/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా చంద్రమోహన్ Yadagiri Goud
మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా చంద్రమోహన్

మహబూబాబాద్ ఎస్పీగా గుండేటి చంద్రమోహన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మహబూబాబాద్ ఎస్పీగా పని చేస్తున్న శరత్ చంద్ర పవార్ ను తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ కి బదిలీ చేశారు.మంచిర్యాల జిల్లా మందమర్రి కి చెందిన చంద్రమోహన్ 2012 గ్రూప్ 1 అధికారిగా పోలీస్ శాఖలో చేరారు.

దేవరకొండ డిఎస్పీగా, కరీంనగర్ ఇంటెలిజెన్స్ డిఎస్పీగా పని చేశారు. కరీంనగర్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ గా పనిచేసి ఇటీవలే నాన్ క్యాడర్ ఎస్పీగా పదోన్నతి పొందారు.

ప్రస్తుతం హైదరాబాదులోని డిజిపి కార్యాలయంలోని మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్ లో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం రోజు మహబూబాబాద్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

సహనం కోల్పోతున్న బిఆర్ఎస్ నేతలు

రాజకీయాల్లో ముఖ్యంగా కావల్సింది సహనం బిఆర్ఎస్ నేతలు ఈమధ్య సహనం కోల్పోతున్నారు ఎంత సహనం ఉంటే అంతలా రాణిస్తారు. కానీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకో గానీ ఈ మధ్య పదే పదే సహనం కోల్పోతున్నారు.

మొన్నటికి మొన్న స్టీల్ వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా ఓ వ్యక్తిని తోసేసి ఓ వర్గం ఆగ్రహానికి గురయ్యారు. ఆ తరువాత క్షమాపణలు చెప్పారు. తాజాగా మరోసారి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహనం కోల్పోయారు. భాగ్యనగర్ గణేష్ సమితి సెక్రెటరీ పై మండిపడ్డారు.

ఓల్డ్ సిటీలో మ్యాన్ హోల్స్, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని వివరిస్తున్న సెక్రటరీ పై తలసాని అసహనం వ్యక్తం చేశారు. గత బోనాలల్లో సరైన ఏర్పాట్లు లేక మ్యాన్ హోల్స్ లో పడి భక్తులకు గాయాల పాలయ్యారంటు చెపుతున్న గణేష్ ఉత్సవ నిర్వహకులపై మరోసారి మండిపడ్డారు.

మొన్నటికి మొన్న మంత్రి హరీష్ రావు పై మైనంపల్లి హనుమంతరావు తీవ్ర విమర్శలు చేశారు..

కాంగ్రెస్, బిజెపి పార్టీలకు అభ్యర్థుల కరువు: ఎమ్మెల్సీ కవిత

కామారెడ్డి జిల్లా:ఆగస్టు 28

కాంగ్రెస్ పార్టీ దళితులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. దేశాన్ని, రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్ పెట్టి దళితులకు ఏమో చేస్తామనడం భావ దారిద్ర్యం తప్పా మరొకటి కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వచ్చి ఎస్సీ డిక్లరేషన్ చేయడం అర్రస్ పాట పాడినట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఎస్సీలను ఎన్నో ఏండ్లు పేదరికంలో ఉంచిన చరిత్ర కాంగ్రెస్‌ది అని మండిపడ్డారు. ఆ పార్టీ రాజకీయ లబ్ధికోసం చేసే ఎత్తుగడలు తప్పా దళితుల కోసం చేసేదేమీ లేదన్నారు. ఇన్ని రోజులు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏం చేసిందని ప్రశ్నించారు.

రైతుల కోసం బీజేపీ మీటింగ్ పెట్టడం, ఆ సభకు అమిత్ షా రావడం, హంతకుడే రైతులకు సంతాపం తెలిపినట్టుందని మండిపడ్డారు.మోటర్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ ప్రభుత్వం చూస్తున్నదని ఆరోపించారు.

దళితుల కోసం పనిచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. అదే కర్ణాటక రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని కుంటి సాకుగా చెప్తూ ఉచిత పథకాలను ఎత్తి వేసిందని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన రైతు బంధును కాపీ కొట్టి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. 13 కోట్ల మందికి రైతు బంధు ప్రారంభించి 2.5 కోట్ల మందికే ఇస్తున్నారు. రాష్ట్రంలో మాత్రం అందరికీ ఇస్తున్నామని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు అభ్యుర్థులే లేరన్నారు...

కూతురు మరణం తట్టుకోలేక.. తండ్రి ఆత్మహత్య

అల్లారు ముద్దుగా పెంచిన కూతురు కండ్ల ముందే మృతి చెందటంతో ఆ తండ్రి హృదయం తట్టుకోలేకపోయింది.

గోరు ముద్దులు తినిపిస్తూ గుండెల మీద పెట్టుకొని ఎంతో గారాభంగా పెంచిన బిడ్డను మృత్యువు కబలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి..చిట్టితల్లీ నీవు లేని లోకంలో నేను ఉండలేనంటూ ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారకర సంఘటన నగరంలోని ఖైరతాబాద్‌లో సోమవారం చేటు చేసుకుంది.

ఖైరాతాబాద్‌కు చెందిన కిశోర్‌ ఐదేళ్ల కూతురు ఆరాధ్య అనారోగ్యంతో మృతి చెందింది. ఎంతో అపురూపంగా పెంచుకున్న బిడ్డ కండ్ల ముందే తనువు చాలించడంతో తీవ్ర మనోవేదనకు గురైన తండ్రి కిశోర్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

తండ్రీ, కూతుళ్ల మరణం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని కిశోర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖాన మార్చురీకి తరలించారు...

గుండెపోటుతో చెస్ సీనియర్ క్రీడాకారుడు మృతి

తెలంగాణ చెస్ క్రీడాకారుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

సీనియర్ క్రీడాకారుడైన ఆ వ్యక్తి చేస్ గేమ్ ఆడుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ యూసుఫ్‌గూడలో ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో శుక్ర, శని, ఆదివారాల్లో స్లాన్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ నిర్వహించారు.

దాదాపు 15 రాష్ట్రాలకు చెందిన 700 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఈ పోటీలకు హైదరాబాదులోని అంబర్ పేట్‌లో ఉండే సాయి (72) అనే సీనియర్ చెస్ క్రీడాకారుడు శనివారం మధ్యాహ్నం వచ్చారు. ఆ టోర్న మెంట్‌లో ఆయన కూడా పాల్గొని ఆడుతున్నారు.

గేమ్ మధ్యలోనే అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో సిబ్బంది అతనిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు....

మైనంపల్లి హనుమంతరావుపై వేటుకు రంగం సిద్ధం

బీఆర్ఎస్ తొలి జాబితా విడుదలకు ముందే తన కుమారుడికి సైతం టికెట్ కేటాయించాల్సిందే.. లేకుంటే తానేంటో చూపిస్తానన్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై వేటుకు రంగం సిద్ధమైంది.

తన కుమారుడికి టికెట్ కేటాయించాలని అడగటం వరకూ సబబే కానీ మంత్రి హరీష్‌రావుపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరీ దారుణం. దీనిపై వెంటనే మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత స్పందించారు.

అలాగే మైనంపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలకు దిగారు.

దీంతో మైనంపల్లిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. మల్కాజ్‌గిరి అభ్యర్థిని మార్చాలని సైతం బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును మల్కాజిగిరి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది.

ఈ క్రమంలోనే తాజాగా మంత్రి హరీశ్ రావు తో శంభీపూర్ రాజు భేటి అయ్యారు. 4 పెండింగ్ సీట్లతో పాటు మల్కాజిగిరికి ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉంది.

జనగామ పల్లా: రాజేశ్వర్ రెడ్డి, నర్సాపూర్ :సునీత లక్ష్మారెడ్డి, నాంపల్లి :ఆనంద్ గౌడ్, గోషామహల్ : నందకిషోర్ వ్యాస్‌లను బీఆర్ఎస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది...

NTR: సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ ఎంతో ప్రత్యేకం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

దిల్లీ: భారతీయ సినిమా చరిత్రలో నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్‌) ఎంతో ప్రత్యేకమని.. రాజకీయాల్లోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము అన్నారు..

కృష్ణుడు, రాముడు వంటి పాత్రల్లో ఆయన నటన అద్భుతమని కొనియాడారు. ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి విడుదల చేశారు.

రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెదేపా అధినేత చంద్రబాబు, భాజపా ఏపీ అధ్యక్షురాలు, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు హాజరయ్యారు.

ISRO: మా వద్ద చంద్రుడి అద్భుత ఫొటోలు.. త్వరలో విడుదల: ఇస్రో ఛైర్మన్‌

చంద్రుడికి సంబంధించి ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశమూ తీయని అద్భుతమైన ఫొటోలు తమ వద్ద ఉన్నాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు.

అవి తమ కంప్యూటర్‌ కేంద్రానికి వెళుతున్నాయని చెప్పారు. అక్కడ శాస్త్రవేత్తలు వాటిని ప్రాసెస్‌ చేస్తున్నారని.. త్వరలోనే ఆ ఫొటోలను విడుదల చేస్తామన్నారు.

జాబిల్లిపై ప్రజ్ఞాన్‌ రోవర్‌, విక్రమ్‌ ల్యాండర్‌ సమర్థంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కొన్ని పరిశోధనల్లో భాగంగా రోవర్‌ కచ్చితంగా వేర్వేరు ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. రాబోయే 10 రోజుల్లో ల్యాండర్‌, రోవర్‌లు అన్ని పరిశోధనలను పూర్తిచేస్తాయని తెలిపారు. విక్రమ్‌ ల్యాండర్‌ దిగిన చోటుకు ‘శివ్‌శక్తి’ అనే పేరును ప్రధాని మోదీ పెట్టడాన్ని సోమనాథ్‌ సమర్థించారు.

శివ్‌శక్తి, తిరంగా (చంద్రయాన్‌-2 కూలిన ప్రదేశానికి పెట్టిన పేరు) రెండు పేర్లూ భారతీయతకు చిహ్నమన్నారు. చంద్రుడితోపాటు అంగారక, శుక్ర గ్రహాల వద్దకు వ్యోమనౌకలను పంపే సత్తా భారత్‌కు ఉందని సోమనాథ్‌ స్పష్టం చేశారు. ఈ పరిశోధనల కోసం మరిన్ని పెట్టుబడులు అవసరమని తెలిపారు.  ఆదివారం తిరువనంతపురంలో ఉన్న భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన సోమనాథ్‌.. సైన్స్‌, ఆధ్యాత్మికం పట్ల తనకు ఆసక్తి ఉందని తెలిపారు.

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ కొనసాగుతుంది

తిరుమల తిరుపతి దేవస్థానంలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

స్వామివారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

కాగా నిన్న ఆదివారం శ్రీవారిని 79,152 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 4.02 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారికి 30,329 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.....

నేడు ఎన్టీఆర్‌ రూ.100 నాణెం ఆవిష్కరణ

లెజెండరీ నటుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నందమూరి తారక రామారావు చిత్రంతో రూపొందిన రూ.100 నాణేన్ని ఇవాళ రాష్ట్రపతి ముర్ము విడుదల చేయనున్నారు.

రాష్ట్రపతి భవన్ లో జరగనున్న ఈ కార్యక్రమంలో టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు..

SB NEWS