/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ బదిలీ Mane Praveen
NLG: స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ బదిలీ

నల్లగొండ: స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న హేమంత్ కేశవ్ పాటిల్ ను హైదరాబాద్ కు అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) గా బదిలీ చేసింది. అయితే ఇంకా వారి స్థానంలో ఎవరిని నియమించలేదు.

NLG: సంత్ సేవాలాల్ 285 జయంతి ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

గిరిజన అభివృద్ధి శాఖ మరియు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గం, నారాయణ పూర్ మండల కేంద్రంలో, శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 285 జయంతి ఉత్సవాలలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు గిరిజన సాంప్రదాయంలో గిరిజనులు, గిరిజన అభివృద్ధి శాఖ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సాంప్రదాయ గిరిజన తలపాగా ను ఆయనకు చుట్టి సన్మానించారు.

NLG: రాహుల్ గాంధీకి, సిఎం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ చిత్రపటాలకు పాలాభిషేకం

నల్లగొండ జిల్లా:

కాంగ్రెస్ మరో రెండు గ్యారెంటీ లు అమలులోకి వచ్చిన సందర్భంగా, ఈ రోజు మర్రిగూడ మండలంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీకి, సిఎం రేవంత్ రెడ్డి, కోమిటిరెడ్డి బ్రదర్స్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతర్ యాదయ్య, బుచ్చి నాయక్, మారగోని వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ యువనేత అల్వాల్ రెడ్డి , కొండల్, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.

NLG: మార్చి 1 ,2 ,3 తేదీలలో ఆర్య సమాజం మహాసభలు

నల్లగొండ: ఆర్య సమాజం స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆర్య ప్రతినిధి సభ సౌజన్యంతో మహర్షి దయానంద సరస్వతి ద్విషత జయంతి మహాసభలు ఈనెల 1, 2, 3 ,తేదీలలో పట్టణంలో ఆర్యసమాజ మహాసభలు నిర్వహిస్తున్నట్లు మహాసభ నిర్వాహకులు కృష్ణారెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఈ మహాసభలలో స్వామి రాందేవ్ హాజరవుతున్నట్లు తెలిపారు. 

NLG: ఉమెన్స్ కాలేజీలో' 'జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు"

నల్లగొండ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో లైఫ్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో 'జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు" నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు జాతీయ సైన్స్ దినోత్సవ ప్రాముఖ్యత ను గూర్చి విద్యార్థినిలకు వివరించారు. పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. 

ప్రిన్సిపల్ డా.ఘన్ శ్యామ్, సూక్ష్మజీవ విభాగాధిపతి దేవవాణి, జంతుశాస్త్ర విభాగాధిపతి రావిరాల నరేష్, అధ్యాపకులు స్వామి, సంధ్య, సమత, మిస్కిన్, సరిత, సునిత, అతూఫా మరియు విద్యార్థినిలు పాల్గొని విజయవంతం చేశారు.

NLG: ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ: ఈ నెల 28 నుంచి మార్చి 19 వ తేదీ వరకు నిర్వహించే, ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్ధులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల సమీపంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.

పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్, ఇంటర్ నెట్ సెంటర్స్, అన్ని మూసి వేయాలని ఆదేశించారు. పరీక్షా సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుమికూడరాదని, ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించ కూడదని పేర్కొన్నారు. అభ్యర్ధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్ష నిర్వహణకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.

NLG:చాయసోమేశ్వరాలయం వద్ద వర్క్ షాప్

నల్లగొండ: పానగల్ లో గల ఛాయా సోమేశ్వరాలయం వద్ద విజ్ఞాన భారతి ఎన్జీవో ఆధ్వర్యంలో, ఆప్టిక్స్ పై వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డి.ఆర్.డి.ఓ. శాస్త్రవేత్తలు జి.ఎన్ రావు, శ్రీ లక్ష్మీ మూర్తి హాజరై, విద్యార్థులకు ఛాయా సోమేశ్వర ఆలయంలో శివలింగంపై ఛాయా ఏ విధంగా పడుతుంది, అలా ఎందుకు జరుగుతుందనే కోణంలో ప్రయోగాత్మకంగా వివరించి విద్యార్థుల చేత అనేక ప్రయోగాలు చేయించడం జరిగింది. వారు మాట్లాడుతూ.. భారతీయ జీవిత విధానం ప్రతిదీ సైన్స్ తో ముడిపడిందని, ప్రతి గుడిలో సైన్స్ ఉందని వారు అన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నల్లగొండ డీఈవో బిక్షపతి మాట్లాడుతూ.. ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదువుకొని సైన్స్ లో పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలయ్యి దేశానికి సేవ చేయాలని అన్నారు.

