నిజంనిప్పులాంటిది

Feb 14 2023, 12:01

AP: 26 టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్..

తాడేపల్లి: పర్యాటకుల భద్రతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పర్యాటక ప్రదేశాల్లో టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

రాష్ట్ర వ్యాప్తంగా 26 ​టూరిస్ట్ పోలీసు స్టేషన్‌లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మరో మంచి కార్యక్రయం చేపట్టినట్లు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. పోలీసులు మీ స్నేహితులే అనే భావనను తీసుకురాగలిగామని, ఇంతకుముందు జరగని రీతిలో పోలీస్‌ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. పోలీస్‌ స్టేషన్లలో రిసెప్షనిస్టులు పెట్టి తోడుగా నిలిచే కార్యక్రమం చేపట్టామని అన్నారు.

నిజంనిప్పులాంటిది

Feb 14 2023, 11:24

హైదరాబాద్​లో భారీగా డ్రగ్స్, గంజాయి పట్టివేత..

రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల కట్టడికి ప్రభుత్వం అనేక రకాల చర్యలు చేపట్టింది. డ్రగ్స్ సరఫరా, వినియోగంపై రాష్ట్ర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు..

ఎక్కడికక్కడ సరఫరాను నియంత్రిస్తున్నారు. అయినా రోజూ ఏదో చోట డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్​లో భారీగా డ్రగ్స్, గంజాయి పట్టుబడ్డాయి.

ముంబయికి చెందిన నలుగురు డ్రగ్ స్మగ్లర్లను హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యుల నుంచి 204 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ స్మగ్లర్లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగరంలోని పలువురు ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు ఈ ముఠా ముంబయి నుంచి వచ్చినట్లు తెలుస్తోంది..

మరోవైపు ఇవాళ నగరంలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రెస్టు చేశారు. ఆ ముఠా నుంచి 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న కారును సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నిజంనిప్పులాంటిది

Feb 14 2023, 11:18

Pulwama Attack Anniversary: పుల్వామా అమర వీరులకు ప్రధాని మోదీ నివాళులు..

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఈ ఘటన జరిగి నాలుగేళ్లయిన సందర్భంగా వారిని స్మరించుకున్నారు.

పుల్వామా అమరుల త్యాగాన్ని దేశం ఎన్నిటికీ మరువదని, దేశాభివృద్ధికి వీర సైనికుల శౌర్యమే స్ఫూర్తిదాయకమన్నారు. ఈమేరకు ఆయన మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు.

2019 ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్‌ పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 40 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఇందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ బాలాకోట్‌లోకి ప్రవేశించి భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. ఉగ్ర శిబిరాలను పేల్చి వేసింది. ఈ ఘటనలో దాదాపు 250 మంది తీవ్రవాదాలు హతమైనట్లు అమిత్ షా ఓ ఎన్నికల ర్యాలీలో తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Feb 14 2023, 11:01

యాదాద్రి దేవస్థానం ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి

•వెబ్‌సైట్‌లో ఈ-సేవలు

యాదగిరిగుట్ట: మొక్కు పూజల నిర్వహణలో భక్తుల ఆశయాలకు ఆటంకం కలగకుండా, భావాలను మరింత పెంచేలా విధానాలు అమలు కావాలన్న సీఎం దిశానిర్దేశంతో దైవదర్శనంతో పాటు నిత్య, వార, మాస, వార్షికోత్సవాలలో భక్తులు సులభంగా పాల్గొనేందుకు యాదాద్రి దేవస్థానం ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది.

బ్రహ్మోత్సవాల టికెట్లకు సైతం ఇబ్బందులు కలగకుండా అందుబాటులోకి తెచ్చారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు సేవలు మరింత సులభతరమయ్యాయి.

వెబ్‌సైట్‌లో ఈ-సేవలు

యాదాద్రిలో ఈ-సేవలను కూడా అందుబాటులో ఉంచారు. ‘యాదాద్రిటెంపుల్‌.తెలంగాణ.జీవోవీ.ఇన్‌’ అనే వెబ్‌సైట్‌లో ఈ సేవలను పొందొచ్చు. ఇందులో నిజాభిషేకం (ఇద్దరికి రూ.800, ఒక్కరికి రూ.400), సహస్రనామార్చన రూ.300, శ్రీ సుదర్శన నారసింహహోమం రూ.1,250, స్వామి వారి కల్యానం రూ.1,500, శయనోత్సవం రూ.100, స్వర్ణపుష్పార్చన రూ.600, సుప్రభాత దర్శనం రూ.100, దర్బార్‌ సేవ రూ.516, అష్టోత్తర ఘటాభిషేకం రూ.1000, శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం రూ.800, స్కూటర్‌ పూజ రూ.300, ఆటో పూజ రూ.400, కారు పూజ రూ.500, బస్సు, లారీ, ట్రాక్టర్‌ పూజ రూ.1000, శాశ్వత నిత్యపూజ పదేళ్లకు రూ.15వేలు, శాశ్వత నిత్య సహస్రనామార్చన రూ.15వేలుగా నిర్ణయించారు. రాత్రి బసచేసే భక్తుల కోసం కొండ కింద గదులు ఉన్నాయి. లక్ష్మీ నిలయం నాన్‌ ఏసీకి రూ.560, లక్ష్మీనిలయం నాన్‌ ఏసీ డీలక్స్‌ రూ.1000గా నిర్ణయించారు.

