ముస్లిం మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసిన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్
![]()
పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని భువనగిరి పట్టణంలోని వైఎస్ఆర్ గార్డెన్లో బి ఆర్ ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎంపీ అభ్యర్థి మల్లేష్ మాట్లాడుతూ తెలంగాణ లో గంగ జమున తహేజీబ్ కొనసాగుతుందని తెలంగాణ హిందూ ముస్లిం భాయ్ భాయ్ లాగా ఉంటారని ముఖ్యంగా పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా ముస్లిం మైనారిటీ లకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం
ఆనవయితీగా వస్తుందని అన్నారు.అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీ లకు ఓటు బ్యాంకు గా పరిగననిస్తుందని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం లో మైనారిటీ లను అన్ని విధాలుగా ఆదుకోవడం జరిగిందని అన్నారు.ముస్లిం మైనారిటీ లకు రంజాన్ తోఫా మరియు ఇతర సౌకర్యాలు కల్పించలేని అసమర్ధత ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అని అన్నారు.మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి భువనగిరి నియోజకవర్గం ముస్లిం మైనారిటీ లకు అన్ని విధాలుగా ఆదుకున్నారని అన్నారు. అలాగే ప్రతి ముస్లిం కుటుంబం సుఖ సంతోషాలతో ఈదుల్ ఫిత్ర్ రంజాన్ పండుగ ను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, భువనగిరి జెడ్పిటిసి సుబ్బూరు భీరు మలయ్య,
కోఆప్షన్ సభ్యులు అఫ్జల్ నిక్కత్ ఇక్బాల్ చౌదరీ.ఎండీ ముజీబ్ ఇస్మాయిల్,ఎండీ ముజీబ్,ఎండీ రహీం ఎండీ అంజద్ గఫ్ఫార్.పట్టణ అధ్యక్షులు కిరణ్ కుమార్ కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, వీరేష్ లు పాల్గొన్నారు.

						

 ప్రముఖ కవి రెబ్బ మల్లికార్జున్  ను ఉగాది కవి సమ్మేళనంలో ఘనంగా సన్మానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రచయిత సంఘం మరియు భువన భారతి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో "శ్రీ క్రోధి" నామ సంవత్సర ఉగాది వేడుకల జిల్లా స్థాయి కవి సమ్మేళనంను స్థానిక సోమసీతా రామ ఫంక్షన్ హాల్ రాయగిరిలో ఏర్పాటు చేశారు. ఈ కవి సమ్మేళనంలో రెబ్బ మల్లికార్జున్ పాల్గొని తన కవితా గానం చేసి, పలువురి ప్రముఖ కవుల ప్రశంసలందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి చేతుల మీదుగా రెబ్బ మల్లికార్జున్ కి శాలువా, మెమోటో, ప్రశంసపత్రం అందజేసి ఘనంగా సన్మానించి, అభినందనలు తెలియజేశారు.


యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పురస్కారాలు మోత్కూరి విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. మోత్కూరు పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో ట్రస్ట్ అధ్యక్షులు మోత్కూరి బ్రహ్మ ఆచార్య అధ్యక్షతన అవార్డుల ప్రధాన ఉత్సవం కొనసాగింది. నిస్వార్ధంగా సమాజ సేవ చేస్తున్న ప్రజా సేవకులను గుర్తించి మోత్కూరి విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ఉగాది పురస్కారాలు ప్రధానం చేయడం అభినందనీయమని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గుర్రం లక్ష్మీ నరసింహ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మోత్కూరు నరహరి తెలుగు ప్రాత్య కళాశాల విశ్రాంత ప్రధాన చార్యులు, గుర్రం కవిత లక్ష్మీనరసింహారెడ్డి మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ ఎస్ ఎన్ చారి రాష్ట్ర ఉత్తమ గ్రామీణ విలేఖరి ముఖ్య అతిథులుగా పాల్గొని పురస్కారాలు అందజేశారు. ట్రస్టు కార్యకలాపాలు మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో విస్తరించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులను సన్మానించారు.
ఈ దేశంలో ప్రేరేపిస్తూ దేశంలో మత చిచ్చు రేపుతున్న మతోన్మాదులను వారి ఆలోచన విధానాలను వారి వల్ల ఈ దేశానికి జరిగేటువంటి నష్టాన్ని ప్రజలందరూ గమనించాలి.ఒకవైపు హిందూ రాష్ట్ర హిందువుల కోసం అని ప్రచారం చేస్తూ దేశమంతగా కార్పొరేటీకరణను వేగవంతం చేయడం హిందుత్వ ఫాసిస్టుల వ్యూహం. అందుకే దేశంలోని సమస్త ప్రజల సంపద కార్పొరేట్ల పరం అవుతుంది. గతంలో ఎన్నడూ లేనంతగా పబ్లిక్ ఆస్తులన్నీ ప్రైవేటీకరణ పేరుతో అమ్మి వేస్తున్నారు. ఈ దేశ ప్రాకృతిక వనరుల మీద ఎటువంటి అధికారం ఉండదు. ఇవన్నీ పెట్టుబడిదారీ కార్పొరేట్ శక్తుల సంపదను పెంచడానికే తప్ప సాధారణ ప్రజల కోసం కాదు అని అన్నారు.
Apr 07 2024, 21:01
- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
0- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
17.8k