/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz కేంద్రం ప్రవేశపెట్టిన మహిళ 33% రిజర్వేషన్ లో బీసీ ఎస్సీ ఎస్టీ సబ్ కోటాను తేల్చాలని నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన Miryala Kiran Kumar
కేంద్రం ప్రవేశపెట్టిన మహిళ 33% రిజర్వేషన్ లో బీసీ ఎస్సీ ఎస్టీ సబ్ కోటాను తేల్చాలని నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన

కేంద్రం ప్రవేశపెట్టిన మహిళ 33% రిజర్వేషన్ లో బీసీ ఎస్సీ ఎస్టీ సబ్ కోటాను తేల్చాలని నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన

నల్లగొండ జిల్లా కేంద్రంలో మహిళా డిగ్రీ కాలేజీ నుండి క్లాక్ టవర్ జ్యోతిరావు పూలే విగ్రహం వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది.

బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ

పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్లు 33% ప్రవేశపెట్టడాన్ని నలగొండ బీసీ సంక్షేమ సంఘం స్వాగతిస్తూ ఉన్నాం. కానీ గత 25 సంవత్సరాల క్రితమే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు మహిళల రిజర్వేషన్లు సబ్ కోట ఇవ్వకుండా ప్రవేశ పెట్టవద్దని కచ్చితంగా ఆనాడు ప్రతిపక్షాలు అడ్డుకోవడం జరిగింది. ఈనాడు దేశ ప్రధాని మోడీ గారు 33% రిజర్వేషన్ పెట్టడం శుభదాయకం అయినా బీసీ ఎస్సీ ఎస్టీలకు సబ్ కోట తేల్చకుండా దాన్ని ప్రవేశపెట్టడాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న ఆదేశాల మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.

ఇప్పటికైనా గత 75 సంవత్సరాలు 75 సంవత్సరాల కాలంలో బీసీ  ఓట్లు వేసే యంత్రాలుగా ఈ పార్టీలు చూడడం జరుగుతుంది ఇప్పటికైనా సబ్ కోట ఇచ్చి రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాస ప్రసన్న కుమార్ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి పద్మ ప్రసాద్ జిల్లా బీసీ మహిళ అధ్యక్షులు అధ్యక్షురాలు సింగం లక్ష్మి బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కార్యదర్శి కర్నాటి యాదగిరి మార్గం సతీష్ కుమార్ యువజన సంఘం వైస్ ప్రెసిడెంట్ పగిళ్ల కృష్ణ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన సతీష్ యాదవ్ టౌన్ ప్రెసిడెంట్ సదానంద్ వల్ల కీర్తి శ్రీనివాస్ చల్లేటి రవీంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.

SB news

street buzz news

ఈనెల 25న విద్యుత్తు ఏఈ కార్యాలయాల ముందు ధర్నాలు జయప్రదం చేయండి.

ఈనెల 25న విద్యుత్తు ఏఈ కార్యాలయాల ముందు ధర్నాలు జయప్రదం చేయండి.

 100 యూనిట్లు ఉచిత కరెంట్ కై దళిత కుటుంబాల దరఖాస్తులు.

    నిరుపేద దళితులకు జీవో నెంబర్ 342 ప్రకారంగా 100 యూనిట్ల ఉచిత విద్యుత్తు గృహ అవసరాలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ ఏఈ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించి దరఖాస్తులు ఇవ్వనున్నట్లు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు ఈరోజు కెవిపిఎస్ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని పెద్ద బండలో దళితులు చేత దరఖాస్తులు విడుదల చేయడం జరిగింది.

    ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ధనికులకు ఉద్యోగులకు ధనవంతులకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు వృత్తిదారులకు ఉచిత విద్యుత్తు ఇస్తూ భూమిలేని నిరుపేద దళితులకు గృహ అవసరాలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు ఇవ్వాలని డిమాండ్ చేశారు జిల్లాలో 100 అయినట్లు జీవో నెంబర్ 342 ప్రకారం ఇవ్వాల్సి ఉండగా ఎక్కడ అమలు కావడం లేదని ప్రతి దళిత అర్హత గల కుటుంబం కులం సర్టిఫికెట్ ఆధార్ కార్డు విద్యుత్ కనెక్షన్ జిరాక్స్ పత్రాలతో ఏఈ కార్యాలయాల ముందు ధర్నాలకు హాజరై దరఖాస్తుల సమర్పించాలని కోరారు. 