ఎస్.పి.ఆర్ విద్యాసంస్థల చైర్మన్ నన్నూరి రాంరెడ్డి, ఎం వి ఆర్ విద్యాసంస్థల చైర్మన్ కొలనుపాక రవికుమార్, న్యూస్ విద్యాసంస్థల చైర్మన్ గంట్ల అనంత రెడ్డి, అక్షర విద్యాసంస్థల చైర్మన్ పోలోజు నాగేందర్, సిల్వర్ మూన్ విద్యాసంస్థల చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్లు తిరుమలగిరి కృష్ణవేణి విద్యాసంస్థల చైర్మన్ బత్తిని నగేష్ , చిట్యాల కృష్ణవేణి విద్యా సంస్థల చైర్మన్ కన్నెబోయిన శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

NLG: ప్రతి వాహనాన్ని మంచి కండీషన్ లో ఉండే విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి: ఎస్పీ చందనా దీప్తి


నల్లగొండ: ప్రతి వాహనాన్ని మంచి కండీషన్లో ఉండే విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి: ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ: ప్రతి వాహనాన్ని మంచి కండీషన్లో ఉండే విధంగా జాగ్రత్తగా చూసుకోవాలని జిల్లా ఎస్పి చందన దీప్తి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ వాహనాలను తనిఖీ కార్యక్రమంలో అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో గల పోలీస్ వాహనాలు నిరంతరంగా వివిధ ప్రజాసేవలకు వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నూతన వాహనాలను సమకూర్చడంలో మరియు ఎలాంటి ఆటంకం కలగకుండా సాఫీగా ప్రజా సేవలు కొనసాగిస్తున్నాయని తెలిపారు.

వాహనాల నిర్వహణ లోటు పాట్లపై నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని, క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి సమగ్ర నివేదికను నెలవారీగా సమర్పించాలని, మోటార్ వాహనాల అధికారి కి తెలియజేశారు. వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంచి కండిషన్లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లకు ఆదేశించినారు. పోలీసు అధికారుల ఆధీనంలో ఉన్న వాహనాలను సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, సొంత వాహనంలా మంచి కండిషన్లో ఉంచి ఎప్పటికప్పుడు సర్వీసింగ్, ఇంజన్ ఆయిల్, టైర్ల నిర్వహణ ఉత్తమ ప్రమాణాలను పాటించుకుంటూ డ్రైవర్లకు నిర్వహణపై ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించాలని తెలిపారు.

NLG: టి జి సి జి టి ఏ నూతన డైరీ ఆవిష్కరణ

నల్లగొండ: తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ గేజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ అడ్మిషన్ క్యాంపెయిన్ పోస్టర్ మరియు నూతన డైరీ ఆవిష్కరణ, ఈరోజు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డాక్టర్ గన్ శ్యామ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సుంకరి రాజారామ్ మాట్లాడుతూ.. సంఘ సభ్యులకు ఈ డైరీ ఎంతో ఉపయోగకరమని, దీనిలో సంఘ అధ్యాపకులకు సంబంధించిన విలువైన జీవోలు పొందుపరచడం జరిగిందని తెలిపారు. ప్రతి ప్రాథమిక సభ్యునికి ఎంతో ఉపయుక్త కరంగా ఈ నూతన డైరీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టి జి సి జి టి ఏ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ సయ్యద్ మునీర్, వైస్ ప్రెసిడెంట్, టి భాస్కర్ రెడ్డి, యూనివర్సిటీ కోఆర్డినేటర్ యాదగిరి రెడ్డి సభ్యులు నరేష్, స్వామి, మంజుల, అపర్ణ, అరుణ తదితరులు పాల్గొన్నారు.

NLG: ఆర్థికపరమైన అంశాలపై అవగాహన కోసం 2 కే రన్.

నల్లగొండ: ఆర్థికపరమైన అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించే నిమిత్తం, ఆర్ బీ ఐ ఆదేశాల మేరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ భారియా తెలిపారు. జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ వద్ద లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో, ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలపై ఏర్పాటు చేసిన 2 కె రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడంతోపాటు, ప్రతి ఒక్కరిని ఆర్థిక అంశాల పట్ల సాధికారత కల్పించే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈనెల 26 నుండి మార్చి 1 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా యువతపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతున్నదని, ప్రజలు బ్యాంకు కార్యకలాపాలపై పూర్తి అవగాహన కలిగి ఉండడంతో పాటు, బ్యాంకు ఖాతాను ఎలా ప్రారంభించాలి? ఏదైనా అనుమానాస్పద నంబర్ నుంచి మెసేజ్ లేదా కాల్స్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆర్థికంగా ఇబ్బందులకు గురికాకుండా చేపట్టే చర్యలు, తదిత అంశాలపై ఈ వారోత్సవాలలో వివరించడం జరుగుతుందని తెలిపారు.

ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం నిరంతరం చేస్తున్నప్పటికీ ప్రత్యేకించి ఈ వారం రోజుల పాటు ,అన్ని బ్యాంకులు ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఎస్ బి ఐ రీజినల్ మేనేజర్ అలీముద్దీన్, ఎల్డీఎం శ్రామిక్, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్, సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, మెప్మా పిడి కరుణాకర్ ,యూబీఐ చీఫ్ మేనేజర్ రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.