బ్రేక్‌ దర్శనం టికెట్లు..

తిరుమల తరహాలో యాదాద్రిలో బ్రేక్‌ దర్శనం టికెట్లను పొందుపరిచారు. ఒక్కోరికి టికెట్‌ ధర రూ.300, రూ.150 శీఘ్రదర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో పొందొచ్చు. ఆలయంలో జరిపే వివిధ ఏర్పాట్లకు విరాళమిచ్చేందుకు ఈ డొనేషన్‌ సదుపాయం కల్పించారు. దీన్ని ఈ హుండీ అంటారు. ప్రధానాలయం దివ్యవిమాన గోపురాన్ని స్వర్ణమయం చేసేందుకు ఆన్‌లైన్‌లో వితరణ చేయొచ్చు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో తిరుకల్యాణ మహోత్సవం-2023 టికెట్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. ధర రూ.3వేలు, ఈ టికెట్లను ముందుగానే బుక్‌ చేసుకోవచ్చు. ఈ నెల 28న తిరుకల్యాణం జరగనుంది. ఆన్‌లైన్‌ బుకింగ్‌లో పేరు, పూజ వివరాలు, గోత్రం, మొబైల్‌ నెంబర్‌, మెయిల్‌ ఐడీ, తేదీ, వెల, ఎన్ని టికెట్లు, చిరునామా నింపాలి. ఆప్షనల్‌గా నక్షత్రం, రాశి, ఆధార్‌ నెంబర్‌, వయసు, ఆలయ సందర్శన వేళల వివరాలు నింపాలి.

నిజంనిప్పులాంటిది

Feb 14 2023, 10:56

ముఖ్యమంత్రి కొండగట్టు పర్యటన రేపటికి వాయిదా

కొడిమ్యాల: ముఖ్యమంత్రి కేసీఆర్‌ జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయ పర్యటన బుధవారానికి వాయిదా పడింది.

స్వామివారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున

మంగళవారం పర్యటనను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారని స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

నిజంనిప్పులాంటిది

Feb 13 2023, 21:23

CM Jagan: నిర్లక్ష్యం వద్దు.. ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోకపోతే టికెట్‌ ఇచ్చేది లేదు: సీఎం జగన్‌

అమరావతి: 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో వెనుకబడిన 30 మంది ఎమ్మెల్యేల(Ysrcp MLAs)పై సీఎం జగన్‌ (CM Jagan) మండిపడ్డారు..

పనితీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యేల పనితీరుపై చేసిన సర్వే నివేదికను సోమవారం ఆయన ప్రదర్శించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తక్కువ రోజులపాటు తిరిగిన పలువురు ఎమ్మెల్యేల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి గతంలో హెచ్చరించినా ఇప్పటికీ పనితీరు మెరుగుపరుచుకోని ఎమ్మెల్యేలపైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం అస్సలు ప్రదర్శించవద్దని హెచ్చరించారు..

మార్చి 18 నుంచి 'మా భవిష్యత్తు నువ్వే జగన్‌' పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈలోగా పార్టీ కన్వీనర్లు, సచివాలయ సమన్వయకర్తలకు శిక్షణ ఇవ్వనున్నారు. పలు నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న గృహ సారథులు, కన్వీనర్ల నియామకం పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని సీఎం జగన్‌ దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

నిజంనిప్పులాంటిది

Feb 13 2023, 18:49

Pawan Kalyan: మౌనంగా ఉండే నాయకుడు కోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒకటే: పవన్ కల్యాణ్‌..

అమరావతి: తాడేపల్లిలో అంధ యువతి హత్య పూర్తిగా శాంతిభద్రతల వైఫల్యమేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు అసలు రక్షణ ఉందా?..

సీఎం నివాసం దగ్గరలోనే ఘాతుకాలు జరిగినా మౌనమేనా? అని ప్రశ్నించారు. తాడేపల్లి అసాంఘిక శక్తులకు, గంజాయికి అడ్డాగా మారిందన్నారు. తాడేపల్లిలోనే గతంలో జరిగిన రేప్‌ కేసులో ఒక నిందితుడిని ఇప్పటికీ పట్టుకోలేకపోయారని విమర్శించారు.

