/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz కాసేపట్లో సచివాలయానికి గవర్నర్ తమిళి సై Yadagiri Goud
కాసేపట్లో సచివాలయానికి గవర్నర్ తమిళి సై

చార్మినార్ భాగ్యలక్మి అమ్మవారిని గవర్నర్ తమిళి సై దర్శించుకున్నారు. శుక్రవారం ఆలయానికి వెళ్లిన ఆమెకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో గవర్నర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం రాష్ట్ర సచివాలయానికి వెళ్లనున్నారు. సెక్రటేరియట్ ప్రారంభం తర్వాత గవర్నర్ తొలిసారి వెళ్లడం విశేషం. కాగా, దాదాపు రెండేండ్లుగా ప్రగతి భవన్, రాజ్‌భవన్ మధ్య దూరం పెరిగింది

రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా తనకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోటోకాల్ లేదంటూ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ నిప్పులు చెరిగారు.

రాజ్‌భవన్‌‌లో బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా ట్విట్టర్ ద్వారా తనదైన శైలిలో తమిళిసై సెటైర్ వేశారు. ఇదిలా ఉండగా.. అనూహ్యంగా మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో గవర్నర్‌తో సీఎం దాదాపు 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు.

అనంతరం గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం ఆహ్వానం పలికారు. సచివాలయ ప్రాంగణంలో ప్రభుత్వం నిర్మించిన చర్చి, మసీదు, నల్లపోచమ్మ ఆలయాల ప్రారంభోత్సవానికి రావాలని ఇన్వైట్ చేశారు. దీనికి అంగీకరించిన ఆమె కాసేపట్లో సచివాలయానికి వెళ్లనున్నారు..

Hyderabad: విమానంలో మందుబాబుల హల్‌చల్.. శంషాబాద్‌లో అత్యవసరంగా దించిన పైలట్

శంషాబాద్‌: దుబాయ్‌ నుంచి కొచ్చికి బయలుదేరిన ఓ విమానంలో నలుగురు ప్రయాణికులు మద్యం మత్తులో తోటి ప్రయాణికులతో అమర్యాదగా ప్రవర్తించారు..

ఇదేమని అడిగిన సిబ్బందిపై, ఇతర ప్రయాణికులపై దాడికి యత్నించారు. దీంతో విమానాన్ని పైలట్‌ దారిమళ్లించి శంషాబాద్‌ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌ చేశారని ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపారు.

ఆ నలుగుర్నీ భద్రతాధికారులు అదుపులోకి తీసుకుని... పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్జీఐఏ ఠాణా పోలీసులు తెలిపారు..

బోల్తా పడ్డ ట్రావెల్స్ బస్సు పలువురికి గాయాలు

ఎన్టీఆర్ జిల్లా :

జిల్లా లోని జగ్గయ్యపేట పరిధిలో ఉన్నతోటచర్ల మునగచర్ల మధ్యలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద గురువారం అర్ధరాత్రి మయూరి ట్రావెల్స్ బస్సు (AP39 TC 4248) బోల్తా కొట్టింది.

జాతీయ రహదారి పక్కన ఉన్న కందకంలో పల్టీ కొట్టిన బస్సు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి.ప్రమాదం జరిగిన సందర్భంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

హైదరాబాదు నుండి విజయనగరం వెళ్తున్న బస్సు అతి వేగంకారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ప్రమాదంలో గాయపడిన 10 మంది ప్రయాణికులకు గాయాలు నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు , జి ఎం ఆర్ ,108 సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు.....

ఈనెల 27న ఖమ్మంలో పర్యటించనున్న అమిత్ షా

ఈ నెల 27న ఆదివారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. అదే రోజు సాయంత్రం ఖమ్మం లో‌ జరిగే బీజేపీ రైతు సభ లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు.

ఆ రోజు మధ్యాహ్నం భద్రాచలం రాములవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

అమిత్ షా ఖమ్మం పర్యటన షెడ్యూల్

27న ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు అమిత్ షా చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 2.10 గంటలకు కొత్తగూడెంకు చేరుకుంటారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం రాములవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తిరిగి భద్రాచలం దేవాలయం నుంచి రోడ్డు మార్గాన కొత్తగూడెంకు వస్తారు. అక్కడి నుంచి 2.55 గంటలకు బీఎస్ఎఫ్ హెలికాప్టర్‌లో బయలుదేరి‌ 3.30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు.

