/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz TG News: రంగారెడ్డి జిల్లాలో భారీ పేలుడు.. ఆరుగురి మృతి Raghu ram reddy
TG News: రంగారెడ్డి జిల్లాలో భారీ పేలుడు.. ఆరుగురి మృతి


జిల్లాలోని షాద్‌నగర్‌లో గల సౌత్‌ గ్లాస్‌ పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. పేలుడు ఘటనలో ఆరుగురు కార్మికులు మృతిచెందారు. బాయిలర్‌ పేలినట్లు స్థానికులు చెబుతున్నారు.

రంగారెడ్డి: జిల్లాలోని షాద్‌నగర్‌లో గల సౌత్‌ గ్లాస్‌ పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. పేలుడు ఘటనలో ఆరుగురు కార్మికులు మృతిచెందారు.

బాయిలర్‌ పేలినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 30 మంది పనిచేస్తున్నారు. వారిలో 20 మంది కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. మరో నలుగురి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పరిశ్రమలో చెల్లాచెదురుగా శరీర భాగాలు పడ్డాయి

ఒకేసారి పేలుడు సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఈ దుర్ఘటన ఎలా జరిగిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతులు ఒడిశా, బిహార్‌, యూపీ వాసులుగా గుర్తించారు. తీవ్ర గాయాలైన వారిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా, గాంధీ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది.

మాన్యం చెల్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సొంత భవనం త్వరగా పూర్తి చేయాలి. ఐద్వా డిమాండ్

మాన్యం చెల్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సొంత భవనం త్వరగా పూర్తి చేయాలి. ఐద్వా డిమాండ్

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో ఈ రోజు మాన్యం చేల్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సర్వే నిర్వహించడం జరిగింది. ఐద్వా అధ్యక్ష మరియు కార్యదర్శి మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలోని మాన్యం చెల్కా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సొంత భవనం లేక ఇక్కడ సిబ్బంది ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు. వచ్చిన పేషెంట్లకు గాలి వెళుతురు లేక ఇబ్బంది పడుతున్నారు.వెంటనే సొంత భవనం నిర్మించాలని కోరుతూ ఇక్కడ స్టాఫ్ 15 మంది ఉన్నారు.

ఒకే డాక్టరు రోజు కి 100 మంది పేషెంట్లను చూడడం జరుగుతుంది. కావున ఇంకొక డాక్టర్ ని రిఫర్ చేయాలని కోరుతూ ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఒకే డాక్టర్ రోజు చూసే 100 మందికి కాక అదనంగా పేషెంట్లు వస్తారు. వాళ్లకు ఫార్మసిస్ వాళ్లే మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది.

అలా కాకుండా డాక్టరు పరీక్షలు చేసి చూస్తే బాగుంటుందన్నారు. గవర్నమెంట్ నిధులు కేటాయించి సొంత హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలని కోరుతూ ఇక్కడ స్టాఫ్ కి శాలరీస్ కూడా మంత్లీ మంత్లీ రావటం లేదు వైఫై కనెక్షన్ వాళ్ళ సొంత ఖర్చులతోనే ఉపయోగిస్తున్నారు.

అలాగే కరెంట్ బిల్లు కూడా (20000) ఇరవై వెయ్లు పెండింగ్ లో ఉంది. ఈ సమస్యలపై త్వరగా ప్రభుత్వం స్పందించి ఇక్కడ కావలసిన నిధులు కేటాయించాలి అని డిమాండ్ చేసినారు.

మాకు మేయరూ మీకు ఉప మేయరూ...!

అపుడే పదవుల పంపకాలు మొదలయిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పక్షం రోజులు కాలేదు. లోకల్ బాడీస్ విషయంలో గోడ దూకుళ్లకు తెర లేపాలని చూస్తున్నారు. విశాఖ కార్పొరేషన్ ఇపుడు వైసీపీ చేతిలో ఉంది

నాలుగేళ్ల వరకూ మేయర్ మీద అవిశ్వాసం పెట్టకూడదని వైసీపీ ప్రభుత్వం హయాంలో చట్టం చేశారు. ఇపుడు ఆ చట్టాన్ని మార్చి మూడేళ్ళకే అని సవరిస్తారని అంటున్నారు. 2021 మార్చిలో విశాఖ మేయర్ పీఠం వైసీపీ పరం అయింది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం చూసుకుంటే 2025 మార్చి వరకూ మేయర్ సీటుకు ఢోకాలేదు.

