/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మేజర్ ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే కంచర్ల Miryala Kiran Kumar
నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మేజర్ ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే కంచర్ల

 నేడు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారుతమ క్యాంప్ కార్యాలయంలో... గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ,గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ సంస్థలు మరియు ట్రస్మా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో...నిర్వహించిన నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మేజర్ ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..భారత హాకీ క్రీడను ప్రపంచవ్యాప్తం చేసిన త్రిబుల్ ఒలంపియన్... మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు ఆగస్టు 29 ని నేషనల్ స్పోర్ట్స్ డేగా ...ప్రభుత్వం జరుపటం... అత్యంత సముచితమని.. భారత హాకీ క్రీడ విశ్వవ్యాప్తం కావడానికి వారి త్యాగం ఎంతో ఘనమైనదని... జర్మనీ నియంత హిట్లర్ తమ దేశం తరుఫున ఆడితే... మేజర్ పదవేకాదు, అనేక సంపదలను ఆశ చూపినా, ఆ ప్రలోబాలకు లొంగకుండా... తన మాతృ దేశం కోసమే ఆడతానని చెప్పిన గొప్ప దేశభక్తుడని... ఇది ఈనాటి యువతరం వారి నుండి స్ఫూర్తి పొంది దేశ భక్తిని అలవార్చుకోవాలని కోరారు..

ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు కందాల పాపిరెడ్డి, జిల్లా అధ్యక్షులు కోడి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి జి వి రావు

, చెన్నయ్య గౌడ్, రాష్ట్ర నాయకులు గంట్ల అనంతరెడ్డి, పుచ్చకాయల వెంకటరెడ్డి, పులిజాల లక్ష్మీనారాయణ, రాజ్ కుమార్ రెడ్డి, రామకృష్ణ, ఎండి అజీజ్ షరీఫ్, జంగయ్య, అరుల్ రాజ్, ముద్దం నరసింహ, భారతీయ శ్రీనివాస్ రెడ్డి, హాలియా పబ్లిక్ స్కూల్ శ్రీనివాస్ మల్లెపల్లి శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అంజన్ గౌడ్, జహంగీర్, మల్లయ్య, పాండు, వాణి, ఆక్స్ఫర్డ్ జంగయ్య, మరియు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, క్రీడల కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు

ఎమ్మెల్యే కు వినతి పత్రం అందించిన ఆశ వర్కర్లు..

ఆశ వర్కర్స్ కు కనీస వేతనం 18000 ఇవ్వాలి 

ఎమ్మెల్యేకు వినతి 

     ఆశ వర్కర్స్ కు కనీస వేతనం 18000 నిర్ణయించి అర్హులైన వారికి సెకండ్ ఏఎన్ఎం లుగా ప్రమోషన్లు కల్పించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెం పల్లి సత్తయ్య డిమాండ్ చేశారు

        

మంగళవారం తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) యూనియన్ ఆధ్వర్యంలో నలగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇస్తున్న పారితోషకాలను 18000 లకు పెంచి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, పారితోషం లేని అదనపు పనులు ఆశాలతో చేయించకూడదని, ఆశలకు పని భారం తగ్గించాలని పెండింగ్ లో ఉన్న కరోనా రిస్క్ అలవెన్స్ బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్స్ కు ప్రమాద బీమా ,పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ప్రసూతి సెలవులు పైన సర్కులర్ ను వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. 

    

 ఈ కార్యక్రమంలో సీఐటీయూ నల్లగొండ మండల కన్వీనర్ పోలె సత్యనారాయణ, ఆశ వర్కర్స్ యూనియన్ తిప్పర్తి మండల అధ్యక్షులు టి పార్వతమ్మ, గాదరి పూలమ్మ, నిర్మల, బిక్షవమ్మా, ఎల్లమ్మ , మల్లేశ్వరి, శైలజ,రేణుక, తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగులకు పీఆర్సీ.. పేస్కేలుపై 30 శాతం వేతనాలు పెంపు

తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగులకు పీఆర్సీ.. పేస్కేలుపై 30 శాతం వేతనాలు పెంపు

తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగులకు పీఆర్సీ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

టీఎస్‌ఎస్‌ ఉద్యోగుల పీఆర్సీకి ఆర్థిక శాఖ మూడు నెలల క్రితమే క్లియరెన్స్‌ ఇచ్చింది. 

తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగులకు పీఆర్సీ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్‌ఎస్‌ ఉద్యోగుల పీఆర్సీకి ఆర్థిక శాఖ మూడు నెలల క్రితమే క్లియరెన్స్‌ ఇచ్చింది. దీనికి సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలపడంతో తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. పీఆర్సీ 2020 ప్రకారం టీఎస్‌ఎస్‌ ఉద్యోగులకు వేతనాలు పెరగనున్నాయి. పెరగనున్న పీఆర్సీ 2021 జూన్‌ 1వ తేదీ నుంచి వర్తించనుంది.

తెలంగాణ సాంస్కృతిక సారధిలో మొత్తం 583 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం పే స్కేలు మీద 30 శాతం పీఆర్సీని అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉద్యోగుల పేస్కేలు24,514 ఉండగా.. నూతన పీఆర్సీ ప్రకారం జీతభత్యాలు ఒక్కొక్కరికీ 7,300 మేర పెరగనున్నాయి.

నల్గొండలో నూతన బట్టల షోరూం ఓపెనింగ్ లో ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసిన నల్లగొండ ఎమ్మెల్యే సతీమణి కంచర్ల రమాదేవి

నల్గొండలో నూతన బట్టల షోరూం ఓపెనింగ్ లో ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసిన నల్లగొండ ఎమ్మెల్యే సతీమణి కంచర్ల రమాదేవి

నల్లగొండ పట్టణంలోని వివేకానంద నగర్ గౌతమి కాలేజ్ సమీపాన కొలను మహేష్ శ్రీవిద్య దంపతుల క్వీన్స్ ఫ్యాన్సీ క్లాతింగ్ స్టోర్ ను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సతీమణి కంచర్ల రమాదేవి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.

అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు సరసమైన ధరలకు కాస్మెటిక్స్ ఫ్యాన్సీ మెటీరియల్ డ్రెస్సెస్ మరియు అన్ని రకముల వన్ గ్రామ్ గోల్డ్, ఎంపోరియం శారీస్ మ్యాచింగ్ డెకరేటివ్ ఐటమ్స్ లభిస్తాయని పట్టణ ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బొజ్జ నాగరాజు, రావుల రేణుక, విజయ , రూప, లీలావతి, సైదమ్మ శిరీష కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

వికలాంగుల విద్య, ఉపాధి కోసం ప్రత్యేక విధానాన్ని ప్రకటించాలి

వికలాంగుల విద్య, ఉపాధి కోసం ప్రత్యేక విధానాన్ని ప్రకటించాలి

ఆటిజం వినికిడి తెరపి కేంద్రాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి-సంక్షేమం, సాధికారత కోసం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

