madagoni surendar

Feb 11 2023, 17:30

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.

అమరావతే ఏపీ రాజధానిగా కొనసాగుతుందని స్పష్టమైన ప్రకటన చేయండి.

ఏపీ రాజధాని అమరావతి అని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా ఫలుమార్లు స్పష్టం చేసింది.

నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా అమరావతిని రాజధానిగా అంగీకరించారు.

ఏపీ హైకోర్టు కూడా అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని తీర్పునిచ్చింది.

3 రాజధానుల బిల్లు రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

ప్రతి నెల ఒకటో తేదీకి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం 3 రాజధానులంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు.

అమరావతి రాజధాని విషయంలో ఇకనైనా వివాదాలకు స్వస్తి పలకండి.

- రామకృష్ణ.

madagoni surendar

Feb 11 2023, 11:24

వైద్య సేవలు రోగుల హక్కులు.. యంగలి గోపి గౌడ్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్, ది నేషనల్ కన్సుమర్ రైట్స్ కమీషన్.

వైద్య సేవలు రోగుల హక్కులు..

యంగలి గోపి గౌడ్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్,

ది నేషనల్ కన్సుమర్ రైట్స్ కమీషన్. 

నల్గొండ జిల్లా :

సమాజంలో ప్రతి ఒక్కరూ వినియోగ దారులే అందరూ తమ అవసరాల కోసం అనేక వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ధరలలో తేడాలు, కల్తీ, తూనికలు, కొలతలలో మోసాలు వంటివెన్నో జరుగుతుంటాయి వినియోగదారులకు చట్ట పరిజ్ఞానం లేనందు వల్ల నష్టపోతుంటారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పొందే సేవల్లో లోపం ఉంటే వినియోగదారుల ఫోరంలో కేసు దాఖలు చేయవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రులకు వర్తించదు కానీ వైద్యంలో నిర్లక్ష్యం చూపితే డాక్టర్‌పై సివిల్‌ కోర్టులో కేసు నమోదు చేసుకోవచ్చు.

రోగానికి సంబంధించిన సమాచారం కోరొచ్చు. మందుల పట్టికకు సంబంధించిత సమాచారం చికిత్సకు సంబంధించిన వివరాలను పొందే హక్కు ఉంటుంది 

మార్కెట్‌ నుంచి ఏ వస్తువునైనా కొనేటప్పుడు ఐఎస్‌టీ, అగ్‌మార్క్‌ ముద్ర ఉన్న వస్తువులనే కొనాలి. కల్తీ జరిగితే ఫిర్యాదు చేయవచ్చు. ఫోరాల పరిధిలోకి వచ్చే వివాదాలు, అంశాలు వస్తు సేవల నాణ్యతా ప్రమాణాలలో లోపాలు, వ్యత్యాసాలు, తేడాలు వస్తు, సేవల ప్యాకేజీల ముద్రించిన ధర కంటే ఎక్కువ వసూలు చేసినప్పుడు బస్డాండ్స్‌, రైల్వేస్టేషన్స్‌, సినిమా హాళ్లలోనూ వస్తు, సేవల ప్యాకేజీ మీద ముద్రించిన రేటుకే అమ్మాలని చట్టం శాసిస్తోంది. అలా కాకుండా అధిక ధరలకు అమ్మితే బాధిత వినియోగదారుడు తూనికల, కొలతల శాఖవారి టోల్‌ఫ్రీ నెంబర్‌ 1800-425-333కి ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేసి న్యాయాన్ని పొందొచ్చు ఆ ఫిర్యాదును వారం రోజలలోపు విచారించి పరిష్కరిస్తుంది.

madagoni surendar

Feb 11 2023, 08:45

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన.

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన.

