TeluguCentralnews

Mar 09 2023, 19:18

ఇటలీలోని ట్రెంట్ పట్టణం వింత ఆచారం...

ఇటలీలోని ట్రెంట్ పట్టణంలో ఎన్నుకున్న నేతలు బాధ్యతరాహిత్యంగా ప్రవర్తిస్తే హామీలు అమలు చేయకుంటే చెక్కుబోనులో బంధించి నీటిలో ముంచుతారు. ఇది అనాదిగా వస్తున్న ఆనవాయితీగా స్థానికులు చెప్తున్నారు. 

ఈ విధంగా చేస్తే వారికి బుద్ది వస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. దీనిని కోర్టు ఆఫ్ పెనింటెన్స్ గా కూడా పిలుస్తారు.

TeluguCentralnews

Mar 09 2023, 17:18

కరెన్సీ నోటుపై పెన్నుతో రాతలు ఉంటే చెల్లవు అని సోషల్ మీడియాలో ప్రచారం... క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

కొత్త కరెన్సీ నోటుపై ఏమైనా రాస్తే అది చెల్లదని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో గత కొద్ది కాలంగా వాట్సప్ సహా ఇతర సోషల్ మీడియాలో మెసేజ్ వైరల్ అవుతోంది. 

మరోవైపు దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న   ఇప్పటికీ చాలా లావాదేవీలు నోట్ల ద్వారానే జరుగుతున్నాయి. దీంతో అటు వ్యాపారులు కస్టమర్లు ఇద్దరు ఆందోళనకు గురవుతున్నారు. 

మరి దీనిపై అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసుకుందాం...

 PIB ఫ్యాక్ట్ చెక్ వైరల్ సందేశాన్ని పరిశోధించినప్పుడు, RBI పేరుతో వైరల్ అవుతున్న మెసేజ్ పూర్తిగా ఫేక్ అని పెన్నుతో వ్రాసిన నోట్లు చెల్లవు అనేది అబద్ధమని PIB ఫ్యాక్ట్ చెక్ తన విచారణలో తెలిపింది. 

  క్లీన్ నోట్ పాలసీ ప్రకారం, కరెన్సీ నోట్లపై ఏమీ రాయొద్దని, అలా చేయడం వల్ల నోట్లు పాడైపోయి, అవి చిరిగిపోయే ప్రమాదం ఉందని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

TeluguCentralnews

Mar 09 2023, 16:52

పారాదీప్ తీరంలో గూఢచర్య పావురం

 మత్య్సకారులు ఒడిశాలోని తీరంలో  చిన్న కెమెరా, మైక్రోచిప్‌తో అమర్చబడిన ఓ పావురాన్ని తమ బోట్లో గుర్తించారు. వెంటనే జగత్‌సింగ్‌పూర్‌లోని పారాదీప్ మెరైన్ పోలీసులకు అప్పగించారు. 

దానిని పరీక్షించిన పోలీసులు.. పావురం రెక్కపై కోడ్ నంబర్‌తో మెసేజ్ ఉన్నట్లు, పావురాన్ని వైద్యులు పరీక్షిస్తున్నారని... దానికి అమర్చిన పరికరాలను పరిశీలించేందుకు రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ సహాయం తీసుకుంటామని జగత్‌సింగ్‌పూర్ ఎస్పీ రాహుల్  తెలిపారు.

దీనిని గూఢచర్యం కోసం ఉపయోగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

TeluguCentralnews

Mar 03 2023, 10:55

వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి తొలగించాడని.. వ్యక్తిపై కాల్పులు

ఇటీవల కాలంలో చిన్నచిన్న కారణాలకే దాడులకు పాల్పడడం, దారుణంగా వ్యవహరించడం రోజురోజుకు పెరిగిపోతోంది. చిన్న విషయాలకే నేరాలు, ఘోరాలకు పాల్పడుతున్నారు. తాజాగా గురుగ్రామ్‌లో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్ గురిచేస్తోంది. వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి తొలగించినందుకు ఓ వ్యక్తిపై ముగ్గురు కాల్పులు జరిపారు. గురుగ్రామ్‌లో కుక్కల మరణంపై మాటల యుద్ధం తర్వాత పెంపుడు జంతువుల యజమానుల వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించబడిన ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తిపై కాల్పులు జరిపి గాయపరిచారని పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటన ఫిబ్రవరి 26న జరిగింది. రాజ్‌కమల్ అనే బాధితుడి చేతికి, కడుపులో గాయాలయ్యాయి.