కానీ టీడీపీ తమ్ముళ్ళ ఆరాటం అలాగే అధినాయకత్వం ఆలోచనలు చూస్తూంటే మూడేళ్ళకే అవిశ్వాసం అన్న సవరణలను తొందరలోనే తెస్తారని అంటున్నారు. 98 మంది కార్పోరేటర్లు ఉన్న విశాఖ కార్పొరేషన్ లో వైసీపీకి 57 మంది ఉన్నారు. టీడీపీకి 30 మంది ఉంటే జనసేన ప్లస్ బీజేపీకి కలిపి నలుగురు ఉన్నారు. వీరు కాకుండా ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎమ్మెల్యేలు ఎంపీలు కలసి చూస్తే టీడీపీ మెజారిటీ యాభైకి చేరుకుంటుందని అంటున్నారు.

వైసీపీ నుంచి కొందరిని తమ వైపు తిప్పుకుంటే దర్జాగా విశాఖ మేయర్ పీఠం తమ చేతిలోకి వస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. గతంలో విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన నాయకునికే మేయర్ పీఠం అప్పగించాలని చూస్తున్నారు. తమకు సహకరించిన జనసేన బీజేపీలకు చెరో ఉప మేయర్ ఇస్తారని అంటున్నారు.

విశాఖ కార్పొరేషన్ కి 2026 ఏప్రిల్ దాకా పదవీ కాలం ఉంది. దాంతో రానున్న రెండేళ్ళలోనూ తమ ఆధీనంలో విశాఖ కార్పోరేషన్ ని ఉంచుకుంటే మొత్తం మెగా సిటీ అంతా టీడీపీ కూటమి గుప్పిట్లో ఉంటుందని భావిస్తున్నారు. విశాఖ మేయర్ పీఠం టీడీపీకి దక్కి నాలుగు దశాబ్దాలు అవుతోంది. 1987లో తొలిసారి గెలిచిన టీడీపీకి మళ్లీ ఆ చాన్స్ రాలేదు. దాంతో చరిత్రను తిరగరాయాలని చూస్తోంది. అంతే కాకుండా విశాఖ సిటీలో వైసీపీని రాజకీయంగా మరింతగా దెబ్బ తీయాలన్న అసలైన వ్యూహం ఇందులో ఉంది అని అంటున్నారు.

తెలంగాణలో పవన్‌కు వై కేటగిరి సెక్యూరిటీ: రోడ్డు మార్గంలో క్షేత్రదర్శనం

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పర్యటించబోతోండటం ఇదే తొలిసారి.

ఆయన పర్యటన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. తెలంగాణలో వై సెక్యూరిటీ భద్రతను పవన్ కల్యాణ్‌కు కల్పించారు.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన మాల ధారణ చేశారు.

11 రోజులపాటు నిష్ఠగా ఈ దీక్ష చేయనున్నారు. ఈ సమయంలో ఆహారంగా పాలు, పండ్లు, ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటారు. గత ఏడాది కూడా ఆయన ఇదే దీక్ష చేశారు.

Hemant Soren: ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు బెయిల్

ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు భారీ ఊరట లభించింది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఆయనకు ఝార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన ఐదు నెలల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు.

ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా సోరెన్, ఐఏఎస్ అధికారి, రాంచీ మాజీ డిప్యూటీ కమిషనర్ ఛవీ రంజన్, భాను ప్రతాప్ ప్రసాద్ తదితరులతో సహా 25 మందికి పైగా వ్యక్తులను ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అరెస్టు చేసింది.

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వెంట‌నే జనవరి 31న రాంచీలోని రాజ్‌భవన్‌లో హేమంత్ సోరెన్‌ను అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. అప్పటి నుంచి రాంచీలోని బిర్సా ముండా జైల్లోనే ఉన్నారు.

కాగా, అరెస్టయిన సమయంలో సోరెన్ తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రతీకార చర్యలో భాగంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తనపై మనీలాండరింగ్ కేసును మోపిందని అన్నారు.

అయితే సోరెన్, ఇతరులపై ఆరోపించిన భూ కబ్జాకు సంబంధించిన మనీ లాండరింగ్ విచారణలో భాగంగా రాంచీలో జూన్ 22న ఈడీ జరిపిన దాడుల్లో రూ. 1 కోటి నగదు, 100 బుల్లెట్ల‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ

తెలంగాణ(telangana) గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (Radhakrishnan) సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu naidu)తో సమావేశం అయ్యారు.

తెలంగాణ(telangana) గవర్నర్ సీ.పీ. రాధాకృష్ణన్(Radhakrishnan) ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu naidu)తో సమావేశం అయ్యారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు.

రెండు గంటలపాటు సమావేశం కొనసాగింది. మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారని టిడిపి వర్గాలు చెబుతున్నారు. ఎలాంటి రాజకీయ అంశాలు ప్రస్తావించలేదని పేర్కొంది.

గత కొన్నేళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 (APRA)కి సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన పూర్తైన 10 ఏళ్ల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజన అస్పష్టంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

తొలి ప్రపంచ కమ్మ మహాసభ - చంద్రబాబు, రేవంత్ హాజరు..!!