 

 ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గారే నరసింహ జిల్లా నాయకులు కోట సైదులు రత్నం యాదయ్య దాసరి ఆనంద్ దూలపల్లి గిరి చింత ఎల్లయ్య బచ్చలకూరి పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

sb news

street buzz news

కాంగ్రెస్‌ వస్తే సంవత్సరానికి ఒకరు చొప్పున ఐదుగురు సీఎంలు గ్యారంటీ మంత్రి కేటీఆర్‌

కాంగ్రెస్‌ వస్తే సంవత్సరానికి ఒకరు చొప్పున ఐదుగురు సీఎంలు గ్యారంటీ మంత్రి కేటీఆర్‌

అధికారం కోసం కాంగ్రెస్‌ నేతలు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. వాళ్లకు అధికారం కావాలనే లక్ష్యం తప్ప మరేమి కనిపించడం లేదని విమర్శించారు.

కాంగ్రెస్ హామీల్లో అభివృద్ది గురించి ఎక్కడైనా మాట్లాడారా అంటూ నిలదీశారు. 

అధికారం కోసం కాంగ్రెస్‌ నేతలు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. వాళ్లకు అధికారం కావాలనే లక్ష్యం తప్ప మరేమి కనిపించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ హామీల్లో అభివృద్ది గురించి ఎక్కడైనా మాట్లాడారా అంటూ నిలదీశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు చిన్న సత్యనారాయణ బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేతలు ఇటీవల బహిరంగ సభ పెట్టి ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని అడుగుతున్నారని.. 55 ఏండ్లలో 11 ఛాన్స్‌లు ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. కరెంటు ఇవ్వలేదు, తాగునీరు ఇవ్వలేదు, సాగు నీరు ఇవ్వలేదు, రైతు బందు ఇవ్వలేదు, ఏదీ ఇవ్వలేదు. సిగ్గు లేకుండా వచ్చి.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నరని మండిపడ్డారు.

కాంగ్రెస్‌ నాయకులు నోటికి వచ్చిన వాగ్ధానాలు ఇస్తున్నారని, ఎంత వస్తే అంత చెబుతున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

కాంగ్రెస్‌ హామీల విలువ రాష్ట్ర బడ్జెట్‌ కంటే ఎక్కువగా ఉందని తనకు ఒక స్నేహితుడు సమాచారం ఇచ్చాడని తెలిపారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు రూ. 200 పెన్షన్‌ ఇచ్చినోళ్లు, ఇప్పుడు మాత్రం రూ. 4000 ఇస్తామని మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక వేళ పొరపాటునో.. గ్రహపాటునో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. 6 హామీలు అమలు చేస్తారని.. వాటిని వివరించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కటిక చీకట్లు, కరెంటు కష్టాలు గ్యారంటీ.. తాగునీటి కష్టాలు, ఆడవారికి నీటి తిప్పులు గ్యారంటీ.. ఎరువులు, విత్తనాల కొరత, పోలీస్ స్టేషన్ల ముందు నిలబడటం గ్యారంటీ.. రైతు బంధు రాం రాం, దళిత బంధు బంద్‌ పెడుతారనేది గ్యారంటీ.. సంవత్సరానికి ఒకరు చొప్పున ఐదుగురు సీఎంలు గ్యారంటీ.. రాష్ట్రం సంకనాకి పోవడం గ్యారంటీ.. .. అంటూ కాంగ్రెస్ గ్యారంటీలపై మంత్రి కేటీఆర్ చురకలంటించారు. డబ్బు సంచులతో దొరికిపొయిన వారిని పీసీసీ అధ్యక్షుడిని చేస్తే ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు వస్తాయని అన్నారు. కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.11వేల కోట్లు నిధులు మళ్లించారన్నారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అక్కడ హామీలు అమలు చేయలేక, అభివృద్ధి పనులు చేయలేక చేతులు ఎత్తేశారన్నారు. కరెంటు ఛార్జీలు పెంచారని.. విద్యుత్ సంక్షోభం వచ్చిందని గుర్తుచేశారు.