వికలాంగులకు విద్యా, ఉపాధి కల్పన కోసం ప్రత్యేక విదానాన్ని ప్రకటించాలనీ, రాష్ట్రంలో 12.2 శాతం జనాభా కలిగిన వికలాంగుల సంక్షేమం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టదా అని వక్తలు ప్రశ్నించారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర కమిటీ నేతృత్వంలో వెలువడుతున్న వికలాంగుల వాయిస్ చైతన్య మాస పత్రిక 9వ వార్షికోత్సవం ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోజరిగింది. వార్షికోత్సవం ప్రత్యేక సంచికను వొకేషనల్ రేహాబిలిటేషన్ సెంటర్ మాజీ డైరెక్టర్ గంగాధర్ రావు, ఎన్పీఆర్డీ జాతీయ ఉపాధ్యక్షులు యం అడివయ్య, వికలాంగుల వాయిస్ మాస పత్రిక మేనేజర్ కే వెంకట్, అసిస్టెంట్ మేనేజర్ బి స్వామి, అసిస్టెంట్ ఎడిటర్ జే రాజు, ఎడిటోరియల్ బోర్డ్ సభ్యులు అర్ వెంకటేష్, ఎ రంగారెడ్డి, బలేశ్వర్, సాయమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అడివయ్య, గంగాధర్ రావు మాట్లాడుతూ దేశంలో 2.68 కోట్ల మంది వికలాంగులు ఉంటే రాష్ట్రంలో 43.04 లక్షల మంది వికలాంగులు ఉన్నారన్నారు. రాష్ట్ర జనాభాలో వీరు 12.2శాతం ఉన్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వీరి సంక్షేమం ఎందుకు పట్టడం లేదని ప్రశ్నించారు. విద్యా, ఉపాధి దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శక్తి సామర్థ్యాలను వెలికి తీయడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనాభాకు అనుగుణంగా విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలన్నారు. దేశలో 50 లక్షల మంది ఆటిజం కలిగిన వారున్నారని తెలిపారు. రాష్ట్రంలో 5 లక్షల మంది ఉన్నారనీ, వీరందరికీ ప్రభుత్వమే ఉచితంగా థెరపీ అందించేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో, రాష్ట్రంలో వినికిడి లోపం సమస్య కూడా తీవ్రంగా ఉందన్నారు. వికలాంగుల వాయిస్ మాస పత్రిక మేనేజర్ కే వెంకట్ మాట్లాడుతూ వైకల్య ధృవీకరణ పత్రాలు అందించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు.

కార్యక్రమంలో ఎన్పీఆర్డీ నాయకులు టి మధు బాబు, కాశప్ప, దశరథ్, యశోద, పి కవిత, అరిఫా, ఉపేందర్, రాష్ట్ర కమిటీ సభ్యులు గోపాల్, ఎస్ ప్రకాష్ ,జయలక్ష్మి,శంకర్, భుజంగ రెడ్డి, రాధమ్మ, చంద్రమోహన్, లలిత ,బాలయ్య ,చందు, లింగన్న, వెంకన్న, సావిత్రి, షాహిన్ బేగం, రాజశేఖర్ గౌడ్, జంగయ్య, నారాయణ లతో పాటు వివిధ జిల్లాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మినీ అంగన్వాడీ టీచర్లను గుర్తించిన ఘనత సీఎం కెసిఆర్ ది: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

మినీ అంగన్వాడీ టీచర్లను గుర్తించిన ఘనత సీఎం కెసిఆర్ ది: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

