/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz అంత‌ర్జాతీయ క్రికెట్‌లో తొలి ట్రాన్స్‌జెండ‌ర్ Miryala Kiran Kumar
అంత‌ర్జాతీయ క్రికెట్‌లో తొలి ట్రాన్స్‌జెండ‌ర్

*అంత‌ర్జాతీయ క్రికెట్‌లో తొలి ట్రాన్స్‌జెండ‌ర్* 

కెనడాకు చెందిన డేనియెల్లె మెక్‌గ‌హే(Danielle McGahey) త్వ‌ర‌లోనే అంత‌ర్జాతీయ‌ క్రికెట్‌లో అరంగేట్రం చేయ‌నుంది. దాంతో, తొలి ట్రాన్స్‌జెండ‌ర్ క్రికెట‌ర్‌(First Transgender Cricketer)గా ఆమె గుర్తింపు చరిత్ర సృష్టించ‌నుంది.

ఓపెనింగ్ బ్యాట‌ర్ అయిన డేనియెల్లె వ‌చ్చే ఏడాది పొట్టి ప్రపంచ క‌ప్ క్వాలిఫ‌యింగ్ స్క్వాడ్‌(2024 Women’s T20 World Cup Qualifying Squad)లో చోటు ద‌క్కించుకుంది.

ఐసీసీ(ICC) నుంచి ఎలాంటి అభ్యంత‌రాలు లేక‌పోవ‌డంతో కెన‌డా సెలెక్ట‌ర్లు డేనియెల్లేను సెలెక్ట్ చేశారు.

‘నేను క్రికెట‌ర్ అవుతాన‌ని క‌లలో కూడా అనుకోలేదు. అలాంటిది ఇప్పుడు మా క‌మ్యూనిటీ త‌ర‌ఫున దేశానికి ప్రాతినిధ్యం వ‌హించ‌బోతున్నా. అందుకు చాలా సంతోషంగా, చాలా గ‌ర్వంగా ఉందని అన్నారు.

క్యాన్సర్ ప్రమాదకరమైన వ్యాధి కాదు!

క్యాన్సర్ ప్రమాదకరమైన వ్యాధి కాదు!

```డాక్టర్ గుప్తా మాట్లాడుతూ, నిర్లక్ష్యంతో పాటు ఎవరూ క్యాన్సర్‌తో చనిపోకూడదు. ;(1) చక్కెర తీసుకోవడం మానేయడం మొదటి దశ. మీ శరీరంలో చక్కెర లేకుండా, క్యాన్సర్ కణాలు సహజంగా చనిపోతాయి.

 ;(2) రెండవ దశ ఒక కప్పు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసి 1-3 నెలల పాటు ఉదయం భోజనానికి ముందు తాగితే క్యాన్సర్ పోతుంది. మేరీల్యాండ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం, కీమోథెరపీ కంటే వేడి నిమ్మ నీరు 1000 రెట్లు మెరుగైనది, బలమైనది మరియు సురక్షితమైనది.

(3) మూడవ దశ ఏమిటంటే, ఉదయం మరియు రాత్రి 3 టేబుల్ స్పూన్ల ఆర్గానిక్ కొబ్బరి నూనెను త్రాగాలి, క్యాన్సర్ అదృశ్యమవుతుంది, మీరు చక్కెరను నివారించడం సహా ఇతర రెండు చికిత్సలలో దేనినైనా ఎంచుకోవచ్చు.

అజ్ఞానం ఒక సబబు కాదు. నేను 5 సంవత్సరాలకు పైగా ఈ సమాచారాన్ని పంచుకుంటున్నాను. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ చెప్పండి, క్యాన్సర్‌తో చనిపోవడం ఎవరికైనా అవమానకరం; ప్రాణాలు కాపాడేందుకు విస్తృతంగా షేర్ చేయండి.

స్వచ్ఛ సర్వేక్షణ్ కింద నల్లగొండ నియోజకవర్గంలో అప్పాజిపేట ఎంపిక

స్వచ్ఛ సర్వేక్షణ్   కింద నల్లగొండ నియోజకవర్గంలో అప్పాజిపేట ఎంపిక           

 నల్లగొండ : స్వచ్ఛ సర్వేక్షణ్  గ్రామీణ -2023 సంవత్సరం కింద నల్లగొండ మండలం అప్పాజిపేట ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైంది. నల్లగొండ జిల్లాలో మొత్తం 12 గ్రామ పంచాయతీలు ఎంపిక కాగా , నల్లగొండ నియోజకవర్గంలో అప్పాజిపేట సెలక్ట్ అయ్యింది.

ఈ సందర్భంగా జిల్లా పరిషత్తులో గ్రామ సర్పంచ్ పబ్బతిరెడ్డి రవీందర్ రెడ్డిని , కార్యదర్శి ఉపేందర్ ను జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి , కలెక్టర్ ఆర్ వి. కర్ణన్ లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ , జడ్పీ సిఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి , ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి , ఎంపీవో మాధవరెడ్డిలు ఉన్నారు.

నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆర్ కృష్ణయ్య జన్మదిన వేడుకలు

నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆర్ కృష్ణయ్య జన్మదిన వేడుకలు

నేడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఉద్యమ సూర్యుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న ఆర్ కృష్ణ అన్న జన్మదిన సందర్భంగా నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద కేకు కట్ చేసి స్వీట్ల పంపిణీ సంబరాలతో బీసీ సంక్షేమ సంఘం యువజన సంఘం ఉద్యోగుల సంఘం మహిళా సంఘం విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన సంబరాలు చేయడం జరిగింది.

ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి గారు కేక్ కట్ చేసి వారు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నిరంతరం బీసీల కోసం గత 50 సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నటువంటి అహర్నిశల్ కృషి చేస్తున్న ఏకైక లక్ష్యం బీసీ వర్గాలు చట్టసభల్లో లేనంత కాలం మనకు రాజ్యాధికారం పొద్దలేమని ఉద్దేశంతో చట్టసభల్లో రిజర్వేషన్లు వచ్చేంతవరకు కుల సంఘాలు తో పాటు మేధావులు అన్ని వర్గాల ప్రజలు అన్న ఆర్ కృష్ణ అన్నకు మద్దతు తెలియజేస్తూ వారి ఉద్యమానికి రిజర్వేషన్లు వచ్చేంతవరకు మద్దతు ఇవ్వాలని నలగొండ బీసీ సంక్షేమ సంఘం ప్రతి ఒక్కరికి విజ్ఞ ప్తి చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిసి మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి పద్మ మత్స్యకారుల రాష్ట్ర అధ్యక్షులు లోకనబోయిన వెంకటరమణ ముదిరాజ్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మున్నా ప్రసన్న కుమార్ యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మేకల యాదన్న యాదవ్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి కర్నాటి యాదగిరి మార్గం సతీష్ కుమార్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శులు భరత్ మల్లె పోయిన సతీష్ యాదవ్ మార్గం సతీష్ పగిళ్ల కృష్ణ చిలుకూరి శ్రీనివాస్ వలకీర్తి శ్రీనివాస్ సుజాత వనం లలిత రుద్ర లక్ష్మీనారాయణ రవీంద్ర చారి వెంకటాచారి దుడుకు తిరుపతయ్య ఉజ్వల్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో మరో 100 ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించనున్న మంత్రి హరీష్ రావు

తెలంగాణలో మరో 100 ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించనున్న మంత్రి హరీష్ రావు

హైదరాబాద్ :సెప్టెంబర్‌ 12

ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాష్ట్రంలో మరో 100 ఆరోగ్య మహిళా కేంద్రాలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 272 కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మార్చి 8న ప్రభుత్వం ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించింది...

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈనెల 15 వరకు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

Weather Report: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈనెల 15 వరకు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాబోయే 3 రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో.. ఈ నెల 15 వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు..

గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..పార్వతీపురం, అల్లూరి, ప్రకాశం, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు..

జమ్మూ కాశ్మీర్ రాజౌరీలో ఎన్‌కౌంటర్‌.. ఓ ఉగ్రవాది హతం

Jammu Kashmir: రాజౌరీలో ఎన్‌కౌంటర్‌.. ఓ ఉగ్రవాది హతం

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. నార్ల గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి..

అయితే ఈ క్రమంలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. మంగళవారం రాజౌరీ జిల్లాలోని మారుమూల గ్రామంపై సెర్చ్ చేయడానికి వెళ్లిన భద్రతా బలగాల బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు..

అంగన్‌వాడీ టీచర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ప్రభుత్వం..

అంగన్‌వాడీ టీచర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ప్రభుత్వం..

రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మినీ కేంద్రాలను.. ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌డ్రేట్‌ చేసింది.

అలాగే ఉద్యోగ విరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 

రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మినీ కేంద్రాలను.. ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌డ్రేట్‌ చేసింది. అలాగే ఉద్యోగ విరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవోను జారీ చేసింది. ఉద్యోగ విరమణ చేసే అంగన్‌వాడీ టీచర్లకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద అంగన్వాడీ టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.50వేలు భృతి అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఉద్యోగ విరమణ అనంతరం ఆసరా పెన్షన్‌ మంజూరు చేయనున్నట్లు జీవోలో పేర్కొంది.

సర్వీసులో ఉన్న అంగన్‌వాడీలు మరణిస్తే తక్షణ సాయం కింద రూ.20వేలు, హెల్పర్లకు రూ.10వేలు అందజేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ధన్యవాదాలు తెలిపారు. మధురానగర్‌ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖలో ఆమె మంగళవారం అంగన్‌వాడీలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత అత్యధికంగా అంగన్‌వాడీల వేతనాలను పెంచారంటూ గుర్తు చేశారు.

దేశంలోనే అంగన్‌వాడీలు చేస్తున్న సేవలకు గుర్తింపు ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణ ముందుందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంగన్‌వాడీలకు అరకొరగా జీతాలు ఇస్తున్నారని మండిపడ్డారు. కొవిడ్‌ సమయంలో అంగన్‌వాడీల సేవలను గుర్తించి అవార్డులు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. అంగన్‌వాడీలు సమ్మె విరమించాలని సూచించారు. అంగన్‌వాడీలు కేంద్రం ప్రభుత్వం పరిధిలో ఉన్న డిమాండ్లతో సమ్మె చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న డిమాండ్లను నెరవేర్చామని స్పష్టం చేశారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

అంగన్‌వాడీలపై ఒత్తిడి తగ్గించేందుకు యాప్‌ సింప్లిఫైడ్‌ చేస్తామన్నారు. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను.. అప్‌గ్రేడ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్న మంత్రి.. ఈ సందర్భంగా అంగన్‌వాడీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో అంగన్‌వాడీ టీచర్లకు రూ.13,650, మినీ అంగన్‌వాడీ టీచర్లకు రూ.7,800, హెల్పర్లకు రూ.7,800 చొప్పున వేతనాలు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో మరుగునపడిన అంగన్‌వాడీలకు, ఆత్మగౌరవాన్ని కల్పించింది సీఎం కేసీఆరేనన్నారు. రాష్ట్రం రూ.115కోట్ల భారాన్ని మోస్తుందన్నారు.

మోదీ ప్రభుత్వం కేంద్రం వాటాను 90శాతం నుంచి 60శాతానికి తగ్గించిందని.. రాష్ట్ర ప్రభుత్వాల వాటాను ప్రభుత్వం 40శాతానికి పెంచిందని చెప్పారు. కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో పెరిగిన వేతనాల ప్రకారం కేంద్ర వాటా 60శాతం ఉండాల్సి ఉండగా.. అంగన్‌వాడీ టీచర్ల వేతనాల్లో 19శాతం, హెల్పర్ల వేతనాల్లో 17 శాతం మాత్రమే ఇస్తుందని ఆరోపించారు.

తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ వేతనాలకు తన వాటా కింద 40శాతం ఇవ్వాల్సి ఉండగా.. 80శాతం, హెల్పర్ల వేతనాల్లో 82శాతం ఉండడం సీఎం కేసీఆర్‌ ఔదార్యానికి, అంగన్‌వాడీలపై ఆయనకు ఉన్న ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హోళికెరీ, జేడీలు లక్ష్మిదేవి సునంద, అంగన్‌వాడీ టీచర్స్-హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు నల్లా భారతి, మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు వరలక్ష్మి, టీఎన్జీవో నిర్మల, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

