madagoni surendar

Mar 23 2023, 16:54

హైదరాబాద్ : అంగట్లో అమ్మకానికి 16.8 కోట్ల మంది డేటా.. ఆరుగురి అరెస్టు

హైదరాబాద్ : అంగట్లో అమ్మకానికి 16.8 కోట్ల మంది డేటా.. ఆరుగురి అరెస్టు

హైదరాబాద్‌: వ్యక్తిగత డేటా సేకరించి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 16.8కోట్ల మందికి సంబంధించిన డేటా చోరీ చేశారని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు..

పలు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్ల నుంచి డేటాను చోరీ చేసి ఈ ముఠా సైబర్‌ నేరగాళ్లకు అమ్ముతున్నట్లు వెల్లడించారు. పాన్ ఇండియా ప్రభుత్వ ఉద్యోగులు, పలు బ్యాంకింగ్‌ క్రెడిట్ కార్డులు, పాన్ కార్డ్, పాలసీ బజార్ వంటి పేరున్న సంస్థల నుంచి డేటా చోరీ అయిందని చెప్పారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

''బీమా, రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల సమాచారం తస్కరించినట్లు గుర్తించాం. ఫేస్‌బుక్‌ యూజర్ల ఐడీ, పాస్‌వర్డ్‌లు, ఐటీ ఉద్యోగుల డేటాను సైతం చోరీ చేశారు. డిఫెన్స్‌, ఆర్మీ ఉద్యోగుల డేటా అంగట్లో అమ్మకానికి పెట్టారు. మహిళల వ్యక్తిగత డేటానూ సైబర్‌ నేరగాళ్లకు అమ్ముతున్నారు. ఇది దేశ భద్రతకు పెను ముప్పు. సైబరాబాద్‌ పరిధిలో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాం. ఈ వ్యవహారంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా క్రెడిట్‌ కార్డ్‌ జారీ చేసే ఓ ఏజెన్సీ ఉన్నట్లు గుర్తించాం. దీనికి సంబంధించి జస్ట్‌ డయల్‌ సంస్థపై కూడా కేసులు నమోదు చేస్తాం. గతంలో ఇలాంటి కేసులు మా దృష్టికి వచ్చాయి. వీరి వెనుక ఎవరున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తాం'' అని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు..

madagoni surendar

Mar 23 2023, 16:46

ఘనంగా నేషనల్ క్రిస్టియన్ బోర్డు సమావేశం.పెనుగంచిప్రోలు.

ఘనంగా నేషనల్ క్రిస్టియన్ బోర్డు సమావేశం.

పెనుగంచిప్రోలు

నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అద్యక్షులు డాక్టర్ జాన్ మాస్క్ పిలుపు మేరకు మండలంలోని శివపురం గ్రామంలో ఏ జి సి ఎం ప్రార్ధనా మందిరంలో పాస్టర్ ప్రభు కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా నేషనల్ క్రిస్టియన్ బోర్డు మండల ప్రతినిధుల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా 

 ఏపి స్టేట్ అద్యక్షులు రెవ. డా. నవీన్ కుమార్ మాట్లాడుతూ దైవ సేవలో ఉన్న వారంతా నమ్మకంగా, ఐక్యత కలిగి జీవించాలని, దేశ రక్షణ కొరకు ప్రార్థించాలని పిలుపునిచ్చారు. జిల్లా అద్యక్షులు

రెవ. ఏ చింతయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మండలంలో కష్టపడి పనిచేయాలని అందరికి క్రీస్తు ప్రేమను పంచాలన్నారు. స్టేట్ ట్రెజరర్ వై. శేఖర్ బాబు మాట్లాడుతూ క్రైస్తవులు సమయపాలన కలిగి సమాజిక సేవ చేయలని తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర, జిల్లా కార్యవర్గం సభ్యులు, పలువురు మండల నాయకులు, స్థానిక దైవ సేవకులు తదితరులు పాల్గొన్నారు

madagoni surendar

Mar 23 2023, 16:41

పోలవరం. ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం: కేంద్రం.

