/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TS: టెన్త్ ఎగ్జామ్స్.. విద్యాశాఖ కీలక నిర్ణయం Mane Praveen
TS: టెన్త్ ఎగ్జామ్స్.. విద్యాశాఖ కీలక నిర్ణయం

తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాపీయింగ్ నివారణకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాలు ఇవ్వగానే ప్రతి పేజీపై విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ రాయాలని పేర్కొంది. ఇలా చేస్తే ప్రశ్నపత్రాలు తారుమారు కాకుండా ఉంటాయని తెలిపింది. కాపీయింగ్ కు పాల్పడిన వారిని డిబార్ చేస్తామని, ఇందులో సిబ్బంది పాత్ర ఉంటే యాక్ట్-25, 1997 సీసీఏ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

NLG: మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినుల క్షేత్ర పర్యటన

నల్గొండ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లైఫ్ సైన్సెస్ విభాగానికి చెందిన 109 మంది విద్యార్థినిలు జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం , సూక్ష్మజీవ శాస్త్రం మరియు గ్రంథాలయ శాస్త్ర విభాగం సంయుక్త ఆధ్వర్యంలో, శనివారం ఏర్పాటు చేసిన క్షేత్ర పర్యటన లో భాగంగా చర్లపల్లి దగ్గర గల అంజన శ్రీ నాచురల్ ఫామింగ్ క్షేత్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఈ క్షేత్రాన్ని నిర్వహిస్తున్న వై.అంజిరెడ్డి విద్యార్థినిలకు వారి క్షేత్రంలో పెంచుతున్న వివిధ మొక్కలు, జంతువుల గురించి, సమీకృత వ్యవసాయం గూర్చి, జీవ వైవిధ్య ప్రాముఖ్యత గూర్చి వివరంగా తెలియ జేశారు. అంతే కాకుండా రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడకుండా సహజ పద్దతుల ద్వారా పంటలను ఎలా పెంచుతారో విద్యార్థులకు వివరించారు. తన క్షేత్రంలో పెంచుతున్న గొర్రెలు, వివిధ రకాల దేశవాళీ కోళ్ళ పెంపకం మరియు వాటి నిర్వహణ గూర్చి విద్యార్థినిలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో లైఫ్ సైన్సెస్ విభాగాల అధిపతులు డా. కె.శ్రీనివాస రెడ్డి (వృక్షశాస్త్రం), డా.రావిరాల నరేష్ (జంతుశాస్త్రం), కె.దేవవాణి (సూక్ష్మ జీవ శాస్త్రం), అద్యాపకులు జె.స్వామి, ఎ.సంధ్య, జి.సరిత, మిస్కిన్ తరన్నుమ్, కె.వనజ, పి.సునీత, అతుఫా మరియు లైబ్రరీ విభాగ అధిపతి సుంకరి రాజారామ్ తదితరులు పాల్గొన్నారు.

NLG: ఎన్నికల కోడ్ విధులు చేపడుతున్న గ్రామపంచాయతీ సిబ్బంది

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో.. మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి గుర్రం ఉమాదేవి సూచనల మేరకు.. గ్రామపంచాయతీ సిబ్బంది ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా, బహిరంగ ప్రదేశాలలో ఉన్న పలు రాజకీయ పార్టీలకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు తొలగిస్తున్నారు. అదేవిధంగా అభివృద్ధి పనుల శిలాఫలకాలను కప్పివేస్తున్నారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది కందికంటి స్వామి పాల్గొన్నారు.

NLG: ప్రవస్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ లు పంపిణీ

నల్లగొండ: పట్టణంలో ప్రవస్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ బండారు కవిత గిరిధర్ ఆధ్వర్యంలో, కేంద్రీయ విద్యాలయంలో ప్రైమరీ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్, పెన్సిల్, స్కేల్, రబ్బర్ మరియు బిస్కెట్ ప్యాకెట్ పంపిణీ చేశారు. 

