TeluguCentralnews

Mar 17 2023, 13:45

తాజాగా బ్రిటన్ లో కూడా ‘టిక్‌టాక్‌’ పై నిషేదం.

చైనా యాప్‌ ‘టిక్‌టాక్‌’కు మరో భారీ షాక్‌ తగిలింది. ఇప్పటికే పలు దేశాల్లో బ్యాన్ అయిన ఈ యాప్ తాజాగా బ్రిటన్ లో నిషేధించారు. అయితే పూర్తిగా మాత్రం కాదు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వ ఫోన్‌లలో ఈ యాప్‌ను నిషేధిస్తున్నట్లు బ్రిటన్‌ వెల్లడించింది. మంత్రి ఆలివర్ డౌడెన్ గురువారం పార్లమెంటులో ఈ మేరకు ప్రకటన చేశారు.

‘ప్రభుత్వ సమాచారాన్ని టిక్‌టాక్‌ ఏ విధంగా వినియోగిస్తోందోనన్న విషయంలో ముప్పు పొంచి ఉంది. ప్రభుత్వానికి చెందిన సున్నితమైన సమాచార భద్రతకు ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలి. కాబట్టి, ప్రభుత్వ పరికరాల్లో ఈ యాప్‌ను నిషేధిస్తున్నాం. సైబర్ సెక్యూరిటీ నిపుణుల సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. డేటాను యాక్సెస్‌ చేసే ఇతర యాప్‌లపైనా దృష్టి సారించాం. థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ల నిర్వహణపై ప్రభుత్వ విధానాన్ని బలోపేతం చేస్తాం’ అని డౌడెన్‌ అన్నారు.

బ్రిటన్‌లో ప్రస్తుతం ప్రభుత్వ పరికరాల్లో టిక్‌టాక్ వినియోగం పరిమితంగా ఉంది. తాజాగా దాన్ని పూర్తిగా నిషేధించింది. అన్ని ప్రభుత్వ శాఖల్లోని డివైజ్‌లకు ఇది వర్తిస్తుంది. అయితే, ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు, సాధారణ ప్రజల వ్యక్తిగత పరికరాలపై ఈ నిషేధం ఉండదు. ఇంటర్నెట్‌ దుర్వినియోగం వంటి అంశాలపై పనిచేసే ప్రభుత్వ విభాగాల్లోని ఫోన్‌లలో టిక్‌టాక్ వినియోగానికి నిర్దిష్ట మినహాయింపులు కల్పిస్తున్నట్లు క్యాబినెట్ కార్యాలయం తెలిపింది.

TeluguCentralnews

Mar 16 2023, 20:07

ఆయుధాల కొనుగోలుకు రూ.70 వేల కోట్ల రక్షణశాఖ డీల్

ఆయుధ సామాగ్రి కొనుగోలుకు కేంద్ర రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ దళాలకు వివిధ ఆయుధ సంపత్తిని కొనుగోలు చేసేందుకు రూ.70 వేల కోట్ల విలువైన ప్రతిపాదనలకు రక్షణ మంత్రిత్వ శాఖ (Defence Ministry) ఆమోదించినట్లు అధికారులు తెలిపారు. 

భారత నౌకా దళానికి 60 మేడ్ -ఇన్-ఇండియా యుటిలిటీ హెలికాప్టర్లు మెరైన్, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు (BrahMos missiles), భారత సైన్యం కోసం 307 ATAGS హోవిట్జర్లు, 9 ALH ధృవ్ ఛాపర్‌ల (Dhruv choppers)ను కొనుగోలు చేసే ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh ) నేతృత్వంలోని మండలి సమావేశం ఆమోదం తెలిపింది.

ఈ డీల్‌లో హెచ్‌ఏఎల్ నుంచి 60 యూహెచ్ మెరైన్ చాపర్‌లను కొనుగోలు చేసేందుకు భారత నావికాదళానికి రూ.32 వేల కోట్ల మెగా ఆర్డర్ కూడా ఉందని అధికారులు తెలిపారు. భారత నౌకాదళానికి రూ. 56 వేల కోట్ల విలువైన బ్రహ్మోస్ క్షిపణులు, శక్తి ఈడబ్ల్యూ సిస్టమ్స్, యూటీలిటీ హెలికాప్టర్లు- మారీమ్ అనుమతి లభించింది.

TeluguCentralnews

Mar 16 2023, 19:51

టీ ఇవ్వలేదని భార్యపై యాసిడ్ పోసిన భర్త

టీ ఇవ్వలేదని భార్యపై మద్యం మత్తులో భర్త యాసిడ్‌ పోసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. 

