/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz బ్రేకింగ్ న్యూస్: TS:రంగారెడ్డి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ అరెస్ట్‌.. Miryala Kiran Kumar
బ్రేకింగ్ న్యూస్: TS:రంగారెడ్డి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ అరెస్ట్‌..

రంగారెడ్డి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ అరెస్ట్‌

భూపాల్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన ఏసీబీ అధికారులు

ధరణిలో మార్పులకు రూ.8 లక్షలు డిమాండ్‌

లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ

అడిషనల్‌ కలెక్టర్‌ భూపాల్‌రెడ్డితో పాటు..

సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌మోహన్‌ అరెస్ట్‌

భూపాల్‌రెడ్డి నివాసంలో రూ.16 లక్షలు సీజ్‌

Ts: సర్పంచి ఎన్నికలు త్వరగా పూర్తి చేయండి: కేంద్ర పంచాయతీరాజ్ శాఖ

సర్పంచ్ ఎన్నికలు నిర్వహించండి

వీలైనంత త్వరగా పూర్తి చేయండి

రాష్ట్రానికి లేఖ రాసిన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ

గ్రాంట్ల రిలీజ్ చిక్కులతో అడ్వయిజరీ జారీ

కసరత్తు మొదలు పెట్టిన రాష్ట్ర అధికారులు

పంద్రాగస్టు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

ఆ తర్వాతే స్థానిక సమరంపై మరింత క్లారిటీ

రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ లేఖ రాసింది. రాష్ట్రంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తున్నందున కేంద్రం నుంచి నిధులు విడుదల కావాలంటే ఎన్నికైన స్థానిక పాలనా వ్యవస్థ ఉండడం అనివార్యం కావడంతో కేంద్రం ఈ లేఖ రాసినట్టు రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి సర్పంచ్ తో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఒకే సారి నిర్వ హించాలని తొలుత రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మరోవైపు బీసీ రిజర్వేషన్ చిక్కు లున్నందున రాష్ట్ర బీసీ కమిషన్, పంచాయ తీరాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో ఇప్పటికే సీఎం సుదీర్ఘ రివ్యూ నిర్వహించారు. ఆ మూడు విభాగాల అధికారులకు వర్క్ డివిజన్ చేసి వీలైనంత తొందరగా ఎన్నికల నిర్వహణపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇక సీఎం విదేశీ టూర్ ముగించుకుని వచ్చిన తర్వాత దీనిపై సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉన్నది.

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ దాడి.. కొనసాగుతున్న తనిఖీలు...

మాజీ మంత్రి జోగి రమేష్‌ నివాసంలో ఏసీబీ తనిఖీలు

ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్‌ నివాసంలో తనిఖీలు

అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్‌పై ఆరోపణలు

తనిఖీలు చేస్తున్న 15 మంది ఏసీబీ అధికారులు

నల్లగొండ: బ్రాహ్మణ సేవా సమితి జిల్లా కమిటీ ఎన్నిక.. నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా సిరి ప్రగడ శ్రీనివాస శర్మ..

బ్రాహ్మణ సేవాసమితి జిల్లా కమిటీ ఎన్నిక

తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి జిల్లా కమిటీని సోమవారం జిల్లా కేంద్రంలోని గొల్లగూడ రామాలయంలో తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పోచంపల్లి రమణారావు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా సిరి ప్రగడ శ్రీనివాస్ శర్మ, జిల్ల ప్రధాన కార్యదర్శిగా వేదాంతం కృష్ణ చరణ్ చార్యులు, ఉపాధ్యక్షులు పసునూరి రాంబాబు,సిరిప్రగడ ఆనందరావు,గాదె గిరిధర్ రావు, సహాదు కార్యదర్శ్మి గా కంజర్ యశ్వంత్ చార్యులు, కోశాధికారిగా కలాహలం సంజయుచార్యులు, ప్రచార కార్యదర్శి రంగరాజు జగదీష్, కార్యవర్గ సభ్యులు మారేవల్లి వెంకటాచార్యులు, గాదె మురళి కృష్ణ మడపు సంతోష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అనంతరం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ ఆదేశాల మేరకు ఈరోజు కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. నూతన కమిటీ జిల్లా పేద బ్రాహ్మకుల కోసం ఎల్లవేళలు అందుబాటులు ఉండి అందరికి సహయ సహకారలు అందించి కమిటీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్లమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి లతోపాటు జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీ లు రాష్ట్ర మంత్రులు తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేద బ్రాహ్మణులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో ఎంతోమంది బ్రాహ్మణులు వెనకబడి ఉన్నారని రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అవకాశం కల్పించి బ్రాహ్మణ కులానికి చెందిన విద్యార్థులకు విదేశీ చదువుల కోసం ఆర్థికంగా ప్రోత్సహించాలని కోరారు.

శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు తగ్గిన వరద.. అన్ని గేట్లను మూసివేసిన అధికారులు..

శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు తగ్గిన వరద

అన్ని గేట్లను మూసివేసిన అధికారులు

జులై 29న శ్రీశైలం గేట్లు ఎత్తిన అధికారులు

ఈ నెల 5న నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తిన అధికారులు

శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు

ప్రస్తుత నీటిమట్టం 881.20 అడుగులు

ఇన్ ఫ్లో 77,598, ఔట్‌ ఫ్లో 68,211 క్యూసెక్కులు

పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు

ప్రస్తుత నీటి నిల్వ 194.3096 టీఎంసీలు

హైదరాబాద్‌లో సీజనల్‌ వ్యాధుల టెన్షన్‌.. టెన్షన్...

హైదరాబాద్‌లో సీజనల్‌ వ్యాధుల టెన్షన్‌. రోగులతో కిక్కిరిసిపోతున్న ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్పత్రులు. రోజు రోజుకి పెరుగుతున్న డెంగ్యూల కేసులు. ఉస్మానియా, గాంధీ, ఫీవర్‌, నిలోఫర్‌లో విపరీతంగా OPలు. నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో వెయ్యికి చేరుకున్న OP. OP విపరీతంగా పెరగడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత. బదిలీలతో వైద్యుల కొరతు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఆస్పత్రులు. ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ.

నల్లగొండ: రెండవ విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలి: దళిత బంధు సాధన సమితి

రెండవ విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలి

రెండవ విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి వినతి పత్రం అందజేసి, అనంతరం దళిత బంధు సాధన సమితి నాయకులు బడుపుల శంకర్, కందుల లక్ష్మయ్య మాట్లాడుతూ..

గత ప్రభుత్వం నిరుపేద దళితులను గుర్తించి ఆర్థిక భరోసగా దళిత బంధులో లబ్ధిదారులుగా ఎంపిక చేసిందని తెలిపారు. ఎంపిక సమయంలో ఎంపీడీవో, గ్రామపంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల నుండి వాటికి సంబంధించిన అన్ని పత్రాలను తీసుకొని పరిశీలన చేసి దళిత బంధు పోర్టల్ లో పేర్లను నమోదు చేశారని పేర్కొన్నారు. బ్యాంకులో కూడా దళిత బంధు లబ్ధిదారులతో జీరో ఎకౌంటును తీయించారని వెల్లడించారు. దళిత బందులో నిధులను విడుదల చేశారని, లబ్ధిదారులకు రూ. 10 లక్షలు జమాయ్యాయి. గ్రౌండింగ్ జరిగే లోపు ఎన్నికల నియామవళి రావడంతో లబ్ధిదారులకు గ్రౌండిగ్ చేయలేదన్నారు. ఎన్నికల తర్వాత గ్రౌండిగ్ చేస్తారు అనుకున్నాం కానీ ఎకౌంటు లను ఫ్రీజింగ్లో పెట్టి ఇప్పటివరకు గ్రౌండిగ్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించి దళిత జాతికి రావాల్సిన దళిత బంధు నిధులను విడుదల చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. దళిత బంధు కోసం సాగే పోరాటంలో దళిత బంధు లబ్ధిదారులంతా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో పోతేపాక నవీన్, దొడ్డి రమేష్, పుల్లెంల ఏడుకొండలు, కొప్పోలు విమలమ్మ, మామిడి ఎల్లయ్య, పేరపాక నరసింహ, అద్దంకి రవీందర్, బాకి నరసింహ, బొజ్జ శ్రీను, బొజ్జ సురేష్, దర్శనం రాంబాబు, అప్పల మధు, ఉదారి శ్రీకాంత్, కొండేటి నాగయ్య, బాలస్వామి, చింతకింది సైదులు, పోలే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

రాజ్ తరుణ్-లావణ్య కేసులో ముఖ్యంగా వినపడిన పేరు మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో అరెస్ట్...