ప్రవస్తిక ఫౌండేషన్ చైర్మన్ బండారు కవిత గిరిధర్ మాట్లాడుతూ.. మా కుమార్తె ప్రవస్తిక, ఇదే కేంద్రీయ విద్యాలయంలో గత సంవత్సరం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూ ఉండేది. గత సంవత్సరం మార్చి 19న అనారోగ్య కారణంగా ఆకస్మికంగా మరణించింది. ఆమె జ్ఞాపకార్థం ఆమె పేరు మీద ప్రవస్తిక ఫౌండేషన్ స్థాపించి, మా సొంత ఖర్చులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రవస్తిక తల్లిదండ్రులు కవిత గిరిధర్, పాఠశాల ప్రిన్సిపాల్ జి. శ్రీనివాసులు, విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

NLG: లక్కీ డ్రా లో ఒకటో తరగతి అడ్మిషన్ కు ఎంపికైన చిన్నారి ఆరాధ్య

నల్లగొండ: జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చిన్నారి చిట్యాల ఆరాధ్య.. హైదరాబాద్ రామంతపూర్ పబ్లిక్ స్కూల్లో అడ్మిషన్ పొందింది. ఇటీవల ఎస్సీ కార్పొరేషన్ తరఫున 43 మంది విద్యార్థులు అప్లై చేసుకోగా లక్కీ డ్రా పద్ధతిలో ఆరాధ్య ఎంపికైంది. ఆమెతోపాటు మరో విద్యార్థిని కూడా ఎంపిక చేశారు. అదేవిధంగా బేగంపేట పబ్లిక్ స్కూల్ కు ఒక విద్యార్థిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆరాధ్య తల్లిదండ్రులు కవిత గోపాల్ మాడుగుల పల్లి మండలం, కల్వల పాలెం వాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సీ పేద విద్యార్థులకు ఎస్సీ కార్పొరేషన్ ఈ అవకాశం కల్పించింది.

NLG: పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని ఆశా వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం

మర్రిగూడ: మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్స్ యూనియన్, సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆశ వర్కర్స్ సమస్యలపై, లెప్రసీ సర్వే బిల్లుల చెల్లింపు గురించి, పీహెచ్సీలో డాక్టర్ ప్రణయ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ఆశా వర్కర్స్ గత ప్రభుత్వం ఆదేశించినటువంటి సర్వేను అనేక కష్టనష్టాలను కోర్చి జయప్రదంగా నిర్వహించారు, కానీ వారికి గత రెండు సంవత్సరాలు లెప్రసీ సర్వే పెండింగ్ బిల్లు ఇవ్వలేదు. సర్వే చేసిన బిల్లు లు రాలేదు, మళ్లీ ఇప్పుడు సర్వే చేస్తున్నాము. కాబట్టి పెండింగ్ బిల్లు వెంటనే ఇవ్వాలని, లెప్రసీ సర్వే చేసే టైము ను మార్చాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు నాయకురాలు ఏర్పుల పద్మ, పగడాల బాలమణి, ఆంబోతు రోజ తదితరులు పాల్గొని వినతి పత్రం అందజేశారు.

NLG: పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, జామెట్రీ బాక్స్ అందజేసిన డా.కృష్ణ చైతన్య

నల్గొండ: పట్టణంలోని పాతబస్తీ జేబీఎస్ ఉన్నత పాఠశాలలో ఈరోజు సింధూర హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డా.కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో, 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, జామెట్రీ బాక్స్ అందజేశారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులు దాతలు అందించిన సహకారంతో చదువుల యందు శ్రద్ద ఆసక్తులను కనబర్చి , సమయాన్ని వృధా చేసుకోకుండా మంచి మార్కులు సాధించి ఉన్నత స్థానంలో నిలవాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు నిమ్మల నిర్మల్ రెడ్డి, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