దేశంలో ఎక్కడ లేని విధంగా మినీ అంగన్వాడీ టీచర్లను గుర్తించిన ఘనత సీఎం కెసిఆర్ కే దక్కుతుందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు. మినీ అంగన్వాడీ టీచర్లను ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడీ టీచర్లు గా అప్గ్రేడ్ చేయడానికి ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మీ అధ్వర్యంలో నల్గొండ క్లాక్ టవర్ వద్ద జరిగిన పాలాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈసందర్బంగా వారు మాట్లాడుతూ టీచర్ విధులు, ఆయా విధులు రెండు నిర్వర్తిస్తూ ఎన్నో కష్టాలను ఎదుర్కొని,గత ఏడు సంవత్సరాలుగా మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ స్థాపించి, ప్రభుత్వానికి మీ సమస్యలను సామరస్యంగా తెలపడం వల్లన నేడు రాష్ట్రంలో ఉన్న 3989 మంది మినీ అంగన్వాడీ టీచర్లను ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడీ అప్గ్రేడ్ చేసారని ఇందుకు గౌరవ ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు అని తెలిపారు.అనంతరం మినీ అంగన్వాడీ టీచర్స్ రాష్ట్ర అధ్యక్షురాలుఆడెపు వరలక్ష్మి..తమకు ఎల్లవేళలా సహకరిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు,మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి కు, సత్యవతి రాథోడ్ కు మరియు ఎల్లవేళల మాకు సహాయ సహకారాలు అందిస్తు.. నేటి కార్యక్రమానికి విచ్చేసి మాకు శుభాకాంక్షలు తెలిపినందుకు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గార్ల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైది రెడ్డి,నల్గొండ జిల్లా మినీ అంగన్వాడీ టీచర్స్ అధ్యక్షురాలు గుడిసె ఇందిరా, బీ ఆర్ టీ యు నల్గొండ నియోజకవర్గ ఇంచార్జి అవుట రవీందర్,ప్రధాన కార్యదర్శి సుహాసిని, కమిటీ మెంబర్లు సబితా,రాములమ్మ,చంద్రకళ,శైలజ,అనూష, భాగ్య,దనమ్మ,నాగేంద్ర,జయమ్మ, కమల,లలిత మరియు జిల్లా మినీ అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి కేటీఆర్ గారికి నామినేషన్ కోసం 1000 రూపాయలు చొప్పున 1 లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన ముఖరా కె పింఛన్ దారులు..

ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి కేటీఆర్ గారికి నామినేషన్ కోసం 1000 రూపాయలు చొప్పున 1 లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన ముఖరా కె 100 మంది పింఛన్ దారులు..

ముఖరా కె పింఛన్ దారులు 1000 రూపాయలు చొప్పున మొత్తం 100 మంది ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి కేటీఆర్ గారికి నామినేషన్ కోసం విరాలాలు ఇచ్చారు, తమకు కేసీఆర్ గారి పింఛనే ఆసరా అని, తమకు పెద్ద కొడుకుల నెల నెల పింఛన్ ఇచ్చి మా బ్రతుకుకు భరోసాగా నిలుస్తుండని, మా వంతు కృషిగా కేసీఆర్ సారు కు మరియు కేటీఆర్ సారుకు నామినేషన్ కోసం 1000 రూపాయలు చొప్పున విరాళం ఇస్తునమ్మన్నారు, జీవితాంతం కేసీఆర్ సార్కి రుణపడి ఉంటామని అన్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు మంత్రి కేటీఆర్ గారికి తమ విరాళం 1 లక్ష రూపాయలు అందించాలని సర్పంచ్ గాడ్గే మీనాక్షి కి ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాడ్గే సుభాష్ మరియు పింఛన్ దారులు పాల్గొన్నారు

బాణసంచా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం :ఏడుగురు సజీవదహనం

బాణసంచా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం :ఏడుగురు సజీవదహనం

కోల్ కత:ఆగస్టు 27

పశ్చిమ బెంగాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ఆదివారం చోటు చేసుకుంది, ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్టు తెలిసింది 

వివరాల్లోకి వెళ్తే…నార్త్ 24 పరగణాల జిల్లాలోని దత్తపుకూర్‌ పోలీసుస్టేషన్ పరిధిలోని అక్రమ ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో భారీగా పేలుడు సంభవించింది.

ఈ పేలుడులో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. అక్రమ బాణసంచా తయారీ కేంద్రానికి ఆనుకుని ఉన్న పలు ఇళ్లు కూడా పెద్ద మొత్తంలో దెబ్బ తిన్నాయి. ప్రస్తుతం సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి..