ముగ్గురు నిందితులను అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరుపరిచారు. వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.నిందితులను జావెలిన్ త్రోయర్ హితేష్ అలియాస్ డేవిడ్ (23), నోయిడాలో టెన్నిస్ అకాడమీ నిర్వహిస్తున్న ఆనంద్ కుమార్ (26), టోల్ ప్లాజా ఉద్యోగి భూపేందర్ అలియాస్ భీమ్ (30)గా గుర్తించారు. వారి వద్ద నుంచి కంట్రీ మేడ్ పిస్టల్‌తో పాటు రెండు కాట్రిడ్జ్‌లు, స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఒక నెల క్రితం ఆనంద్ కుమార్ కుక్క డాగ్‌ఫైటింగ్ సమయంలో చనిపోయిందని పోలీసు అధికారి తెలిపారు. వాట్సాప్ గ్రూప్‌లో కొన్ని వ్యంగ్య సందేశాలు షేర్ చేయబడ్డాయి. దాని వల్ల మాటల యుద్ధం ప్రారంభమైంది. ఆ తర్వాత రాజ్‌కమల్ ఆనంద్‌కుమార్‌ను వాట్సాప్‌ గ్రూప్ నుంచి తొలగించాడు. దీంతో ఆనంద్ రాజ్‌కమల్‌పై పగ పెంచుకున్నాడు. ఫిబ్రవరి 26న, వారు బస్పదంక గ్రామంలో కలుసుకున్నప్పుడు, నిందితులు రాజ్‌కమల్‌ను కాల్చారు. బుల్లెట్ రాజ్‌కమల్ చేతికి, కడుపులో తాకిందని పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనపై పటౌడీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

TeluguCentralnews

Feb 23 2023, 14:44

పోస్టింగ్ ఇవ్వడంలేదని రోడ్డుపై నగ్న ప్రదర్శన చేసిన నర్సు

ఓ నర్సు ఉద్యోగం కోసం రోడ్డుపై నగ్నంగా నిరసన చేపట్టింది. పోస్టింగ్ ఇవ్వడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో నగ్నంగా మారి రోడ్డుపై నిరసనకు దిగింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే,

ఎస్ఎంఎస్ వైద్య కాలేజీ ఎదుట మహిళ నగ్న ప్రదర్శన చేసింది. అజ్మీర్ జిల్లాకు చెందిన ఈమె జాఎల్ఎం రోడ్డుపై ఆస్పత్రికి ముందు బుధవారం ఈ ఆందోళన చేపట్టింది. ఉదయం 10 గంటలకు ఈ ఘటన జరిగింది. ఆ రోడ్డుపై వెళుతున్న ప్రయాణికులంతా ఆ మహిళను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి తర్వాత కొందరు మహిళలు ఆ మహిళ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. దుస్తులు వేసుకోవాలని మహిళా కానిస్టేబుళ్లు విజ్ఞప్తి చేసినా ఆమె వినిపించుకోలేదు. ఎంత చెప్పినా దుస్తులు వేసుకునేందుకు నిరాకరించింది. ఇక చేసేది లేక ఆమెను పోలీసులు బలవంతంగా అరెస్టు స్టేషన్‌కు తరలించారు. పోస్టింగ్ ఇవ్వడంలో అధికారులు తీవ్ర జాప్యం చేయడంతో ఆమె ఈ తరహా నిరసనకు దిగారు.

TeluguCentralnews

Feb 23 2023, 14:15

Green Growth: పర్యావరణ పరిరక్షణ ప్రజల బాధ్యత - మోదీ

కేంద్రం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గ్రీన్ గ్రోత్ పై దృష్టి సారించింది. అందులో భాగంగా గ్రీన్ ఎనర్జీ మార్కెట్ లో భారత్ ను అగ్రగామిగా నిలుపుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. ‘భారత ప్రజలకు పర్యావరణ పరిరక్షణ అనేది బాధ్యత. అంతేకానీ బలవంతం కాదని మోడీ అన్నారు.

