/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TG: రేష‌న్ కార్డుల జారీకి సంబంధించి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం Mane Praveen
TG: రేష‌న్ కార్డుల జారీకి సంబంధించి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం
HYD: రేష‌న్ కార్డుల జారీకి పటిష్టమైన కార్యాచరణ, ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రేష‌న్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాల‌పై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర స‌చివాల‌యంలో ఉన్నతస్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..
కొత్త  రేష‌న్ కార్డుల కోసం అక్టోబ‌రు 2 వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించాల‌ని సీఎం సూచించారు. రేష‌న్ కార్డుల జారీకి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. అర్హులంద‌రికీ డిజిట‌ల్ రేష‌న్ కార్డులు ఇవ్వడానికి సంబంధించి క‌స‌ర‌త్తు చేశారు. ఈ అంశంపై త్వ‌ర‌లోనే మ‌రోసారి స‌మీక్ష నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.
TG: తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలి: సీఎం
HYD: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. యూనివర్సిటీకి 150 ఎకరాల స్థలం తో పాటు ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ యూనివర్సిటీకి రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు భాగస్వామ్యం కావాలని కోరారు. ఇవాళ రాష్ట్ర సచివాలయంలో స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో పాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో సిఎం సమావేశం నిర్వహించి మాట్లాడారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహేంద్ర, కో చైర్మన్, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు స్కిల్ యూనివర్సిటీ లో భాగస్వామ్యం పంచుకోవాలని, యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. యూనివర్సిటీలో భవనాల నిర్మాణానికి ముందుకు వచ్చిన కంపెనీలు లేదా దాతల పేర్లను ఆ భవనాలకు పెట్టాలని అధికారులకు సూచించారు.

స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఆలోచన, ఆశయాలతో పాటు పలు కీలక అంశాలను మంత్రి శ్రీధర్ బాబు e ఈ సమావేశంలో వివరించారు.

యూనివర్సిటీలో కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని యూనివర్సిటీ బోర్డు నిర్ణయించింది. దసరా పండుగ తర్వాత అక్టోబర్ నెలలో కోర్సులను ప్రారంభించనున్నట్లు సూచన ప్రాయంగా బోర్డు వెల్లడించింది.
NLG: భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ ర్యాలీ
నల్గొండ: స్వచ్ఛతా హి సేవలో భాగంగా ఈరోజు భారత ఆహార సంస్థ డివిజనల్ కార్యాలయ అధికారుల ఆధ్వర్యంలో రామగిరి నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు స్వచ్ఛ ర్యాలీ నిర్వహించి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కలలుగన్న వికాసిత్‌ భారత్‌ కలను సాకారం చేయడంలో స్వచ్ఛ భారత్‌ మూలస్తంభమని ర్యాలీకి నాయకత్వం వహించిన ఏజీఎం (క్యూసీ) డాక్టర్‌ రాఘవేంద్ర సింగ్‌ అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో సీనియర్ అధికారులు కె ఎన్ కె ప్రసాద్, రఘుపతి, శ్రీనివాసరావు, కెకె షా, పట్నాయక్, సుకుమార్, రాము, కాసిరెడ్డి, సిబ్బంది సతీష్ రెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
NLG: వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించిన ఎంపీడీవో
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలం ఎంపీడీవో కార్యాలయంలో గురువారం, ఓటరు జాబితాపై వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఓటర్ సవరణ గురించి స్థానిక ఎంపీడీవో  వివరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ  పార్టీ మండల కార్యదర్శి ఈదుల బిక్షం రెడ్డి, సిపిఎం మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, టిడిపి మండల అధ్యక్షుడు దోమల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు లెంకలపల్లి మాజీ సర్పంచ్ పాక నగేష్, పగిళ్ల హరీష్, గిరి, విష్ణు, తదితరులు పాల్గొన్నారు
TG: దసరా కు రైతు భరోసా డబ్బులు..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలుపనుంది. దసరా లోపు రైతు భరోసా నిధులు రిలీజ్ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈనెల 20 న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉంది. ఈ సమావేశంలో రైతు భరోసా నిధుల పైన ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన రైతు భరోసా నిధులను రిలీజ్ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున, ఏడాది మొత్తంలో రైతుల ఖాతాలో జమ చేస్తామని కాంగ్రెస్..ఎన్నికల ప్రచారంలో చెప్పింది.ఇప్పుడు ఆ డబ్బులను దసరా లోపు వెయ్యాలని అనుకుంటుంది.