కోల్‌కతాకు ఉత్తరాన 30 కిలోమీటర్ల దూరంలోని దత్తపుకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీల్‌గంజ్‌లోని మోష్‌పోల్‌లోని ఫ్యాక్టరీలో పలువురు పని చేస్తున్నారు నేటి ఉదయం 10 గంటలకు ఈ పేలుడు సంభవించిందని పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు

బీడీ టేకేదారుల్లో ఆత్మగౌరవాన్ని నింపిన ఘనత సీఎం కేసీఆర్‌దే రూప్‌ సింగ్‌

బీడీ టేకేదారుల్లో ఆత్మగౌరవాన్ని నింపిన ఘనత సీఎం కేసీఆర్‌దే రూప్‌ సింగ్‌

బిడీ కార్మికుల తరహాలో టేకేదారులకు ఆసరా పింఛను ఇవ్వడం పట్ల రాష్ట్ర బీడీ టేకేదారుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి టేకేదారులు క్షీరాభిషేకం చేశారు.

బీడీ కార్మికుల తరహాలో టేకేదారులకు ఆసరా పింఛను ఇవ్వడం పట్ల రాష్ట్ర బీడీ టేకేదారుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి టేకేదారులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యదర్శి, టేకేదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎల్‌ రూప్‌ సింగ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7వేల మంది బీడీ టేకేదారులకు ఆసరా పింఛన్లు అమలు చేసి ఆత్మగౌరవాన్ని నింపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. 6 లక్షల మంది బీడీ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న బీడీ పరిశ్రమను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌కు యావత్‌ బీడీ కార్మికులు రుణపడి ఉంటారని తెలిపారు.

దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో బీడీ పరిశ్రమలు ఉండగా.. తెలంగాణ మినహా ఏ ఒక్క రాష్ట్రంలోనూ బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి ఇవ్వడం లేదని రూప్‌ సింగ్‌ తెలిపారు. రకరకాల పేర్లతో బీడీ పరిశ్రమను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు.

ఎమ్మెల్యే ధర్మారెడ్డిని కలిసిన ఎరుకల సంఘం నాయకులు

.

ఎమ్మెల్యే ధర్మారెడ్డిని కలిసిన ఎరుకల సంఘం నాయకులు

       

          సంగెం మండలం..

నేడు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి నివాసంలో ఎరుకల సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందచేసి,శాలువతో సన్మానం చేయడం జరిగింది.సంగెం రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు నరహరి ఆధ్వర్యంలో ఎరుకల వివిధ సమస్యలను ఎమ్మెల్యే గారికీ వివరించారు.అందులో ముఖ్యంగా ఎరుకల పిగ్ ఏంపర్మెంట్ స్కీమ్ కింద 60 కోట్లు ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు.ప్రతి మండల సోసైటీ కి 40 లక్షలు మంజూరైనందున మా మాడలానికి ఒక ఎకరం ప్రభుత్వ భూమి ఇవ్వాలని ఎరుకల సంఘం మండల నాయకులు పల్లకొండ బిక్షపతి మరియు రాయపురం సాంబ శివ గారు కోరారు.ఈ విషయం పై సానుకూలంగా స్పందించి ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే ఎరుకల సోసైటీకి ఇప్పించండని స్థానిక ఎంపీపీకి ఎమ్మెల్యే తెలిపారు.ఎరుకల కులస్థులకు గృహ లక్ష్మిలో ప్రాధాన్యత చూపాలని తెలియజేశారు..

   

 ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కేతిరి రాజశేఖర్,హన్మకొండ జిల్లా అధ్యక్షులు లోకిని సమ్మయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిపాటి రమేష్,సంగెం మండల అధ్యక్షులు పల్లకొండ బిక్షపతి, పిగ్ సోసైటీ మండల చైర్మన్ రాయపురం సాంబశివ,ప్రధాన కార్యదర్శి రాయపురం రాజు,ప్రచార కార్యదర్శి పల్లకొండ కుమారస్వామి,డైరెక్టర్లు రాయపురం మల్లేష్,సమ్మయ్య,జనార్దన్,కుమారస్వామి,శ్రీనివాస్,మల్లయ్య,రాజేష్, ఎల్లస్వామి,ఎల్లయ్య,సదానందం,స్వామి,సాంబమూర్తి,సమ్మక్క,యాకమ్మ,సంతోష తదితరులు పాల్గొన్నారు.