మెరుగైన వాతావరణం లేకుండా మానవ సాధికారత అసాధ్యమని, సమగ్రతతో ముందుకు వెళ్లాలని ప్రధాని కోరారు. గ్రీన్ గ్రోత్ వృద్ధిపై ప్రసంగించిన మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా భారత్ లో పెట్టుబడులు పెట్టాలని విద్యుత్ రంగ సంస్థలను మోడీ ఆహ్వానించారు.

గ్రీన్ గ్రోత్ ప్లాన్ లో భాగంగానే వెహికల్ స్క్రాపింగ్ పాలసీ, గోబర్గాన్ స్కీమ్ లను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

TeluguCentralnews

Feb 23 2023, 12:19

చైనా, తజికిస్తాన్ సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూప్రకంపనలు

మొన్నటి మొన్న టర్కీ, సిరియాలు…ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకులా వణికిపోయాయి. వరుసగా భూకంపాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే.. తీవ్ర భూకంపం ధాటికి అతలాకుతలమైన టర్కీని మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. ఇదిలావుంటే.. నిన్న భారత్‌ను వరుస భూ ప్రకంపనలు బెంబేలెత్తించాయి. ఇప్పుడు తాజాగా ఈ ఉదయం చైనా , తజికిస్తాన్ సరిహద్దులో 7.3 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి. చైనాలో గురువారం (ఫిబ్రవరి 23) రాత్రి 8:37 గంటలకు జిన్‌జియాంగ్‌లో 7.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు తూర్పు తజికిస్తాన్‌లో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది.

చైనా భూకంప నెట్‌వర్క్ సెంటర్ (సిఇఎన్‌సి) ఉయ్గర్ అటానమస్ రీజియన్‌లో భూకంపాన్ని ధృవీకరించగా, యుఎస్ జియోలాజికల్ సర్వే తజికిస్తాన్‌లో ఈ ప్రకంపనల గురించి తెలియజేసింది. ఇంత ఎక్కువ తీవ్రతతో కూడిన భూకంపం కారణంగా, అక్కడ పరిస్థితి గురించి మరింత సమాచారం రావల్సి ఉంది.

TeluguCentralnews

Feb 22 2023, 16:19

ప్రపంచానికి మరో భయంకర ముప్పు..! 48 వేల ఏళ్లనాటి జాంబీ వైరస్‌ సజీవంగానే.. విధ్వంసం తప్పదా..?

రష్యాలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అత్యంత ప్రమాదకరమైన జాంబీ వైరస్‌ను శాస్త్రవేత్తలు పునరుత్థానం చేశారు. రష్యాలో ఘనీభవించిన సీల్ కింద పాతిపెట్టిన 48,500 ఏళ్ల నాటి జాంబీ వైరస్‌ను ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు పునరుద్ధరించారు. వాతావరణ మార్పు చాలా కాలంగా మంచులో పాతిపెట్టిన అనేక జాంబీ వైరస్‌లకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు చాలా కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. జాంబీ వైరస్‌లు మంచులో గడ్డకట్టిన వైరస్‌లు అని ముందుగా మనం గమనించాలి. డీప్ ఫ్రిజ్‌లలో నివసించే ఈ జాంబీ వైరస్‌లు చాలా తక్కువ ఉష్ణోగ్రత కారణంగా వాటిని క్రియారహితం చేసే హైబర్నేషన్ లాంటివి. ఇప్పుడు మంచు కరిగి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఏళ్ల తరబడి మంచులో కూరుకుపోయిన వైరస్‌లు జీవం పోసుకుంటాయి. రష్యాలోని గడ్డకట్టిన జీల్ (సరస్సు) కింద వైరస్ పాతిపెట్టినట్లు గుర్తించిన ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు, వైరస్ 48,500 సంవత్సరాల వయస్సులో ఉందని, ఇతర జంతువులకు, మానవులకు కూడా సోకగల సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పారు. ఆ వైరస్‌కు పండోర వైరస్ అని పేరు పెట్టారు.