ప్రపంచ కమ్మ మహాసభకు హైదరాబాద్ కు వేదిక కానుంది. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జులై 20-21 తేదీలో తొలి ప్రపంచ కమ్మ మహాసభ హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ లో నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు జెట్టి కుసుమకుమార్ వెల్లడించారు. ఈ సభల ద్వారా కమ్మ సామాజిక వర్గాన్ని ఒకే వేదిక మీదకు తీసుకురావటం..

విశేష సేవలందించిన వారికి గుర్తింపు ఇవ్వటంతో పాటుగా ఇతర వర్గీయులకు చేయూతనిచ్చేలా కార్యక్రమాలు ఖరారు చేసారు

కమ్మ మహాసభ ద్వారా

కమ్మ సామాజిక వర్గీయుల ఐక్యత...అభివృద్ధి..భవిష్యత్ లక్ష్యాల సాధన కోసం కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఏర్పాటు చేసారు.

ఈ సంస్థ జెట్టి కుసుమకుమార్ నాయకత్వంలో ఏర్పాటు అయింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా ప్రపంచ కమ్మ మహాసభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు.

ఇందు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు తరలి వస్తున్నారు. ప్రధానంగా ఈ మహాసభలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డిలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని కుసుమ కుమార్ వెల్లడించారు.

PV Narasimha Rao: తెలుగు ఠీవీ పీవీకి ఏపీ సీఎం చంద్రబాబు నివాళి

బహుముఖ ప్రజ్ఞశాలి, అపార మేధావి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. పీవీ నరసింహ రావు తెలుగు రాష్ట్రాలకు, దేశానికి చేసిన సేవలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్మరించారు. పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. విప్లవాత్మక సంస్కరణలు, సాహసోపేత నిర్ణయాలతో భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు పునాదులు వేశారని గుర్తుచేశారు.

బహుముఖ ప్రజ్ఞశాలి, అపార మేధావి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. పీవీ నరసింహ రావు తెలుగు రాష్ట్రాలకు, దేశానికి చేసిన సేవలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్మరించారు. పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. విప్లవాత్మక సంస్కరణలు, సాహసోపేత నిర్ణయాలతో భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు పునాదులు వేశారని గుర్తుచేశారు. మాజీ ప్రధాని పీవీ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అంజలి ఘటించారు. రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు

దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన గొప్ప మేధావి పీవీ నరసింహ రావు. భూ స్వామ్య కుటుంబంలో పీవీ జన్మించారు. తనకు గల 1200 ఎకరాల్లో 1000 ఎకరాలను పేదలకు పంచారు. పీవీ నరసింహ రావు అమలు చేసిన భూ సంస్కరణలతో రైతు కూలీలకు భూమి దక్కిందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఏపీ సీఎం పదవి చేపట్టి భూ సంస్కరణలను అమలు చేశారు

ఏ పదవి చేపట్టిన వన్నె తీసుకొచ్చారు. పీవీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో గురుకుల విద్యను ప్రవేశపెట్టారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నవోదయ పాఠశాలలను ప్రారంభించారు.

జైళ్ల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఓపెన్ జైల్ అనే పద్ధతికి శ్రీకారం చుట్టారు. సీఎంగా భూ సంస్కరణలు, ప్రధానిగా ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు.

తొలి పర్యటన ప్రైవేటు దవాఖాన ప్రారంభానికా

సీఎం రేవంత్‌రెడ్డి తొలిసారి జిల్లాల పర్యటనలో ప్రైవేటు దవాఖాన ప్రారంభోత్సవానికి రానుండటంపై బీఆర్‌ఎస్‌ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి భగ్గుమన్నారు. సీఎంకు ఆరు నెలల తర్వాతైనా జిల్లాల్లో పర్యటించడానికి తీరిక దొరికిందని ఎద్దేవా చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి తొలిసారి జిల్లాల పర్యటనలో ప్రైవేటు దవాఖాన ప్రారంభోత్సవానికి రానుండటంపై బీఆర్‌ఎస్‌ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి భగ్గుమన్నారు. సీఎంకు ఆరు నెలల తర్వాతైనా జిల్లాల్లో పర్యటించడానికి తీరిక దొరికిందని ఎద్దేవా చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం తన తొలి పర్యటనను ప్రైవేటు దవాఖాన ప్రారంభోత్సవానికి పెట్టుకోవటం ఆశ్చర్యంగా ఉన్నదని తెలిపారు.

