/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz ఒడిశా ని వనికిస్తూన్న స్క్రబ్‌ టైఫస్‌ 180 మందికి పాజిటీవ్ Miryala Kiran Kumar
ఒడిశా ని వనికిస్తూన్న స్క్రబ్‌ టైఫస్‌ 180 మందికి పాజిటీవ్

ఒడిశా ని వనికిస్తూన్న స్క్రబ్‌ టైఫస్‌ 180 మందికి పాజిటీవ్

శివ శంకర్. చలువాది

ఒడిశా రాష్ట్రంలో స్క్రబ్‌ టైఫస్‌ విజృంభిస్తోంది. 

బాధితుల సంఖ్య ఆదివారానికి 180కి చేరుకుంది. 

ఇప్పటివరకు సేకరించి పంపిన 59 శాంపిళ్లలో 11 స్క్రబ్‌ టైఫస్‌ పాజిటివ్‌గా వెల్లడైనట్లు ఆరోగ్య శాఖాధికారులు వెల్లడించారు. 

మొత్తం 180 మంది బాధితుల్లో ఇతర రాష్ట్రాల వారు 10 మంది ఉన్నారన్నారు. 

సుందర్‌గఢ్, బర్గఢ్‌ జిల్లాల్లో కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. 

రాష్ట్రంలో ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారు.

దివ్యాంగుల కోసం వినూత్న పథకాలు: మంత్రి కొప్పుల

దివ్యాంగుల కోసం వినూత్న పథకాలు: మంత్రి కొప్పుల

ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరైనా కలగని ఆత్మసంతృప్తి ఈ కార్యక్రమంలో కలుగుతున్నదని మంత్రి కొప్పుల 

జగిత్యాల జిల్లా//

ధర్మపురి SH గార్డెన్ లో ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన141మంది దివ్యాంగులకు తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో సుమారు 70 లక్షల విలువ గల ఉచిత సహాయక ఉపకరణాలను 1 బ్యాటరీ ఆపరేటర్ వీల్‌చైర్, 110 ఆపరేటర్ బ్యాటరీ ట్రైసైకిల్లు, 30 స్కూటీలు మొదలగు పరికరాలు అర్హులైన దివ్యాంగువకు పంపిణీ చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ

సమైక్య పాలనలో వికలాంగులను పట్టించుకోలేదు. వికలాంగుల శాఖ మొక్కుబడిగా ఉండేది, వారి అవసరాలను తీర్చేది కాదు, 

కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ దివ్యాంగులకు 200 ఇస్తుండే, వారిని ఈ దివ్యాంగులకు ఫించన్ పెంచాలని సోయి జ్ఞానం ఉందా అని మంత్రి ప్రశ్నించారు..

దివ్యాంగులను కన్నబిడ్డల్లా అక్కున చేర్చుకున్న ఘనత సిఎం కెసిఆర్ గారిది, తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుంది.

గతం లో కాంగ్రెస్ పార్టీ పాలనలో దివ్యాంగులకు 50 శాతం సబ్సిడీ కింద ఈ ఉపకరణాలు అందించారు, కాని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులకు ఈ ఉపకరణాలను ఉచితంగా అందించడం జరుగుతోంది.. కెసిఆర్ గారు ఒక మానవీయ కోణంతో ఆలోచించి, వారికి ఉచితంగా అందిస్తున్నారు

దివ్యాంగుల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగంలో ఉన్నది. దివ్యాంగులకు బాసటగా నిలవడమే తెలంగాణ ప్రభుత్వ ఆశయం. సాటి మనిషి కష్టం, బాధ అర్థం చేసుకొని తీర్చగలిగినప్పుడే మానవ జన్మకు అర్థం, పరమార్థం ఉంటాయని సీఎం కేసీఆర్‌ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. వారి ముఖాల్లో చిరునవ్వు ఉంటేనే ప్రభుత్వంగా మాకు ఆత్మ సంతృప్తి ఉంటుంది.

దివ్యాంగులకు వినూత్న సంక్షేమ పథకాలు అమలుచేస్తూ దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ముందున్నదని చెప్పారు.

