్తారా అనేది సస్పెన్స్‌. 

నేటి గవర్నర్‌తో భేటీలో మాత్రం మంత్రివర్గం అంశంపై చర్చకు వచ్చే ఛాన్స్ ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. దీంతోపాటు అసెంబ్లీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, ఆమోదించిన బిల్లపై గవర్నర్‌తో చర్చించనున్నారు.

madagoni surendar

Mar 27 2023, 11:19

ఏప్రిల్ నెల టీటీడీ శ్రీవారి దర్శన టికెట్లు నేడు విడుదల.శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం రూ.300 టికెట్లు.ఈ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల

ఏప్రిల్ నెల టీటీడీ శ్రీవారి దర్శన టికెట్లు నేడు విడుదల

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం రూ.300 టికెట్లు

ఈ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల

ఆన్ లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలన్న టీటీడీ

నేడు తిరుమల చేరుకోనున్న 10 ధర్మరథం విద్యుత్ బస్సులు

టీటీడీకి బస్సులను విరాళంగా అందించిన ఒలెక్ట్రా సంస్థ

ఏప్రిల్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నేడు విడుదల చేయనున్నారు. రూ.300 విలువ చేసే ఈ టికెట్లను ఈ ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో ఉంచనుంది. ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్ లైన్ లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది. 

కాగా, 10 ఎలక్ట్రిక్ బస్సులు నేడు తిరుమల చేరుకోనున్నాయి. ధర్మరథం పేరిట నిర్వహించే సర్వీసుల కోసం వీటిని వినియోగించనున్నారు. విద్యుత్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా ఈ బస్సులను టీటీడీకి విరాళంగా ఇస్తోంది. ఈ విద్యుత్ బస్సులకు టీటీడీ ప్రత్యేక పూజలు చేయనుంది.

madagoni surendar

Mar 27 2023, 11:17

ఏప్రిల్ నెల టీటీడీ శ్రీవారి దర్శన టికెట్లు నేడు విడుదల

ఏప్రిల్ నెల టీటీడీ శ్రీవారి దర్శన టికెట్లు నేడు విడుదల

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం రూ.300 టికెట్లు

ఈ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల

ఆన్ లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలన్న టీటీడీ

నేడు తిరుమల చేరుకోనున్న 10 ధర్మరథం విద్యుత్ బస్సులు

టీటీడీకి బస్సులను విరాళంగా అందించిన ఒలెక్ట్రా సంస్థ

ఏప్రిల్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నేడు విడుదల చేయనున్నారు. రూ.300 విలువ చేసే ఈ టికెట్లను ఈ ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో ఉంచనుంది. ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్ లైన్ లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది. 

కాగా, 10 ఎలక్ట్రిక్ బస్సులు నేడు తిరుమల చేరుకోనున్నాయి. ధర్మరథం పేరిట నిర్వహించే సర్వీసుల కోసం వీటిని వినియోగించనున్నారు. విద్యుత్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా ఈ బస్సులను టీటీడీకి విరాళంగా ఇస్తోంది. ఈ విద్యుత్ బస్సులకు టీటీడీ ప్రత్యేక పూజలు చేయనుంది.