 Street Buzz news నల్గొండ జిల్లా:

 ;(నకిరేకల్):- విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించిన బహుజన్ సమాజ్ పార్టీ, NSUI విద్యార్థి సంఘాల నాయకులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నకిరేకల్ మైనార్టీ స్కూల్ ను కట్టంగూర్ కు తరలించొద్దని ఆ పాఠశాల అద్దె భవనంలో మగ్గుతోందని వెంటనే సొంత భవనం నిర్మించాలని డిగ్రీ, బీసీ గురుకుల.మైనార్టీ గురుకుల పాలిటెక్ని, ఐటిఐ కళాశాలను నకరేకల్ లో నిర్మించాలని డిమాండ్ చేశారు,లేకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.బహుజన్ సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ అభివృద్ధి కోసం పార్టీ మారానని చెప్పుకునే నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నకిరేకల్ లోని విద్యారంగా సమస్యలు ఏం పరిష్కరించిండు నకిరేకల్ నియోజకవర్గాన్ని ఏం డెవలప్ చేసిండు కనిపించట్లేవా అని ప్రశ్నించారు. అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ నాయకులను విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజిత్, నియోజకవర్గ నాయకుడు గద్దపాటి రమేష్, నియోజకవర్గ కోశాధికారి కొవ్వూరి రంజిత్, చిట్యాల మండల అధ్యక్షురాలు చుక్క పూజిత, విజయ్, సందుపట్ల శృతి విద్యార్థి యూనియన్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్, జిల్లా సంపత్ తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 10 2023, 09:14

హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తున్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి కొండేటి

హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తున్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి 

Street Buzz news నల్గొండ జిల్లా:  ;(నకిరేకల్ నియోజకవర్గం):- హాత్ సే హాత్ జోడోయాత్ర పాదయాత్రను గురువారం రెండవ రోజు నకిరేకల్ పట్టణ కేంద్రంలో నిర్వహించి స్థానిక సమస్యలు ప్రజలను అడిగి తెలుసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న  

TPCC ప్రధాన కార్యదర్శి నకిరేకల్ నియోజకవర్గ చార్జ్ .కొండేటి మల్లయ్య మరియు వైస్ ప్రెసిడెంట్ చెరుకు సుధాకర్ .ఈ కార్యక్రమంలో టీపీసీసీ డెలికే సుంకరబోయిన నరసింహ యాదవ్, మాజీ ఎంపీపీ లింగాల మల్లేశ్వరి, ఎంకన్న, మాజి మండల పార్టీ అధ్యక్షులు రాచకొండ లింగయ్య గౌడ్ ,డిసిసి కార్యదర్శి యాస కరుణాకర్ రెడ్డి, బొప్పని యాదగిరి, నకిరేకంటే శ్రీను,వంటేపాక వెంకన్న స్వప్న, వెంకటమ్మ, సుంకర సైదులు, మేడి నాగరాజు,కొండ నారాయణ, సిహెచ్ శ్రీరంగం, కొండల్ గౌడ్, వనం స్వామి, పున్న శ్రీను,కోమటి యాదగిరి, వనం వెంకట సత్తి, చిట్టిపోలు కుమారస్వామి, కొంగరి అంజయ్య, మునుగోడు చంద్రయ్య, సుంకరి సైదులు, ఏర్పుల రవి, మహిళా కాంగ్రెస్ నాయకురాలు కొండ అంజమ్మ, సురుగు జ్యోతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 09 2023, 18:10

మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ తరలించడం విరమించుకోవాలి. బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి *


*మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ తరలించడం విరమించుకోవాలి.ప్రియదర్శిని మేడి

నకిరేకల్ పట్టణ కేంద్రంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు అనుకూలంగా అందుబాటులో ఉన్న తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ ను తరలించడం ప్రభుత్వ అసమర్థ చర్య అని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాల ప్రిన్సిపల్ మరియు పాఠశాలలోని ఉపాధ్యాయులు వారి స్వలాభం కోసం స్కూలు తరలించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జిల్లా స్థాయి అధికారులకు చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకొని పాఠశాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రియదర్శిని మేడి జిల్లా స్థాయి అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించగా హాస్టల్ ని ఎక్కడికి మార్చడం లేదని చెప్పడం గమనార్హం. పార్టీ మారానని చెప్పుకునే ఎమ్మెల్యే సిసి రోడ్లు, డ్రైనేజీలు శంకుస్థాపనలకు, దళిత బంధు ఆశ చూపే పనికి మాత్రమే పరిమితమయ్యారన్నారు. నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఉన్న ప్రభుత్వ హాస్టల్ ను ఇతర ప్రాంతాలకు తరలించడం పట్ల ఎమ్మెల్యే స్పందించకపోవడం ఆయనకు పేద విద్యార్థుల పట్ల ఉన్న నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ హాస్టళ్లకు ప్రత్యేక నిధులు కేటాయించి సొంత భవనాలు నిర్మించలేని అసమర్థ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి సీనియర్ నాయకుడు గద్దపాటి రమేష్, చిట్యాల మండల అధ్యక్షురాలు చుక్క పూజిత,నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కుమార్,విద్యార్థి సంఘం నాయకులు అంజన్ కుమార్ యాదవ్,జిల్లా సంపత్ తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 07 2023, 18:03