దివ్యాంగుల్లో ఆత్మగౌరవాన్ని పెంచడంతోపాటు.. ఎవరి సాయం లేకున్నా బతకగలమనే ఆత్మైస్థెర్యాన్ని వారిలో నింపిందని పేర్కొన్నారు. 

వికలాంగులకు రూ.3016 పింఛన్ ను 4016 గా పెంచి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.

ఏటా దివ్యాంగులకు రూ.1,800 కోట్లు పింఛన్‌ ఇస్తున్నాయని మంత్రి తెలిపారు. అర్హులైనవారు ఎవరు దరఖాస్తు చేసుకున్నా పరికరాలు అందజేస్తామని చెప్పారు.

ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరైనా కలగని ఆత్మసంతృప్తి ఈ కార్యక్రమంలో కలుగుతున్నదని మంత్రి తెలిపారు 

అన్నివర్గాలు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ముందుకు వెళుతున్నారని మంత్రి తెలిపారు.

మానవత్వం చాటుకున్న నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు.

మానవత్వం చాటుకున్న నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు.

ఈనెల 03 వ తారీఖు నాడు నల్గొండ పట్టణం స్ధానిక 27 వ వార్డు నందు నివాసం ఉంటున్న సిగిలంభట్ల వెంకటేశ్వర్లు గారు అనారోగ్యంతో మరణించారని విషయం తెలుసుకున్న ఎమ్మేల్యే భూపాలన్న గారు ఆరోజు వార్డు నకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారు ఉండటానికి కూడా నివాసం లేదని స్ధానిక కౌన్సిలర్ వట్టిపల్లి శ్రీనివాస్ గారి ద్వారా విషయం తెలుసుకుని వారితో మాట్లాడి వీలైతే గృహలక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తానని ఖర్చులకు అవసరాలకు నిమిత్తం 20వెలు రూపాయలు ఆర్థిక సహాయం కింద ఇస్తానని హామీ ఇచ్చి... ఇచ్చిన మాట ప్రకారం నేడు వారి కుటుంబ సభ్యులను పిలిపించి 20వేల రూపాయలను అందియడం జరిగింది.

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ వట్టిపల్లి శ్రీనివాస్ గారు, పట్టణ అధ్యక్షులు బోనగిరి దేవేందర్ గారూ, పట్టణ జాయింట్ సెక్రటరీ ఒప్పల. మారుతి ప్రకాష్ గారు తదితరులు ఉన్నారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా గురుకుల పాఠశాలలో మట్టి వినాయకుని బహూకరించిన సామాజిక కార్యకర్త, మానవ హక్కుల(NHRC)) డివిజన్ కార్యదర్శి సాధిక్ పాషా

పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మట్టి వినాయకుడిని పూజించాలని నల్గొండ గురుకుల పాఠశాలకు మట్టి వినాయకుని బహుకరించిన సామాజిక కార్యకర్త సాధిక్ పాష

పర్యావరణాన్ని కాపాడే బాధ్యత దేశంలో ప్రతి ఒక్కరికి ఉందని, పర్యవరణాన్ని కాపాడడంలో ప్రతి ఒక్కరు తమ బాధ్యత నిర్వర్తించాలని, పర్యావరణ పరిరక్షణ కొరకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని, తన వంతుగా నల్గొండ పట్టణంలోని బీసీ గురుకుల పాఠశాలలో మట్టి వినాయకుని బహుకరించి తన వంతుగా పర్యావరణ పరిరక్షణకై అడుగు వేశానని ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఇదే బాటలో నడవాలని ఈ సందర్భంగా సాధిక్ బాషా గారు ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, కత్తుల శంకర్, ఏ.టి.పి,డి.డబ్లు, అశోక రాణి మరియు ఇతర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు

మరోసారి చిన్నారులపై వీధి కుక్కల దాడి గాయపడ్డ చిన్నారులు

వీధి కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారులను పరామర్శించిన ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు గారు

చిన్నారులపై కుక్కల దాడి జరగడం విచారకరం ఇలాంటి ఘటన పునవ్రతం కాకుండా చూసుకుంటాం....... దమ్మలపాటి వెంకటేశ్వరరావు ఇల్లందు మున్సిపల్ చైర్మన్

భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు పట్టణం: పురపాల సంఘం పరిధిలోని 23వ వార్డు మైనార్టీ స్కూల్ సమీపంలో ఉదయం ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేశాయి. దాడిలో గాయపడ్డ చిన్నారులను ఇల్లందు ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలాపాటి వెంకటేశ్వరరావు గారు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని చిన్నారులను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ..