అనంతరం అక్కడ జరిగే బీజేపీ రైతు సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బహిరంగ సభ తర్వాత గంట పాటు తెలంగాణ బీజేపీ నేతలతో ఆయన సమావేశమై ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు.

సాయంత్రం 5.45 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి గన్నవరానికి చేరుకుని.. సాయంత్రం 6.20 గంటలకు అమిత్ షా ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు...

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్ట్‌

అట్లాంటా: అమెరికా (USA) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) అరెస్టు అయ్యారు. 2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర తదితర కేసులు ఆయనపై నమోదైన నేపథ్యంలో పోలీసులకు లొంగిపోవాల్సి ఉంది..

ఈ మేరకు జార్జియా జైల్‌ వద్ద పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇప్పటికే ఆయన స్వయంగా ఫుల్టన్‌ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయి రెండు లక్షల డాలర్ల విలువైన బాండ్‌ను సమర్పించి బెయిల్‌ తీసుకొనేందుకు అట్లాంటా ఫుల్టన్‌ కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్ని ఫాని విల్లీస్‌ అనుమతించారు.

దీంతో ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు ట్రంప్‌ జైలుకు వెళ్లారు. ట్రంప్‌పై నమోదైన నాలుగు క్రిమినల్‌ కేసుల్లో ఇదొకటి. ట్రంప్‌ జైలులో 20 నిమిషాలు గడిపారు. అనంతరం బెయిల్‌పై బయటకొచ్చారు..

తిరుమలలో శుక్రవారం పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి :ఆగస్టు 25

తిరుమలలో నేడు శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చారు.

శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

ఇక గురువారం శ్రీవారిని 67,308 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.82 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 26,674 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

తెలంగాణ ఎన్నికలకు సర్వం సిద్ధం !

- తెలంగాణ ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించిన ఈసీ

- అక్టోబర్ రెండో వారంలో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం

- డిసెంబర్ రెండో వారంలోగా ఎన్నికలు నిర్వహించే ఛాన్స్.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలోగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు అప్రమత్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే 115 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్ సైతం తొలి జాబితాను ప్రకటించేందుకు కసరత్తులు చేస్తున్నాయి. మరోవైపు ఎన్నికల సంఘం కూడా అసెంబ్లీ ఎన్నికల విషయమై కసరత్తు ప్రారంభించింది. అక్టోబర్ రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తోంది. డిసెంబర్ రెండో వారంలోగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రణాళికలు రూపొందిస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ గడువు 2024 జనవరి 16 వరకు ఉంది. 2014లో సార్వత్రిక ఎన్నికలతోపాటు ఉమ్మడి రాష్ట్రంలోనే చివరి ఎన్నికలు జరిగాయి. కానీ ఐదేళ్లు పూర్తి కాకుండానే కేసీఆర్ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. దీంతో 2018 అక్టోబర్ 6న ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. సరిగ్గా రెండు నెలలకు అంటే డిసెంబర్ 7న పోలింగ్ నిర్వహించారు. ఎమ్మెల్యేలంతా జనవరి 17న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో జనవరి 16వ తేదీ వరకు ప్రస్తుత అసెంబ్లీ మనుగడ సాగించే అవకాశం ఉంది.

తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఒకేసారి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందు కేంద్ర ఎన్నికల సంఘం రెండు సార్లు రాష్ట్రంలో పర్యటించనుంది. ఎన్నికల సన్నద్ధతను పరిశీలించడానికి ఓసారి.. నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత మరోసారి సీఈసీ బృందం రాష్ట్రానికి రానుంది. అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంటోంది. తెలంగాణలోనూ డబ్బు ప్రభావం పెరిగిందని మునుగోడు, హుజూరాబాద్ ఉపఎన్నికలను బట్టి చెప్పొచ్చు. ఈ ఉపఎన్నికల్లో పార్టీలు భారీగా డబ్బును పంచాయనే ప్రచారం జరిగింది. దీంతో ఎన్నికల్లో నగదు ప్రభావాన్ని అరికట్టడానికి నిఘాను పెంచనుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను సైతం ఎన్నికల సంఘం రంగంలోకి దింపనుంది.