కాంగ్రెస్‌ దగ్గర డబ్బులు తీసుకోండి.. ఓటు బీఆర్‌ఎస్‌కు వేయండి

తొమ్మిదేండ్ల తెలంగాణలో తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో ఎంతో ముందుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మున్సిపాలిటీలు, గ్రామాలకు అనేక అవార్డులు వచ్చాయన్నారు. ఇంటింటికి నల్లా నీటిని అందిస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును కూడా సీఎం కేసీఆర్ పూర్తి చేస్తారని, తాగునీటిని అందిస్తారన్నారు. 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. రైతు బందు లాంటి పథకాలు అందించే సీఎం కేసీఆర్ పక్షాన ఉంటారో, రాబందు లాంటి కాంగ్రెస్ పక్షాన ఉంటారో ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ వారు డబ్బులు ఇస్తే తీసుకోవాలని, ఓటు మాత్రం బీఆర్ఎస్‌కు వేయాలని సూచించారు. ఈ గట్టున కేసీఆర్ రూపంలో రైతు బంధు ఉంది, ఆ గట్టున కాంగ్రెస్ రూపంలో రాబందులు ఉన్నారంటూ ఏ గట్టున ఉంటారో ఆలోచించుకొండంటూ సూచించారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా విజయం సాధించడం ఖాయమని, ఖమ్మం జిల్లాలోనూ బీఆర్ఎస్ అత్యధిక సీట్లు సాధిస్తుందన్నారు. ఖమ్మం జిల్లాలో కొందరు పార్టీని వీడారని, వారి సమస్యను ప్రజా సమస్యగా చెబుతున్నారని అన్నారు. స్వీయ మానసిక ఆందోళనను ప్రజల బాధగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆనాడు గోదావరి జలాలను ఎందుకు తీసుకురాలేదని కేటీఆర్ ప్రశ్నించారు.

నార్కెట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో కల్లుగీత కార్మికుల మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ

హలో గీతన్న చలో హైదరాబాద్

నార్కెట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో కల్లుగీత కార్మికుల మహా ధర్నా పోస్టర్ ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న వైఎస్ ఎంపీపీ కల్లూరు యాదగిరి గారితో కలిసి ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న వైస్ ఎంపీపీ కల్లూరు యాదగిరి మాట్లాడుతూ ఈనెల 22న ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాకు వేలాదిమంది పాల్గొని జయప్రదం చేయాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి తాళ్లు ఎక్కే క్రమంలో ప్రమాదం జరిగి వందలాదిమంది చనిపోవడం కాళ్లు చేతులు విరగడం నడుము పడిపోవడం జరుగుతుంది.

రెండు రోజులకు ఒకరు చనిపోతున్నారు వీరి ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని అట్లాగే వారికి సేఫ్టీ మోకులు ఇవ్వాలని సభ్యులందరికీ ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని కోరారు గీత కార్మికుని కుటుంబం బతకాలంటే ఈ వృత్తి చాలా ప్రమాదమైనప్పటికీ తాళ్లు ఎక్కడం తప్పట్లేదు ఈ వృత్తిలో సంవత్సరానికి సుమారు 550 మంది చెట్టుపై నుంచి జారిపడుతున్నారు కాళ్లు చేతులు విరుగుతున్నాయి నడుములు పడిపోతున్నాయి 180 మంది చనిపోతున్నారు ఇంత ప్రమాదం ఏ వృత్తిలో లేదు.

కాబట్టి ఈ గీత కార్మికుల్ని కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది మునుగోడు ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకొని గీత కార్మికుల ఓట్లు వేయించుకోవడానికి ఆ పార్టీ మంత్రివర్యులు కేటీఆర్ గారు లిక్కర్ షాపులను సొసైటీలకు ఇస్తామని గీత కార్మికుల ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు ఇటీవల జరిగిన లిక్కర్ షాపుల టెండర్లలో సొసైటీలకు ఇవ్వకుండా పాత పద్ధతిని కొనసాగించడం చాలా దుర్మార్గమైన చర్య అన్నారు.

ఇటీవల బీసీ కుల వృత్తుదారులకు ఇచ్చిన జీవో నెంబర్ 5 ప్రకారం కళ్ళు గీత కార్మికులందరికీ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని సొసైటీలకు భూమి కల్లుకు మార్కెట్ నీర తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలని తదితర సమస్యలన్నీ పరిష్కరించాలని ఈ నెల 22న హైదరాబాదు ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నాకు రాష్ట్ర నలుమూలల నుండి ప్రతి గీత కార్మికుడు కదిలి ఈ ధర్నాను జయప్రదం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అంతటి సత్యనారాయణ బొల్లు రవీందర్ దండు రవి మాడగొని సైదులు దండు శ్రీను కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

sb news

street buzz news Telangana

*వసుధైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ*

వసుధైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలకు పర్యవాణం మీద అవగాహన కల్పిస్తూ, మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా కలిగే ప్రయోజనాలను వారికి తెలియజేస్తూ శ్రీ వసుధైక ఫౌండేషన్ అధ్వర్యంలో చైతన్యపురి, శివాజీ విగ్రహం వద్ద అయిదు వందల మట్టి విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఉదయ్ మరియు పౌండేషన్ మెంబెర్స్ రామయ్య, శ్రీకర్, రమేష్, సూర్య ప్రకాష్ అరిగె, గీత, ప్రవీణ, సాయి ప్రీతమ్, శివ తదితరులు పాల్గన్నారు.