చిన్నాలపై కుక్కల దాడి చాలా విచారకరమన్నారు. మళ్లీ ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు చేపడతామని తెలియజేశారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికే వందల సంఖ్యలో కుక్కలను రిహబిలైట్ సెంటర్ కి తరలించామని తెలియజేశారు.

రేషన్ వినియోగదారుల కు ముఖ్యమైన సమాచారం.. మీ సందేహాలను తెలుసుకోండి..

రేషన్ వినియోగదారుల కు ముఖ్యమైన సమాచారం

 రేషన్ కార్డు లో నమోదైయున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు వారి యొక్క ఆధార్ కార్డుకు రేషన్ కార్డులో ఉన్న తమ పేరును అనుసంధానం  కావడానికి  ( ధ్రువీకరణ ) ekyc  చేయించుకోవాలి.మీ దగ్గర లో ఉన్న రేషన్ షాపుకువెళ్లి మీ వెలిముద్ర లేదా ఐరిష్ తో మీ ఆదార్ కార్డును అనుసంధానం చేసుకోకపోతే మీ పేరు పైన వచ్చే బియ్యం నిలిచిపోయే అవకాశాలు ఉంటాయి.కావున వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరు ekyc కొచ్చే సందేహాలు/నివృత్తి_ మా ఇంట్లో 5 మందిమి ఉన్నాము కార్డులో ఉన్న ఎవరమైన ఒకరము వచ్చి వేలి ముద్ర వేస్తే కాదు కార్డులో నమోదైయున్న ప్రతి కుటుంబసభ్యుడు కచ్చితంగా రేషన్ షాపుకు వచ్చి వేలిముద్ర లేదా ఐరిష్ ఇవ్వాల్సి ఉంటుంది

2) మా కార్డులో పేర్లు ఉన్న. అయిదు మందిలో ప్రస్తుతం ఇద్దరమే ఉన్నాము ,మిగతా ఇద్దరు బ్రతుకు. దెరురువుకొరకు బొంబాయి మరియు హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లినారు ,మరి వారు వేలి ముద్ర వేయకపోతే బియ్యం లేదు ,తెలంగాణ రాష్ట్రంలో మీకు దగ్గరలో ఉన్న ఏ రేషన్ షాపుకైనా వెళ్లి మీ కార్డు నంబర్ చూయించి అందులోని మీ పేరును తెలిపి వెలిముద్ర ఇచ్చి ekyc పూర్తి చేసుకోవచ్చు.అయితె మీ పేరు నమోదైన షాపులో ekyc చేయించుకోవడం ఉత్తమం , ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు, వారు వచ్చినప్పుడు వెలిముద్ర ఇచ్చి ekyc చేయించుకోవచ్చును. 

3) మా ఇంట్లో ఇంకా నలుగురు పిల్లల యొక్క పేర్లు,, కొడుకులు /కూతుర్లు పేర్లు రేషన్ కార్డులో లేవు మరి వారి పరిస్థితి ఇట్టి ekyc అందరివి పూర్తి స్థాయిలో అయిపోయిన తరువాత అట్టి వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కావున రేషన్ కార్డులో పేరు లేని వారిని రేషన్ షాపుకు తీసుకురావాల్సిన అవసరం లేదు..

4) మా కోడలు పేరు వారి పుట్టింటి ఊరిలో ఉంది ,ఇక్కడ ekyc పుట్టింటి ఊరిలో వీరి పేరు రేషన్ కార్డులో నమోదై ఉంటే అక్కడి కార్డు నంబర్ వ్రాసుకొని వచ్చి ఇక్కడకూడా ekyc చేయించుకోవచచ్చు ఒకవేళ వీరి పేరు  కార్డులో తొలగించికొని ఉంటే అక్కడ గాని, ఇక్కడగాని, ekyc చేయించుకోవడానికి రాదు

5) ఇట్టి ekyc చేయించుకోవాడానికి రేషన్ షాపులో డబ్బులేమైన లేదు ఇట్టి పనిని పూర్తిగా ఉచితంగా నే చేయబడును..

