/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz నేడు బిజెపి పార్టీ అభ్యర్థుల తుది జాబితా? Yadagiri Goud
నేడు బిజెపి పార్టీ అభ్యర్థుల తుది జాబితా?

భారతీయ జనతా పార్టీ బీజేపీ జనసేన మధ్య పొత్తులు, సీట్ల సర్దుబాటు వ్యవహారం దాదాపు కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. పొత్తుల్లో భాగంగా జనసేనకు 9 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అగ్రనాయకత్వం అంగీకరించినట్టు తెలిపారు.

అయితే జనసేన మరిన్ని సీట్లు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరో రెండు సీట్లు పెంచి గరిష్టంగా 11 సీట్ల వరకు ఇవ్వడానికి కూడా కమలదళం సిద్ధపడినట్టు సమాచారం.

బీజేపీతో పొత్తుల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆంధ్ర ప్రాంత ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్న కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ వంటి స్థానాలను తమకు కేటాయించాలని జనసేన కోరుతుండగా.. కూకట్‌పల్లిని జనసేనకు కేటాయించేందుకు బీజేపీ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దులు పంచుకున్న ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిగతా స్థానాలను కేటాయించే అవకాశం ఉంది.

బీజేపీ జాబితా ఎప్పుడు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మిగిలింది 29రోజులే!. అందుకే, ప్రధాన పార్టీలన్నీ స్పీడ్‌ పెంచాయి!.. ఒకవైపు ప్రజా ఆశీర్వాద సభలతో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దూసుకుపోతుంటే, మరోవైపు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వరుస పర్యటనలతో తెలంగాణపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు.

ఇక, బీజేపీ కూడా దూకుడు పెంచింది. పెండింగ్‌ సీట్లకు అభ్యర్ధుల్ని ప్రకటించి ప్రచారంలో స్పీడ్‌ పెంచేందుకు రెడీ అవు తోంది.ఈ రాత్రికి తుది జాబితా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది.

బీజేపీ. ఈ సాయంత్రం ఢిల్లీలో సమావేశం కాబోతున్న బీజేపీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ… ఫైనల్‌ లిస్ట్‌ను ఖరారు చేయ బోతోంది. అలాగే, జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటుపైనా నిర్ణయం తీసుకోనుంది బీజేపీఅధిష్టానం...

కెసిఆర్ ను గద్దె దించాలన్నదే నా లక్ష్యం : వివేక్ వెంకటస్వామి

బీజేపీ పార్టీ భారీ షాక్ తగిలింది. బీజేపీ నేత మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన కుమారుడు వంశీకి చెన్నూర్ అసెంబ్లీ టికెట్ ను కేటాయించాలన్న హామీ పై హస్తం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… సోనియా, మల్లిఖార్జున్ నాయకత్వం బలోపేతం కోసం వివేక్ పార్టీలో చేరారని చెప్పారు. కీలక సమయంలో వివేక్ పార్టీలో చేరారన్నారు. వారి చేరికతో వెయ్యి ఏనుగుల బలం చేకూర్చిందని వ్యాఖ్యానించారు.

రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వివేక్ చేరిక తెలంగాణకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను గద్దె దించాలనే లక్ష్యంతోనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా వివేక్ వెంకటస్వామి ప్రకటించారు.

తెలంగాణ సాధన కోసం ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు పోరాటం చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు.కేసీఆర్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. అందరం కలిసికట్టుగా కేసీఆర్ ను గద్దె దింపాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. తామంతా కలిసికట్టుగా ఈ పోరాటంలో పాల్గొంటామని వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు...

బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు పోలీస్ భద్రత

తాజాగా దుబ్బాక లో అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తి దాడి నేపథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది.

ఈ మేరకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత పెంచుతూ ఇంటెలిజెన్స్‌ ఏడీజీ అనిల్‌కుమార్‌ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం 2+2 భద్రతను 4+4గా పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు భద్రతను తక్షణమే పెంచాలని ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలోని అన్ని యూనిట్ల అధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు...

నేడు తెలంగాణకు ఈసీ బృందం

ఎన్నికలు గడువు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షించనుంది. ఇందుకు ఈసీ బృందం నేడు తెలంగాణకు రానుంది..

సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు సతీశ్ వ్యాస్, ధర్మేంద్ర శర్మతో కూడిన బృందం మూడు రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనుంది.

ఈసీ బృందం…రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, అధికారులతో సమావేశం కానుంది. ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీయనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఇతర అధికారులతో కూడా సమావేశం కానున్నారు.

అనంతరం ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల అధికారులతో సమావేశం కానుంది. తనిఖీలు, స్వాధీనాలపై సమీక్ష నిర్వహించనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల సీఎస్. డీజీపీల, అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు.

ఎన్నికలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సరిహద్దుల్లో చెక్ పోస్టులు, తనిఖీలు తదితర అంశాలపైచర్చిస్తారు...

నేడు కాంగ్రెస్ తుది జాబితా రిలీజ్? వామపక్షాలకు ఎన్ని సీట్లు?

ఇవాళ ఫైనల్ జాబితా రిలీజ్ అవ్వొచ్చనే అంచనా ఉన్నా.. ఇవాళ తెలంగాణకు ప్రియాంక గాంధీ వస్తుండటం వల్ల.. నేతలు ఆమె పర్యటన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. అందువల్ల ఇవాళ లిస్ట్ రిలీజ్ చేస్తారా చెయ్యరా అన్నది సస్పెన్స్‌గా మారింది. పైగా సీపీఎం, సీపీఐలకు ఎన్ని స్థానాలు ఇవ్వాలనేది కూడా తేల్చాల్సి ఉంది. ఈ పార్టీలు చెరో రెండు స్థానాలు కోరుతున్నాయి. కాంగ్రెస్ చెరో స్థానం ఇవ్వాలనుకుంటోంది. ఖమ్మం జిల్లాలో భద్రాచలం లేదా.. వారా లేదా ఇల్లెందు స్థానం ఇవ్వాల్సిందేనని సీపీఎం కోరుతోంది. ఈ స్థానాల్లో దేనినీ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. ఈ విషయాన్ని తేల్చే బాధ్యత సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై పడింది..

మరో సీటుగా మిర్యాలగూడ స్థానాన్ని సీపీఎం కోరుతోంది. దాన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్ ఆసక్తిగానే ఉంది. మిర్యాలగూడతోపాటూ.. మరో స్థానాన్ని ఖమ్మంలో ఇవ్వాలని కోరుతుండటం కాంగ్రెస్‌కి సమస్యగా మారింది..

సీపీఐకి ఖమ్మంలోని కొత్తగూడెం ఇస్తారని తెలుస్తోంది. ఐతే.. ఈ పార్టీ చెన్నూరును కూడా అడుగుతోంది. దీన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. ఇవాళ ఏదో ఒకటి తేలిపోతే, తమవైపు నుంచి లిస్ట్ రిలీజ్ చెయ్యాలని కాంగ్రెస్ భావిస్తోంది. మంగళవారం లేదా బుధవారం లిస్ట్ రిలీజ్ చెయ్యాలనుకుంటోంది. ఐతే.. వామపక్షాలతో సానుకూలంగానే వ్యవహరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. పొత్తు చెడిపోయే పరిస్థితి రాదని అంటున్నారు. అందువల్ల కాంగ్రెస్ రాజీ పడి 4 స్థానాలను వారికి ఇస్తుందా లేక.. రెండే ఇచ్చి.. పంతం నెగ్గించుకుంటుందా అన్నది ఇవాళో, రేపో తెలుస్తుంది..

CM KCR : ఇవాళ మూడు బహిరంగ సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్..

CM KCR will participate in three public meetings today

ఉమ్మడి నల్గొండ జిల్లాలలో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ముందుగా హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ సభలకు హాజరుకానున్నారు. ఈ తరుణంలో మూడు నియోజకవర్గాలలో సభా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి..

ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, నల్లమోతు భాస్కరరావు, రమావత్ రవీంద్ర కుమార్, దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అన్ని సభలలో 70 నుంచి లక్ష మంది వరకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు నాయకులు..

