/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Sidharth Luthra: సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మరో ట్వీట్‌ Yadagiri Goud
Sidharth Luthra: సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మరో ట్వీట్‌

అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు తరఫున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తాజాగా ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా మరో పోస్ట్‌ పెట్టారు..

'ప్రతి రాత్రి తర్వాత ఉషోదయం ఉంటుంది. అది మన జీవితాల్లోకి కొత్త వెలుగులను మోసుకొస్తుంది' అంటూ ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు.

చంద్రబాబు తరఫున హైకోర్టులో వేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేసిన నేపథ్యంలో లూథ్రా ఈ ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

చంద్రబాబు కేసును వాదిస్తునప్పటి నుంచి లూథ్రా వరుస ట్వీట్లు చేస్తున్నారు.

తమకు ఎదురవుతున్న అవమానాలను, అపహాస్యాన్ని పట్టించుకోవద్దన్న స్వామి వివేకానంద వ్యాఖ్యలను ఓ పోస్ట్‌లో ప్రస్తావించారు.

అన్ని ప్రయత్నాలూ చేసినా న్యాయం కనుచూపుమేర కనిపించనప్పుడు కత్తి పట్టడమే సరైందని, పోరాటమే శరణ్యం అంటూ లూథ్రా చేసిన ట్వీట్‌ కూడా ఆసక్తిని రేకెత్తించింది..

SB NEWS

Bhuma Akhila Priya: భూమా అఖిలప్రియ నిరాహార దీక్ష భగ్నం..

నంద్యాల: తెదేపా నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రెండు రోజులుగా ఆమె నిరాహార దీక్ష చేపట్టారు..

నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన ఆర్కే ఫంక్షన్‌ హాల్‌ వద్ద ఆమె దీక్షకు దిగారు. ఆమె సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి సైతం నిరవధిక దీక్షలో కూర్చున్నారు.

దీంతో పోలీసులు శనివారం వేకువ జామున ఆమె దీక్షను భగ్నం చేశారు. అక్కడి నుంచి ఆమెను నంద్యాల డీఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఆళ్లగడ్డకు తరలించారు.

ఆళ్లగడ్డలోని నివాసంలోనికి వెళ్లేందుకు ఆమె నిరాకరించారు. పోలీసుల వాహనంలోనే దీక్షను కొనసాగిస్తానని ఆమె పట్టుబట్టారు.

ఈ దశలో ఆళ్లగడ్డ పోలీసులు ఆమెను, ఆమె సోదరుడు విఖ్యాతరెడ్డిని ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేసి ఆమె నివాసానికి తరలించారు..

SB NEWS

మైనంపల్లి బి ఆర్ ఎస్ కు రాజీనామా

ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. పార్టీకి మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చేశారు.

ఈ మేరకు తన రాజీనామా లేఖ శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపించారు.

అనంతరం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. కాగా, గత కొద్ది రోజులుగా మైనంపల్లి అలకబూనారు.

తన కొడుకు రోహిత్ రెడ్డికి మెదక్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని గుస్సా అవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. మైనంపల్లి రెండు అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ, బీఆర్ఎస్ మాత్రం ఒకటే టికెట్ కేటాయించింది....

SB NEWS

SB NEWS

. bit.Iy/368vgEt

TS News: నేడు, రేపు విస్తారంగా వర్షాలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో శని, ఆదివారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణశాఖ పేర్కొంది..

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

పరకాలలో ఫైరింగ్ కలకలం..

హన్మకొండ జిల్లా: పరకాలలో ఫైరింగ్ కలకలం రేపింది. అధికార పార్టీకి చెందిన బిల్డర్ తిరుపతిరెడ్డి లైసెన్స్ తుపాకితో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు..

ఐదురోజుల క్రితం కాల్పుల ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. తుపాకీని సీజ్ చేశారు.

కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు లైసెన్స్ తుపాకీతో సంవత్సరికం పంక్షన్‌లో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

మద్యం మత్తులో ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడానికి గాలిలోకి కాల్పులు జరిపాడని సీఐ వెంకటరత్నం వెల్లడించారు. నిందితున్ని కోర్టులో హాజరుపర్చిగా న్యాయస్థానం రిమాండ్ విధించిందని స‍్పష్టం చేశారు..

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

Rahul Gandhi : రైల్వే కూలీగా రాహుల్ గాంధీ..!

దిల్లీ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గురువారం మాస్‌ లుక్కులో కనిపించారు.

దిల్లీలోని ఆనంద్‌ విహార్‌ రైల్వే స్టేషన్‌ (Anand Vihar Railway Station)లో కొద్దిసేపు కూలీగా పనిచేశారు..

ఈ సందర్భంగా అక్కడి కూలీలతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.

రాహుల్‌ తమను కలవాలని రైల్వే కూలీలు సామాజిక మాధ్యమంలో కోరిన వీడియో ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనికి రాహుల్‌ స్పందించారు.

గురువారం ఆయనే స్వయంగా ఆనంద్‌ విహార్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ పార్టీ (Congress) తన అధికారిక ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో పంచుకొంది.

భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra)కు దీనిని కొనసాగింపుగా అభివర్ణించింది. ఆ వీడియోలో రాహుల్ గాంధీ రైల్వే కూలీ వలే సామాన్లు మోస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి..

కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఇండ్లు నిర్మించాయా?: మంత్రి కేటీఆర్

ఒక్క రూపాయి చెల్లించే అవసరం లేకుండా పేదలకు ఇళ్లను అందిస్తున్నామని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.

దుండిగల్ లో గురువారం రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గొని 2,100మంది అర్హులైన పేద లబ్దిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ..ఇళ్లు కట్టి చూడు.. పెళ్ళి చేసి చూడు అని పెద్దలు అన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఇళ్లు కట్టిస్తున్నాడు..పెళ్లి చేస్తున్నాడు. ఒక్క రూపాయి చెల్లించే అవసరం లేకుండా పేదలకు ఇళ్లు అందిస్తున్నాం.

అత్యంత పారదర్శకంగా ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరిగింది. కాంగ్రెస్, బిజెపి పార్టీల కార్యకర్తలకు సైతం రెండు పడకల గదుల ఇళ్లు అందిస్తున్నాం.

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఒక్కరోజే 13,300 ఇళ్లను అబ్ధిదారులకు ఇళ్లను అందజేస్తున్నాం. ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చు అవుతుంది.

కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఇళ్లు నిర్మించాయా?. భవిష్యత్ లో అర్హులందరికీ రెండు పడకల గదుల ఇళ్లు ఇస్తాం. రూ.73వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేశాం” అని పేర్కొన్నారు...

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు

ఉద్యోగులకు సింగరేణి యాజమాన్యం శుభవార్త అందించింది. 11వ వేజ్‌ బోర్డు ఏరియర్స్‌ విడుదల చేసింది.

మొత్తం 39,413 మంది సింగరేణి ఉద్యోగులకు రూ.1,450 కోట్లు జమచేసింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి కార్మికుల బ్యాంక్‌ ఖాతాలో ఏరియర్స్‌ జమ చేయనున్నట్లు వెల్లడించింది.

ఈ లెక్కన ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.3.70 లక్షల ఏరియర్స్ జమకానుంది‌. త్వరలో దసరా, దీపావళి బోనస్‌ చెల్లింపులకు కూడా సింగరేణి సిద్ధమైంది..

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

అసెంబ్లీలో తొడ కొట్టడం మీసాలు మెలేయడం మన సాంప్రదాయం కాదు: స్పీకర్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా కొనసాగాయి, అసెంబ్లీ నుండి గురువారం 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.

మరో వైపు ఈ సమావేశాలు ముగిసే వరకు టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ప్రారంభమైన వెంటనే చంద్రబాబు అరెస్ట్ పై వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.

స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం వద్ద టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం తిప్పారు. బాలకృష్ణకు వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి తొడగొట్టి కౌంటరిచ్చారు.

దీంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పోటా పోటీగా నిరసనలకు దిగారు. దీంతో సభను స్పీకర్ తమ్మినేని సీతారాం వాయిదా వేశారు.

టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్య ప్రసాద్, పయ్యావుల కేశవ్.. వైసీపీ నుంచి టీడీపీ వైపు వెళ్లిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అదే సమయంలో నందమూరి బాలకృష్ణకు మాత్రం ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు.

అసెంబ్లీలో తొడగొట్టడం, మీసం మెలేయడం సరైన సంప్రదాయం కాదని అన్నారు స్పీకర్. అలాంటి చర్యలకు పాల్పడినందుకు బాలకృష్ణకు మొదటి హెచ్చరిక జారీ చేశారు. మిగతా సభ్యులపై కూడా అధికార పక్షం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరడంతో..

వారిని కూడా ఒకరోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా టీడీపీ సభ్యులందర్నీ సభ నుంచి బయటకు పంపించి వేశారు...

తెలంగాణ రైతులకు రుణమాఫీ నిధులు విడుదల

తెలంగాణ రైతులకు రుణమాఫీ నిధులను కెసిఆర్ సర్కార్ అందించనుంది, రుణమాఫీ కోసం రూ.వెయ్యి కోట్లు నిధులను ఈ మేరకు విడుదల చేసింది.

తెలంగాణ ప్రభుత్వం బుధవారం రాత్రి నిధులను విడుదల చేసింది. ఈ డబ్బులు రైతుల అకౌంట్లలో జమ కానున్నాయి. రైతు రుణమాఫీ ద్వారా దాదాపు 21.35 లక్షల మంది రైతులు లబ్ది పొందారు. తొలి విడతగా రూ.50 వేలలోపు రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ చేయగా..

రెండో విడత రుణమాఫీ ప్రక్రియను ఆగస్ట్ 3 నుంచి ప్రభుత్వం ప్రారంభించింది

రెండో విడతలో 29.61 లక్షల మంది రైతులకు రూ.19 వేల కోట్లను మాఫీ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఆగస్ట్ 5న రూ.5809 కోట్లు, తాజాగా రూ.10 వేల కోట్ల విడుదల చేసింది.

త్వరలో రూ.లక్ష రుణం తీసుకున్న రైతులకు కూడా మాఫీ చేయనుంది. ఎన్నికల నేపథ్యంలో విలైనంత త్వరగా రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో బ్యాంకులతో సంప్రదించి వేగవంతంగా చర్యలు చేపడుతోంది.

రుణమాఫీ నిధులు విడుదల అవుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా రైతు రుణమాఫీ ఎప్పుడు అవుతుందా? అని రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు......

SB NEWS