Polavaram: 'పోలవరం. ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం: కేంద్రం

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతానికి పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని తేల్చి చెప్పింది..

పార్లమెంటులో వైకాపా ఎంపీ సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. తొలిదశ సహాయ, పునరావాసం అంతవరకేనని స్పష్టం చేశారు. తొలిదశ సహాయ, పునరావాసం మార్చి 2023 నాటికే పూర్తి కావాల్సి ఉందని పేర్కొన్నారు.

అయితే, తొలిదశలో 20,946 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం ఖరారైందని వెల్లడించారు. ఇప్పటివరకు కేవలం 11,677 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం కల్పించినట్లు తెలిపారు. సహాయ, పునరావాసం మార్చి నాటికే పూర్తి కావాల్సి ఉన్నా... అందులో కూడా జాప్యం జరిగిందని కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా వివరించారు..

madagoni surendar

Mar 23 2023, 14:35

ఏపీ :ఒక్క ఎమ్మెల్యే కోసం స్పెషల్ ప్లైట్ ఏర్పాటు చేసిన వైయస్సార్ సీపీ

ఒక్క ఎమ్మెల్యే కోసం స్పెషల్ ప్లైట్ ఏర్పాటు చేసిన వైయస్సార్ సీపీ.

ఎమ్మెల్సీ పోలింగ్.. ఓటు వేసిన 174 మంది ఎమ్మెల్యేలు

AP: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ దాదాపు ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు ఓటు వేసేందుకు గడువు ఉన్నా.. ఇప్పటికే 175 మంది ఎమ్మెల్యేల్లో 174 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుమారుడి వివాహం ఉండటంతో నెల్లిమర్ల వైసీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడు ఇంకా ఓటు వేయలేదు. ఆయన కోసం వైసీపీ ప్రత్యేక ఛాపర్ ఏర్పాటు చేసింది. దాంట్లో బయల్దేరిన ఆయన కాసేపట్లో గన్నవరం విమానాశ్రయం చేరుకుని ఓటు వేసేందుకు పయనం కానున్నారు.....

madagoni surendar

Mar 23 2023, 13:25

విజయవాడ:ఇంద్రకీలాద్రి లో దోపిడి.. కేశఖండనశాలలో భక్తుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్న సిబ్బంది..

విజయవాడ:ఇంద్రకీలాద్రి లో దోపిడి..

కేశఖండనశాలలో భక్తుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్న సిబ్బంది..

దూర ప్రాంతాల నుంచి వచ్చు భక్తులను నిలువునా దోచుకుంటున్న దేవస్థానం సిబ్బంది..

కేశఖండనశాలలో తలనీలాలు సమర్పించే భక్తుల నుండి అధిక దోపిడీ..

దుర్గగుడి కేశఖండన శాలలో భక్తుల నుండి అధిక దోపిడీ

భక్తుల సెంటిమెంటును ఆసరాగా చేసుకుంటున్నా దేవాలయ సిబ్బంది..

భక్తులు సమర్పించే తలనీలాలు టికెట్ ధర 25 రూపాయలు..

ఆలయ సిబ్బంది మాత్రం 500 రూపాయలు డబ్బులు ఇస్తేనే తలనీలాలు చేస్తాం లేకపోతే లేదు అని చెబుతున్నారని భక్తులు ఆరోపణ..

వాటాల నిమిత్తం

MLA 200

ట్రస్ట్ బోర్డు సభ్యులకు 200

కేశఖండ శాల లో విధులు నిర్వహించే వాళ్లకి 100

madagoni surendar

Mar 23 2023, 12:56

గర్భనిరోధానికి ఇక పిల్స్‌తో పనిలేదు.తెలుగు రాష్ట్రాల్లో కొత్త విధానం అమలుకు కేంద్రం రెడీ.

గర్భనిరోధానికి ఇక పిల్స్‌తో పనిలేదు

తెలుగు రాష్ట్రాల్లో కొత్త విధానం అమలుకు కేంద్రం రెడీ!

