/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Crime news | నల్లగొండ జిల్లాలో దారుణం..గంజాయి మత్తులో స్నేహితుని గొంతు కోసి పరారైన యువకుడు Yadagiri Goud
Crime news | నల్లగొండ జిల్లాలో దారుణం..గంజాయి మత్తులో స్నేహితుని గొంతు కోసి పరారైన యువకుడు

నల్లగొండ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

గంజాయి మత్తులో తోటి స్నేహితుని గొంతు కోసి పారిపోయాడు. ఈ విషాదకర సంఘటన నాగార్జునసాగర్ హిల్ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గంజాయి మత్తులో నితిన్ అనే యువకుడు స్నేహితుడు విష్ణు గొంతి కోసి పారిపోయాడు.

గాయపడిన విష్ణును సహచరులు దవాఖానకు తరలించారు. గొంతు కోసిన నిందితుడు నితిన్ ఏఎస్ఐ భిక్షమయ్య కొడుకుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసున మోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మళ్లీ మొదటికొచ్చిన బతుకమ్మ చీరలు లొల్లి

తెలంగాణ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న బతుకమ‍్మ చీరలపై ఆడపచుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రభుత్వం ఆర్భాటంగా పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ మహిళలు.. వాటిని తీసుకునేందుకు కూడా ఆసక్తి చూపించటం లేదు. నేతలు ఎంత బతిమాలినా లాభం లేకుండా పోతోంది. కనీసం తీసుకున్నట్టు ఫొటోకు ఫోజు ఇవ్వమని బతిమాలితే.. తీరా తీసుకుని వాటిని ఆ నేతల ముందే చింపేస్తూ, కాల్చేస్తూ.. నిరసన వ్యక్తం చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలంలోని తక్కలపల్లి గ్రామానికి చెందిన మహిళలైతే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన చీరలను పెట్రోల్ పోసి మరీ తగలబెట్టేశారు.

కేసీఆర్ భార్య గానీ, కోడలు గానీ.. కూతురు కవిత గానీ ఈ చీరలు కట్టుకుంటారా?అంటూ నిలదీస్తున్నారు.

చేనేత చీరలను పంపిణీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటన చేసిన ప్రభుత్వం.. తీరా డామేజీ చీరలను ఇచ్చిందని మండిపడుతున్నారు.

కేవలం వంద రూపాయల విలువ చేసే సాధారణ చీరలు పంపిణీ చేశారనీ అన్నారు. క్రైస్తవుల పండగల సమయంలో విందులు ఏర్పాటు చేసి బహుమతులు ఇస్తారని.. ముస్లింలకు ఇఫ్తార్ విందులు, బట్టలు, కుట్టుమిషన్లు ఇస్తారని.. మరి హిందువుల పండగలకు మాత్రం నామమాత్రంగా చీరలు ఇచ్చి సీఎం కేసీఆర్ చేతులు దులుపుకుంటున్నారని దుయ్యబట్టారు.

ఇదిలా ఉంటే.. కొత్తూరు మండలం ఎస్బీపల్లికి చెందిన మహిళలైతే.. బతుకమ్మ చీరలను తీసుకోడానికి కూడా నిరాకరించారు. గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద స్థానిక జడ్పీటీసీ తదితర నాయకులు గ్రామంలో ఉన్న మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు.

కానీ చీరలు తీసుకోడానికి మహిళలు ముందుకు రాలేదు. చీరలు తీసుకుంటున్నట్లు కనీసం ఫొటో అయిన దిగాలని మహిళలను కొందరు బతిమాలారు. అయితే.. కొందరు మహిళలు తీసుకున్నా.. ఆ చీరలను చూసి నాసిరకంగా ఉన్నాయి అంటూ అక్కడే రోడ్డుపై పడేసి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...

గాంధీ ఆసుపత్రిలో సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించిన: హోం మంత్రి

సంతానం లేక ఇబ్బందులు పడుతున్న దంపతుల కోసం రాష్ట్రంలో తొలిసారిగా ఇన్‌-విట్రో-ఫెర్టిలైజేషన్‌ ఐవీఎఫ్‌, సెంటర్‌ను తెలంగాణ సర్కార్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది.

