/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png StreetBuzz తిరుపతిలో వృద్ధురాలి గొంతు కోసి దారుణ హత్య Andrapradesh
తిరుపతిలో వృద్ధురాలి గొంతు కోసి దారుణ హత్య

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

తిరుపతి జిల్లా కేంద్రంలోని రాయల్ నగర్ లో గురువా రం సాయంత్రం దారుణం జరిగింది. 

ఇంటిలో చొరబడ్డ అగంత కుడు 67 ఏళ్ల జయలక్ష్మి అనే వృద్ధురాలిని హత్య చేశాడు. ఆమె మనవరాలు 14 ఏళ్ల మైనర్ బాలికపై కూడా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ముఖానికి మాస్క్ వేసుకుని ఇంటిలోకి చొరబడిన దుండగుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆగంతకుడు ఎందుకు ఈ దారుణానికి ఒడి గట్టాడన్న దానిపై పోలీసుల విచారణ కొనసాగుతుంది. 

తిరుపతి రాయల్ నగర్ లో సంచలనంగా మారిన ఈ ఘటనపై పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలాన్ని పరిశీలిం చిన ఎస్పీ సుబ్బరాయుడు, ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు దారుణంపై ఆరా తీశారు.

తిరుపతి రాయల్ నగర్‌ లోని తిలక్ రోడ్డులోని బసవయ్య అండ్ కో యజమాని శ్రీనివాసరావు ఇంట్లోకి చొరబడ్డాడు అగంతకుడు. శ్రీనివాసరావు తల్లి జయలక్ష్మి, ఆయన భార్య సురక్ష, ఇద్దరు కూతుళ్లు ప్రేరణ, నియాతి, లపై కత్తితో దాడికి పాల్పడి నట్లు గుర్తించారు. 

కాగా వృద్ధురాలు జయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా మనవరాలు 14 ఏళ్ల మైనర్ బాలిక గొంతుపై కత్తితో దాడి జరిగినట్లు గుర్తించారు. 

దాడి చేసి పారిపోతున్న అగంతకుడు అదే సమ యంలో బయటకు వెళ్లి ఇంటి తిరిగి వచ్చిన శ్రీనివా సరావు భార్య సురక్ష, పెద్ద కూతురు ప్రేరణ పై కూడా దాడికి పాల్పడ్డాడు. 

మెట్లు ఎక్కుతూ ఎదురు వచ్చిన ఇద్దరిపైనా కత్తి దాడికి ప్రయత్నం చేశాడని పోలీసులు చెబుతున్నారు.. అయితే ఈ దారుణానికి ఒడిగట్టిన హంతకుడు పక్కింటి యువకుడిగా పోలీసులు అనుమానిస్తు న్నారు. 

సిసి ఫుటేజీ ఆధారంగా దాడికి పాల్పడిన యువ కుడిని గుర్తించినట్లు పోలీసు లు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Andrapradesh

జేసీ దివాకర్ రెడ్డి తన ఇంట్లో ప్రజల్ని కలుస్తున్న సమయంలో శ్రీనివాసులు అనే మాజీ టీడీపీ నేత ఆయన వద్దకు వచ్చారు. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత పెద్దారెడ్డి పంచన చేరి జేసీపైనే విమర్శలు చేశారు ఈ శ్రీనివాసు

జేసీ ప్రేమిస్తే ప్రాణమిస్తారు.. వంచిస్తే ఎత్తి అవతల పడేస్తారు
జేసీ దివాకర్ రెడ్డి తన ఇంట్లో ప్రజల్ని కలుస్తున్న సమయంలో శ్రీనివాసులు అనే మాజీ టీడీపీ నేత ఆయన వద్దకు వచ్చారు. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత పెద్దారెడ్డి పంచన చేరి జేసీపైనే విమర్శలు చేశారు ఈ శ్రీనివాసులు. ఇప్పుడు టీడీపీ గెలవడంతో మళ్లీ ఆయన జేసీ వద్దకు వచ్చి.. టీడీపీలో చేరుతానన్నారు. కానీ జేసీ మాత్రం..బయటకు పంపేశారు. ఆయన వెళ్లనంటే .. జేసీ అనుచురులు ఇలా కాళ్లు, చేతులు పట్టుకుని తీసుకెళ్లి బయట పడేసి వచ్చారు.
త్వరలోనే ఆలయాలకు కొత్త పాలకమండళ్లు: మంత్రి

రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన దేవాలయాల్లో సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇతర అంశాలపై సమీక్ష చేస్తున్నట్లు ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. 

త్వరలోనే అన్ని ఆలయాలకు కొత్త పాలకమండళ్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ప్రభుత్వం మారిన తర్వాత అప్పటి వరకు కొనసాగిన పాలకమండళ్ల సభ్యులు తమ పదవీకాలంతో సంబంధం లేకుండా రాజీనామాలు చేయడం నైతిక విలువలు పాటించడం అవుతుందని తెలిపారు.

