/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz గూడూరు నారాయణరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం Vijay.S
గూడూరు నారాయణరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం


గూడూరు నారాయణ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈ రోజు గూడూరు టోల్ గేట్ వద్ద చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి మాజి ఎంపీ & భువనగిరి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు.ఈ కార్యక్రమం లో వారితో పాటు భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ గారు , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి మల్లేష్ గారు, బి జె పి రాష్ట్ర కిసాన్ మోర్చ ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి గారు, గూడూరు నారోత్తం రెడ్డి గారు, బి జె పి బీబీనగర్ మండల అధ్యక్షులు ఇంజమూరి ప్రభాకర్ గారు మాజి అధ్యక్షులు జంగా రెడ్డి గారు మరియు జిల్లా బి జె పి నాయకులు, మండల నాయకులు మరియు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

వలిగొండ మండల కేంద్రంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు


వలిగొండ మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతినీ ఘనంగా నిర్వహించారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి కృష్ణాఫర్, సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎల్లంకి మహేష్,బి.ఎస్.పి మండల పార్టీ అధ్యక్షులు సుక్క శ్రీకాంత్, జయంతిని పురస్కరించుకొని ఈ సందర్భంగా సంయుక్తంగా మాట్లాడుతూ* జ్యోతీ రావు పూలే సత్యశోధక సమాజం ఏర్పాటు చేయడంతో మహారాష్ట్రలో బ్రాహ్మణేతర ఉద్యమం ఒక నిర్దిష్టమైన రూపాన్ని సంతరించుకున్నది.

 పూలే మాలి కులానికి కూరగాయలు పండించి వ్యాపారం చేసే కులం చెందిన ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. క్రైస్తవ మిషనరీ పాఠశాలలో చదువుకున్నాడు. స్వేచ్ఛా సమానత్వం వంటి పాశ్చ్యాత్య ఆదర్శాలతో ప్రత్యేకించి అమెరికాకు చెందిన టామ్ పెన్ రచనల చేత ఉత్తేజితుడై పూలే సాంఘిక సంస్కరణలు చేపట్టాడు.

 పీష్వా పీడకల పాలనను అంతం చేసిన బ్రిటిష్ పాలకులు పెట్టుబడిదారీ అభివృద్ధిని పాశ్చ్యాత్య ఆలోచనను అన్ని కులాలకు అందించారు.పీడిత ప్రజలలో, బాంబే కార్మిక వర్గంలోనూ, రైతాంగంలోనూ, పూనాలో ఆ చుట్టుపక్కల ఉన్న అంటరానివారిలోనూ పూలే తన కృషిని కేంద్రీకరించాడు.

ఆర్య దురాక్రమణదారులు స్థానిక జాతిపరమైన కుల వ్యవస్థ పుట్టుక సిద్ధాంతాన్ని వ్యాఖ్యానించి, సత్యశోధక్ సమాజ్ రైతాంగంతో సంబంధాలు ఏర్పరుచుకుంది.

సత్యశోధక్ సమాజ్ బ్రాహ్మణ పురోహితులు చేసే పెళ్లి తంతును తిరస్కరించారు. స్త్రీల కోసం పాఠశాలలను,అనాథలైన స్త్రీలకు ఆశ్రమాన్ని కల్పించారు.అంటరాని వారి కోసం పాఠశాలలను ప్రారంభించింది. మంచి నీటి బావులను వారికి అందుబాటులోకి తెచ్చారు. కుల వ్యవస్థను , అంటరానితనం సమూలంగా నిర్మూలించడం కోసం అనేక ఉద్యమాలు చేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు గుండు కృష్ణమూర్తి, బొడిగ సుదర్శన్,వేముల నరేందర్,కొత్త వెంకటేష్, సారయ్య,ఎడవల్లి చందు, ఉదయ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు

ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాగీరు యాదగిరి గౌడ్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాగీరు యాదగిరి గౌడ్ గురువారం జిల్లా నాయకులు చెరుకు శివయ్య గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు , అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయని అన్నారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సారధ్యంలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చెరుకు శివయ్య గౌడ్, ఈతాప రాములు, గ్రామస్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్స్ లో మైనార్టీ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల రోజులు పవిత్ర రంజాన్ మాసంలో కఠోర దీక్షలు చేసి ,ప్రపంచ మానవాళి సుఖ, సంతోషాల తో ఉండాలని అల్లాహాను ప్రార్ధించిన అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వలిగొండ ఎంపీపీ నూతి రమేష్ రాజ్, ముస్లిం పెద్ద పెద్దలు, యువకులు ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సుంకిశాల గ్రామం నుండి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో బీఆరెస్ పార్టీని వీడి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన వలిగొండ మండలం సుంకిశాల గ్రామ నాయకులు.