హైదరాబాద్‌ లోని గాంధీ ఆస్పత్రిలోని మాతా,శిశు ఆరోగ్య కేంద్రం భవనంలోని ఐదో అంతస్థులో ఏర్పాటు చేసిన సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆదివారం నాడు హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో టీఎస్‌ఎంఎస్‌ ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాజారావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

పేట్లబూర్జు, వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రుల్లో కూడా ఐవీఎఫ్‌ సెంటర్లను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. వీటి ద్వారా ఖరీదైన ట్రీట్మెంట్‌ను ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు.

కాగా, రూ.5 కోట్లతో గాంధీ దవాఖానలో సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2018 నుంచి గాంధీ దవాఖానలో ఐయూఐ విధానం ద్వారా సంతాన సాఫల్య కేంద్రం నిర్వహిస్తున్నామని, మందులు వాడటంతో ఇప్పటివరకు 200 మహిళలకు సంతానం కలిగిందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు చెప్పారు.

ఇప్పుడు మంత్రి హరీశ్‌రావు

ప్రత్యేక చొరవతో ఐవీఎఫ్‌ విధానాన్ని అందుబాటులోకి తేవడం శుభపరిణామమని సంతాన సాఫల్య కేంద్రం నోడల్‌ అధికారి, గైనకాలజీ విభాగం ప్రొఫెసర్‌ వెల్లంకి జానకీ తెలిపారు.

తెలంగాణ విద్యారంగంలో అభివృద్ధి చెందింది: మంత్రి జగదీశ్ రెడ్డి

విద్యతోనే జీవితానికి వెలుగు అని నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితోనే తెలంగాణలో విద్యారంగం అభివృద్ధి చెందిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.

కోట్లాది రూపాయలు వెచ్చించి విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే అన్న్నారు. జిల్లాలోని చివ్వెంల మండలంలో ఐలాపురం గ్రామం వద్ద 4.2 కోట్లతో నిర్మించిన టీటీడబ్ల్యూఆర్‌జేసీ బాలికల పాఠశాల, కళాశాలను ఆదివారం మంత్రి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ..అభివృద్ధి విద్యతోనే సాధ్యమని అందుకే కష్టపడి చదివి మంచి ర్యాంకులు సాధించి భవిష్యత్తు బంగారు బాటలు వేసుకోవాలని విద్యార్థులకు పిలుపు నిచ్చారు.

ఏదైనా సమాజంలో వెనుక బాటు తనానికి విద్య లేక పోవడమే కారణమన్నారు. ప్రస్తుత సమాజాన్ని పీడిస్తున్న కులాల అంతరాలు పోవాలంటే విద్య వళ్లనే సాధ్యమవుతుందని నమ్మిన కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా వెయ్యి గురుకుల పాఠశాలలను నెలకొల్పినారని తెలిపారు.

అందరూ చదువుకునేలా జ్యోతిరావు పూలే, బీఆర్ అంబేద్కర్, సంత్ సేవాలాల్ ప్రజలను విద్య వైపు మళ్లించే విధంగా పోరాటం చేశారని వారి ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న గురుకుల పాఠశాలలన్నీ అన్ని జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసుకున్నామని మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జెట్పీటీసీ సంజీవ్ నాయక్, గ్రామ సర్పంచ్ బి సునీత, కళాశాల ఆర్సీ కే లక్ష్మయ్య, ప్రిన్సిపాల్ మంజుల, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు...

గురుకులాల్లో చేపల కూర.. దసరా తర్వాత అమలు

బీసీ గురుకులాల్లోని విద్యార్థులకు భోజనంలో చేపల కూర అందించాలని ఫిష్‌ ఫెడరేష న్‌ నిర్ణయించింది. దసరా తర్వాత అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.