6) రేషన్ షాపుకు కుటుంబసభ్యులు అందరు ఒకేసారి వచ్చి ekyc ఎవరు ఉంటే వారు ekyc చేసుకోవచ్చు,కాకపోతే షాపుకు వచ్చే ప్రతి ఒక్కరు తమ రేషన్ కార్డు లేదా కార్డు తీసుకరావలసి ఉంటుంది లేదా కార్డు నంబర్ వ్రాసుకు రావాలి..

7) మా ఇంట్లో కొందరివి వేలిముద్రలు కానీ కనుపాప కాని స్కాన్ కావడం లేదు వారి పరిస్థితి దగ్గర లో ఉన్న ఆధార్ సెంటర్ కు వెళ్లి వేలి ముద్ర /కనుపాప ఇచ్చి మీ ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకున్న తరువాత రేషన్ షాపుకు వచ్చి ekyc చేయించుకోవాలి,అక్కడ కూడా ఆదార్ నంబర్ కు అనుసంధానం కాకపోతే అట్టి వాటిపై ప్రభుత్వం ఏదైనా మార్గదర్శకాలు ఇవ్వవచ్చు ,వేచిచూడాలి

-:గమనిక:-

ఇట్టి eKyc ని రేషన్ షాపుల పని దినాలలో షాపులు తెరచివుంచిన సమయంలో ఎప్పుడైనా ,ఎక్కడైనా చేయించుకోవచ్చు..

మీకు ఇట్టి ekyc చేయించుకోవడంలో ఇంకెలాంటి సందేహాలున్న సంబంధిత తహసీల్దార్ గారిని గాని ,మీ స్థానిక డీలర్ ను గాని సంప్రదించగలరు.

కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం.. కోజికోడ్ లో విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపు

కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం.. కోజికోడ్ లో విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపు

వైరస్ కారణంగా ఇద్దరి మృతి 

విద్యాసంస్థలకు రేపటి వరకు సెలవులు

కోజికోడ్ కు చేరుకున్న కేంద్ర బృందం

ఇతర రాష్ట్రాల నుండి కేరళ వెళ్లే ప్రయాణికులు జాగ్రత.. అని హెచ్చరిస్తున్న.. ఆరోగ్య నిపుణులు

కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం కోజికోడ్‌లోని పాఠశాలలు, కళాశాలలకు రేపటి వరకు సెలవులను పొడిగించింది. రాష్ట్రంలో ఈ వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కోజికోడ్ జిల్లాలోని అంగన్‌వాడీలు, మదర్సాలు, ట్యూషన్ సెంటర్లు, ప్రొఫెషనల్ కాలేజీలు సహా అన్ని విద్యాసంస్థలకు గత రెండు రోజులుగా సెలవులు ఇచ్చారు. అనవసర ప్రయాణాలు, సమావేశాలకు దూరంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోజికోడ్ కలెక్టర్ ప్రజలను కోరారు. 

మరోవైపు రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించడానికి కేంద్రం నుంచి ఒక బృందం కోజికోడ్ చేరుకుంది. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులతో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమావేశమయ్యారని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఈ సమావేశంలో ఆగస్టు 30న మరణించిన మొదటి వ్యక్తిని కాంటాక్ట్ అయిన హై-రిస్క్ కాంటాక్ట్ గ్రూప్‌లో ఉన్న వారందరి నమూనాలను తీసుకోవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం 14 మంది ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. వారి నమూనాలను కూడా తీసుకొని ల్యాబ్‌కు పంపుతామన్నారు. వైరస్ సోకిన 9 ఏళ్ల బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.