HYD : డ్రగ్స్‌ పెడ్లర్‌ మస్తాన్‌ సాయి అరెస్ట్‌. వరలక్ష్మి టిఫిన్స్‌ డ్రగ్స్‌ కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్‌ సాయి. గుంటూరు జిల్లాలో మస్తాన్‌ సాయి అరెస్ట్‌ చేసిన ఏపీ పోలీసులు. లావణ్య, రాజ్‌తరుణ్‌ కేసులోనూ వినిపించిన మస్తాన్‌ సాయి పేరు. మస్తాన్‌ సాయి ఫోన్‌లో అమ్మాయిల వీడియోలు గుర్తింపు. పలువురు అమ్మాయిలను బ్లాక్‌మెయిల్‌ చేసిన మస్తాన్‌ సాయి.

నల్లగొండ: నల్లగొండ బిజెపి చేనేత సెల్ కో కన్వీనర్ కటకం శ్రీధర్ ఆధ్వర్యంలో చండూరులో ఘనంగా చేనేత దినోత్సవం..

నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా చేనేత సెల్ కో కన్వీనర్ కటకం శ్రీధర్ గారి ఆధ్వర్యంలో

చండూరు పట్టణంలో జాతీయ చేనేత దినోత్సవ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చేనేత కళాకారులు మహిళలు పెద్ద పెద్ద ఎత్తున హాజరు అయ్యారు స్థానిక మార్ కొండయ్య దేవస్థానంలో జరిగిన ఈ కార్యక్రమం లో మహిళా చేనేత కళాకారునిలను శాలువాతో సత్కరించి వారికి మూమెంట్ అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి చేనేత సెల్ రాష్ట్ర కోకన్వీనర్ మిర్యాల వెంకటేశం గారు ముఖ్యఅతిథిగా విచ్చేయడం జరిగింది అలాగే ఓబిసి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోమటి వీరేశం. గారు ఓబిసి మోర్చా జిల్లా జనరల్ సెక్రెటరీ తిరందాసు కనకయ్య గారు. గుర్రం బిక్షమయ్య గారు. ఏలె స్చంద్రశేఖర్ గారు.

తిరందాస్ శ్రీను.కౌన్సిలర్ చిలుకూరి రాధిక శ్రీనివాస్ గారు. 

గంజి శ్రీనివాస్. చెరుపల్లి కృష్ణ గారు. తదితరులు పాల్గొనడం జరిగింది.

చట్టాలపై పౌర సమాజం అవగాహన కలిగి ఉండాలి:సురుపంగ శివలింగం

 "చట్టాలపై పౌర సమాజం అవగాహన కలిగి ఉండాలి"

-- సురుపంగ శివలింగం

 

ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం మరియు ఎస్సీ, ఎస్టీ ల ప్రత్యేక ప్రగతి నిధి చట్టం పట్ల పౌర సమాజం పూర్తి అవగాహన కలిగిఉండాలని దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి శివలింగం అన్నారు.

ఈరోజు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సిటిజన్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎన్నిక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత గిరిజనుల రక్షణ చట్టాలు మరియు సంక్షేమ, అభివృద్ధి చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిరంతరం జరగవలసిన అవసరం ఉన్నదన్నారు.

దేశవ్యాప్తంగా ప్రజలను సంఘటిత పరిచి చైతన్యం చేయవలసిన భాద్యత పౌర సమాజంపై ఉన్నదన్నారు.

ఇందుకోసం కృషి చేస్తున్న దళిత సంఘాలకు అభినందనలు తెలిపారు.

జిల్లాలో సిటీజన్స్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఆవిర్భావం జరగడం నూతన కమిటీ ఎన్నుకోవడం మంచి పరిణామమని ఈకమిటీలు గ్రామ గ్రామాన ఏర్పాటు చేయాలని అంతేకాకుండా కమిటీల బలోపేతానికి కృషి చేయాలని అన్నారు.

 దళిత గిరిజన విశ్రాంత ఉద్యోగులు, అద్వకేట్ లు, జర్నలిస్టులు, దళిత గిరిజన నాయకులు పాల్గొన్నారు.

అనంతరం నూతన అడ్ హాక్ కమిటీని ఎన్నుకున్నారు.

గౌరవ సలహదారులుగా మేడి లక్ష్మయ్య, కట్టెల శివకుమార్, కె. మధు, డి. నాగయ్య, కె. విజయలక్ష్మి, మోహన్,  కె. యాదయ్య, మౌనిక,  తదితరులను ఎన్నుకున్నారు.