ప్రస్తుతానికి ఈ పథకాన్ని కేవలం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించినట్టు ఫెడరేషన్‌ చైర్మన్‌ పిట్టల రవీందర్‌ తెలిపారు.

జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలోని 33 బీసీ గురుకులాల్లో 15 వేల మందికి లబ్ధి చేకూరనున్నది. ప్రతి బుధవారం చేపల కూరను అం దించనున్నట్టు తెలిపారు.

ఒ క్కో విద్యార్థికి 150 గ్రాముల చొప్పున, 15 వేల మందికి ప్రతివారం సుమారు 22 క్వింటాళ్ల చేపలు అవసరం కానున్నాయి. ముళ్లు లేని చేపలను విద్యార్థులకు అందించనున్నారు.

పాఠశాలల్లో చేపలు శుభ్రం చేయాల్సిన అవసరం లేకుండా రెడీ టు కుక్‌ విధానంలో అందించనున్నారు. ఇప్పటికే చేపల సరఫరాదారులతోనూ అధికారులు సమావేశమై చర్చించారు.

చేపల వంటకాన్ని రుచిగా చేసేందుకు స్కూళ్లలోని వంట మనుషులకు ఒక రోజు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు....

తెలంగాణలో కారు స్పీడ్ పెంచుతున్న హరీష్ రావు కేటీఆర్

రాష్ట్రంలో ‘కారు’ స్పీడ్ పెంచింది. ప్రజలకు మరింత చేరువ కావడానికి కారును మరింత వేగంగా ప్రజల చెంతకు తీసుకువెళుతున్నారు.అధికార బిఆర్‌ఎస్ పార్టీ ఒక పక్క అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిస్తూనే, మరో పక్క పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ఎన్నికలకు సిద్ధమవుతోంది.

ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో మంత్రులు, ఎంఎల్‌ఎలు వారి వారి నియోజకవర్గాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రజలకు మరింత చేరువ కావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఒక్కొక్క రోజు 15 నుంచి 25కు పైగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ప్రతిపక్షాలు అభ్యర్థులను ప్రకటించి నియోజకవర్గాలకు ప్రచారం కోసం వచ్చేవరకు సమస్యలను అన్నింటినీ పరిష్కరించుకొని ఎన్నికలకు సిద్ధం కావాలన్న లక్ష్యంతో మంత్రులు, ఎంఎల్‌ఎలు ఉన్నారు.

కెటిఆర్, హరీష్ రావు సుడిగాలి పర్యటనతో కార్యకర్తలు ఫుల్ జోష్ తో ఉన్నట్లు తెలుస్తుంది

రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్, బిఆర్‌ఎస్ కీలక నాయకులు, మంత్రి హరీశ్‌రావులు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తుండటంతో పార్టీ కేడర్‌లో జోష్ పెరుగుతోంది. మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావులు ఒక్కపక్క అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రారంభిస్తూనే మరో పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ కేడర్‌లో భరోసా నింపుతున్నారు.

ఇద్దరు నేతలు హెలికాప్టర్‌లో జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఒక్కో రోజు దాదాపు 5 నుంచి 10కిపైగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బలంగా అసమ్మతి ఉన్న నియోజకవర్గాలలో ఇప్పటికే సంప్రదింపులు జరిపి అసమ్మతిని చల్లార్చింది.

అసమ్మతి ఉన్న నియోజకవర్గాలలో అభ్యర్థుల విషయంలో పార్టీ కేడర్‌కు స్పష్టతనిస్తూ అభ్యర్థిని గెలిపించేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేసేందుకు సమాయత్తం చేస్తున్నారు....

కోతులకు విషం పెట్టి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు

మూగజీవాలపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. 35కు పైగా కోతులకు విషం పెట్టి చంపేశారు. వాటి కళేబరాలను ఓ శ్మశానం వద్ద పడేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఆదివారం చోటు చేసుకుంది.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల స్థానికంగా కోతుల బెడద ఎక్కువైపోయిందని అక్కడి వారు తెలిపారు. మైనింగ్ కారణంగా కొండలు కనుమరుగైపోవడంతో కోతులు గ్రామాలపై పడుతున్నాయని, ఈ క్రమంలోనే ఆగంతుకులు వాటిని విషప్రయోగంతో మట్టుబెట్టి ఉండొచ్చని భావిస్తున్నారు.