మూడు నాలుగు సెంటీమీటర్ల పొడవుతో సూదిలా సాధనం

మోచేతి చర్మం కింద పైపొరలో అమరిక

గర్భాన్ని నిరోధించే హార్మోన్ విడుదల

అన్ని రాష్ట్రాల్లోనూ ఉచితంగా పంపిణీ చేయనున్న కేంద్రం

బిడ్డల మధ్య ఎడం కోరుకునే వారికి ఉపయుక్తం

సంతానం కావాలనుకున్నప్పుడు ఈజీగా తొలగించొచ్చు

న్యూ ఢిల్లీ : గర్భ నిరోధానికి ఇప్పటి వరకు ఉన్న పిల్స్, ఇంజెక్షన్లు, కాపర్-టి, కండోమ్‌ల వంటి సాధనాల స్థానంలో కొత్త పద్ధతి వస్తోంది. దీనిని తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కొత్త సాధనం 3-4 సెంటీమీటర్ల పొడవు, 2-4 మిల్లీమీటర్ల పొడవుతో సూదిలా ఉంటుంది. దీనిని మోచేతి చర్మం కింద పైపొరలో అమరుస్తారు. దీంట్లో నుంచి గర్భాన్ని నిరోధించే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. నిజానికీ సాధనం హార్మోన్‌తోనే తయారవుతుంది. సంతానం మధ్య దూరం ఉండాలని కోరుకునే వారు ఈ సాధనాన్ని ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల భార్యాభర్తల సఖ్యతకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ విధానాన్ని ‘సబ్ డెర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్’గా పిలుస్తున్

madagoni surendar

Mar 23 2023, 12:39

ఏపీ అసెంబ్లీలో ప్రారంభమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. మొదటి వోటు వేసిన సీఎం జగన్

ఏపీ అసెంబ్లీలో ప్రారంభమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.

మొదటి వోటు వేసిన సీఎం జగన్

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్ ముగిసిన గంట తర్వాత అంటే..సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ మొదలుకానుంది. అందర్నీ ఏకకాలంలో తరలించే ప్రయత్నాల్లో ఉంది టీడీపీ. చంద్రబాబుతో కలిసే ఓటింగ్‌కి వెళ్లబోతున్న 19 మంది ఎమ్మెల్యేలు. ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు మెజార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు. ఈ పోలింగ్ మొత్తం విప్ వర్సెస్ ఆత్మప్రబోధానుసారం కాన్సెప్ట్‌లో జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పోటీచేస్తున్న ఒక్క సీటును గెలిచితీరతామంటున్నాయి టీడీపీ వర్గాలు. లేదు లేదు ఏడుకు ఏడు సీట్లు తమవేనన్న ధీమాలో ఉంది వైసీపీ. ఎవరి ధీమా వాళ్లకు ఉన్నా.. ఎవరి టెన్షన్ కూడా వాళ్లకుంది. ఎందుకంటే.. ఈ పోటీల్లో గెలుపోటములను రెబల్స్ టెన్షన్ ప్రభావితం చెయ్యబోతోంది.

madagoni surendar

Mar 23 2023, 10:51

అమరావతి :కేజీబీవీలలో ప్రవేశం కోసం దరఖాస్తుల స్వీకరణ

'కేజీబీవీలలో ప్రవేశం కోసం దరఖాస్తుల స్వీకరణ'

అమరావతి: కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో 6, 11వ తరగతుల్లో ప్రవేశం కోసం, 7, 8, 9 తరగతుల్లో మిగి లిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తు న్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ తెలిపారు.సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 352 కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గానూ ఆన్లైన్లో దర ఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. 

ఈనెల 27 నుంచి ఏప్రిల్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నామన్నారు.

 అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ ( బడి మానేసిన వారు) పేద, ఎస్.సి, ఎస్.టి, బీసీ, మై నారిటీ, బి.పి.ఎల్ బాలికలు మాత్రమే దర ఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 

ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణిస్తామని చెప్పారు. 