ఎంజీఎంను సందర్శించాలనే సోయిలేకుండా, కార్పొరేట్‌ దవాఖానను ప్రారంభించనుండటం బాధ కలిగించిందని వెల్లడించా రు. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ వెంటిలేటర్‌పై ఉన్నదని ఆరోపించారు. ప్రభుత్వ దవాఖానలు దయనీయస్థితిలో ఉన్నాయని విమర్శించారు. ఎంజీఎం దవాఖానలో ఐదు గంటల పాటు కరెంట్‌ లేకపోవటంతో రోగులు విలవిలలాడారని గుర్తుచేశారు. ఓరుగల్లు పర్యటన సందర్భంగా సీఎం ముందు పలు డిమాండ్లు ఉంచుతున్నామని రాకేశ్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం ఉంచుతారా? లేదా? చెప్పాలి అని డిమాండ్‌ చేశారు.

రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులను సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని హనుమకొండలో ఆయన పర్యటనను అడ్డుకుంటామని బీఆర్‌ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్‌ హెచ్చరించారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే జాబ్‌ క్యాలెండర్‌, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల శరత్‌ చంద్ర, ఉపాధ్యక్షుడు కంజర్ల మనోజ్‌ కుమార్‌, రూరల్‌ జిల్లా కోఆర్డినేటర్‌ లంక రాజగోపాల్‌, బీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకులు కలకోట్ల సుమన్‌, గొల్లపల్లి వీరస్వామి, జిల్లా కార్యదర్శి హర్ష మధు తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌లో ప్రభుత్వం చేపట్టిన సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఇప్పటికే ఒకసారి నిర్మాణ కాలపరిమితిని పొడిగించి పనులు చేపట్టారు. ఇప్పుడు ఆ గడువు కూడా సమీపిస్తున్నా పనుల్లో వేగం పుంజుకోవటం లేదు. పనులు పూర్తి కావాలంటే మరో ఆరు నెలలు గడువు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరేందుకు రహదారులు, భవనాల (ఆర్‌అండ్‌బీ) శాఖ ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు సమాచారం. పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో కేసీఆర్‌ ప్రభుత్వం వరంగల్‌లో 24 అంతస్తులతో సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం చేపట్టింది. 56.39 ఎకరాల్లో మొదట రూ.1,116 కోట్ల అంచనా వ్యయంతో 1,750 పడకల కెపాసిటీతో పనులు మొదలు పెట్టింది.

Rythu Runa Mafi | రుణమాఫీకి ఎన్సీడీసీ రుణం.. భారీ మొత్తంలో రుణం ఇచ్చేందుకు ఆసక్తి చూపని జాతీయ బ్యాంకులు!

రైతు రుణమాఫీకి అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జాతీయ బ్యాం కులతో రుణాల గురించి చర్చలు జరిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

రైతు రుణమాఫీకి అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జాతీయ బ్యాం కులతో రుణాల గురించి చర్చలు జరిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. భారీ మొత్తంలో రుణం ఇచ్చేందుకు జాతీయ బ్యాంకులు ఆసక్తి చూపడంలేదని సమాచారం. దీంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్‌ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్సీడీసీ)ని సంప్రదించినట్టు తెలిసింది. రుణం ఇచ్చేందుకు తమ సంస్థ షరతులు, కేంద్ర ప్రభుత్వ అనుమతులను ఎన్సీడీసీ అధికారులు వివరించిన ట్టు తెలిసింది.

ఎన్సీడీసీ కేంద్ర సహకార శాఖ అధీనంలో ఉంటుంది. ఈ సంస్థ రుణం ఇవ్వాలంటే కేంద్ర సహకార శాఖ అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం కేంద్ర సహకార శాఖ మంత్రిగా బీజేపీ అగ్రనేత అమిత్‌షా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎన్సీడీసీ రుణం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడినట్టు తెలిసింది. నాలుగు రోజులపాటు ఢిల్లీలో మకాం వేసిన రేవంత్‌రెడ్డి.. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలతోపాటు రుణమాఫీకి అవసరమైన రుణం పొందేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని పలువురు కేంద్ర మంత్రులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.

రుణమాఫీకి నిధుల వేటలో భాగంగా ముంబై వెళ్లిన అధికారులు ఆర్బీఐ అధికారులతో చర్చించినట్టు తెలిసింది. ఢిల్లీలో పలు జాతీయ బ్యాంకుల అధికారులతోనూ చర్చించినట్టు సమాచారం. అయితే ఆ బ్యాంకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎడారిలో ఒయాసిస్‌ మాదిరిగా ప్రభుత్వానికి ఎన్సీడీసీ కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఢిల్లీలో ఎన్సీడీసీ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి, రాష్ట్ర ప్రభుత్వ అవసరాలను, రుణ అనివార్యతను వారికి వివరించినట్టు తెలిసింది. ఎక్కువ మొత్తంలో రుణం ఇవ్వాలని ఎన్సీడీసీని కోరినట్టు తెలిసింది. ఈ రుణం వస్తుందనే ఆశతోనే ప్రభుత్వ పెద్దలు రుణమాఫీపై ప్రకటనలు చేస్తున్నట్టు తెలిసింది