ప్రస్తుత లెక్కల ప్రకారం 1. 53 కోట్ల ఎకరాలకు రూ. 11475 కోట్లు ఖర్చు అవుతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంచనా వేసింది. ఇక రేపు తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఈ డబ్బులు రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
TG: చెరువులు, కుంటలు, నాళాల పై ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలి: బిఎస్పి
ఖమ్మం పట్టణంలో చెరువులు, కుంటలు, నాళాలపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్ర ఉపేంద్ర సాహు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం పట్టణం, అంబేద్కర్ చౌరస్తాలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, బుధవారం జిల్లా అధ్యక్షుడు చెరుకుపల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన నిరసన ప్రదర్శన కార్యక్రమంలో ఉపేంద్ర సాహు మాట్లాడుతూ.. ఖమ్మం పట్టణ పరిసర ప్రాంతాలైన లకారం చెరువు, దంసలాపురం చెరువు, ఖానాపురం చెరువు, కుంటలు, నాళాలు, అలుగులపై అక్రమంగా భూ కబ్జాదారులు యదేచ్ఛగా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని అన్నారు.

చెరువులతోపాటు పట్టణంలోని నాళాలపై కూడా అక్రమ నిర్మాణాలు చేయడం వల్ల తీవ్రమైన వర్షాలు కురిసినప్పుడు పట్టణంలో నీళ్లు బయటకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయిందని అన్నారు.
మున్నేరు వరదలతో దానవాయి గూడెం కాలనీ, కరుణగిరి, సాయి కృష్ణ నగర్, వెంకటేశ్వర నగర్, బొక్కల గడ్డ,  మోతి నగర్ కాలనీలు, బస్తీలలోకి వరద రావడంతో ఆ ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, ఇండ్లు ఖాళీ చేశారని అన్నారు. వరదలలో ఇండ్లతో పాటు సమస్తం కోల్పోయి, కట్టుబట్టలతో రోడ్డునపడితే ముఖ్యమంత్రి పర్యటించి కంటితుడుపు చర్యగా కేవలం 16,500/- ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని అన్నారు.వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలు మొత్తం పేద ప్రజలే కాబట్టి కుటుంబానికి 2 లక్షల రూపాయల నష్ట పరిహారంతో పాటు ఇండ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వైరా రోడ్ మొత్తం చెరువుని తలపించేలా నీటితో నిండిందన్నారు. జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు హైదరాబాద్ లో హైడ్రా తరహాలో ఖమ్మం లో చెరువులు, కుంటలు, నాలాలపై ఉన్న ఆక్రమణ లని తొలగించి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు. లేని పక్షంలో అక్రమ నిర్మాణాలను తొలగించేంత వరకు బహుజన్ సమాజ్ పార్టీ ఎంతటి పోరాటాలకైనా సిద్దపడుతుందని పేర్కొన్నారు.

నిరసన కార్యక్రమం అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మధుసూధన్ నాయక్ కు మెమోరాండం అందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ ఎం. పుల్లయ్య, శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మిరియాల నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లెపోగు విజయ్, జిల్లా కార్యదర్శులు బి. ఉపేందర్, దారెల్లి రమేష్, ఆదూరి కోటయ్య, మహిళా నాయకురాలు కుమారి, యూ. నవీన్, డి. రాజశేఖర్, ఆర్. రమేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
NLG: బాలికల గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: బీసీ రాజ్యాధికార సమితి
నల్గొండ జిల్లా:
హాలియా పట్టణం లోని తుమ్మడం బీసి గురుకుల బాలికల పాఠశాలను బుధవారం జిల్లా  బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. గురుకుల బాలికల  పాఠశాల లో మధ్యాహ్నం భోజనంలో నిత్యం పురుగుల అన్నం, చికెన్, సాంబార్ లలో నీళ్లు ఉన్నాయని తినలేక ఆకలితో అలమటిస్తున్నారని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు.