''తన నివాసం పరిసరాల పరిస్థితులనే సీఎం సమీక్షించుకోలేకపోతే ఎలా? తల్లి పెంపకంలోనే లోపం ఉందని చెప్పే మంత్రులు ఉన్న ప్రభుత్వమిది.. దొంగతనానికి వచ్చి రేప్‌ చేశారని చెప్పే మంత్రులు గల ప్రభుత్వమిది.. అఘాయిత్యాలు జరుగుతుంటే మహిళా కమిషన్‌ ఏం చేస్తోంది? గంజాయికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్‌ని మార్చారు. మౌనంగా ఉండే నాయకుడు కోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒకటే. యువతిని కిరాతకంగా చంపిన మృగాడిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి దారుణ ఘటనలపై అన్ని వర్గాలు స్పందించాల్సిన అవసరం ఉంది'' అని పవన్‌ పేర్కొన్నారు.

నిజంనిప్పులాంటిది

Feb 13 2023, 17:07

Andhra News: జగన్‌ నిర్ణయాన్ని ఎందుకు స్వాగతించకూడదు?: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ..

అమరావతి: పారిశ్రామికంగా దేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్‌ ఆకర్షిస్తోందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు..

రాష్ట్ర జీఎస్‌డీపీ 11.34 శాతంగా ఉందని.. జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ చాలా ముందుందన్నారు. తలసరి ఆదాయం కూడా 38.5 శాతం మేరకు పెరిగిందని చెప్పారు. కొందరు రాష్ట్ర వృద్ధి తిరోగమనంలో ఉందని ప్రచారం చేస్తున్నారని.. అది దుష్ప్రచారం మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు.

'2022 జూలై నాటికి ఏపీకి రూ. 40,361 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దేశవ్యాప్తంగా రూ.1.71 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే అందులో అత్యధిక పెట్టుబడులు ఏపీకే వచ్చాయి. ఈ మేరకు రూ.23,985 కోట్లకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. పెట్టుబడులు రాబట్టడంలో ఏపీ 5వ స్థానంలో ఉంది. అలయన్స్ టైర్స్ సంస్థ విశాఖలో రూ.1,040 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తిని ప్రారంభించడానికి ముందుకు వచ్చింది. రాష్ట్ర పారిశ్రామిక విధానానికి ఆకర్షితులై దేశీయ, విదేశీ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఈజ్‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోనూ ఏపీ అగ్రస్థానంలో ఉంది. బల్క్ డ్రగ్ పార్కు కోసం రూ.1000 కోట్ల గ్రాంట్ ఏపీ సాధించింది..

నిజంనిప్పులాంటిది

Feb 13 2023, 14:22

పోలీసులపై రాళ్లూ రువ్విన ఎమ్మార్పీఎస్ నాయకులు..

విజయవాడ కానిస్టేబుల్ గా నందిగామ ట్రాఫిక్ లో చేసే తిరుమల్ రావు అనే కానిస్టేబుల్ కు తలకు గాయం

ఎస్సీ వర్గీకరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) కార్యకర్తలు దిగ్బంధానికి (రాస్తారోకో) పిలుపునిచ్చారు, ఎన్టీఆర్ జిల్లాలో ఆందోళన..

ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు వద్ద ఎమ్మార్పీఎస్ ఆందోళన హింసాత్మకంగా మారింది..

రాళ్ల దాడి మరియు ఒక పోలీసు కానిస్టేబుల్ గాయపడ్డారు, తరువాత పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టాలని ఎంఆర్‌పీఎస్‌ కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు..

నిజంనిప్పులాంటిది

Feb 13 2023, 13:50

ఎలాగు రాజీనామా చేయ్సాలిందే.. కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌

న్యూఢిల్లీ: కేంద్రంపై బురద జల్లేందుకు అసెంబ్లీని వాడుకున్నారని కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత బడ్జెట్‌లో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్‌ నెరవేర్చలేదన్నారు..

కేంద్రాన్ని విమర్శించిన కేసీఆర్‌ రాష్ట్ర పరిస్థితిపై ఎందుకు మాట్లాడరు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతేంటి? అంటూ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

''అసెంబ్లీలో కేసీఆర్‌ పరిధి దాటి మోదీపై మాట్లాడారు. బడ్జెట్‌ సమావేశాలా? మోదీ విద్వేశ సమావేశాలా?. నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి ఏమైంది?. విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడ లేదు. ఆధారాలు లేకుండా కేంద్రంపై ఆరోపణలు చేశారు. కుటుంబ పాలనపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు. దేశ పరిస్థితులపై కేసీఆర్‌కు అవగాహన లేదు'' అంటూ ఆయన దుయ్యబట్టారు..

''దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చకు మేం సిద్ధం. ప్రగతి భవన్‌ లేదంటే ఫామ్‌హౌజ్‌కు చర్చకు రమ్మంటారా?. అభివృద్ధిపై చర్చకు కేసీఆర్‌ ఎక్కడకు రమ్మన్నా వస్తాం. రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని వస్తే రండి. అసలు కేసీఆర్‌ను రాజీనామా ఎవరు అడిగారు?. వచ్చే ఎన్నికల తర్వాత ఎలాగు రాజీనామా చేయ్సాలిందే'' అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు..