/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz నారా లోకేష్‌కు భీమవరం పోలీసుల నోటీసులు Yadagiri Goud
నారా లోకేష్‌కు భీమవరం పోలీసుల నోటీసులు

పశ్చిమగోదావరి: భీమవరం సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్‌కు భీమవరం పోలీసులు నోటీసులు ఇచ్చారు. యువగళం పాదయాత్రలో టీడీపీ రౌడీమూకలు మరోసారి రెచ్చిపోయిన సంగతి తెలిసిందే..

పుంగనూరులో చంద్రబాబు కనుసన్నల్లో దౌర్జన్యాలకు తెగబడగా... భీమవరంలో లోకేశ్‌ ప్రోద్బలంతో పేట్రేగి పోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్‌లో మంగళవారం రాత్రి బహిరంగ సభ అనంతరం గునుపూడి శివారులో టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు బరి తెగించాయి.

లోకేశ్‌ పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభ వద్ద టీడీపీ కార్యకర్తలు వ్యూహాత్మకంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. గతంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీపై వాటర్‌ బాటిళ్లు, రాళ్లు రువ్వడంతో పాటు ఫ్లెక్సీని తొలగించడానికి ప్రయత్నించారు. వివేకానందరెడ్డిని చంపింది ఎవరంటూ ఫ్లెక్సీలను ప్రదర్శించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలను పట్టుకుని నినాదాలు చేస్తూ ఉద్రిక్తత సృష్టించారు..

రెండు ఫ్యాన్సీ నంబర్లకూ పోటాపోటీ

హైదరాబాద్‌ ఈస్ట్‌జోన్‌ పరిధిలో మంగళవారం సాయంత్రం జరిగిన ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్‌లో సంచలనం చోటుచేసుకొన్నది.

అధిక ధరకు ఓ ఫ్యాన్సీ నంబర్‌ను ఓ సంస్థ దక్కించుకోవడం విశేషం. మరో రెండు ఫ్యాన్సీ నంబర్లకూ పోటాపోటీ ధర పలికింది. ఆ వివరాలను హైదరాబాద్‌ జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ పాండురంగ్‌ నాయక్‌ ప్రకటించారు.

మొత్తంగా ఆర్టీఏ ఖాజానాకు రూ.18 లక్షల ఆదాయం సమకూరినట్టు ఆయన తెలిపారు. టీఎస్‌11ఈజడ్‌ 9999 నెంబర్‌ను రూ.9,99,999కు చర్చ్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ దక్కించుకున్నదని తెలిపారు.

టీఎస్‌11ఎఫ్‌ఏ 0001 నంబర్‌ను 3.50 లక్షలకు కామినేని సాయి శివనాగు కైవసం చేసుకొన్నాడని పేర్కొన్నారు. అదే సిరీస్‌తో 0011 నంబర్‌ను శ్యామల రోహిత్‌రెడ్డి రూ.1.55 లక్షలకు దక్కించుకొన్నారని తెలిపారు...

700 కోట్లతో నాఫ్‌కో సంస్థ తెలంగాణలోభారీ పెట్టుబడులు

తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. అమెరికా టూర్‌ను ముగించుకొని దుబాయ్‌ పర్యటనను మొదలు పెట్టిన మంత్రి కేటీఆర్‌.. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తూ బిజి బిజీగా గడుపుతున్నారు.

ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టబడితో మంత్రి కేటీఆర్‌ తన దుబాయి పర్యటన ప్రారంభించారు. అగ్నిమాపక సామాగ్రి తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్‌కో కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో రూ.700 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది.

ఈ మేరకు మంత్రి కేటీఆర్‌తో కంపెనీ సీఈవో ఖాలిద్‌ అల్‌ ఖతిబ్‌ ప్రతినిధి బృందం సమావేశమైంది.

అనంతరం తెలంగాణ రాష్ట్రంలో తమ అగ్నిమాపక సామాగ్రిని తయారు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.700 కోట్ల భారీ పెట్టుబడిని పెడుతున్నట్లు తెలిపింది.

తెలంగాణతోపాటు దేశం విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అగ్నిమాపక సామాగ్రి, అగ్నిమాపక సేవల అవసరం భవిష్యత్తులో భారీగా పెరుగుతుందని విశ్వాసం తమకుందని నాఫ్‌కో తెలిపింది. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న అగ్నిమాపక సామాగ్రి తయారీ ప్లాంట్‌ భారతదేశ డిమాండ్‌కు సరిపోతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

తిరుమల తిరుపతి లో పెరిగిన భక్తుల రద్దీ..

తిరుమలకు బుధవారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 18 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.

ఇదిలా ఉంటే.. నిన్న సెప్టెంబర్‌ 5, మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 71,946. తలనీలాలు సమర్పించిన వాళ్ల సంఖ్య 30,294గా ఉంది. శ్రీవారి హుండీ ఆదాయం 4.51 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా తిరుమల తిరుపతి దేవాదాయ శాఖ తెలిపింది.

ఈ ఏడాది అధిక మాసం సందర్భంగా సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనుంది, 17వ తేదీ న వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది.

18వ తేదీన ధ్వజారోహణంతో బ్రహోత్సవాలు ప్రారంభం అవుతాయి. అదే రోజు తిరుమలకు విచ్చేసి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

సెప్టెంబరు 22న గరుడసేవ, 23న స్వర్ణరథోత్సవం, 25న మహారథం, 26న చక్రస్నానం, చివరగా.. ధ్వజారోహణంతో వార్షిక బ్రహోత్సవాలు ముగుస్తాయి. మళ్లీ అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

మనిషి కనిపడట్లేడు.. మాట వినపడట్లేదు: కేటీఆర్ ఎక్కడ : రేవంత్ రెడ్డి

గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరంలో వర్షాలకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి.

రోడ్లపైకి మోకలాల్లోతు నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఇవాళ మంత్రి కేటీఆర్‌పై సెటైర్లు వేశారు.

‘నువ్వు నిర్మించిన విశ్వనగరం జల విలయంలో విలవిలలాడుతోంది. పండుటాకులా వణికిపోతోంది. హైటెక్ హంగుల వీడియోలు, ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో భ్రమలు కల్పించే కేటీఆర్.. ఇప్పుడెక్కడ? మనిషి కనిపించడం లేదు.. మాట వినిపించడం లేదే’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.......

Mamata Benarjee: రాజ్‌భవన్‌ ఎదుట ఆందోళన చేస్తా: మమత బెనర్జీ

కోల్‌కతా: అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్‌ ఆనంద్‌ బోస్‌ (Anand Bose) తన వద్ద పెండింగ్‌లో పెడుతున్నారంటూ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Benarjee) ఆరోపించారు..

ఇదే తంతు కొనసాగితే రాజ్‌భవన్‌ (RajBhavan) ఎదుట ధర్నాకు దిగుతానని ఆమె అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని మమతా బెనర్జీ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్న యూనివర్సిటీల కార్యకలాపాల్లో గవర్నర్‌ జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా పని చేయకపోతే విశ్వవిద్యాలయాకు రావాల్సిన నిధులను నిలిపివేస్తానని హెచ్చరిస్తున్నారని అన్నారు..

''గవర్నర్‌ చర్యలు పరిపాలనను స్తంభింపజేసేలా ఉన్నాయి. అసెంబ్లీ ఆమోదించిన ఒక్క బిల్లును కూడా ఆయన తిరిగి పంపడం లేదు. అలాగని ఆమోదించడం లేదు. ఒకవేళ ఆయన తిప్పి పంపిస్తే.. సవరణలు చేసి తిరిగి ఆ బిల్లు గవర్నర్‌ ఆమోదానికి వెళ్తే.. కచ్చితంగా ఆమోదించాలన్న నిబంధన ఉంది. అంతేకాకుండా ఒకే బిల్లును రెండుసార్లు వెనక్కి పంపినా అది చట్టం అవుతుంది. అందుకే ఆయన బిల్లులను తన వద్దే పెట్టుకుంటున్నారు'' అని మమతా బెనర్జీ పేర్కొన్నారు..

Pawan: మాజీ సైనికుడిపై హత్యాయత్నానికి తెగబడ్డా పట్టించుకోరా?: పవన్‌ కల్యాణ్‌

అమరావతి: ఒక సైనికుడిగా దేశ రక్షణ విధుల్లో భాగస్వామి అయిన మోపాడ ఆదినారాయణ తన గ్రామంపై బాధ్యతతో ప్రభుత్వ ఆస్తులను కాపాడాలనుకుంటే పాలకపక్షం అతనిపై హత్యాయత్నానికి తెగబడటం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు..

''దేశాన్ని శత్రువుల నుంచి కాపాడిన వ్యక్తి స్థానిక గూండాల నుంచి ప్రాణహానిని ఎదుర్కొంటున్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం రైతులపాలెంనకు చెందిన ఆదినారాయణపై స్థానిక వైకాపా సర్పంచి సంబంధీకులు తీవ్రంగా దాడి చేస్తే పోలీసులు స్పందించలేదు. హత్యాయత్నానికి సంబంధించిన సెక్షన్లు కాకుండా సాధారణ దాడిగా కేసు నమోదు చేశారు'' అని పవన్‌ అసహనం వ్యక్తం చేశారు..

''వైకాపా నాయకులు ప్రభుత్వ భూములు, కాలువలు కబ్జా చేసి రెవెన్యూ రికార్డులు మారుస్తున్నారని జిల్లా అధికారులకు ఆదినారాయణ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయనపై దాడి చేశారు. భూ కబ్జాదారులు ఎంతకు తెగిస్తున్నారో అర్థమవుతోంది. విశాఖ చుట్టుపక్కల ప్రభుత్వమే సహజ వనరులను ధ్వంసం చేసి విలాసవంతమైన గృహాలు నిర్మించుకుంటోంది. ప్రజా ప్రతినిధులు ఆస్తులు కొల్లగొడుతున్నారు. వారి బాటలోనే అనుచరులు కూడా కబ్జాలు చేస్తున్నారు. ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. యథా పాలకుడు తథా అనుచరుడు అన్న చందంగా వైకాపా పాలన ఉంది..

Nara Lokesh: గ్రంధి శ్రీనివాస్‌.. భీమవరానికి పట్టిన క్యాన్సర్‌ గడ్డ: లోకేశ్‌

భీమవరం: స్థానిక వైకాపా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ భీమవరానికి పట్టిన క్యాన్సర్‌ గడ్డ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు..

యువగళం పాదయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గ్రంధి శ్రీనివాస్‌ అక్రమాలపై వైకాపా కార్యకర్తలే ఫిర్యాదు చేశారన్నారు. జగన్‌ ఇసుకాసురుడైతే.. గ్రంధి శ్రీనివాస్‌ భూబకాసురుడని లోకేశ్‌ ధ్వజమెత్తారు. తక్కువ ధరకు భూములు కొని ఎక్కువ ధరకు అమ్మారని ఆరోపించారు. పేదలకు ఒక్క ఇల్లు కట్టలేదు.. ఆయన మాత్రం పెద్ద ప్యాలెస్‌ కట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

''గ్రంధి శ్రీనివాస్‌ సొంత పార్టీ కార్యకర్తలపైనే కేసులు పెట్టించారు. టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తామన్న హామీ ఏమైంది. భీమవరాన్ని మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దుతాం. డంపింగ్‌ యార్డు, రింగ్‌రోడ్డు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటు చేస్తాం. కిడ్నీ బాధితులకు డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేస్తాం. ఉండి సెంటర్‌లో వంతెన నిర్మిస్తాం. ఆకివీడు పంచాయతీలో సమస్యలు పరిష్కరిస్తాం. తెదేపా హయాంలో భీమవరంలో రూ.1500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. తెదేపా అధికారంలోకి రాగానే రోడ్లు బాగు చేస్తాం'' అని లోకేశ్‌ హామీ ఇచ్చారు..