దరఖాస్తును‘హెచ్ టీటీపీఎస్://ఏపీకేజీబీవీ. ఏపీసీఎఫ్ఎస్ఎస్. ఐఎన్' సైట్ ద్వారా పొందవచ్చునన్నారు. 

ఎంపికైన విద్యార్థుల కు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందుతుందని తెలిపారు. సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడవచ్చని, సందేహాలు ఉంటే 9494383617, 9441270099, 9441214607, 9490782111 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

madagoni surendar

Mar 23 2023, 10:43

వైజాగ్ : విశాఖ రామజోగిపేటలో కూలిన మూడంతస్తుల భవనం.. ముగ్గురు మృతి

వైజాగ్ : విశాఖ రామజోగిపేటలో కూలిన మూడంతస్తుల భవనం.. ముగ్గురు మృతి

జగదాంబ కూడలి(విశాఖ) విశాఖ నగరం కలెక్టరేట్‌ సమీపంలోని రామజోగిపేటలో బుధవారం అర్ధరాత్రి మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది..

ఈ ఘటనలో బాలిక సాకేటి అంజలి(14), దుర్గాప్రసాద్‌(17)తో పాటు మరొకరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో కొమ్మిశెట్టి శివశంకర, సాకేటి రామారావు, సాకేటి కల్యాణి, సున్నపు కృష్ణ, సాతిక రోజారాణి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక, ఎన్డీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో పరిసర ప్రజలు భయాందోళనలో ఉన్నారు..

ప్రమాద సమయంలో భవనంలో మొత్తం 8 మంది ఉన్నారు. మరోక వ్యక్తి చోటు ఆచూకీ కోసం శిథిలాల కింద గాలింపు చేపట్టారు. గాయపడిన ఐదుగురిని కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని డీసీపీ సుమిత్‌ గరుడ పరిశీలించారు..

madagoni surendar

Mar 22 2023, 20:57

ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్న మీడియా.కందుకూరి యాదగిరి సీనియర్ పాత్రికేయులు

ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్న మీడియా.కందుకూరి యాదగిరి సీనియర్ పాత్రికేయులు

Streetbuzz news నల్గొండ జిల్లా :

సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను అవినీతిని ఎండగట్టి ప్రజల పక్షాన ఫోర్త్ ఎస్టేట్ గా నిలబడవలసిన మీడియా గాడి తప్పిందా? ప్రజల్లో విశ్వాసం కోల్పోతుందా?సన్నగిల్ల చేసుకుంటుందా?ఈ ప్రశ్నలకు 90 శాతం ప్రజలు నిజంగానే మీడియా ఎప్పుడో గాడి తప్పిందని ఒకప్పుడు ఉన్న విశ్వాసం ప్రస్తుతం లేదని సమాధానం చెప్పే పరిస్థితి కనిపిస్తున్నది.ఒకప్పుడు ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరిగిందంటే న్యాయం చేసేందుకు సింహం జూలు విదిల్చుకొని లేచి గాండ్రించి పంజా విసిరిన చందంగా పెద్దన్న పాత్ర పోషించిన మీడియా.. ప్రస్తుతం ఇలాంటి సంఘటనలు సమాజంలో ఎన్నో జరుగుతున్నప్పటికీ చూసి చూడనట్లు,రాసి రాయనట్లు,చెప్పి చెప్పినట్లు గా వ్యవహరించటం వెనక ఆంతర్యం ఏమిటని సభ్య సమాజం సందేహంలో పడింది. ప్రస్తుతం మీడియా అంతా మనీ మైండ్ తో కొనసాగుతోందని జనం మాట్లాడుకుంటున్నారు.ఇంకొక అడుగు ముందుకేసి మీడియా పైన విశ్వాసం లేనట్లుగా ప్రజలు వ్యవహరించడానికి కారణాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్రాలను దేశాలను పరిపాలిస్తున్న ప్రతినిధుల వ్యవహార శైలి ఒంటెద్దు పోకడలో ఉన్నప్పుడు జీర్ణించుకోలేని ప్రజలు ఆశ్రయించేది ప్రచారమాధ్యమాలను.ఆ ప్రచార మాధ్యమాలు ప్రజల ఆవేదన లో భాగస్వాములు కాకుండా స్వలాభం కోసం కొన్ని మీడియా సంస్థలు ఎక్కడో ఒకచోట ప్రజా సమస్యలకు చోటు ఇచ్చి మిగులు భాగం అంతా ప్రకటనలకు పరిమితమైనట్లు బహిర్గతంగానే తెలుస్తోంది. ఎప్పుడైతే మీడియా ధనాపేక్షకు ప్రధాన విలువలిస్తుందో దాని ప్రారంభ సంకల్ప ఔన్నత్యాన్ని కోల్పోతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమైనా కానీ తన నిజస్వరూపాన్ని మార్చుకోకుండా ఉన్నప్పుడే మీడియాపై ప్రజలకు విశ్వాసం ఉంటుంది.ప్రచురిస్తున్న కథనాల తీరుతెన్నులను సమాజం గమనిస్తుందన్న సంగతులు మర్చిపోయిన వారు లేదా ఎవరేమనుకుంటే తమకేం అనుకునేవారు గాడి తప్పిపోతున్నారని ప్రత్యేకంగా చూపించాల్సిన పనిలేదు. అరకదున్నుతున్న రైతు చేతిలో ముళ్ళు కర్ర ఎంత ముఖ్యమో ప్రజాస్వామ్యంలో ప్రజలు తప్పు చేసిన ప్రభుత్వాలు చట్టవిరోధంగా పని చేస్తున్న గాడి తప్పే అరకలాంటి ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థను,ప్రభుత్వాలను చక్కపెట్టే పనిలో ఉండాల్సిన మీడియా ఎప్పుడు ప్రజాస్వామ్యం ప్రభుత్వాలు తప్పు చేస్తాయా తిలా పాపం తల పిడికెడు అందామా అని ఎదురుచూస్తున్నట్లు ఉంది మీడియా పోకడ.సమాజంలో జరుగుతున్న సంఘటనలను సమాచారాలను ప్రజలకు చేరవేయడంలో ప్రస్తుతం మీడియా ఎంతవరకు సామాజిక బాధ్యత వహిస్తున్నది? అన్న ప్రశ్నకు ఏ మీడియా వద్ద సరైన సమాధానం లేదనేది ఒప్పుకోవాల్సిన సత్యం. పెరిగిన ఆధునిక టెక్నాలజీ కి తగినంతగా సమాచార సేకరణలో న్యాయం వైపు ఉండి కలం గలాలతో దిశా నిర్దేశం చేయాల్సిన ఫోర్త్ ఎస్టేట్ అందుకు తగినట్లుగా ఎందుకు వ్యవహరించట్లేదు!? 20 ఏళ్ల క్రితం ఉన్న సమాజానికి ప్రస్తుత సమాజానికి చాలా తేడా కనిపిస్తున్నది.ఎక్కడ ఎన్ని మార్పులు వచ్చినా మీడియాలో మార్పులు రాకూడదు అనేది ప్రజల యొక్క బలమైన కోరిక. పనికిమాలిన మీడియా, సొమ్ములకు అమ్ముడు పోయే మీడియా,అక్రమాలకు కొమ్ముకాస్తున్న మీడియా,స్వలాభం చూసుకుంటున్న మీడియా,స్వార్థ బుద్ధితో కొనసాగుతున్న మీడియా సామాజిక స్పృహ లేని మీడియా, సమాచార వ్యవస్థ మీద సమాజానికి ఇలాంటి ఆలోచన రాకముందే ప్రజలకు యావగింపు రాకముందే మీడియా పైననే ఆధారపడే 80 శాతం ప్రజల ఆత్మఘోషను వినిపించేందుకు చూపించేందుకు వెనువెంటనే తేరుకోవాలని సభ్య సమాజం ఎదురుచూస్తున్నది

కందుకూరి యాదగిరి

సీనియర్ పాత్రికేయులు