ఘనంగా రమాబాయి అంబేద్కర్ జయంతి*

ఘనంగా రమాబాయి అంబేద్కర్ జయంతి

నల్గొండ జిల్లా :

 రామన్నపేట బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో మాత రమాబాయి అంబేద్కర్ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బిఎస్పి మండల ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా మాట్లాడుతూ.. రమాబాయి అంబేడ్కర్ 1898 ఫిబ్రవరి 7న మహారాష్ట్ర లోని "ధబోల్" గ్రామంలో జన్మించారన్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించటంతో బంధువులతో కలిసి ముంబాయి వచ్చారన్నారు.మాతా రమాబాయికి 1906లో బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్‌ తో వివాహం జరిగిందన్నారు. అంబేడ్కర్ చదువు, ఉద్యమాలతో బిజీగా ఉండటంతో కుటుంబ బారమంతా మాతా రమాబాయి చూసుకునేవారన్నారు. అంబేడ్కర్ ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్ళేటప్పుడు ఆమె పూర్తి సహకారం అందించారన్నారు. కుటుంబ జీవితంలో ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చిన ఆమె ఏనాడు చలించిపోలేదని, సమస్యలకు లొంగిపోలేదన్నారు. అంబేడ్కర్ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్నారన్నారు. మాతా రమాబాయి జీవితం ఎన్నో విషాదాలు చవి చూసింది. నలుగురు పిల్లల మరణం, భర్త ఎప్పుడూ ఇంటి పట్టున ఉండక పోవటం, సమాజంలో రాజకీయ ఉద్రిక్తతలు ఆమెను ఆందోళనకు గురిచేశాయి. అంబేడ్కర్ దళిత జాతుల కోసం అహర్నిశలు కృషిచేస్తుంటే, శ్రమిస్తుంటే రమాబాయికి తీవ్ర ఆందోళన కలిగించేది. 1935 మే 26న మాతా రమాబాయి అంబేడ్కర్ మరణించారన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గాప్రసాద్, టిల్లు, ఉపేందర్, అనూష్,పవన్,సురేష్, మజ్జు తదితరులు పాల్గొన్నారు

madagoni surendar

Feb 06 2023, 15:10

ప్రజా ఆమోదయోగ్యమైన బడ్జెట్: టి.ఎన్.సి.ఆర్.సి రాష్ట్ర వైస్ చైర్మన్, బీఆర్ఎస్వీ నాయకులు యంగలి గోపి.

ప్రజా ఆమోదయోగ్యమైన బడ్జెట్: 

టి.ఎన్.సి.ఆర్.సి రాష్ట్ర వైస్ చైర్మన్, బీఆర్ఎస్వీ నాయకులు యంగలి గోపి గౌడ్

Street buzz న్యూస్ నల్గొండ జిల్లా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ రూ.2,90,396 కోట్ల బడ్జెట్‌ను ప్ర‌వేశ‌ పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేసిన టి.ఎన్.సి.ఆర్.సి రాష్ట్ర వైస్ చైర్మన్, బీఆర్ఎస్వీ నాయకులు యంగలి గోపి గౌడ్ .,

ఈ బడ్జెట్‌ అన్ని వర్గాల సంక్షేమంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలకు భారీగా నిధులు కేటాయించి ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిందంటూ కొనియాడారు.  