తెలంగాణ గవర్నర్‌గా సూపర్ స్టార్ రజినీకాంత్‌?

తమిళ సినీ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు బీజేపీ అగ్రనాయకత్వం బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయనకు గవర్నర్ పదవి కట్టబెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రజినీకాంత్‌కు ఈ పోస్ట్ ఇవ్వడం ద్వారా దక్షిణ భారతదేశంలో ఆయన చరిష్మా పార్టీకి కలిసి వస్తుందని, ముఖ్యంగా తమిళనాడులో సీఎం స్టాలిన్‌ను కట్టడి చేయవచ్చని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలపై పట్టు ఉన్న రజినీకాంత్‌ను తెలంగాణ గవర్నర్‌గా పంపించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది...

కరోనా టీకాకు.. గుండెపోటు ముప్పుకు సంబంధం లేదు

భారత్‌లో వినియోగించిన కరోనా వ్యాక్సిన్లకు, గుండెపోటు (Heart Attack) ముప్పు పెరుగుదలకు ఎటువంటి సంబంధం లేదని తాజా అధ్యయనం వెల్లడించింది.

కరోనా వైరస్‌ (Coronavirus) విజృంభణ తర్వాత దేశంలో గుండెపోటు ముప్పు పెరిగిందనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా వ్యాక్సిన్‌ ప్రభావం గుండెపోటు (Heart Attack) కేసులు పెరగడానికి ఏమైనా కారణమా అనే అనుమానాలు వచ్చాయి. ఈ కోణంలో కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో పరిశోధనలు చేస్తోంది. ఇదే సమయంలో భారత్‌లో వినియోగించిన కరోనా వ్యాక్సిన్లకు, గుండెపోటు ముప్పు పెరుగుదలకు ఎటువంటి సంబంధం లేదని తాజా అధ్యయనం వెల్లడించింది. మన దేశంలో కరోనా వ్యాక్సిన్‌లు (Corona Vaccine) సురక్షితమైనవేనని పరిశీలన అధ్యయనం తెలిపింది. ఇందుకు సంబంధించిన నివేదిక.. పీఎల్‌ఓఎస్‌ వన్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

‘భారత్‌లో వ్యాక్సిన్‌లు సురక్షితమని మా అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో గుండెపోటుకు వ్యాక్సిక్‌లతో సంబంధం లేదు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో గుండెపోటు మరణాలు తక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనంలో గుర్తించాం’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన జీబీ పంత్‌ ఆస్పత్రికి చెందిన మోహిత్‌ గుప్తా వెల్లడించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత అక్యూట్‌ మయోకార్డియల్‌ ఇన్‌ఫార్‌క్షన్‌ (AMI) ఎప్పుడూ కనిపించలేదని తమ విశ్లేషణలో తేలినట్లు చెప్పారు. ఆస్పత్రిలో చేరిన ఏఎంఐ బాధితుల్లో.. వయసు, మధుమేహం, ధూమపానం కారణాల వల్లే మరణం ముప్పు ఎక్కువగా కనిపించిందన్నారు. అయితే, ఇది ఒకే కేంద్రంలో జరిపిన అధ్యయనమని.. ఇందుకు కొన్ని పరిమితులు ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.

గుండెపోటు తర్వాత బాధితుల మరణానికి సంబంధించి వ్యాక్సిన్‌ ప్రభావం ఏమైనా ఉందా..? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు గతేడాది మన దేశంలోనే ఓ అధ్యయనం జరిగింది. ఇందుకోసం దిల్లీలోని జీబీ పంత్‌ ఆస్పత్రిలో ఆగస్టు 2021-ఆగస్టు 22 మధ్య కాలంలో చేరిన 1578 మంది రోగుల సమాచారాన్ని విశ్లేషించారు. వీరిలో 1086 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నవారు కాగా.. 492 మంది టీకా తీసుకోనివారే. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 1047 (96 శాతం) మంది రెండు డోసులు తీసుకోగా.. మరో 4శాతం మాత్రం కేవలం ఒక డోసు తీసుకున్నారు.