/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు మెంబర్ గా సీతారెడ్డి Yadagiri Goud
తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు మెంబర్ గా సీతారెడ్డి

చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి సతీమణి గడ్డం సీతా రెడ్డి కి కీలక పదవి దక్కింది.

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ గా నియమించారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి. 24 మందితో కొత్త పాలక మండలి ఏర్పాటు చేశారు. తెలంగాణా నుండి చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి సతీమణి సీతా రెడ్డికి అవకాశం దక్కింది.

టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం దక్కడం పట్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తనను టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి …తెలంగాణ సీఎం కేసీఅర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

సీతారెడ్డి. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని వెల్లడించారు. ఇటీవల తిరుమల వేంకటేశ్వర స్వామినీ దర్శించుకున్న మరుసటి రోజే టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం దక్కడం విశేషం

కువైట్ లో రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

కువైట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందినట్లు సమాచారం.

మృతుడు గౌస్‌బాషా (35) అతని భార్య (30), ఇద్దరు కుమారులు ఈ ప్రమాదంలో మృతి చెందారు.. గౌస్‌బాషా రాజంపేట పట్టణంలోని ఎగువగడ్డలో ఉన్న అమ్మమ్మ తాతల వద్ద ఉంటూ స్థానిక ఓ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నట్లు తెలుస్తోంది.

అనంతరం తన స్వగ్రామమైన మదనపల్లెకి వెళ్లారు. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లి వివాహం చేసుకుని స్థిరపడ్డారు.బెంగళూరు నుంచి కువైట్‌కి వెళ్లిన గౌస్‌బాషా, ఆయన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి శుక్రవారం కారులో వెళ్తూ అదుపు తప్పి కారు బోల్తా పడిన సంఘటనలో కుటుంబం మృతి చెందినట్లు సమాచారం.

రోడ్డు ప్రమాదం జరిగింది వాస్తవమేనని, మృతి చెందినట్లు చెబుతున్న వ్యక్తికి ఫోన్‌ చేస్తే అందుబాటులోకి రావడం లేదని.. దీని బట్టి చూస్తే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని.. వారి మృతదేహాలను చూసే వరకు నిర్ధారించలేమని గౌస్‌బాషా సమీప బంధువులు తెలిపారు.........

పర్యాటక రైలులో భారీ పేలుడు :10 మంది దుర్మరణం

ఆలయాల నగరంగా ప్రసిద్ధిగాంచిన తమిళనాడు రాష్ట్రంలోని మదురైలోని రైల్వే స్టేషన్‌లో ఆగివున్న పర్యాటక రైలులో అగ్నిప్రమాదం జరిగింది.

ఈ రైలులోని ప్యాంట్రీకార్‌లో సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది..ఇందులో మొత్తం 10 మంది వరకు చనిపోయినట్టు సమాచారం. మరికొందరు గాయపడినట్లు తెలిసింది,

లక్నో నుంచి రామేశ్వరం ప్రాంతాలను కలుపుతూ రైల్వే శాఖ పర్యాటక రైలును నడుపుతుంది. ఈ రైలు మదురై స్టేషన్‌కు వచ్చి ఆగింది. శనివారం ఉదయం రైలులోని ప్యాంట్రీకార్‌లో వంట పనుషులు తేనీరు పెట్టేందుకు గ్యాస్ స్టౌ వెలిగించారు. ఆ సమయంలో సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది

ఈ ప్రమాదంలో తొలుత ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వచ్చినప్పటికి ఇప్పటివరకు 10 మంది చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే అగ్నిమాపకదళ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని మదురై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు..

డీఎస్సీ ఏర్పాట్లపై అధికారుల కసరత్తు

తెలంగాణలో డీఎస్సీకి లైన్‌ క్లియర్‌ అయ్యింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన నేపథ్యంలో పాఠశాల విద్యలో 5,089 టీచర్‌ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ శుక్రవారం సాయంత్రం ఆమోదం తెలిపింది.

ఈ మేరకు జీవో – 96ను జారీచేసింది. ఈ నేపథ్యంలోనే డీఎస్సీ మార్గదర్శకాల రూపకల్పనపై సంబంధిత శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు.అధికారిక సమాచారం ప్రకారం దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే స్వీకరిస్తారు.