NLG: శివన్నగూడెం లో పోషణ పక్వాడ కార్యక్రమం

NLG: శివన్నగూడెం లో పోషణ పక్వాడ కార్యక్రమం

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండలం, శివన్నగూడెం గ్రామంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సిరిధాన్యాలు, పూర్వ ప్రాథమిక విద్య పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

6 సం.లోపు పిల్లలకు మెదడు అభివృద్ధి 80% వరకు ఉంటుందని, ఈ వయసులో పూర్వ ప్రాథమిక విద్య, పౌష్టికాహారం చాలా అవసరం అని తెలిపారు. సూపర్వైజర్ పద్మ అంగన్వాడీ టీచర్లు విజయశ్రీ, సువర్ణ, అనసూర్య, తదితరులు పాల్గొన్నారు.

NLG: తెలంగాణ కళావేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కంజర శ్రీను

నల్లగొండ జిల్లా: 

తెలంగాణ కళావేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నల్లగొండ జిల్లాకు చెందిన కంజర శ్రీను ను నియమించారు. ఈ సందర్భంగా కంజర శ్రీను మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో ఇంతటి బాధ్యతను అప్పగించి, తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు నకిరేకంటి కిరణ్ కుమార్ మరియు తెలంగాణ కళావేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షులు పందిరి సైదులు, తోటి కళాకారులకు ధన్యవాదాలు అని తెలిపారు.

TG: భువనగిరి పార్లమెంటు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థిగా నూనె వెంకట్ స్వామిని ప్రకటించిన బి.ఎల్.ఎఫ్ రాష్ట్ర కమిటీ

బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బి.ఎల్.ఎఫ్.) తరఫున ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామిని, శుక్రవారం భువనగిరి పార్లమెంటు బిఎల్ఎఫ్ అభ్యర్థిగా పోటీలో ఉండనున్నారని బి.ఎల్.ఎఫ్. రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్య ప్రకాష్ ప్రకటించారు

ఈరోజు హైదరాబాదులోని ఓంకార్ భవన్లో జరిగిన బిఎల్ఎఫ్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణ, ఆధిపత్య పార్టీ లను ఓడించి, కార్మిక వర్గ ప్రయోజనం కోసం, అట్టడుగు వర్గాల అణచివేతకు వ్యతిరేకంగా ముందుండి పోరాడుతున్న బిఎల్ఎఫ్.. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలకు పోటీ చేయనున్నదని తెలిపారు. ప్రస్తుతం ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నామని,

భువనగిరి పార్లమెంట్ కు ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి,

నల్లగొండ పార్లమెంటుకు ఎంసిపిఐ కేంద్ర కమిటీ సభ్యుడు వస్కుల మట్టయ్య,

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి ఎం సి పి ఐ రాష్ట్ర నాయకుడు వనం సుధాకర్,

జహీరాబాద్ నియోజకవర్గానికి బి ఎల్ పి రాష్ట్ర నాయకుడు వడ్ల సాయి కృష్ణ చారి,

నిజామాబాద్ నియోజకవర్గానికి బిఎల్పి రాష్ట్ర నాయకుడు అబ్బగాని అశోక్ గౌడ్

పార్లమెంట్ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో తమ యొక్క అభ్యర్థులుగా పోటీలో ఉంటారని బహిరంగంగా ప్రకటిస్తున్నామని, త్వరలో మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాలకు కూడా తమ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో ఎం సిపిఐ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్, ఎం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, బి ఎల్ పి రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు దండి వెంకట్, బిసిపి రాష్ట్ర కార్యదర్శి కే పర్వతాలు, వర్కర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాయబడి పాండురంగ చారి, ప్రజా పోరాట సమితి రాష్ట్ర నాయకులు ఉయ్యాల లింగ స్వామి గౌడ్, అరూరి సత్తయ్య ప్రజాపతి, మోతె చంద్రమౌళి కురుమ, గార లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.