/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz అంగన్వాడి కేంద్రాలను ప్రక్షాళన చేయాలి: బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్ Vijay.S
అంగన్వాడి కేంద్రాలను ప్రక్షాళన చేయాలి: బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్

 యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలను ప్రక్షాళన చేసి, విద్యార్థులకు, గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన ఆహారం అందించాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజాపేట మండలం చల్లూరు గ్రామంలో శనివారం గర్భిణీ కి అందించిన ఆహారంలో ఈగలు పడి చనిపోయి ఉండడం, అంగన్వాడీ కార్యకర్తల నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో అనేకం జరుగుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గత నెలలో స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కేమెరాలు ఏర్పాటు చేయాలని, అంగన్వాడీ కార్యకర్తలకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని సూచించారని వెంకటేష్ గుర్తు చేశారు. అధికారులు వెంటనే ముఖ్యమంత్రి సూచనలు అమలు చేసి, పసి పిల్లలకు, తల్లులకు, గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

బొమ్మలరామారం మండల కేంద్రంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచార ర్యాలీ


యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం గుడ్డిబావి చౌరస్తా వద్ద చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును కోరుతూ ర్యాలీ,కార్నర్ మీటింగ్ నిర్వహించారు.

ఈ ర్యాలీ కి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు,భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి గారు,గిరిజన సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు.మహిళ సహకార అభివృద్ధి సంస్థ ఛైర్మన్ బండ్రు శోభారాణి

తదితరులు పాల్గొన్నారు.

బొమ్మలరామారం మండల కేంద్రం నుండి గుడ్డి బావి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ ర్యాలీ భారీజన సంద్రోహం మధ్య కొనసాగింది.

ఈ ర్యాలీ లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు ప్రజలందరినీ కలుస్తూ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు.

భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థిగా ప్రజా ఉద్యమ నాయకుడు ఎండి జహంగీర్ ని గెలిపించండి: దయ్యాల నరసింహ సిపిఎం భువనగిరి మండల కార్యదర్శి


ప్రశ్నించే వారు లేకుంటే సమాజం అధోగతి పాలవుతుంది తప్పుడు ఆలోచన లే రాజ్యమేలు తాయి సిపిఎం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నీకి సిపిఎం అభ్యర్థిగా ప్రజా ఉద్యమనాయకుడైన ఎండి జాంగిర్ గారు పోటీ చేస్తున్నారు గెలిపించాలని ప్రజలని కోరారు ఈరోజు శనివారం రోజున భువనగిరి మండలం చీమల కొండూరు లో సిపిఎం భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నరసింహ పాల్గొని మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా కమ్యూనిస్టు రాజకీయాల్లో జీవితంలో అనేక సవాలను ఎదుర్కొని నిజాయితీగా ప్రజా సమస్యలపై పోరాటమే దినచర్య కొనసాగుతున్న ఎండి జాంగిర్ గాని వర్గాల ప్రజలు ఆశీర్వదించి భారీ మెజార్ట తో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ము కావున ప్రజలందరూ అన్ని రకాల వర్గాలు సిపిఎం పార్టీని ఆదరించి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకై మీ ఓటు వేసి గెలిపించాలని నరసింహ అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య సిపిఎం శాఖ కార్యదర్శి బోడ ఆంజనేయులు గ్రామ నాయకులు రావుల పోశయ్య జయమ్మ గ్రామ ప్రజలు జయమ్మ మల్లయ్య శ్రీశైలం బిక్షపతి పద్మ ఎల్లమ్మ కాశమ్మ లక్ష్మి రజిని మల్లమ్మ రేణుక లలిత తదితరులు పాల్గొన్నారు.

వెంకిర్యాల లో యోగ మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత యోగ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం


యోగ మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలోని వెంకిర్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్స్ లో ఉచిత యోగ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించడం జరిగినది . ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు యోగ మాస్టర్ సుధాకర్ మాట్లాడుతూ ఈ యోగా శిబిరం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించడం జరిగిందని, యోగా శిక్షణలో పాల్గొనడం వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. తమ సంస్థ గత ఆరు సంవత్సరాలుగా గ్రామంలో నిస్వార్ధంగా సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని అన్నారు . ఈ శిబిరం వేసవి సెలవులలో పూర్తిగా కొనసాగుతుందని ,విద్యార్థులు ఎవరైనా పాల్గొనవచ్చు అని తెలిపారు ,ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హెడ్మాస్టర్ చంద్ర రెడ్డి, మహర్షి మోడల్ హై స్కూల్ కరస్పాండెంట్ పి మల్లేష్ గౌడ్, వెంకిర్యాల వాస్తవ్యులు పోచారం మున్సిపల్ కార్పొరేటర్ చింతల రాజశేఖర్, సభ్యులు జిలుకపల్లి లక్ష్మీనారాయణ ,ముడుపు రాకేష్ ,కొండ శ్రీనాథ్ రెడ్డి, చిలుకూరు జంగయ్య మిత్రబృందం, విద్యార్థులు మరియు గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందజేసిన దాసిరెడ్డిగూడెం మాజీ సర్పంచ్ కొమిరెల్లి సరిత - సంజీవరెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని దాసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పత్తేపు లలిత అనారోగ్య కారణంగా మృతి చెందడం జరిగింది. వారి కుటుంబానికి దాసిరెడ్డిగూడెం తాజా మాజీ సర్పంచ్ కొమిరెల్లి సరిత సంజీవరెడ్డి వారి కుటుంబానికి 100 కేజీల బియ్యం 5000/- రూపాయలు బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో దాసిరెడ్డి గూడెం బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దంతూరి నరేష్ కుమార్, కార్యదర్శి గోధుమగడ్డ మల్లారెడ్డి, అప్పిడి వెంకటరెడ్డి, బాలగోని సత్తయ్య, బాలయ్య కుటుంబ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