వలిగొండ మండలం సుంకిశాల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ జిల్లా నాయకులు చెరుకు శివయ్య గౌడ్ ఆధ్వర్యంలో బీఆరెస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన మాజీ సర్పంచ్ మొగిలిపాక నరసింహ,ఉప సర్పంచ్ కొండల్ రెడ్డి,మాజీ సర్పంచ్ పోలెపల్లి స్వామి,ఎండోమెంట్ డైరెక్టర్ బాల కృష్ణ,మాజీ పాల సంఘం చైర్మెన్ రాచమల్ల శంకరయ్య,పాల సంఘం చైర్మెన్ పరమేష్,ఈతాప రాములు,పోలేపల్లి వీరాస్వామి,బొక్క బుచ్చిరెడ్డి మరియు 200మంది బీఆరెస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారు.

ఎంపీపీ పూస బాల నరసింహ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన బందెల క్రిస్టఫర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు


యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాల నగరం అభివృద్ధి ప్రదాత, ప్రజాసేవ చేయాలని లక్ష్యంతో ముందడుగు వేసి ఇంద్రపాల నగరం గ్రామ సర్పంచిగా గత ఐదు సంవత్సరాలుగా పలు అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి, గ్రామాన్ని ప్రగతి పథంలో లో నడిపించి, రామన్నపేట ఎంపీపీ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రజా నాయకులు పూస బాల నరసింహ కి ఇంద్ర పాలనగరం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బందెల క్రిస్టఫర్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. ఇంద్రపాల నగరం గ్రామానికి వీరి చేసిన సేవలు సేవలు మరువలేమని అన్నారు

ఆడపిల్లలకు రక్షణ కరువు ...కీచక ఉపాధ్యాయుడిని ఉద్యోగం నుంచి తొలగించాలి :ఏఐఎస్ఎఫ్


నేటి సమాజంలో ఆడపిల్లలుగా పుట్టడమే పాపం అయిపోయిందని అమ్మాయిలకు ఎక్కడ రక్షణ లేకుండా పోయిందని, రోజురోజుకు యాదాద్రి భువనగిరి జిల్లాలో అమ్మాయిలపై అఘాయిత్యాలు, కామాంధుల ఆగడాలు పెరుగుతున్నాయని మోత్కూర్ మండల కేంద్రంలో ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ అన్నారు 

దానికి నిదర్శనమే గుండాల మండల కేంద్రంలో జరిగిన సంఘటన 

 విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే వక్ర బుద్ధితో గత కొంతకాలంగా చాక్లెట్లు ఆశ చూపి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన తీరు సభ్య సమాజాన్ని కలిసి వేసిందని అన్నారు కామాంధుడైన అండెం మాధవరెడ్డి పైన పోక్సో కేసు నమోదు చేసి విధుల నుండి తొలగించాలని డీఈఓ,ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ( ఎ ఐ ఎస్ ఎఫ్)గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం 

నిత్యం విద్య సంస్థల్లో అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఇకమీదట ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నత స్థాయి అధికారులు పర్యవేక్షించి విద్యార్థులతో మాట్లాడి వారి యొక్క సమస్యలు తెలుసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం 

         

ఆరోగ్యాన్ని కాపాడుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి: ఏ ప్రదీప్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి

 ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకొని, దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని రామన్నపేట మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జూనియర్ సివిల్ జడ్జి ఏ. ప్రదీప్ అన్నారు. బుధవారం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి లో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆద్వర్యంలో జరిగిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యాధి వచ్చాక చికిత్స చేయించుకోవడం కంటే వ్యాధి రాకుండా తీసుకునే జాగ్రత్తలే ముఖ్యమని ఆయన అన్నారు. కుటుంబ యజమాని అనారోగ్యంతో బాధపడుతుంటే ఆ కుటుంబం మొత్తం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి పోతుందని, తద్వారా దేశ పురోభివృద్ధి కూడా జరగదని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ దురలవాట్లను విడనాడి కుటుంబ అభివృద్ధికి, దేశాభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో రామన్నపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరన్న, రామన్నపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం డి మజీద్, సీనియర్ న్యాయవాదులు నరేందర్ రావు, జినుకుల ప్రభాకర్, ప్యానల్ అడ్వకేట్లు మామిడి వెంకట్ రెడ్డి, డేవిడ్, స్వామి, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జగతయ్య, మొగిలయ్య, వైద్యులు డాక్టర్ శ్వేత ప్రియాంక, డాక్టర్ మాదవా చారి , డాక్టర్ అంఖిత, డాక్టర్ లింగా యాదవ్, డాక్టర్ ముఖిత్, నర్సింగ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, పారా లీగల్ వాలంటీర్ కొడారి వెంకటేష్, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది సాయిదీప్ , వైద్య సేవలకు వచ్చిన ప్రజలు పాల్గొన్నారు.

అమ్మాయిలకేది రక్షణ ...అధికారులు ఏం చేస్తున్నారు: కొడారి వెంకటేష్ ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు

 నేటి సమాజంలో ఆడపిల్లలుగా పుట్టడమే పాపమైపోయిందని, అమ్మాయిలకు ఎక్కడా రక్షణ లేకుండా పోయిందని ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అమ్మాయిలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, కామాందుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు సైతం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆయన ఆరోపించారు. గత ఏడాది కాలంగా అభం శుభం తెలియని అమాయక పిల్లలపై ప్రధానోపాధ్యాయుడే కాటేస్తుంటే మండల విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖ అధికారులు ఏం పర్యవేక్షణ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పిల్లల హక్కుల పరిరక్షణ కోసం, నెల నెలా లక్షల రూపాయలు వేతనాలు తీసుకుంటూ పిల్లల హక్కుల్ని భంగం చేస్తున్నారని ఆయన అన్నారు. గుండాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాధవరెడ్డి చేసిన అఘాయిత్యానికి మొత్తం ఉపాద్యాయ లోకం తలదించుకుని, సభ్య సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భువనగిరి లో పరీక్ష రాస్తున్న సమయంలో ఓ లెక్చరర్ అసభ్య ప్రవర్తన, చౌటుప్పల్ లో తల్లిదండ్రుల వద్ద ఆదమరచి నిద్రపోతున్న చిట్టితల్లిని ఎత్తుకెళ్లి ఓ కామాంధుడు తన కోరిక తీర్చుకోవడం, గుండాల లో విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో తల ఎత్తుకొని నిలబడేలా చేయాల్సిన గురువే, ఆ చిన్నారులతో తన కోరికలు తీర్చుకునే సంఘటనలు చూస్తుంటే,  పిల్లలను చదువులు మాన్పించి, బాల్యవివాహాలు చేసి బాధ్యత తీర్చుకోవడమే మంచిదని తల్లిదండ్రులకు భావన కలుగుతుందని ఆయన అన్నారు. మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడినా, వారితో అసభ్యంగా ప్రవర్తించినా, నిందితులకు ఉరిశిక్షే సరియైన శిక్ష అని ఆయన అన్నారు .భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు , చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

టేకుల సోమవారం లో సెక్యూరిటీ టీం మెంబెర్స్ తో పూట్ పెట్రోలింగ్ నిర్వహించి నేరాల పట్ల అవగాహన కల్పించిన వలిగొండ ఎస్సై మహేందర్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని టేకుల సోమవారం గ్రామంలో సెక్యూరిటీ టీం మెంబెర్స్ తో కలిసి వలిగొండ ఎస్సై డి మహేందర్ మంగళవారం రాత్రి ఫూట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు జరుగుతున్న దొంగతనాలు , చైన్ స్నాచింగ్, సైబర్ నేరాలపట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. అన్ని గ్రామాల్లో టీం సభ్యులు తమ తమ గ్రామాలలో గస్తీ నిర్వహించి ,దొంగతనాలు జరగకుండా చూడాలని అన్నారు .అనుమానం ఉన్న వ్యక్తులు తారాసపడితే వెంటనే సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు చేగూరి మోహన్, చేగూరి బాలకృష్ణ, టి గణేష్ రెడ్డి, చేగూరి మల్లేష్ ఆధ్వర్యంలో యువకులు,తదితరులు పాల్గొన్నారు.