పరీక్షలను ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. గురుకుల ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించగా, డీఎస్సీని సైతం ఇదే తరహాలో నిర్వహించే అంశంపై విద్యాశాఖ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.

పరీక్షలను మూడు రోజులపాటు నిర్వహిస్తారు ఎస్జీటీలకు ఒక రోజు, స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులకు రెండు రోజులపాటు పరీక్షలు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. తాజాగా 5,089 పోస్టుల భర్తీకి జీవో విడుదల కాగా, 1,523 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ ఫర్‌ డిసేబుల్డ్‌ పోస్టులను కొత్తగా మంజూరుచేయాల్సి ఉన్నది.

ఇవి కొత్త పోస్టులు కావడంతో ఆయా పోస్టులను మంజూరుచేస్తూ.. భర్తీకి అనుమతినిస్తూ ఒకే జీవోను జారీచేసే అవకాశాలు ఉన్నాయి. ఈ జీవో ఒకట్రెండు రోజుల్లో వస్తుందని అధికారులు చెప్తున్నారు.

టీచర్‌ ఉద్యోగాల భర్తీకి డీఎస్సీ ఎగ్జామ్‌ను 80 మార్కులకు నిర్వహిస్తారు. అ ప్రశ్నపత్రంలో మాత్రం 160 ప్రశ్నలుంటాయి. అంటే ఒక్కో ప్రశ్నకు అరమార్కు చొప్పున కేటాయిస్తారు.

ఇక టెట్‌కు 20 మార్కుల వెయిటేజీ ఉంటుంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష నిర్వహణ రాష్ట్రస్థాయిలోనే ఉంటుంది. అయితే, ఫలితాలు ప్రకటించిన తర్వాత జిల్లాలవారీగా మెరిట్‌, సెలెక్షన్‌ జాబితాలు విడుదల చేస్తారు.

కలెక్టర్ల నేతృత్వంలోని డిస్ట్రిక్ట్‌ సెలెక్షన్‌ కమిటీ, డీఎస్సీ, ఈ పోస్టుల భర్తీని చేపడుతుంది. కాగా, పాఠశాల విద్యాశాఖ అధికారులు డీఎస్సీ ఏర్పాట్లపై కసరత్తు ముమ్మరం చేశారు.

మార్గదర్శకాలు

గతంలో ఏజెన్సీ పోస్టుల్లో 100 శాతం గిరిజనులకే కేటాయించగా,

ఈ నిబంధనను తాజాగా ఎత్తివేస్తున్నారు. రోస్టర్‌ ప్రకారం అంతా పోటీపడొచ్చు.

గతంలో 6 శాతం ఉన్న ఎస్టీ రిజర్వేషన్‌ తాజాగా 10 శాతానికి పెంచుతున్నారు.

గతంలో లోకల్‌, ఓపెన్‌ కోటా రిజర్వేషన్‌ 80 : 20 పద్ధతిలో ఉండగా, తాజాగా 95 : 5 రేషియోలో అమలుచేస్తారు.

అభ్యర్థుల స్థానికతను నిర్ధారించేందుకు గతంలో

4-10 తరగతుల చదువును పరిగణలోకి తీసుకోగా,

తాజాగా 1-7 తరగతులను లెక్కలోకి తీసుకొంటారు.

PM Modi: బెంగళూరుకు చేరుకున్న ప్రధాని మోదీ.. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు

బెంగళూరు: విదేశీ పర్యటన ముగించుకొని ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా బెంగళూరుకు వచ్చారు. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు మోదీ ఇక్కడి వచ్చిన సంగతి తెలిసిందే..

ఈ సందర్భంగా విమానాశ్రయం వద్దకు వచ్చిన అభిమానులు, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 'జై విజ్ఞాన్‌.. జై అనుసంధాన్‌' నినాదం ఇచ్చారు. ''చంద్రుడిపై మన ల్యాండర్‌ దిగినప్పుడు భారత్‌లో నేను లేను. ఆ అద్భుత క్షణాలను విదేశాల నుంచి చూశా.