ఈ కేసులో నిందితుడైన భర్తను నడి పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వికలాంగుడు, మాదకద్రవ్యాలకు బానిసయ్యాడు. ఈ దాడిలో భార్య గాయపడి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరింది. ఈ ఘటన మరౌనా బ్లాక్‌లోని లాల్మానియా గ్రామంలో చోటుచేసుకుంది. 

ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. నిందితుడు మొదట మద్యం బాటిళ్లతో ఇంటికి వచ్చాడు. మద్యం బాటిళ్లను ఖాళీ చేసి ఆ తర్వాత దంపతులిద్దరు కలిసి తిన్నారు. తర్వాత టీ ఇవ్వమని భార్యను అడిగాడు.

భార్య గ్యాస్‌పై టీ పెట్టింది. అయినప్పటికీ నిందితుడు వంటగదిలోకి వెళ్లి బాత్‌రూమ్‌ క్లీనింగ్‌ యాసిడ్‌ భార్య ముఖంపై పోశాడు. మహిళ గొంతు విని ఇరుగుపొరుగు వారు పరుగున వచ్చారు. 

బాధితురాలి సమాచారం ప్రకారం, ఆమె మూడు రోజుల క్రితం తన భార్య ముఖంపై వేడి చేయని యాసిడ్ పోశాడు. ఆ సమయంలో ఆమె ప్రమాదం నుంచి తప్పించుకోగలిగింది. 

అయితే ఈరోజు హాట్ యాసిడ్ పోసి తీవ్రంగా గాయపడింది. దీంతో మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరుగులు తీశారు. వారు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని భర్తను అదుపులోకి తీసుకున్నారు.

TeluguCentralnews

Mar 16 2023, 18:17

కూలిన ఆర్మీ హెలీకాప్టర్.. లెఫ్టినెంట్ కల్నల్ మృతి

అరుణాచల్ ప్రదేశ్‌లోని బొమ్‌డిలాలో ఆర్మీ హెలికాప్టర్ గురువారం కుప్పకూలింది. పైలట్ల జాడ కోసం ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. గురువారం ఉదయం 9.15 గంటల ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని బోమ్‌డిలా సమీపంలో ఆపరేషన్ సమయంలో ఆర్మీ ఏవియేషన్‌కు చెందిన చితా హెలికాప్టర్‌కు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయని రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ తెలిపారు. హెలికాప్టర్ తరువాత బొండిలాకు పశ్చిమాన మండల్ సమీపంలో కూలిపోయినట్లు గుర్తించారు. పైలట్‌ల కోసం ఆర్మీ రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ ప్రారంభించింది.

గతేడాది అక్టోబర్‌ 5న అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌లో ఆర్మీ చితా హెలికాప్టర్‌ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ పైలట్లకు గాయాలు కాగా వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉదయం 10 గంటల సమయంలో తవాంగ్‌లోని జెమిథాంక్ సర్కిల్‌లోని బాప్ టెంగ్ కాంగ్ జలపాతం సమీపంలోని న్యామ్‌జాంగ్ చు వద్ద ఈ ప్రమాదం జరిగిందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. సురవ సాంబ ప్రాంతం నుంచి ఇద్దరు పైలట్లతో హెలికాప్టర్లు నిత్యం సంచరిస్తుంటాయి.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే, రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుంది, ఆ తర్వాత తీవ్రంగా గాయపడిన ఇద్దరు పైలట్‌లను బయటకు తీసి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు పైలట్లలో ఒకరైన లెఫ్టినెంట్ కల్నల్ సౌరభ్ యాదవ్ చికిత్స పొందుతూ మరణించారు. తవాంగ్‌లో ఇది మొదటి హెలికాప్టర్ ప్రమాదం కాదు. 2017లో వైమానిక దళానికి చెందిన Mi-17 V5 హెలికాప్టర్ కూలి ఐదుగురు IAF సిబ్బంది మరియు ఇద్దరు ఆర్మీ అధికారులు మరణించారు.

TeluguCentralnews

Mar 16 2023, 18:05

హర్యానా గురుగ్రాంలో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య..

పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్మీడియట్‌ చదివే ఓ విద్యార్ధి 13వ అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హర్యానా రాష్ట్రంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

 వివరాల్లోకెళ్తే.. గురుగ్రాంలోని సెక్టార్ 41లోని సౌత్ సిటీ 1లోని రిట్రీట్ సొసైటీలో 17 ఏళ్ల బాలుడు ఓ ప్రైవేట్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్నాడు. ఫైనల్‌ టర్మ్‌ పరీక్షలు దగ్గరపడుతుండటంతో ఒత్తిడి తట్టుకోలేక తమ అపార్ట్‌మెంట్‌లో 13వ అంతస్థు బాల్కనీ నుంచి కింది దూకాడు. కింద ఏదోపడ్డ శబ్ధం రావడంతో సొసైటీ సెక్యూరిటీ గార్డులు బయటికి వచ్చి చూశారు. అక్కడ రక్తపుమడుగులో పడి ఉన్న బాలుడిని చూసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు బాలుడు చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ సంఘటన సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యంకాకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మంగళవారం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

