కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తండ్రి, ఉమ్మడి రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్ రెడ్డి (76) శుక్రవారం రాత్రి 10.10 గంటలకు గుండెపోటుతో మరణించారు.
కాగా హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. పరిగి నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రముఖ నేత హరీశ్వర్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హరీశ్వర్ రెడ్డి తనయుడు, ప్రస్తుత పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పరిగి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి అకాల మరణం పట్ల తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
కొప్పుల హరీశ్వర్ రెడ్డితో పనిచేసినప్పుడు ఆయనతో ఉన్న అనుబంధాన్ని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు...
![]()
SB NEWS
















SB NEWS
SB NEWS






SB NEWS



. bit.Iy/368vgEt
Sep 23 2023, 09:40
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4.3k