విద్యార్థులు తమ సమస్యలను  ప్రిన్సిపల్ కు విషయం చెప్తే ప్రిన్సిపాల్  నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందని, ఈ ప్రిన్సిపాల్ ఉంటే మేమే మూకుమ్మడిగా టీసి తీసుకొని వెళ్ళిపోతామని విద్యార్థుల అంటున్నారని తెలిపారు.

ఇకనైనా జిల్లా అధికారులు ఆర్సిఓ ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు కర్నాటి యాదగిరి, లింగ యాదవ్, రమేష్, వెంకన్న, సతీష్, రాములు, తదితరులు పాల్గొన్నారు.
TS: సీఎం సహాయ నిధికి టెక్నో పెయింట్స్ డైరెక్టర్స్ విరాళం
HYD: వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి టెక్నో పెయింట్స్ డైరెక్టర్స్ విరాళం అందజేశారు. ఈ మేరకు రూ.20 లక్షల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.

ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల తెలంగాణలో పలు చోట్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభివించిన విషయం తెలిసిందే. ఈ వరదల వల్ల చాలా మంది నిరాశ్రయులయ్యారు.ఈ నేపథ్యంలోనే వరద బాధితులకు సహాయం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నారు.

జూబ్లీ హిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టెక్నో పెయింట్స్ డైరెక్టర్స్ ఆకునూరి శ్రీనివాస్ రెడ్డి, సీవీఎల్ఎన్ మూర్తి, అనిల్ కొండోత్ లు ఈ విరాళానికి సంబంధించిన చెక్ ను రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తాండ్ర కాశీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కు అందజేశారు.ఈ సందర్భంగా వరద బాధితులకు  సహాయం చేసిన దాతలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
నకిరేకల్: క్షేత్రస్థాయి ఆర్గానిక్ రైతు సదస్సు
నకిరేకల్ మండలం, కడపర్తి గ్రామంలో కే.ఎన్. బయోసెన్సెస్ మరియు
శ్రీసత్యం వర్మి బయో ఆర్గానిక్స్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో బుధవారం, నిమ్మ తోటల రైతులతో క్షేత్రస్థాయి ఆర్గానిక్ రైతు సదస్సును నిర్వహించామని కన్సల్టెన్సీ డైరెక్టర్ అక్కినపల్లి కిరణ్ తెలిపారు. వారంలో 2 రోజులు రైతు పొలాల్లో, తోటలలో ఉచిత అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని.. వర్మి కంపోస్ట్ ,బయోసాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు సహజ ఎరువులు, కెమికల్ ఎరువుల మధ్య సమతుల్యతను పాటించే విధానాన్ని, భూమి నుంచి వచ్చే తెగుళ్ల నివారణకు సహజమైన పద్ధతులను వివరించే కార్యక్రమాన్ని కంపెనీ ఇన్చార్జ్
వై.రామానుజ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు.
కేతేపల్లి: రూ. 2,15,000 పలికిన గణేష్ లడ్డు
నల్లగొండ జిల్లా, నాంపల్లి మండలం: కేతేపల్లి గ్రామంలో శ్రీ రాఘవేంద్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ లడ్డు వేలం పాటను సోమవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వడ్లకొండ ప్రవీణ్ యాదవ్ తండ్రి భీమయ్య రూ. 2,15,000 లకు వేలం పాటలో లడ్డు ను సొంతం చేసుకున్నాడు. ఈ వేలం పాటలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ వినాయకుడి ఆశీషులు వడ్లకొండ ప్రవీణ్ కుటుంబీకులకు, గ్రామ ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని కమిటి సభ్యులు కోరుకున్నారు.