/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz జీనోమ్‌ వ్యాలీని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తాం : మంత్రి కేటీఆర్‌ Miryala Kiran Kumar
జీనోమ్‌ వ్యాలీని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తాం : మంత్రి కేటీఆర్‌

జీనోమ్‌ వ్యాలీని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తాం : మంత్రి కేటీఆర్‌

దేశంలోనే అత్యంత మానవ వనరులు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ శివారులోని జీనోమ్‌ వ్యాలీలో బీఎస్‌వీ కంపెనీ కొత్త యూనిట్‌కు మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. భారత్‌ సీరం సంస్థకు అన్నిరకాల సహకారం అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం జీనోమ్‌ వ్యాలీలో ఫేజ్‌-3లో ఉన్నామని.. దీన్ని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తామని మంత్రి కేటీఆర్‌ సందర్భంగా ప్రకటించారు. 

దేశంలోనే అత్యంత మానవ వనరులు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ శివారులోని జీనోమ్‌ వ్యాలీలో బీఎస్‌వీ కంపెనీ కొత్త యూనిట్‌కు మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. భారత్‌ సీరం సంస్థకు అన్నిరకాల సహకారం అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం జీనోమ్‌ వ్యాలీలో ఫేజ్‌-3లో ఉన్నామని.. దీన్ని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తామని మంత్రి కేటీఆర్‌ సందర్భంగా ప్రకటించారు.

దేశంలో ఎక్కడా లేని అనుకూలతలు తెలంగాణలో ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు.. ఎక్కడా లేనంత వేగంగా పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పనలో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందనడం నిర్వివాదమని పేర్కొన్నారు. మాకు కేంద్ర ప్రభుత్వానికి పడదు.. తెల్లారిలేస్తే మేమూ, వాళ్లూ తిట్టుకుంటాం.. విమర్శలు చేసుకుంటాం. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య ఎప్పుడు ఏదో పంచాయితీ నడుస్తూనే ఉంటుంది.. అయినప్పటికీ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో నంబర్‌వన్‌ ఎవరని అడిగితే తెలంగాణ అని వాళ్లు కూడా ఒప్పుకునే పరిస్థితిని సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చారని అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందన్నారు. దేశ సగటు తలసరి ఆదాయం 1,49,000 ఉండగా.. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,17,000గా ఉందన్నారు.

సమర్థవంతమైన నాయకత్వం ఉంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని తెలంగాణ ప్రభుత్వం నిరూపిస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రపంచానికి వ్యాక్సిన్‌ రాజధానిగా హైదరాబాద్‌ మారిందని ప్రపంచంలో ఎక్కడికెళ్లినా గర్వంగా చెప్పగలనని పేర్కొన్నారు. ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 33 శాతం హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో ఏడాదికి 900 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. వచ్చే ఏడాది నుంచి 1400 కోట్ల వ్యాక్సిన్లు ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 50 శాతం మనదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. దీనికి నిపుణులైన యువకులు ఉండటం, వాళ్లను చూసి కంపెనీలు ఇక్కడికి రావడం, వారికి ప్రభుత్వం సహకరించడమే కారణమని అన్నారు.

SB NEWS

SB NEWS TELANGANA

ఈ చెట్లను అస్సలు ఇంట్లో పెట్టోద్దు.. పొరపాటున పెడితే పాములకు వెల్ కమ్ చెప్పినట్లే..

ఈ చెట్లను అస్సలు ఇంట్లో పెట్టోద్దు.. పొరపాటున పెడితే పాములకు వెల్ కమ్ చెప్పినట్లే..

కొన్నిరకాల మొక్కలు , చెట్లు పాములను ఆకర్శిస్తుంటాయి. ఇవి ఇంట్లో ఉండే వీటి నుంచి వెలువడే వాసనలు పాములను ఆకర్శిస్తాయని అంటుంటారు..

 

సాధారణంగా మనలో ప్రతి ఒక్కరికి పాములంటే చచ్చేంత భయం ఉంటుంది. ఇక వర్షాకాలంలో లేదా అడవులకు దగ్గరగా ఉన్న ప్రదేశాలలో పాములు ఎక్కువగా కన్పిస్తుంటాయి.. వర్షంపడ్డాక చెరువులు, కుంటలు నిండుతుంటాయి. అలాంటి సమయంలో ఇళ్లలోనికి నీరు వచ్చి చేరుతుంది.

 

అప్పుడు పాములు మనన ఇళ్లలోనికి వచ్చి చేరుతుంటాయి. కొందరైతే పాముల పేర్లను ఎత్తడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూయించరు. మరికొందరు పాము అనగానే.. వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతుంటారు.. ఇవి ముఖ్యంగా మన ఇళ్లలో ఎలుకలు, మొదలైన వాటిని తినడానికి వస్తుంటాయి.

 

ఈ క్రమంలో కొన్నిసార్లు అవి మనుషులను కాటు వేయడం జరుగుతుంది. మరికొందరు మాత్రం పాములు కన్పించగానే స్నేక్ హెల్ప్ సోసైటివారికి సమాచారం అందిస్తారు..అయితే.. ఈకింద ఇచ్చిన చెట్లను ఇంట్లో పెంచవద్దని అంటుంటారు..

 

పొరపాటున కూడా ఇంటి బయట ఈ 6 మొక్కలు నాటాడు అంటే పామును ఆహ్వానించాడని అర్ధం చేసుకోండి..కొన్ని పూల మొక్కలు పాములను ఆకర్షిస్తాయి. కాబట్టి అలాంటి మొక్కలను ఇంటి చుట్టూ నాటకూడదు. పాములను ఆకర్షించే మొక్కల జాబితా ఇక్కడ ఉంది.

 1. జాస్మిన్- ఇండియాటుడే వార్తల ప్రకారం, జాస్మిన్ వైన్స్ కుటుంబానికి చెందిన మొక్కల దగ్గర పాములు ఎక్కువగా నివసిస్తాయి. ఎందుకంటే మల్లె మొక్క చాలా దట్టమైనది మరియు పాములు దాని రంగులో తమను తాము కప్పుకుంటాయి. దాక్కున్న తర్వాత, పాము తన ఎరను సులభంగా బంధిస్తుంది. మల్లె మొక్కల దగ్గర పాములు నివసించే ప్రమాదం ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం.

1. జాస్మిన్- ఇండియాటుడే వార్తల ప్రకారం, జాస్మిన్ వైన్స్ కుటుంబానికి చెందిన మొక్కల దగ్గర పాములు ఎక్కువగా నివసిస్తాయి. ఎందుకంటే మల్లె మొక్క చాలా దట్టమైనది మరియు పాములు దాని రంగులో తమను తాము కప్పుకుంటాయి. దాక్కున్న తర్వాత, పాము తన ఎరను సులభంగా బంధిస్తుంది. మల్లె మొక్కల దగ్గర పాములు నివసించే ప్రమాదం ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం.

2. సైప్రస్ లేదా సైప్రస్ - తమ ఇంటి దగ్గర యార్డ్ ఉన్నవారు సైప్రస్ మొక్కను నాటుతారు. ఇది అలంకారమైన మొక్క. ఇది చాలా అందంగా కనిపిస్తుంది. కానీ అది కూడా చాలా దట్టమైనది. దట్టంగా ఉండడం వల్ల పాములు దాక్కుని కీటకాలను వేటాడతాయి.

3. క్లోవర్ మొక్కలు- క్లోవర్ మొక్కలు కూడా అలంకారమైన మొక్కలు. దీని ఆకులు మందంగా మరియు దట్టంగా ఉంటాయి. అవి భూమిని పూర్తిగా కప్పేస్తాయి. పాములు ఈ ఆకుల కింద హాయిగా కూర్చుని తమ ఆహారం కోసం రహస్యంగా వెతకడానికి ఇదే కారణం. కాబట్టి అనుకోకుండా ఇంట్లో క్లోవర్ ఆకులను నాటకండి.(Image credit:Pixabay.com)

4. నిమ్మ చెట్టు- నిమ్మ చెట్టు లేదా ఏదైనా సిట్రస్ చెట్టు ఎలుకలు మరియు చిన్న పక్షులకు నిలయం. ఎందుకంటే చిన్న కీటకాలు మరియు పక్షులు దాని పండ్లను తింటాయి. నిమ్మ చెట్ల చుట్టూ పాములు తిరగడానికి ఇదే కారణం. కాబట్టి మీ ఇంటి దగ్గర నిమ్మకాయను నాటకండి.(Image credit:Pixabay.com)

5. దేవదారు చెట్లు - దేవదారు వృక్షాలు ఎత్తైన ప్రదేశాలలో పెరిగినప్పటికీ, అవి మైదాన ప్రాంతాల్లో కూడా కొన్ని సంవత్సరాలు జీవించగలవు. అందుకే కొందరు తమ మైదానాల్లో దేవదారు చెట్లను నాటారు. కానీ గంధపు చెట్టులా, పాము దేవదారు చెట్టులో చుట్టుకొని ఆనందిస్తుంది. కాబట్టి ఇంటి చుట్టూ దేవదారు చెట్లను నాటకండి.

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. SB NEWS దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)

నల్లగొండ టౌన్ లో వినాయకులను దర్శిస్తున్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి జన నీరాజనాలు...

నల్లగొండ టౌన్ లో వినాయకులను దర్శిస్తున్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి జన నీరాజనాలు...

నల్గొండలో గత రెండు రోజుల నుంచి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి మరియు కౌన్సిలర్లు కలిసి నల్గొండ టౌన్ లోని వినాయకులను దర్శించడం, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.

అడుగడుగునా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి అన్ని వినాయక మండపాల దగ్గరికి ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి మహిళలు బొట్టుపెట్టి మరీ హారతిస్తున్నారు, చిన్నపిల్లలు, మహిళలు, యువకులు ఎమ్మెల్యే గారితో సెల్ఫీలు దిగడానికి పోటీ పడుతున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ తనకు అడుగడుగునా ప్రజలు తనపై చూపించే ప్రేమకు బానిసని అయిపోయానని, వారి ప్రేమకు దాసోహం అయిపోయానని, వారి ముఖంలో సంతోషాన్ని చూడడం కోసం మళ్లీ ఎమ్మెల్యేగా తానే గెలుస్తానని నల్గొండ మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని తెలియజేశారు.

SB NEWS

Street buzz news

Street buzz news are national news

విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు భారీగా దసరా సెలవులు... ఎన్ని రోజులంటే...

విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు భారీగా దసరా

సెలవులు.. ఎన్ని రోజులంటే..

ఏపీ, తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులు ఈ సారి భారీ సంఖ్యలో రానున్నాయి. ఏ రాష్ట్రంలో ఎన్ని రోజులు సెలవులు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.

 సెలవులు.. విద్యార్థులకు ఎంతో ఆనందాన్నిచ్చే పదం. ఎక్కువగా పండగలకు సెలవులు వస్తుంటాయి. దానిలో వరుస సెలవులు వస్తే.. విద్యార్థులు ఎగిరి గంతేస్తారు. అలాంటి సందర్భం అక్టోబర్ నెలలో వచ్చేస్తోంది. ఏ తేదీన సెలవు వస్తున్నాయో పూర్తి వివరాలు తెలుసుకోండి. 

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సెలవు దినాలనేవి.. ప్రభుత్వ పాఠశాలలు, CBSE పాఠశాలలు, ICSE పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, సంబంధిత ఉపాధ్యాయులు, లెక్చరర్లు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది, విద్యార్థులకు అనుగుణంగా ఉంటాయి.

 తెలంగాణ ప్రభుత్వం 2023 ఏడాదికి సంబంధించిన సెలవులను ఇప్పటికే ప్రకటించింది. ఆ లెక్క ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయానికి 28 సాధారణ సెలవులు, 24 ఐచ్ఛిక సెలవులను ప్రకటించింది.

 ఆదివారం, రెండో శనివారాల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఎలాగో మూతపడతాయి. ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ హాలిడేస్ తోపాటుగా ఉన్నతాధికారుల అనుమతితో 5 ఆప్షనల్ సెలవులు పొందే అవకాశం కూడా ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 

 జూన్ 12 నుంచి ప్రారంభమైన 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి.. 1 నుంచి 10వ తరగతులకు సంబంధించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను తెలంగాణ ప్రభుత్వం జూన్​ 6న విడుదల చేసిన విషయం తెలిసిందే.  

 ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూళ్లు పని చేస్తాయి. స్కూళ్లు జూన్‌ 12న ప్రారంభమై.. ఏప్రిల్‌ 23, 2024న ముగియనున్నాయి. అంటే.. ఈ అకాడమిక్​ ఇయర్​లో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయాల్సి ఉందన్నమాట. (ప్రతీకాత్మక చిత్రం)6/ 8

ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూళ్లు పని చేస్తాయి. స్కూళ్లు జూన్‌ 12న ప్రారంభమై.. ఏప్రిల్‌ 23, 2024న ముగియనున్నాయి. అంటే.. ఈ అకాడమిక్​ ఇయర్​లో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయాల్సి ఉందన్నమాట.

 2024 ఏప్రిల్‌ 24 నుంచి 2024 జూన్‌ 11 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. ఇక ఈ ఏడాది (2023) దసరా సెలవుల విషయానికి వస్తే.. అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు 13 రోజుల పాటు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.  ఏపీలో అక్టోబర్ 11వ తేదీ నుంచి 16 వరకు దసరా సెలవులు ప్రకటించారు. 17వ తేదీ ఆదివారం కావడంతో 18వ తేదీన పునఃప్రారంభమవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)7/ 8

2024 ఏప్రిల్‌ 24 నుంచి 2024 జూన్‌ 11 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. ఇక ఈ ఏడాది (2023) దసరా సెలవుల విషయానికి వస్తే.. అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు 13 రోజుల పాటు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.  ఏపీలో అక్టోబర్ 11వ తేదీ నుంచి 16 వరకు దసరా సెలవులు ప్రకటించారు. 17వ తేదీ ఆదివారం కావడంతో 18వ తేదీన పునఃప్రారంభమవుతాయి.

 

అలాగే సంక్రాంతి సెలవులు 2024 జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం 6 రోజులు ఉంటాయని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ఈ నెలలోనే ఆదివారాలు మినహా 28-09-2023 గురువారం-మిలాద్ ఉన్ నబీ(మహ్మద్ ప్రవక్త జన్మదినం) సందర్భంగా పాఠశాలలకు సెలవు ప్రకటించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)8/ 8

అలాగే సంక్రాంతి సెలవులు 2024 జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం 6 రోజులు ఉంటాయని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ఈ నెలలోనే ఆదివారాలు మినహా 28-09-2023 గురువారం-మిలాద్ ఉన్ నబీ(మహ్మద్ ప్రవక్త జన్మదినం) సందర్భంగా పాఠశాలలకు సెలవు ప్రకటించనున్నారు.

పారా లీగల్ వాలంటీర్ ను ప్రశంసించిన DLSA సెక్రెటరీ

పారా లీగల్ వాలంటీర్ ను ప్రశంసించిన DLSA సెక్రెటరీ

వరుస కథనాలతో కొన్ని న్యూస్ పేపర్ లో వస్తున్న వార్తలను గమనించి, స్పందించి, వారికి అండగా నిలిచింది పారా లీగల్ వాలంటీర్.

ఖమ్మం జిల్లా పెద్దమండవ గ్రామానికి చెందిన 84 సంవత్సరాల ఒక వృద్ధ మహిళ 20 సంవత్సరాల నుండి కండరాల వ్యాధితో దివ్యాంగులు మారన తన కుమారుల పోషణ కోసం పడుతున్న బాధను పత్రికలో వస్తున్న కథనాలను చూసి వారి ఇంటికి వెళ్లి వారి తరపున ఒక వినతిపత్రం రాసి దివ్యాంగుల శాఖకు వారి సమస్యలను తెలియజేసి వినతి పత్రాలు సమర్పించింది.

వారు చేసిన పనికి గాను ఖమ్మం డిస్టిక్ సివిల్ లీగల్ అత్తారింటికి సెక్రెటరీ గారు ప్రశంసించారు.

sb news

street buzz news

street buzz news are national wide news

కేంద్రం ప్రవేశపెట్టిన మహిళ 33% రిజర్వేషన్ లో బీసీ ఎస్సీ ఎస్టీ సబ్ కోటాను తేల్చాలని నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన

కేంద్రం ప్రవేశపెట్టిన మహిళ 33% రిజర్వేషన్ లో బీసీ ఎస్సీ ఎస్టీ సబ్ కోటాను తేల్చాలని నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన

నల్లగొండ జిల్లా కేంద్రంలో మహిళా డిగ్రీ కాలేజీ నుండి క్లాక్ టవర్ జ్యోతిరావు పూలే విగ్రహం వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది.

బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ

పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్లు 33% ప్రవేశపెట్టడాన్ని నలగొండ బీసీ సంక్షేమ సంఘం స్వాగతిస్తూ ఉన్నాం. కానీ గత 25 సంవత్సరాల క్రితమే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు మహిళల రిజర్వేషన్లు సబ్ కోట ఇవ్వకుండా ప్రవేశ పెట్టవద్దని కచ్చితంగా ఆనాడు ప్రతిపక్షాలు అడ్డుకోవడం జరిగింది. ఈనాడు దేశ ప్రధాని మోడీ గారు 33% రిజర్వేషన్ పెట్టడం శుభదాయకం అయినా బీసీ ఎస్సీ ఎస్టీలకు సబ్ కోట తేల్చకుండా దాన్ని ప్రవేశపెట్టడాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న ఆదేశాల మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.

ఇప్పటికైనా గత 75 సంవత్సరాలు 75 సంవత్సరాల కాలంలో బీసీ  ఓట్లు వేసే యంత్రాలుగా ఈ పార్టీలు చూడడం జరుగుతుంది ఇప్పటికైనా సబ్ కోట ఇచ్చి రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాస ప్రసన్న కుమార్ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి పద్మ ప్రసాద్ జిల్లా బీసీ మహిళ అధ్యక్షులు అధ్యక్షురాలు సింగం లక్ష్మి బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కార్యదర్శి కర్నాటి యాదగిరి మార్గం సతీష్ కుమార్ యువజన సంఘం వైస్ ప్రెసిడెంట్ పగిళ్ల కృష్ణ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన సతీష్ యాదవ్ టౌన్ ప్రెసిడెంట్ సదానంద్ వల్ల కీర్తి శ్రీనివాస్ చల్లేటి రవీంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.

SB news

street buzz news

ఈనెల 25న విద్యుత్తు ఏఈ కార్యాలయాల ముందు ధర్నాలు జయప్రదం చేయండి.

ఈనెల 25న విద్యుత్తు ఏఈ కార్యాలయాల ముందు ధర్నాలు జయప్రదం చేయండి.

 100 యూనిట్లు ఉచిత కరెంట్ కై దళిత కుటుంబాల దరఖాస్తులు.

    నిరుపేద దళితులకు జీవో నెంబర్ 342 ప్రకారంగా 100 యూనిట్ల ఉచిత విద్యుత్తు గృహ అవసరాలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ ఏఈ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించి దరఖాస్తులు ఇవ్వనున్నట్లు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు ఈరోజు కెవిపిఎస్ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని పెద్ద బండలో దళితులు చేత దరఖాస్తులు విడుదల చేయడం జరిగింది.

    ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ధనికులకు ఉద్యోగులకు ధనవంతులకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు వృత్తిదారులకు ఉచిత విద్యుత్తు ఇస్తూ భూమిలేని నిరుపేద దళితులకు గృహ అవసరాలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు ఇవ్వాలని డిమాండ్ చేశారు జిల్లాలో 100 అయినట్లు జీవో నెంబర్ 342 ప్రకారం ఇవ్వాల్సి ఉండగా ఎక్కడ అమలు కావడం లేదని ప్రతి దళిత అర్హత గల కుటుంబం కులం సర్టిఫికెట్ ఆధార్ కార్డు విద్యుత్ కనెక్షన్ జిరాక్స్ పత్రాలతో ఏఈ కార్యాలయాల ముందు ధర్నాలకు హాజరై దరఖాస్తుల సమర్పించాలని కోరారు. 

 

 ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గారే నరసింహ జిల్లా నాయకులు కోట సైదులు రత్నం యాదయ్య దాసరి ఆనంద్ దూలపల్లి గిరి చింత ఎల్లయ్య బచ్చలకూరి పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

sb news

street buzz news

కాంగ్రెస్‌ వస్తే సంవత్సరానికి ఒకరు చొప్పున ఐదుగురు సీఎంలు గ్యారంటీ మంత్రి కేటీఆర్‌

కాంగ్రెస్‌ వస్తే సంవత్సరానికి ఒకరు చొప్పున ఐదుగురు సీఎంలు గ్యారంటీ మంత్రి కేటీఆర్‌

అధికారం కోసం కాంగ్రెస్‌ నేతలు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. వాళ్లకు అధికారం కావాలనే లక్ష్యం తప్ప మరేమి కనిపించడం లేదని విమర్శించారు.

కాంగ్రెస్ హామీల్లో అభివృద్ది గురించి ఎక్కడైనా మాట్లాడారా అంటూ నిలదీశారు. 

అధికారం కోసం కాంగ్రెస్‌ నేతలు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. వాళ్లకు అధికారం కావాలనే లక్ష్యం తప్ప మరేమి కనిపించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ హామీల్లో అభివృద్ది గురించి ఎక్కడైనా మాట్లాడారా అంటూ నిలదీశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు చిన్న సత్యనారాయణ బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేతలు ఇటీవల బహిరంగ సభ పెట్టి ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని అడుగుతున్నారని.. 55 ఏండ్లలో 11 ఛాన్స్‌లు ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. కరెంటు ఇవ్వలేదు, తాగునీరు ఇవ్వలేదు, సాగు నీరు ఇవ్వలేదు, రైతు బందు ఇవ్వలేదు, ఏదీ ఇవ్వలేదు. సిగ్గు లేకుండా వచ్చి.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నరని మండిపడ్డారు.

కాంగ్రెస్‌ నాయకులు నోటికి వచ్చిన వాగ్ధానాలు ఇస్తున్నారని, ఎంత వస్తే అంత చెబుతున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

కాంగ్రెస్‌ హామీల విలువ రాష్ట్ర బడ్జెట్‌ కంటే ఎక్కువగా ఉందని తనకు ఒక స్నేహితుడు సమాచారం ఇచ్చాడని తెలిపారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు రూ. 200 పెన్షన్‌ ఇచ్చినోళ్లు, ఇప్పుడు మాత్రం రూ. 4000 ఇస్తామని మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక వేళ పొరపాటునో.. గ్రహపాటునో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. 6 హామీలు అమలు చేస్తారని.. వాటిని వివరించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కటిక చీకట్లు, కరెంటు కష్టాలు గ్యారంటీ.. తాగునీటి కష్టాలు, ఆడవారికి నీటి తిప్పులు గ్యారంటీ.. ఎరువులు, విత్తనాల కొరత, పోలీస్ స్టేషన్ల ముందు నిలబడటం గ్యారంటీ.. రైతు బంధు రాం రాం, దళిత బంధు బంద్‌ పెడుతారనేది గ్యారంటీ.. సంవత్సరానికి ఒకరు చొప్పున ఐదుగురు సీఎంలు గ్యారంటీ.. రాష్ట్రం సంకనాకి పోవడం గ్యారంటీ.. .. అంటూ కాంగ్రెస్ గ్యారంటీలపై మంత్రి కేటీఆర్ చురకలంటించారు. డబ్బు సంచులతో దొరికిపొయిన వారిని పీసీసీ అధ్యక్షుడిని చేస్తే ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు వస్తాయని అన్నారు. కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.11వేల కోట్లు నిధులు మళ్లించారన్నారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అక్కడ హామీలు అమలు చేయలేక, అభివృద్ధి పనులు చేయలేక చేతులు ఎత్తేశారన్నారు. కరెంటు ఛార్జీలు పెంచారని.. విద్యుత్ సంక్షోభం వచ్చిందని గుర్తుచేశారు.

కాంగ్రెస్‌ దగ్గర డబ్బులు తీసుకోండి.. ఓటు బీఆర్‌ఎస్‌కు వేయండి

తొమ్మిదేండ్ల తెలంగాణలో తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో ఎంతో ముందుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మున్సిపాలిటీలు, గ్రామాలకు అనేక అవార్డులు వచ్చాయన్నారు. ఇంటింటికి నల్లా నీటిని అందిస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును కూడా సీఎం కేసీఆర్ పూర్తి చేస్తారని, తాగునీటిని అందిస్తారన్నారు. 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. రైతు బందు లాంటి పథకాలు అందించే సీఎం కేసీఆర్ పక్షాన ఉంటారో, రాబందు లాంటి కాంగ్రెస్ పక్షాన ఉంటారో ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ వారు డబ్బులు ఇస్తే తీసుకోవాలని, ఓటు మాత్రం బీఆర్ఎస్‌కు వేయాలని సూచించారు. ఈ గట్టున కేసీఆర్ రూపంలో రైతు బంధు ఉంది, ఆ గట్టున కాంగ్రెస్ రూపంలో రాబందులు ఉన్నారంటూ ఏ గట్టున ఉంటారో ఆలోచించుకొండంటూ సూచించారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా విజయం సాధించడం ఖాయమని, ఖమ్మం జిల్లాలోనూ బీఆర్ఎస్ అత్యధిక సీట్లు సాధిస్తుందన్నారు. ఖమ్మం జిల్లాలో కొందరు పార్టీని వీడారని, వారి సమస్యను ప్రజా సమస్యగా చెబుతున్నారని అన్నారు. స్వీయ మానసిక ఆందోళనను ప్రజల బాధగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆనాడు గోదావరి జలాలను ఎందుకు తీసుకురాలేదని కేటీఆర్ ప్రశ్నించారు.

నార్కెట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో కల్లుగీత కార్మికుల మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ

హలో గీతన్న చలో హైదరాబాద్

నార్కెట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో కల్లుగీత కార్మికుల మహా ధర్నా పోస్టర్ ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న వైఎస్ ఎంపీపీ కల్లూరు యాదగిరి గారితో కలిసి ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న వైస్ ఎంపీపీ కల్లూరు యాదగిరి మాట్లాడుతూ ఈనెల 22న ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాకు వేలాదిమంది పాల్గొని జయప్రదం చేయాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి తాళ్లు ఎక్కే క్రమంలో ప్రమాదం జరిగి వందలాదిమంది చనిపోవడం కాళ్లు చేతులు విరగడం నడుము పడిపోవడం జరుగుతుంది.

రెండు రోజులకు ఒకరు చనిపోతున్నారు వీరి ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని అట్లాగే వారికి సేఫ్టీ మోకులు ఇవ్వాలని సభ్యులందరికీ ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని కోరారు గీత కార్మికుని కుటుంబం బతకాలంటే ఈ వృత్తి చాలా ప్రమాదమైనప్పటికీ తాళ్లు ఎక్కడం తప్పట్లేదు ఈ వృత్తిలో సంవత్సరానికి సుమారు 550 మంది చెట్టుపై నుంచి జారిపడుతున్నారు కాళ్లు చేతులు విరుగుతున్నాయి నడుములు పడిపోతున్నాయి 180 మంది చనిపోతున్నారు ఇంత ప్రమాదం ఏ వృత్తిలో లేదు.

కాబట్టి ఈ గీత కార్మికుల్ని కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది మునుగోడు ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకొని గీత కార్మికుల ఓట్లు వేయించుకోవడానికి ఆ పార్టీ మంత్రివర్యులు కేటీఆర్ గారు లిక్కర్ షాపులను సొసైటీలకు ఇస్తామని గీత కార్మికుల ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు ఇటీవల జరిగిన లిక్కర్ షాపుల టెండర్లలో సొసైటీలకు ఇవ్వకుండా పాత పద్ధతిని కొనసాగించడం చాలా దుర్మార్గమైన చర్య అన్నారు.

ఇటీవల బీసీ కుల వృత్తుదారులకు ఇచ్చిన జీవో నెంబర్ 5 ప్రకారం కళ్ళు గీత కార్మికులందరికీ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని సొసైటీలకు భూమి కల్లుకు మార్కెట్ నీర తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలని తదితర సమస్యలన్నీ పరిష్కరించాలని ఈ నెల 22న హైదరాబాదు ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నాకు రాష్ట్ర నలుమూలల నుండి ప్రతి గీత కార్మికుడు కదిలి ఈ ధర్నాను జయప్రదం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అంతటి సత్యనారాయణ బొల్లు రవీందర్ దండు రవి మాడగొని సైదులు దండు శ్రీను కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

sb news

street buzz news Telangana

*వసుధైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ*

వసుధైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలకు పర్యవాణం మీద అవగాహన కల్పిస్తూ, మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా కలిగే ప్రయోజనాలను వారికి తెలియజేస్తూ శ్రీ వసుధైక ఫౌండేషన్ అధ్వర్యంలో చైతన్యపురి, శివాజీ విగ్రహం వద్ద అయిదు వందల మట్టి విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఉదయ్ మరియు పౌండేషన్ మెంబెర్స్ రామయ్య, శ్రీకర్, రమేష్, సూర్య ప్రకాష్ అరిగె, గీత, ప్రవీణ, సాయి ప్రీతమ్, శివ తదితరులు పాల్గన్నారు.