తెలంగాణ బడ్జెట్ దేశానికి మోడల్‌గా నిలుస్తూ, మహిళలు ఆర్థికంగా మరింత ప్రగతి సాధించేందుకు బడ్జెట్‌లో పెద్దపీట వేయడం సంతోషకరమని, దళితులు, మైనారిటీల భద్రత, సంక్షేమం, అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంకితభావంతో ముందుకు సాగుతున్నారని చెప్పడానికి ఈ బడ్జెట్ నిదర్శనమని అన్నారు.

madagoni surendar

Feb 06 2023, 09:18

ఉదయ సముద్రం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలంటూ రిలే నిరాహార దీక్ష

ఉదయ సముద్రం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలంటూ రిలే నిరాహార దీక్ష  

Street Buzz news నల్గొండ జిల్లా:

 ;(నకిరేకల్):- వందల కోట్ల రూపాయలతో గత ప్రభుత్వాలు ప్రారంభించిన బ్రాహ్మణ వెల్లంల ఉదయసముద్రం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు వెంటనే విడుదల చేసి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని ఆధ్వర్యంలో ఆదివారం రిలే నిరాహార దీక్ష నార్కట్ పల్లి పోలీస్ కాంప్లెక్స్ దగ్గర ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి ఆదిమల్ల గోవర్ధన్ మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం ఉదయ సముద్రం మూడు నెలల్లో పూర్తి అవుతుందని మాట్లాడిన ఎమ్మెల్యే ఇప్పటిదాకా ఆ ప్రాజెక్టు పూర్తి చేయకపోవడానికి ఏ పని ప్రారంభించకపోవడం చూస్తే ప్రజలను మభ్య పెట్టడానికే ఇలాంటి బూటకపు వాగ్దానాలు, అదేవిధంగా మాయమాటలు చెపుతున్నారని విమర్శించారు. నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ తెలంగాణ రాష్టం వచ్చిన తరువాత ప్రాజెక్టుల రీడిజన్ పేరిట లక్షల కోట్ల రూపాయల  దుర్వినియోగం జరిగిందని ఒక ఎకరాకు కూడా కనీసం ఈ ప్రాంతంలో నీరు అందించలేనటువంటి ప్రాజెక్టుల్లో అవినీతి గురించి విమర్శించారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టు దాదాపు 15 సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పటికీ ఇప్పటి రెండు దశాబ్దలైన పూర్తి కానటువంటి ఏకైక ప్రాజెక్ట్ గా ఉదయ సముద్రం ప్రాజెక్ట్ మిగిలిపోనుందని తెలియజేశారు. అభివృద్ది అంటే రోడ్ల వెడల్పులు, రోడ్లు వేయడం విధి దీపాలు వెయ్యడమే అభివృద్ధా అని ప్రశ్నించారు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడమే గొప్ప అనుకుంటున్నటు వంటి ఎమ్మెల్యే ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని విమర్శించారు. విద్యా వ్యవస్థకు సంబంధించి నకిరేకల్ నియోజకవర్గంలో సాధించిన అభివృద్ధి ఏంటో చెప్పాలని వైద్య వ్యవస్థలో, ఉపాధికి సంబంధించిన అభివృద్ధి కాని ఒక కంపెనీ, ఒక పరిశ్రమ అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఎన్ని ఉద్యోగాలు ఈ నియోజకవర్గంలో వచ్చినయో తెలియజేయాలన్నారు. ఉదయ సముద్రం విషయంలో ఎంతోకాలంగా రైతులందరూ ఎదురు చూసినటువంటి పరిస్థితి, కాల్వలు లేనటువంటి దుస్థితి పోవాలన్నారు. ఈ ప్రాంతానికి ఎట్టి పరిస్థితిలోనూ ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి అయితే తప్ప అభివృద్ధి జరగదు అన్నారు. కొద్దిపాటి నిధులు మాత్రమే కేటాయిస్తే పూర్తయ్యే ప్రాజెక్టును కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8 సంవత్సరాల పాటు చోద్యం చూస్తుందని ఎట్టి పరిస్థితుల్లోనూ బిఆర్ఎస్ ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే కు ప్రజలు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. అదే విధంగా నకిరేకల్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్యే కు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో గద్దపాటి రమేష్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు పావిరాల నర్సింహా యాదవ్, నియోజకవర్గ కోశాధికారి దేశాపాక రాజ్ కూమార్, మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కుమార్, రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్, ఉపాధ్యక్షులు గుని రాజు, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా,కోశాధికారి గట్టు రమేష్, చిట్యాల మండల కోశాధికారి మునుగోటి సత్తయ్య, మేడి శ్రీను, గ్యార శేఖర్, మేడి వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.