దివ్యాంగుడు మరియు దివ్యాంగుల కోసం పోరాడే నాయకుడు పల్లకొండ కుమారస్వామిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన...

దివ్యాంగుడు మరియు దివ్యాంగుల కోసం పోరాడే నాయకుడు పల్లకొండ కుమారస్వామిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన...

      

వరంగల్ జిల్లా చెన్నారావుపేట గ్రామానికి చెందిన పల్లకొండ సారయ్య ఎస్టీ,ఎరుకల కులం,నిరుపేద కుటుంబం,పందుల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు.అతనికి భార్య,ఇద్దరు పుట్టుకతో వికలాంగులు ఉన్నారు.వికలాంగుడైన పల్లకొండ కుమారస్వామి,పై చదువులు చేసిన జాబ్ లేదు,అతనికి పెళ్లి చేస్తే భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇంటి పెద్ద యజమాని గత 44సం,,రాలు గా 1979 సం.రంలో 1650 రూ.లకు స్థిర నివాసం దాదాపు గా 2 గుంటల స్థలాన్ని కొనుగోలు చేసి ఆ స్థలంలో ఇంటిని నిర్మించుకొని ఉంటున్నారు.అప్పుడు రోడ్ కి ఇరువైపులా 50 పీట్లు తీసి కొనుగోలు చేయడం జరిగింది.

వారి ఇంటి వెనుకల పందుల షెడ్ కోసం ఒక గుంట స్థలం వదిలి పెట్టి ఇంటిని నిర్మిచుకునే ముందు అగ్రవర్ణాల కులానికి చెందిన ఒక వ్యక్తి ఇది నా భూమి అని వారిపై డాడీ చేసిన వెనుకాకు కట్ట వలిసిన ఇంటిని రోడ్డుకి ఇరువైపులా 33 పీట్ల తీసి ఇవ్వడం వల్ల ఇటీవల 80 పీట్ల రోడ్ వెడల్పు విస్తీరంలో ఇంటిని తొలిగించడం వల్ల నష్ట పోయారు.ఇంకా 100 పీట్ల హైవే రోడ్ వస్తే పూర్తిగా ఆ ఇంటిని తొలిగిస్తే పూర్తిగా నష్ట పోయే అవకాశం ఉంది.కనుక వెనుక ఉన్న స్థలంలో గృహ లక్ష్మి కింద ఇంటిని నిర్మిచుకుంటుంటే వారిపై దాడి చేసే ప్రయత్ననికి పాల్పడుతూ అడ్డు పడుతున్నారు. వారికి కొందరి నాయకుల నుంచి ప్రాణ హాని ఉందనీ,దయచేసి ప్రభుత్వం నుంచి ఆదుకోవాలని ఆ వికలాంగుల కుటుంబం వేడుకుంటుంది.

నల్లగొండలో 40 వ వార్డు సావర్కర్ నగర్ లోని వినాయకుని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కంచర్ల, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి

 నల్లగొండ శాసనసభ్యులు,

 కంచర్ల భూపాల్ రెడ్డి గారు..

గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు రెండవ రోజు...

 పట్టణంలోని 40 వ వార్డు సావర్కర్ నగర్ లో... నీలగిరి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో... ఏర్పాటు చేసిన వినాయక మండపంలో.., ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం జరిగిన. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు..

ఈ సందర్భంగా ఆ కంచర్ల మాట్లాడుతూ ఆ విఘ్ననాధుడు అందరినీ చల్లగా చూడాలని ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని.. ఆ దేవదేవుని వేడుకుంటున్నట్లు తెలియజేశారు... అదేవిధంగా నల్లగొండలో నల్లగొండలో 1200 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న... అభివృద్ధికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన పూర్తయ్యే విధంగా భగవంతుని కోరుకున్నట్టు తెలియజేశారు.

 ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పట్ల పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ కార్యదర్శి సంధినేని జనార్ధన్ రావు మాజీ కౌన్సిలర్ నాంపల్లి శ్రీనివాస్ కాకునూరి వీరాచారి, మామిడి పద్మ సువర్ణ, గుంటూజు బ్రహ్మచారి, ఉత్సవ కమిటీ నాయకులు నాంపల్లి ప్రణయ్ మునాస సాయి మేకల రవి... తదితరులు పాల్గొన్నారు

కేంద్రం ప్రకటించిన 33% మహిళా రిజర్వేషన్ లో భాగంగా తెలంగాణలో 39 స్థానాలు మహిళలకు ఇవ్వాల్సి వస్తే అత్యధిక మహిళలు కలిగిన అసెంబ్లీ స్థానాలు ఇవే..

ఈ స్థానాలు మహిళలకే`

చట్టసభల్లో మహిళా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలపై చర్చ నెలకొంది. రాష్ట్రంలో 39-40 స్థానాలు నారీమణులకు కేటాయించే అవకాశం ఉంది. అత్యధిక మహిళా జనాభా ఆధారంగా నియోజకవర్గాల కేటాయింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇదే కనుక నిజమైతే

నిర్మల్, ముథోల్, పెద్దపల్లి, మంథని, కరీంనగర్, హుజురాబాద్, సిరిసిల్ల, నిజామాబాద్ అర్బన్, రూరల్ స్థానాలు, జహీరాబాద్, కామారెడ్డి, పటాన్ చెరు, గజ్వేల్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, జూబ్లిహిల్స్, నాంపల్లి, కార్వాన్, యాకత్ పురా, శేరిలింగంపల్లి, చేవెళ్ల, మహబూబ్ నగర్, మక్తల్, వనపర్తి, గద్వాల్, హుజూర్ నగర్, దేవరకొండ, తుంగతుర్తి, మునుగోడు, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్, ములుగు, పినపాక, ఇల్లందు, మహబూబాబాద్, సత్తుపల్లి, కొత్తగూడెం తో పాటు మరికొన్ని స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది.

SB news

Streetbuzz news

రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ గా వెంపటి వెంకటేశ్వర రావు నియామకం

రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ గా వెంపటి వెంకటేశ్వర రావు నియామకం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ గా వెంపటి వెంకటేశ్వరరావు నియామకమయ్యారు. ఈ మేరకు హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అమరవాధి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.

వీరు గతంలో సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ చైర్మన్ బాధ్యతలు నిర్వహించి ఆ పదవికే వన్నె

తేవడంతో పాటు ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదుగుటకు తమ వంతు కృషి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ గా నియామకమైన సందర్భంగా పలువురు జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాపై నమ్మకంతో రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ నియమించినందుకు అమరవాది లక్ష్మీనారాయణకు, సహకరించినందుకు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మా శెట్టి అనంతరాములకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు.

ఆర్యవైశ్యులు సామాజిక వ్యాపార రంగంతో పాటు రాజకీయరంగంలో సైతం రాణించే విధంగా తన కృషి చేస్తానని తెలిపారు.

నల్లగొండ పానగల్లు రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎన్జీ కాలేజ్ కాంటాక్ట్ లెక్చలర్ దంపతుల పార్థియాదేహాలను దర్శించి ఆర్ధిక సాయాన్ని ప్రకటించిన ఎమ్మెల్యే

 నేడు నల్లగొండ పానగల్లు రోడ్డు ప్రమాదంలో మరణించిన దంపతుల కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన కంచర్ల*..

ఈరోజు ఉదయం.. పానగల్ వద్ద.. మార్నింగ్ వాక్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని...మరణించిన ఓర్సు విష్ణు మూర్తి, స్వప్న దంపతుల పార్థివ దేహాలను..

 నల్లగొండ శాసనసభ్యులు,

 కంచర్ల భూపాల్ రెడ్డి గారు...

 ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో సందర్శించి నివాళులర్పించారు...

 NG కళాశాల లో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పని చేస్తున్న... విష్ణుమూర్తి అతని భార్య స్వప్న... రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత దురదృష్టకరమైన విషయమని ... వారి పిల్లలు అనాధలయ్యారని.. వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని... కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు..

 వారి పిల్లల పేరు మీద రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామని... ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలియజేశారు.

 

మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి.. సీనియర్ నాయకులు బక్క పిచ్చయ్య, స్థానిక కౌన్సిలర్ ఆలకుంట్ల మోహన్ బాబు, పట్టణ పార్టీ కార్యదర్శి సందినేని జనార్దన్ రావు సూర మహేష్ తదితరులు వెంట ఉన్నారు