గుడి మల్కాపురం గ్రామ శివారులో చెట్టును ఢీకొట్టిన కారు డ్రైవర్ మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం గుడిమల్కాపురం గ్రామ శివారులో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది .ఈ ప్రమాదంలో డ్రైవర్ వృత్తి చెందాడు. మృతుడు బోయపల్లి రాము గా గుర్తించారు .ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం .ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మానవత్వం చాటుకున్న భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఔషపూర్ గ్రామ సమీపంలో బైక్ యాక్సిడెంట్ కావడంతో అటుగా వెళుతున్న భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత బిజెపి అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు తన కాన్వాయిని ఆపి సంఘటన స్థలంలో జరిగిన ప్రమాదం గురించి ఆరాధిసి వెంటనే ప్రధమ చికిత్స నిర్వహించి అంబులెన్స్ పిలిపించి ఉప్పల్లోని నువ్వు ప్రైవేట్ హాస్పిటల్ పంపించడం జరిగింది. ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్న ఆపద సమయంలో ఆదుకున్న డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారికి అభినందనలు తెలిపారు.

ప్రజా ఉద్యమ నాయకుడు జహంగీర్ ను ఎంపీగా గెలిపించండి : నారీ ఐలయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు


ప్రజా ఉద్యమ నాయకుడు ఎండి జహంగీర్ ను భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు లు కోరారు ఈరోజు సుంకిశాల గ్రామంలో సిపిఎం ఇంటింటి ప్రచారంలో భాగంగా వ్యవసాయ మార్కెట్లో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహిస్తున్న సిపిఎం భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎండి జాంగిర్ను ఈ ఎన్నికల్లో ఎంపీగా గెలిపించాలని ఎంపీగా గెలిస్తే నిరంతరం ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటారని అనేక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని రైతులకు గిట్టుబాటు ధర వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనిని కల్పించే విధంగా పోరాటాల నిర్వహిస్తారని అందుకే ఈ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ను కోట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ప్రజలతో ఏమాత్రం సంబంధంలేని అనేకమంది వివిధ రాజకీయ పార్టీల పేరుతో ఈ ఎన్నికల్లో ముందుకు వస్తున్నారని వారు ఏనాడు ప్రజల సమస్యలు పరిష్కారం కోసం పనిచేసిన పరిస్థితులు లేవని కేవలం వాళ్ల ఆస్తులను కాపాడుకోవడం వాటిని మరింత పెంచుకోవడం కోసం ఈ ఎన్నికల్లో ముందుకు వస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పి ఓడించాలని సిపిఎం అభ్యర్థి జాంగిర్ను గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మొగిలి పాక బొందయ్య పోలేపల్లి వెంకయ్య,పోచమ్మ అలివేలు, రేణుక,పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు

ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు తండ్రీ కొడుకుల మృతి


యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ ఎం మండల పరిధిలోని రాయిపల్లి గ్రామానికి చెందిన బోడ నరేష్,అతని కుమారుడు సాయి 10 చాడ గ్రామంలో బంధువులు ఇంటికి పండుగకి వెళ్లి.ఇంటి పక్కనే ఉన్న బావిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు తండ్రి కొడుకులు ఇద్దరు మరణించారు.మృతి చెందిన బాలుడు సాయి ఆత్మకూరు ఉన్నత పాఠశాలలో 6 వ తరగతి చదువుతున్నాడు.మృతుడు నరేష్ గతంలో చాలా రోజులు ఆత్మకూరు రాంనగర్ కాలనిలో నివాసం ఉండి మేస్త్రి పని చేసుకునేవాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అంగన్వాడి స్కూల్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు, పిల్లలకు అసెస్మెంట్ కార్డులు అందజేసిన ఐసిడిఎస్ సూపర్వైజర్ గోద ధనలక్ష్మి


వలిగొండ మండల కేంద్రంలోని అంగన్‌వాడీ- 2 మరియు 6 కేంద్రాల్లో ఈసీసీ డే ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ గొద ధనలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లలకు ఆటపాటతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ సేవలు వినియోగించుకోవాలని తల్లులకు బాలింతలకు సూచించారు. వలిగొండ మండల కేంద్రంలోని అంగన్‌వాడీ- 2 మరియు 6 కేంద్రాల్లో ప్రీస్కూల్ పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో అసెస్మెంట్ కార్డు ఇవ్వడం జరిగింది. అంగన్‌వాడీ స్కూల్ లను సద్వినియోగం చేసుకోవాలని టీచర్లు జి. బాలవిజయ, సిహెచ్ సబిత సూచించారు. ఈ కార్యక్రమంలో తల్లులు,బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.