ప్రకృతి వైపరీత్యాలే కాకుండా, గ్లోబల్ వార్మింగ్ అనేక రకాల అంటువ్యాధులను కూడా ఆహ్వానిస్తుంది. గ్లోబల్ వార్మింగ్ పర్యావరణంలో తీవ్రమైన మార్పులకు కారణమవుతుందని, పెరుగుతున్న కాలుష్య స్థాయి కారణంగా ప్రపంచంలోని ఉష్ణోగ్రత పెరుగుతోందని మనందరికీ తెలిసిందే. ఇది మంచుతో కప్పబడిన పర్వతాలను కరిగిస్తోంది. దీని కింద అనేక వైరస్లు, కీటకాలు స్తంభింపజేస్తాయి. నీరు కరిగిపోయి వైరస్ సజీవంగా వచ్చి కరోనావైరస్ లాగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

శాస్త్రవేత్తలు దాదాపు రెండు డజన్ల పురాతన వైరస్‌లను పునరుద్ధరించారు. వీటిలో చాలా పురాతనమైనవి, అత్యంత ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయని చెప్పారు. వేలాది శతాబ్దాలుగా స్తంభింపజేసినప్పటికీ వైరస్‌లు అంటువ్యాధులుగానే ఉంటాయి. 48,500 సంవత్సరాలకు పైగా ఒకే సరస్సు కింద గడ్డకట్టిన వైరస్‌లతో సహా ఈ వైరస్‌లను పునరుద్ధరించిన పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, రష్యాలోని సైబీరియన్ ప్రాంతంలోని బర్మా ఫ్రాస్ట్ నుండి సేకరించిన పురాతన నమూనాలను పరిశీలించినప్పుడు వైరస్ 13 కొత్త వ్యాధులకు కారణమవుతుందని తేలింది. అవేవీ ప్రస్తుతం మానవ సమాజానికి తెలియవని చెప్పారు.

TeluguCentralnews

Feb 22 2023, 14:17

ఉక్రెయిన్‌పై రష్యా ఎప్పటికీ విజయం సాధించదు..

 రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది కావస్తోంది. కాగా, సోమవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ లో ఆకస్మికంగా పర్యటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీలో చర్చలు జరిపారు. సామ్రాజ్యాన్ని నిర్మించాలనుకునే నియంత ఎప్పటికీ ప్రజల స్వేచ్ఛను తగ్గించలేదని, ఉక్రెయిన్ పై రష్యా ఎప్పటికీ విజయం సాధించలేదని అన్నారు. ఉక్రెయిన్ పర్యటన ముగిసిన తర్వాత పోలాండ్ వచ్చిన బైడెన్ అక్కడి ప్రజలు, ఉక్రెయిన్ శరణార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

ఉక్రెయిన్ కు తమ మద్దతు కొనసాగుతుందని.. మిత్రపక్షాలతో కలిసి ఆ దేశానికి అండగా నిలుస్తామని అన్నారు. రాబోయే రోజులకు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఉక్రెయిన్ బలంగా ఉందని ఆయన అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రసంగంపై కూడా బైడెన్ స్పందించారు. పుతిన్ చెప్పినట్లు పశ్చిమ దేశాలు రష్యాపై దాడి చేయడానికి కుట్ర చేయడం లేదని స్పష్టం చేశారు. తమ పొరుగువారితో జీవించాలనుకునే మిలియన్ల మంది రష్యన్లు మాకు శత్రువులు కారని అన్నారు.

ఈ కార్యక్రమం అనంతరం పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుదాతో భేటీ అయ్యారు బైడెన్. నాటో కూటమి మునుపెన్నడు లేనంత బలంగా ఉందని అన్నారు. అమెరికాకు పోలాండ్, నాటో ఎంత అవసరమో, నాటోకు అమెరికా అంత అవసరం అని అన్నారు. ఉక్రెయిన్ లో బైడెన్ ఆకస్మికంగా పర్యటించడాన్ని ఆండ్రెస్ పొగిడారు. ఉక్రెయిన్ లో ఇది చాలా ధైర్యా్న్ని నింపుతుందని అన్నారు.

TeluguCentralnews

Feb 22 2023, 14:06

ముంబై మురికివాడలో భారీ అగ్నిప్రమాదం.. 25కు పైగా ఇళ్లు దగ్ధం...

ముంబైలోని ధారవి షాహోనగర్ ప్రాంతంలోని కమలా నగర్ మురికివాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. షాహునగర్ ప్రాంతంలో 25కు పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేశారు. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో 20 నుంచి 25 వాహనాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.

రోడ్లు ఇరుకుగా ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. మంటలు ఇంకా మండుతూనే ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.