వెల్డింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు పని కల్పించాలి,సింగరేణిలో యూస్ అండ్ త్రో విధానం పోవాలి వెల్డింగ్

వెల్డింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు పని కల్పించాలి

 సింగరేణిలో యూస్ అండ్ త్రో విధానం పోవాలి వెల్డింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు పని కల్పించాలి

సింగరేణిలో యూస్ అండ్ త్రో విధానం పోవాలి

 సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు యర్రగాని కృష్ణయ్య డిమాండ్*

  

 సింగరేణి కొత్తగూడెం సెంట్రల్ వర్క్ షాపులో గత 5 సంవత్సరాల నుండి పనిచేస్తున్న వెల్డింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు పని కల్పించాలని పర్మనెంట్ కార్మికుల వచ్చారు కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులకు పని లేదు అని టెండర్లు పిలవకుండా కాంట్రాక్ట్ కార్మికులకు పని లేకుండా చేయడం సరైనది కాదని తక్షణమే వారికి పని కల్పించాలని AITUC అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు యర్రగాని కృష్ణయ్య డిమాండ్ చేశారు.శుక్రవారం నాడు సెంట్రల్ వర్క్ షాప్ జనరల్ మేనేజర్ శ్రీ యన్.దామోదర్ గారికి వినతి పత్రం సమర్పించిన అనంతరం వెల్డింగ్ కాంట్రాక్టు కార్మికుల సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ..

వర్క్ షాపులో వెల్డర్స్ లేనప్పుడు మరియు కరోనా అత్యవసర పరిస్థితుల్లో కాంట్రాక్ట్ కార్మికులతో పని చేయించుకొని నేడు టెండర్లు పిలవకుండా అనేక సంవత్సరాల నుంచి పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు పనిలేకుండా చేయడం చాలా దుర్మార్గమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇదే పనిని నమ్ముకొని ఆధారపడి ఉన్న వెల్డింగ్ కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలను వీధిన పడేయటం సరైనది కాదని విమర్శించారు.ఇప్పటికైనా సింగరేణి ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తక్షణమే టెండర్లు పిలవడం కానీ, ప్రత్యామ్నాయ పనులు కల్పించడం ద్వారా కానీ వెల్డింగ్ కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు జహెద్, మదర్,రవి,అజయ్,శంకర్ తదితరులు పాల్గొన్నారు

ఎమ్మెల్సీ కుర్ర. సత్యనారాయణను కలిసిన ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ, విద్యార్థి సంఘం నాయకులు కట్టెల శివకుమార్

ఎమ్మెల్సీ కుర్ర. సత్యనారాయణ కలిసిన ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ, విద్యార్థి సంఘం నాయకులు

హైదరాబాదులోని తెలంగాణ ఎరుకల సంఘం( కుర్రు) రాష్ట్ర గౌరవ వ్యవస్థాపకులు. మాజీ శాసనసభ్యులు . కాబోయే.ఎమ్మెల్సీ . కుర్ర . సత్యనారాయణ ను ఆయన చాంబర్లో గురువారం ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంపల్లి బిక్షపతి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని కోరినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.

అంగన్ వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతు తెలియజేస్తున్న బిజెపి నాయకులు నాగం వర్షిత్ రెడ్డి

అంగన్ వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతు తెలియజేస్తున్న బిజెపి నాయకులు

నల్లగొండ పట్టణంలో ఐసీడీఎస్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్ జేఏసీ ఆధ్వర్యంలో అంగన్వాడి ఉద్యోగులకు పర్మనెంట్ చేయాలని కనీస వేతనం 26000 రూపాయలు చెల్లించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్లు పెంచాలని గత నాలుగు రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మె కు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు నాగం వర్శిత్ రెడ్డి గారు మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి చాకిరి చేయిస్తుంది కానీ వారికి పనికి తగ్గ ప్రతిఫలం అందియకుండా నిర్లక్ష్యం చేస్తున్న ఈ ప్రభుత్వ తీరును ఎండగట్టారు కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలకు నిధులు ఇస్తున్న సరిగ్గా వినియోగించుకోలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని తెలియజేశారు.అంగన్వాడి ఉద్యోగుల డిమాండ్లు నెరవేరిచే వరకు మేము వారితో పాటు అండగా ఉండి పోరాడుతామని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దాసోజు యాదగిరచారి,కాశమ్మ,నరేందర్ రెడ్డి,పల్లె ప్రకాష్,మధు,శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.