TeluguCentralnews

Mar 16 2023, 14:47

నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాని నరేంద్ర మోడీ

ప్రపంచం శాంతిని, స్నేహాన్ని కోరుకోవడంలో ప్రధాని మోడీ ఎప్పుడూ ముందుంటారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టి దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో పడనీయకుండా కాపాడారు. అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

అన్ని దేశాలతో స్నేహాన్ని కొనసాగిస్తూ దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో నోబెల్‌ శాంతి బహుమతి రేసులో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ప్రకటించే అవార్డుల్లో ప్రధాని మోడీకి నోబెల్ శాంతి బహుమతి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇటీవల నార్వేకు చెందిన నోబెల్ అవార్డ్స్ కమిటీ భారత్ ను సందర్షించింది. నోబెల్ శాంతి బహుమతి విజేతను నిర్ణయించే ఈ కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అస్లే టోజే ప్రధాని మోడీని ప్రశంసించారు. ఆయన ప్రపంచానికి చేస్తున్న సేవలను కొనియాడారు. యుద్ధాలు చేసే దేశాల చేత కూడా యుద్ధాలను ఆపించగల సత్తా ఉన్నవాడని పేర్కొన్నారు. మోడీ లాంటి శక్తివంతమైన నేతకు ప్రపంచ దేశాల మధ్య శాంతి నెలకొల్పే సామర్థ్యం ఉందని కితాబిచ్చారు. మోడీ లాంటి నేత శాంతిని పెంచడంలో కీలక పాత్ర పోషించగలరని నమ్ముతున్నట్లు అస్లే టోజే వెల్లడించారు. 

మోడీ విధానాల వల్ల భారత్ సుసంపన్నమైన, శక్తిమంతమైన దేశంగా మారుతోందని అస్లే అన్నారు. ప్రపంచాన్ని నడపగల గొప్ప అర్హత ఉన్న నాయకుడైన ప్రధాని మోడీ.. ఈ ఏడాది అక్టోబర్ లో ప్రకటించే నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకుంటే అది చారిత్రాత్మకం అవుతుందని చెప్పారు.

TeluguCentralnews

Mar 16 2023, 12:20

కెనడా లో భారతీయల నకిలీ వీసాల గుర్తింపు... 700 మంది పై బహిష్కరణ వేటు...

కెనడాలో భారతీయ విద్యార్థుల వీసాలు నకిలీవని గుర్తించడంతో దేశంలోని అధికారులు వారిని దేశం నుంచి బహిష్కరణ వేటు వేశారు.

 వారు కెనడియన్ బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ (CBSA) నుండి బహిష్కరణ లేఖలను అందుకున్నారు. 

 700 మంది విద్యార్థులు బ్రిజేష్ మిశ్రా నేతృత్వంలోని ఎడ్యుకేషన్ మైగ్రేషన్ సర్వీసెస్ (జలంధర్‌లో ఉంది) ద్వారా స్టడీ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. బ్రిజేష్ మిశ్రా ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్ హంబర్ కాలేజీలో అడ్మిషన్ ఫీజుతో సహా అన్ని ఖర్చుల కోసం ఒక్కో విద్యార్థికి రూ. 16 లక్షలకు పైగా వసూలు చేశారు. ఈ విద్యార్థులు 2018-19లో అధ్యయనం ఆధారంగా కెనడా వెళ్లారు.

 ఈ విద్యార్థులు కెనడాలో శాశ్వత నివాసం (PR) కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.

 దీని కోసం ‘అడ్మిషన్ ఆఫర్ లెటర్స్’ పరిశీలనలోకి వచ్చాయి, అంటే కెనడియన్ బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ విద్యార్థులకు వీసాలు జారీ చేసిన పత్రాలను పరిశీలించి ‘అడ్మిషన్ ఆఫర్ లెటర్స్’ నకిలీవని తేల్చింది.

TeluguCentralnews

Mar 16 2023, 11:08

దేశ వ్యాప్తంగా ఈ బంగారం - వెండి ధరలు

తాజాగా బంగారం ధరలో కొంత తగ్గుదల కనిపించింది. తులంపై ఒకేసారి రూ. 110 తగ్గింది.

 గురువారం దేశవ్యాప్తంగా నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,870  

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050 

24 క్యారెట్ల ధర రూ.57,870 వద్ద కొనసాగుతోంది.

విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050  

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,870 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 53,200  

24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,020 

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,800 

 

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,690 

ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.53,050.

24 క్యారెట్ల తులం ధర రూ.57,870 

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.53,100  

24 క్యారెట్ల ధర రూ.57,920 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు 

వెండిపై ఏకంగా రూ. 500 వరకు పెరిగింది.  

హైదరాబాద్‌లో రూ.72,500, 

విశాఖ, విజయవాడలో రూ.72,500  

చెన్నైలో కిలో వెండి ధర రూ.72,500, 

ముంబైలో రూ.69,000, 

ఢిల్లీలో రూ.69,000, 

కోల్‌కతాలో కిలో వెండి రూ.69,000, 

బెంగళూరులో రూ.72,500,

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి మాత్రమే...

TeluguCentralnews

Mar 16 2023, 10:42

న్యూజిలాండ్‌ కెర్మాడెక్ దీవులలో 7.1 తీవ్రతతో భారీ భూప్రకంపనలు

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఉన్న కెర్మాడెక్ దీవులను గురువారం రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం తాకింది.

 యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అంచనా. 300కిమీ వ్యాసార్థంలో సమీపంలోని, జనావాసాలు లేని ద్వీపాలకు యూఎస్ సునామీ హెచ్చరిక వ్యవస్థ ద్వారా సునామీ హెచ్చరిక కొద్దిసేపటి తర్వాత జారీ చేయబడింది. 

భూకంపం కారణంగా న్యూజిలాండ్‌కు సునామీ ముప్పు లేదని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది.

TeluguCentralnews

Mar 15 2023, 20:35

పెళ్లైన పురుషులపై పెరుగుతున్న గృహ హింసలు, పురుషుల జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిటీషన్

పెళ్లైన స్త్రీలపై గృహ హింస జరగడం లాంటి కేసులు చాలా వరకు జరుగుతున్నాయి. కాని వివాహమైన పురషులు కూడా గృహహింసకు గురవుతున్నారంటే చాలా మంది లైట్ గా తీసుకుంటారు. కాని వాస్తవానికి ఎన్సీఆర్బీ నివేదిక చూస్తే పురుషులు కూడా గృహ హింస వల్ల ఆత్మహత్యలు చేసుకనే ఘటనలు కూడా చాలానే జరుగుతున్నాయన్న విషయం అర్థమవుతుంది. అందుకేసమే పురుషుల కోసం సైతం ఓ జాతీయ కమిషన్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది.

న్యాయవాది మహేశ్ కుమార్ తివారీ ఈ పిటీషన్ ను దాఖలు చేశారు. జాతీయ నేర రికార్డుల బ్యూరో వెల్లడించిన సమాచారం ప్రకారం, 2021లో ప్రమాదవశాత్తూ సంభవించిన మరణాలు 1,64,033 అని ఈ పిటిషన్ పేర్కొంది. వీరిలో 81,063 మంది పెళ్లయిన పురుషులని తెలిపింది. వివాహిత మహిళలు 28,680 మంది ప్రమాదవశాత్తూ మరణించినట్లు ఈ నివేదిక పేర్కొందని తెలిపింది. మరణించిన పురుషుల్లో 33.2 శాతం మంది మరణానికి కారణం కుటుంబ సమస్యలని, 4.8 శాతం మంది మరణానికి కారణం వివాహ సంబంధితమైనవని వెల్లడించింది.

2021లో 1,18,979 మంది పురుషులు ఆత్మహత్య చేసుకున్నారని, 45,026 మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్‌సీఆర్‌బీ డేటా వెల్లడించిందని తెలిపింది.

అయితే గృహ హింస బాధిత పురుషుల ఫిర్యాదులను స్వీకరించి, విచారణ జరపాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆదేశించాలని ఈ పిటిషన్ కోరింది. గృహ హింస బాధిత పురుషుల సమస్యల పరిష్కారానికి తగిన చట్టం అమల్లోకి వచ్చే వరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసింది. 

కుటుంబ సమస్యల వల్ల ఒత్తిళ్ళలో ఉన్నవారు, వివాహ సంబంధిత సమస్యలపై పురుషులు చేసే ఫిర్యాదులను కూడా పోలీసులు స్వీకరించాలని కోరింది. దీని కోసం తగిన ఆదేశాలను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా పోలీసు అధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌లకు జారీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఈ పిటిషన్ కోరింది. ఈ ఫిర్యాదులు సరైనరీతిలో పరిష్కారమయ్యేందుకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు నివేదించాలని కోరింది. జాతీయ పురుషుల కమిషన్ వంటి వేదికను ఏర్పాటు చేసేందుకు తగిన నివేదికను సమర్పించాలని ఆదేశించాలని కోరింది.