దేశంలో కేజీ ఉల్లి సగటు ధర రూ.50

దిల్లీ: దేశంలో ఉల్లిపాయల అధిక ధరలు కొనసాగుతున్నాయి. రాజధాని దిల్లీలో కేజీ ఉల్లి చిల్లర ధర రూ.78 పలుకుతుండగా, దేశవ్యాప్తంగా సగటు కనిష్ఠ ధర రూ.50.35గా ఉంది..

గరిష్ఠంగా రూ.83 ఉంది. ఈ క్రమంలో విదేశాలకు ఎగుమతి చేసే ఉల్లిపై టన్నుకు కనీస ఎగుమతి ధర 800 డాలర్లను విధించాలని కేంద్రం నిర్ణయించింది. డిసెంబరు 31వరకు ఈ విధానాన్ని అమలు చేయనుంది..

ఎగుమతులను నిరుత్సాహపరిచి దేశీయ మార్కెట్‌లో తగినంత సరుకును అందుబాటులో ఉంచేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఆహారం, వినియోగదారుల వ్యవహారాలశాఖ ఒక ప్రకటనలో తెలిపింది..

ఏపీ స్కిల్ కేసులో నేడు కీలకం.. చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ వస్తుందా?

అమరావతి: 50 రోజులుగా ఆయన జైలులోనే గడుపుతున్నారు..

ఆయన తరపు లాయర్లు ఏపీ హైకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేశారు..

దానిపై ఆల్రెడీ వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది..

ఇవాళ ఈ తీర్పును వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు..

అందువల్ల ఇవాళ మధ్యంతర బెయిల్ వస్తుందా రాదా అనేది చర్చగా మారింది..

విశాఖ రాజధానిపై నేడు సీఎం జగన్‌ సమీక్ష

గుంటూరు: విశాఖపట్నం రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మంగళవారం తాడేపల్లిలో సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఈ సమీక్ష జరగనుంది..

ఏపీకి అతిత్వరలో పాలనా రాజధాని కానుంది వైజాగ్‌. ఇప్పటికే సీఎం క్యాంప్‌ కార్యాలయానికి సంబంధించిన పనులు పూర్తి కావొచ్చాయి. అలాగే.. అక్కడ ఉన్నతాధికారులకు తాత్కాలిక వసతి కేటాయింపులపై అధికారులతో సీఎం జగన్‌ ఇవాళ్టి సమీక్షలో చర్చించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్రీమెన్‌ కమిటీ, ఆయనకు సమర్పించనుంది..

నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రాక?

తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. విస్తృత పర్యటన చేస్తూ రోజుకు రెండు మూడు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ కూడా బహిరంగ సభలు, రాహుల్, ఖర్గేలతో కార్నర్ మీటింగ్‌లో సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ ప్రియాంకగాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

ఇక బీజేపీ కూడా ఇటీవల కేంద్ర అమిత్ షాతో సూర్యాపేటలో సభ నిర్విహించింది. పూర్తి స్థాయి అభ్యర్థుల ప్రకటన తర్వాత అగ్రనేతలు, కేంద్ర మంత్రులతో సభలకు ప్లాన్ చేస్తుంది.

ఇక ఎన్నికలకు సరిగ్గా నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని చూస్తుంది. అందులో భాగంగా ఆయనకు పార్టీ తరపున హెలికాప్టర్‌ను కేటాయించినట్లు తెలిసింది

బీజేపీ తెలంగాణ స్టార్ క్యాంపెయినర్‌ హోదాలో ఆయనకు ఈ అవకాశం కల్పించినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా బండి సంజయ్‌కి ఉన్న ఫాలోయింగ్‌ను పార్టీకి ఉపయోగపడేలా అధిష్టానం ప్రణాళిక రచించినట్లు అర్థమవుతోంది.

రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో జీహెచ్‌ఎంసీతో పాటు దుబ్బాక, హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో విజయాలు సాధించిన క్రెడిట్ సంజయ్‌కి ఉంది. కార్యకర్తల్లోనూ ఆయన మాస్ ఇమేజ్ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే పలు బహిరంగ సభల్లో బండి సంజయ్ పాల్గొనేందుకు త్వరగా సభలకు చేరుకునేందుకు ఆయనకు హెలికాప్టర్ కేటాయించింది.

సంజయ్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌తో పాటు మరొకరికి కూడా హెలికాప్టర్లు కేటాయించినట్లు సమాచారం.