BJP: 27న తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటన: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈనెల 27న తెలంగాణలో పర్యటిస్తారని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో భద్రాచలం వస్తారని తెలిపారు..

భద్రాచలంలో శ్రీరామచంద్రుని దర్శించుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు భాజపా ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించే 'రైతు గోస.. భాజపా భరోసా' బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని వెల్లడించారు..

ధాన్యం కొనుగోలులో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందని కిషన్‌రెడ్డి విమర్శించారు. సమగ్రమైన పంటల బీమా పథకం తెలంగాణలో అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పి భారాస ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్నారు. ఎన్నికల ముందు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రుణమాఫీ పేరుతో మరోసారి మోసం చేస్తున్నారని విమర్శించారు.

వ్యవసాయ పనిముట్ల సబ్సిడీలను కేసీఆర్‌ సర్కారు ఇవ్వడం లేదన్నారు. సకల సమస్యలకు రైతు బంధు పరిష్కారం కాదన్నారు. లక్షలాది కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తీవ్రంగా నష్టపోయారన్నారు. మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌ కుటుంబానికి లేదన్నారు. తొలి మంత్రివర్గంలో మహిళా మంత్రి లేకుండా ఐదేళ్లు పాలించిన కేసీఆర్‌కు కేంద్రాన్ని విమర్శించే అర్హత లేదన్నారు..

Chandrayaan-3: చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌తో.. '45 ట్రిలియన్‌' ట్రెండింగ్‌..!

జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌-3 (Chandrayaan-3) విజయవంతంగా అడుగుపెట్టడం యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అసాధ్యమనుకున్న ఈ యాత్రను సుసాధ్యం చేసిన భారత్‌ (India), ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలపై అన్ని దేశాలూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి..

అయితే, చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ల్యాండింగ్‌ నేపథ్యంలో ఇప్పుడు '45 ట్రిలియన్‌ (45 Trillion)' అనే పదం నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది. మన చారిత్రక ప్రయోగంపై బ్రిటిష్‌ (British) జర్నలిస్టులు చేసిన వ్యాఖ్యలే ఇందుక్కారణం. ఇంతకీ ఏం జరిగిందంటే..

చంద్రయాన్‌-3 ప్రయోగంపై ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకలు వెల్లువెత్తుతున్న వేళ.. కొందరు బ్రిటన్‌ (Britain) జర్నలిస్టులు భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. ''జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి రాకెట్లను పంపించేలా అంతరిక్ష రంగంలో పురోగతి సాధించిన దేశాలకు యూకే (UK) ఆర్థిక సాయం పంపించాల్సిన అవసరం లేదు'' అని యూకేకు చెందిన సోఫీ అనే జర్నలిస్టు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. జీబీ న్యూస్‌కు చెందిన మరో మీడియా ప్రజెంటేటర్‌ స్పందిస్తూ.. ''రూల్‌ ప్రకారం.. జాబిల్లికి అవతలివైపు రాకెట్లను ప్రయోగించే మీరు.. విదేశీ సాయం కోసం మా వద్దకు రావొద్దు. అంతేగాక, మేమిచ్చిన 2.3 బిలియన్‌ పౌండ్లను మాకు తిరిగిచ్చేయాలి'' అని అన్నారు..

దీంతో వీరి పోస్టులపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు శతాబ్దాల పాటు భారత్‌ను పాలించిన యూకే.. తమ నుంచి దోచుకున్న మొత్తం 45 ట్రిలియన్‌ డాలర్లను తిరిగిచ్చేయాలంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు '45 ట్రిలియన్‌' అనే పదం సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

ఈ 45 ట్రిలియన్‌ ఎలా తెలిసిందంటే..?

భారత్‌కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త ఉత్సా పట్నాయక్‌ ఇటీవల కొలంబియా యూనివర్శిటీ ప్రెస్‌లో ఓ అధ్యయనాన్ని ప్రచురించారు. 1765 నుంచి 1938 వరకు బ్రిటన్‌.. భారత్‌ నుంచి 45 ట్రిలియన్‌ డాలర్లు సంపాదించిందని పట్నాయక్‌ పేర్కొన్నారు. రెండు శతాబ్దాల కాలంలో పన్నులు, వాణిజ్యంపై ఉన్న డేటాను అధ్యయనం చేసి ఆమె ఈ లెక్క చెప్పారు. ఈ మొత్తం.. ప్రస్తుతం యూకే జీడీపీ కంటే 15 రెట్లు ఎక్కువ..