17న జాతీయ సమైక్యతా దినోత్సవం

17న జాతీయ సమైక్యతా దినోత్సవం

 ఈనెల 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

పబ్లిక్‌గార్డెన్స్‌లో జెండాను ఆవిష్కరించనున్న కేసీఆర్‌

జిల్లా కేంద్రాల్లో వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి

ఈ నెల 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరిగే ప్రధాన వేడుకల్లో సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగే వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌, మండలి చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌, మంత్రులు, ప్రభుత్వ చీఫ్‌విప్‌, విప్‌లు, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరిస్తారని తెలిపారు. ఆయా జిల్లా కేంద్రాల్లో ఆదివారం ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఎగురవేయాలని పేర్కొన్నారు.

కోతుల బెడదపై సర్కారు దృష్టి

గ్రామాల్లో కోతుల బెడద నివారణపై ప్రభుత్వం దృష్టి సారించింది. సచివాలయంలో సోమవారం సీఎస్‌ శాంతికుమారి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్రంలో పంటలను ధ్వంసం చేస్తున్న కోతుల నియంత్రణకు ప్రణాళికలు రూపొందించాలన్న హైకోర్టు సూచనలను ఈ సమావేశంలో సమీక్షించారు. తక్షణ, దీర్ఘకాలిక ప్రణాళికలను అధికారులకు నిపుణుల కమిటీ సభ్యులు వివరించారు. సమీక్షలో పీసీసీఎఫ్‌ ఆర్‌ఎం డోబ్రియాల్‌, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌ సిన్హా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌ రోస్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాల్లో జాతీయ జెండానుఆవిష్కరించనున్న ప్రముఖులు జిల్లా పేరు

ఆదిలాబాద్‌ గంప గోవర్ధన్‌

కొత్తగూడెం రేగా కాంతారావు

జగిత్యాల కొప్పుల ఈశ్వర్‌

భూపాలపల్లి పల్లా రాజేశ్వర్‌రెడ్డి

జనగామ ఎర్రబెల్లి దయాకర్‌రావు

గద్వాల టీ పద్మారావు

కామారెడ్డి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

ఖమ్మం పువ్వాడ అజయ్‌

కరీంనగర్‌ గంగుల కమలాకర్‌

అసిఫాబాద్‌ సుంకరి రాజు

మహబూబ్‌నగర్‌ వీ శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబాబాద్‌ సత్యవతి రాథోడ్‌

మంచిర్యాల బాల్క సుమన్‌

మెదక్‌ తలసాని శ్రీనివాస్‌

మేడ్చల్‌ చామకూర మల్లారెడ్డి

ములుగు ఎమ్మెస్‌ ప్రభాకర్‌రావు

నాగర్‌ కర్నూలు గువ్వల బాలరాజు

నల్లగొండ గుత్తా సుఖేందర్‌రెడ్డి

నారాయణపేట వీ సునీతాలక్ష్మారెడ్డి

నిర్మల్‌ ఏ ఇంద్రకరణ్‌రెడ్డి

నిజామాబాద్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి

పెద్దపల్లి టీ భాను ప్రసాద్‌రావు

సిరిసిల్ల కే తారక రామారావు

రంగారెడ్డి పీ సబితా ఇంద్రారెడ్డి

సంగారెడ్డి ఎండీ మహమూద్‌ అలీ

సిద్దిపేట టీ హరీశ్‌రావు

సూర్యాపేట జీ జగదీశ్‌రెడ్డి

వికారాబాద్‌ పట్నం మహేందర్‌రెడ్డి

వనపర్తి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

హనుమకొండ దాస్యం వినయ్‌భాస్కర్‌

వరంగల్‌ బండ ప్రకాశ్‌

భువనగిరి గొంగిడి సునీత

ఇక పొలాల్లోకి 'పాలమూరు' నీళ్లు

ఇక పొలాల్లోకి 'పాలమూరు' నీళ్లు

ఇక పొలాల్లోకి పాలమూరు సాగునీళ్లు పరవళ్లు తొక్కుతాయని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్‌ లిఫ్ట్‌లో మొదటి పంప్‌ను ఈ నెల 16న సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా ప్రారంభించనున్నామని తెలిపారు.

మంత్రులు నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడి

కొల్లాపూర్‌లో సీఎం కేసీఆర్‌ సభ ఏర్పాట్ల పరిశీలన

ఇక పొలాల్లోకి పాలమూరు సాగునీళ్లు పరవళ్లు తొక్కుతాయని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్‌ లిఫ్ట్‌లో మొదటి పంప్‌ను ఈ నెల 16న సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా ప్రారంభించనున్నామని తెలిపారు. ప్రపంచం నివ్వెరపోయే విధంగా సుజల దృశ్యాన్ని చూడబోతున్నామని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ సమీపంలో సీఎం కేసీఆర్‌ పర్యటన, బహిరంగ సభ స్థలాన్ని, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఐజీ షానవాజ్‌ ఖాసీం, కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌తో కలిసి సోమవారం మంత్రులు పరిశీలించారు. ఎల్లూరు రహదారిలోని బొంగురాలమిట్టలో బహిరంగ సభకు ప్రదేశాన్ని పరిశీలించి ఖరారు చేశారు.

అనంతరం నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న అతి భారీ మోటర్లను ఉపయోగించి 300 మీటర్ల దిగువన ఉన్న కృష్ణా జలాలను సముద్రమట్టానికి 687 మీటర్ల ఎత్తున పంపింగ్‌ చేయనున్నట్టు తెలిపారు. ఇది సాంకేతిక రంగంలో ఒక గొప్ప విజయంగా నిలిచిపోనున్నదని చెప్పారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ..

ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లాలో నీటి గోస తీరనున్నదని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి రైతు బిడ్డలు, కూలీలు, ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి తరలిరావాలని మంత్రులు పిలుపునిచ్చారు.