AP : బాలికపై ముగ్గురు మైనర్ల అత్యాచారం, హత్య

నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో బాలిక (8) అదృశ్యం ఘటన కలకలం రేపింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు ముగ్గురు మైనర్ బాలురను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. 

బాలిక ఆడుకుంటుండగా సమీపంలోని ఎత్తిపోతల పథకం వద్దకు తీసుకెళ్లామని.. అనంతరం అత్యాచారం చేసినట్లు నిందితులు అంగీకరించారు. ఈ విషయం బయటపడుతుందనే భయంతో బాలికను కాల్వలోకి తోసేశామని తెలిపారు. బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

AP : ట్రిపుల్ ఐటీలో గంజాయి.. మంత్రి లోకేశ్ ఆగ్రహం


వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేపింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులపై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు

 గంజాయిని ప్రోత్సహించే స్థానిక నాయకులపైనా కఠిన చర్యలకు ఆదేశించారు. దీనిపై మంత్రిని విద్యార్థుల తల్లిదండ్రులు కలిశారు. విద్యాలయాల్లో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. సమస్యను పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్తు కాపాడతామని తెలిపారు.

AP : జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం

జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్పై ఉన్న కేసుల గురించి దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీగా విచారించాలని హైకోర్టు ఆదేశించింది.

జగన్ కేసులపై గతంలో హరిరామజోగయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది కోర్టులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు 3వారాలకు వాయిదా వేసింది.
నా గుండె వేయి ముక్కలైంది: షర్మిల

యూపీలోని హథ్రాస్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. “ఈ ఘటన నా హృదయాన్ని వేయి ముక్కలు చేసింది. ఈ దుఃఖాన్ని వ్యక్తీకరించేందుకు నాకు పదాలు దొరకడం లేదు.

ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. యూపీ సీఎం యోగి నిరంకుశ పాలనవల్లే ఈఘటన జరిగింది. దీనిపై కేంద్ర విచారణ జరిపించాలి” అని ట్వీట్ చేశారు.
AP : నాసిరకం విత్తనాలకు చెక్... - విక్రయిస్తే కఠిన చర్యలకు సీఎం ఆదేశాలు...

రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. "నకిలీ విత్తనాలకు చెక్ పెట్టాలి. అనుమతి లేని, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి.

రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ద్వారా ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. ఖరీఫ్ లో 4 లక్షల భూసార పరీక్షలు చేయాలి. ప్రకృతి వ్యవసాయం, బిందు సేద్యం ప్రోత్సహించి సాగు విస్తీర్ణం పెంచాలి" అని అధికారులను ఆదేశించారు.
AP : మహిళా పోలీసులపై పిటిషన్... విచారణ 3 వారాలు వాయిదా...
సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులకు పోలీసు విధులు అప్పగింతపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ అంశంపై 3 వారాల లో ప్రభుత్వ నిర్ణయం తెలపాలని ఆదేశించింది.

మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా పేర్కొంటూ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ విశాఖకు చెందిన ఉమామహేశ్వరావు పిటిషన్ వేశారు. వ్యాజ్యాలపై విచారణ జరిపిన ధర్మాసనం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విడాకుల ముచ్చట... ఆ పనికే విడాకులు ఇచ్చింది...

చిన్న చిన్న కారణాలకే భార్యభర్తలు విడాకులు తీసుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇల్లు శుభ్రంగా ఉంచడం లేదని, ట్రైమ్ కు భోజనం పెడతాలేదని విడాకులు తీసుకున్న సంఘటనలు కొకొల్లాలు ఉన్నాయి.

తాజాగా ఊరగాయ పచ్చడి డబ్బాలపై భర్త మూతలు బిగుతుగా పెడుతుండడంతో తాను తీయలేకపోతున్నాని అతడికి భార్య విడాకులు ఇచ్చింది. రెడ్డిట్ అనే సోషల్ మీడియాలో భార్య పోస్టు చేసింది. ఊరవేసిన అవకాయ, నిమ్మకాయ పచ్చడి డబ్బాల మూతలను భర్త గట్టిగా మూసి పెడుతున్నాడు. ఈ మూతలు తీయడానికి భార్య ప్రయత్నించిన ఓపెన్ కాకపోవడంతో పక్కింటి వాళ్లు సహాయం తీసుకునేది.

ఇలా పలుమార్లు మూతల విషయంలో దంపతులు మధ్య గొడవల జరిగాయి. భర్తకు ఎంత చెప్పినా పట్టించుకోకపోవడంతో కోర్టు నుంచి విడాకులు తీసుకుంటున్నట్టుగా అతడికి నోటీసులు పంపించింది.

భర్త క్షమాపణలు చెప్పిన కూడా భార్య వినలేదు. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చిన్న విషయానికే విడాకులు తీసుకుంటావా? అని నెటిజన్లు భార్యపై కామెంట్లు చేస్తున్నారు. పచ్చడి డబ్బాలకు మూత బిగుతుగా ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని కూడా కామెంట్లు చేస్తున్నారు.