ఇదిలా ఉండగా.. అంతరిక్ష ప్రయోగాలకు యూకే నుంచి ఆర్థిక సాయాన్ని భారత్‌ 2015లోనే నిలిపివేసిందని ఈ ఏడాది మార్చిలో గార్డియన్‌ ఓ కథనం వెలువరించింది. అయితే, ఆ తర్వాత ఇండిపెండెంట్‌ కమిషన్‌ ఫర్‌ ఎయిడ్ ఇంపాక్ట్‌ సమీక్ష చేపట్టి.. 2016 నుంచి 2021 వరకు యూకే.. భారత్‌కు 2.3 బిలియన్‌ పౌండ్లు సాయంగా ఇచ్చిందని ప్రకటించింది. దీన్ని ఉద్దేశిస్తూనే యూకే జర్నలిస్టులు పోస్టులు చేశారు..

Nara Lokesh: సైకో పాలనలో కంపెనీలు తరలిపోతున్నాయ్‌: లోకేశ్‌

గన్నవరం: తెదేపా హయాంలో ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ ఏర్పాటు చేశామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం పరిధిలోని మల్లవల్లిలో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు 100 ఎకరాలు కేటాయించినట్లు చెప్పారు..

జగన్‌ వచ్చిన తర్వాత ఆ భూముల్లో వైకాపా నేతలు మట్టి తవ్వుకుంటున్నారు తప్ప.. ఇళ్లు కట్టలేదని విమర్శించారు. మల్లవల్లి గ్రామస్థులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో నారా లోకేశ్‌ పాల్గొన్నారు. తెదేపా సైకిల్‌ గుర్తులో ముందు చక్రం సంక్షేమానికి, వెనుక చక్రం అభివృద్ధికి నిదర్శనమన్నారు. రూ.200 పెన్షన్‌ని రూ. 2000కి పెంచిన ఘనత తెదేపాకే చెల్లుతుందన్నారు..

''పెళ్లి కానుక, పసుపు కుంకుమ, చంద్రన్న బీమా లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తెదేపా అమలు చేసింది. మల్లవల్లిలో 1400 ఎకరాల భూములను కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు కొంత మంది నాయకులు కొట్టేయాలని ప్రయత్నిస్తే తెదేపా పోరాడింది. మల్లవల్లిలో భూములు కాపాడి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేసింది కూడా తెదేపానే. విధ్వంసంతో జగన్‌ పరిపాలన మొదలు పెట్టారు. ప్రజావేదికనును కూల్చి వేసి పాలన మొదలు పెట్టారు. మీరు పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో 75 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేవలం సైకో పాలన వలన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. అశోక్‌ లేలాండ్‌ లాంటి అనేక కంపెనీలను తెదేపా తీసుకొస్తే.. జగన్‌ వాటిని తరిమేస్తున్నారు.'' అని లోకేశ్‌ విమర్శించారు..

తెదేపా హయాంలో పసుపుకుంకుమ కింద రూ.20 వేలు ఇచ్చేవారని, ఈ ప్రభుత్వంలో మాకు సాయం అందలేదని మల్లవల్లి మహిళలు లోకేశ్‌ ఎదుట మొరపెట్టుకున్నారు.'' పండగ కానుకలు కూడా జగన్‌ ప్రభుత్వం ఆపేసింది. ఇళ్లు నిర్మించుకున్న వారికి జగన్‌ ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. గ్రామంలో కొన్ని కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు లేదు. జగన్ ప్రభుత్వం మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌ని నాశనం చేసింది. మాకు ఉద్యోగాలు లేకుండా చేశారు. ఉన్న కంపెనీలు అన్ని ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. 2వేల మందికి ఉద్యోగాలు కల్పించిన అశోక్‌ లేలాండ్‌ కంపెనీ జగన్‌ పాలనలో వెళ్లిపోయింది. గ్రామంలో వైఎస్‌ఆర్‌ జలకళ కింద బోర్లు వేయిస్తామని లంచం తీసుకొని బోర్లు వెయ్యకుండా మోసం చేశారు.'' అని మల్లవల్లి గ్రామస్థులు లోకేశ్‌ ఎదుట వాపోయారు..