కోతుల కళేబరాలను చూసి షాకైపోయిన గ్రామస్తులు వెంటనే సర్పంచ్‌కు సమాచారం అందించారు. సర్పంచ్ అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం, పశువైద్య అధికారి వచ్చి పంచనామా జరిపించారు. సర్పంచ్‌, అటవీశాఖ సిబ్బంది ఫిర్యాదుతో మూగజీవాలను మట్టుపెట్టింది ఎవరో తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

స్థానికుల్లో కొందరు ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, కోతుల అంత్యక్రియల్లో గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మూగజీవాలకు తుది వీడ్కోలు పలికారు.

ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం

అఫ్గానిస్థాన్‌లో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి 120 మంది మృతి చెందగా వెయ్యి మంది వరకు గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3 ఉందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు.

భూకంపం ధాటికి పలు భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాల శిథిలాల కింద మృతదేహాలు ఉండొచ్చిన స్థానిక మీడియా వెల్లడించింది. మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భూకంపం ధాటి పలు భవనాలు కుప్పకూలిపోయాయి.

భూ ప్రకంపనలు ఐదు సార్లు చోటుచేసుకున్నట్టు సమాచారం. హెరాత్ సిటీకి 40 కిలో మీటర్ల దూరం భూకంప కేంద్ర ఉన్నట్టు భూపరిశోధన అధికారులు వెల్లడించారు.

బాడ్‌ఘీష్, ఫరాహ ప్రోవిన్స్‌లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు సమాచారం. అధికారులు, రెస్య్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

హైకోర్టు, సుప్రీంకోర్టు, ఏసీబీ కోర్టు,లలో రేపు చంద్రబాబు కేసు విచారణ

తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిటీషన్‌లపై సోమవారం సుప్రీంకోర్టు హైకోర్టు విజయవాడ ఏసీబీ కోర్టు లలో తీర్పులు, విచారణ జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో రేపు హాట్ మండే గా మారనుంది. అలాగే హై కోర్టులో చంద్రబాబు పిటీషన్లపై కూడా సోమవారం తీర్పు రానుంది. అంగాళ్లు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్పు కేసులో బెయిల్, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్‌లపై హై కోర్టు తీర్పు ఇవ్వనుంది.

ఇప్పటికే ఈ మూడు కేసుల్లో వాదనలు శుక్రవారం పూర్తి కావడంతో న్యాయమూర్తి తీర్పును సోమవారానికి వాయిదా వేశారు.

సోమవారమే సుప్రీం కోర్టులో చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్‌పై విచారణ జరగనుంది.

అలాగే విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు స్కిల్ కేసులో బెయిల్, కస్టడీ పిటీషన్‌లపై తీర్పు వెలువడనుంది. ఈ పిటీషన్‌లపై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. కాగా హైకోర్టు, ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, ముందస్తు బెయిల్, కస్టడీ పిటీషన్‌లపై సుదీర్ఘ వాదనలు జరిగాయి.

కాగా రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు హాట్ మండేగా మారనుంది..

తిరుమలలో పూర్తిగా తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల తిరుపతి దేవస్థానం లో ఆదివారం భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. దీంతో శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి డైరెక్ట్ క్యూ లైన్‌ నుంచి భక్తులను పంపుతున్నారు.

స్వామివారి సర్వదర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

కాగా నిన్న శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.50 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

మరోవైపు ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాణిపాకం లో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం పుష్ప పల్లకి ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది.

ఈ ఊరేగింపును తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్త జన సందోహంతో కాణిపాకం పురవీధులు కిటకిటలాడుతున్నాయి.....