అప్పుడే నేరుగా బెంగళూరుకు రావాలని అనుకున్నా. భారత్‌ రాగానే శాస్త్రవేత్తలను కలుసుకొని అభినందించాలనుకున్నా. ఇస్రో శాస్త్రవేత్తలను కలవాలని చాలా ఆత్రుతగా ఉన్నా'' అని మోదీ వెల్లడించారు.

అనంతరం విమానాశ్రయం నుంచి నుంచి నేరుగా పీణ్యలోని ఇస్రో కేంద్రానికి మోదీ వెళ్లారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ సందర్భంగా చంద్రయాన్‌-3 ప్రయోగం తీరును ప్రధానికి ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ వివరించారు..

మూడు ప్రార్థన ఆలయాలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

సచివాలయం ప్రాంగణంలో నిర్మితమైన దేవాలయం, మసీద్‌, చర్చి మ‌రికొద్దిసేప‌టిలో సీఎం కేసీఆర్‌ మీదుగా ప్రారంభం కానున్నాయి. తెలంగాణ పరిపాలనా సౌధం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయం సర్వమత సమ్మేళనానికి అత్తం పట్టనున్నది. సచివాల యం ఆవరణలో కొత్తగా ఈ మూడు నిర్మాణాలు పూర్తయ్యాయి.

సచివాలయం ఆవరణలో నిర్మించిన ఆలయంలో శివుడు, గణపతి, పోచమ్మ, హనుమంతుడి ఆలయాలున్నాయి. ఆయా దేవుళ్ల విగ్రహాలను తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర శిల్ప కళాశాల నుంచి ప్రత్యేకంగా ఆయరు చేయించి తెప్పించారు. కాగా, గుడి, మసీదు, చర్చిలను సచివాలయంతోపాటే ప్రారంభించాలని భావించినా నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో సాధ్యంకాలేదు.

జులై 25 నాడే ప్రారంభించాలని భావించినా అనివార్యంగా కొన్ని పనులు పెండింగ్‌లో పడటంతో నిల్చిపోయింది. హిందూ సాంప్రదాయాలను అనుసరించి పూజారుల సమక్షంలో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన చేసి దేవాలన్ని నేడు పున:ప్రారం భించనున్నారు.ఆ తర్వాత ఇస్లాం, క్రిస్టియన్‌ మతాల సాంప్రదా యాల మేరకు ఆయా మత పెద్దల సమక్షంలో మసీదు, చర్చిలను ప్రారంభిస్తారు.

తెలంగాణ పాత సచివాలయ ప్రాంగణంలో ఉన్న ప్రార్ధనా మందిరాలను తెలంగాణ సర్కార్‌ నూతన సచివాలయ నిర్మాణం తర్వాత పున:నిర్మించింది. గతంలో తెలంగాణ పాత సచివాల యంలో నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయం, రెండు మసీదులు, చర్చి ఉండేవి. పాత భవనాల కూల్చివేతల సమయంలో ప్రార్ధనా మందిరాలకు నష్టం వాటిళ్లడంతో ప్రభుత్వ ఖర్చుతోనే పున:నిర్మి స్తామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఇందుకు అనుగుణంగా సచివా లయ ప్రధాన భవన ప్రాంగణం వెలుపల మూడు నిర్మాణాలను నిర్మించారు. సచివాలయానికి నైరుతి మూలలో నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయం విశాలంగా నిర్మించారు.

ప్రధాన ఆలయంలో భాగంగా గర్బగుడి, మహామండపం నిర్మించారు. నల్లపోచమ్మ ఆలయంతోపాటు శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయం, గణపతి, సుబ్రహ్మన్య స్వామి ఆలయనాలను కూడా నిర్మించారు...

Stalin: దేశంలోనే తొలిసారి అల్పాహార పథకం.. పిల్లలకు స్వయంగా వడ్డించిన సీఎం స్టాలిన్‌

నాగపట్టణం: తమిళనాడు (Tamil Nadu)లోని ప్రభుత్వ పాఠశాలల్లో 'ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని (breakfast scheme)'.. సీఎం స్టాలిన్‌ (MK Stalin) శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చారు..

ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందించే విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. దేశంలోనే విద్యార్థులకు పాఠశాలల్లో అల్పాహారం అందిస్తున్న తొలి రాష్ట్రం తమిళనాడే కావడం విశేషం.

నాగపట్టణం జిల్లాలోని తిరుక్కువళై ప్రాథమిక పాఠశాలలో ఈ స్కీం (breakfast scheme) రెండో విడతను ప్రారంభించిన సీఎం స్టాలిన్‌.. చిన్నారులకు అందించే అల్పాహారాన్ని దగ్గరుండి పరిశీలించారు. అనంతరం పిల్లలకు స్వయంగా బ్రేక్‌ఫాస్ట్‌ వడ్డించిన ముఖ్యమంత్రి.. తాను కూడా చిన్నారులతో కలిసి అల్పాహారం తిన్నారు. చెన్నైలో స్టాలిన్‌ కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి ఈ పథకాన్ని ప్రారంభించారు..

IMS scam: ఐఎంఎస్‌ కుంభకోణం కేసులో ఈడీ ఛార్జిషీట్‌

హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన బీమా వైద్య సేవల (ఐఎంఎస్‌) కుంభకోణం(IMS scam) కేసులో ఈడీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఐఎంఎస్‌ మాజీ సంచాలకులు దేవికారాణితో పాటు 15 మందిని ఈడీ నిందితులుగా చేర్చింది..

గతంలో నిందితులకు చెందిన ₹144 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేస్తోంది..

వైద్యం చేయకుండానే చేసినట్లు, మందులు కొనకుండానే కొన్నట్లు చూపడంతో పాటు తక్కువ ధరకు కొనుగోలు చేసి లెక్కల్లో ఎక్కువ చూపడం ద్వారా కొందరు ఐఎంఎస్‌ అధికారులు భారీ కుంభకోణానికి పాల్పడినట్లు 2019లో ఏసీబీ కేసు నమోదు చేసింది. అయిదేళ్లలో దాదాపు రూ.300 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు అప్పట్లో ఏసీబీ అధికారులు నిగ్గు తేల్చారు..

భద్రకాళి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

వరంగల్‌ జిల్లా :ఆగస్టు 25

రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు శ్రావణ శుక్రవారం కళను సంతరించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు.

వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో బారులుతీరారు.

రాజరాజేశ్వరీ ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు చేస్తున్నారు. కన్యకాపరమేశ్వరి గుడిలో అమ్మవారికి గాజులతో ప్రత్యేక అలంకరణ చేశారు.....

కాసేపట్లో సచివాలయానికి గవర్నర్ తమిళి సై

చార్మినార్ భాగ్యలక్మి అమ్మవారిని గవర్నర్ తమిళి సై దర్శించుకున్నారు. శుక్రవారం ఆలయానికి వెళ్లిన ఆమెకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో గవర్నర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం రాష్ట్ర సచివాలయానికి వెళ్లనున్నారు. సెక్రటేరియట్ ప్రారంభం తర్వాత గవర్నర్ తొలిసారి వెళ్లడం విశేషం. కాగా, దాదాపు రెండేండ్లుగా ప్రగతి భవన్, రాజ్‌భవన్ మధ్య దూరం పెరిగింది

రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా తనకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోటోకాల్ లేదంటూ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ నిప్పులు చెరిగారు.

రాజ్‌భవన్‌‌లో బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా ట్విట్టర్ ద్వారా తనదైన శైలిలో తమిళిసై సెటైర్ వేశారు. ఇదిలా ఉండగా.. అనూహ్యంగా మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో గవర్నర్‌తో సీఎం దాదాపు 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు.

అనంతరం గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం ఆహ్వానం పలికారు. సచివాలయ ప్రాంగణంలో ప్రభుత్వం నిర్మించిన చర్చి, మసీదు, నల్లపోచమ్మ ఆలయాల ప్రారంభోత్సవానికి రావాలని ఇన్వైట్ చేశారు. దీనికి అంగీకరించిన ఆమె కాసేపట్లో సచివాలయానికి వెళ్లనున్నారు..