/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png StreetBuzz గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టు స్టేటస్ కో.. Andrapradesh
గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టు స్టేటస్ కో..

గుంటూరులో గ్రానైట్ తవ్వకాలపై కీలక ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. గ్రానైట్ తవ్వకాలపై స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది.. గ్రానైట్‌ తవ్వకాలు నిలిపివేయాలంటూ గుంటూరు జిల్లా చిలకలూరపేటలో మురికిపుడి రైతులు హైకోర్టును ఆశ్రయించారు.. దీనిపై గతంలో విచారణ జరిపి మంత్రి విడదల రజనీ సహా పలువురికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు.. ఇక, ఈ రోజు మరోసారి విచారణ చేపట్టిన కోర్టు.. స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ఈ కేసులో మంత్రి విడదల రజనీ, ఎంపీ అవినాష్ రెడ్డి మామ ప్రతాప్ రెడ్డి, మరదలు స్వేతారెడ్డి, జీవీ దినేష్ రెడ్డి, శివపార్వతులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు.. అయితే, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూముల్లో డీకే పట్టాలు రద్దుచేయకుండా గ్రానైట్ తవ్వకాలకు ఎన్‌వోసీ ఇవ్వడంపై హైకోర్టులో రైతులు పిటిషన్‌ వేశారు.. ఈ పిటిషన్ తరపున వాదనలు వినిపించారు న్యాయవాది వీవీ లక్ష్మినారాయణ.. మొత్తం 21 ఎకరాల 50 సెంట్లు భూమిలో గ్రానైట్ తవ్వకాలకు ఎన్‌వోసీ ఇచ్చిన ఎమ్మార్వోకు, రైతులు పనులు చేస్తుంటే అడ్డుకున్న ఎస్సైకి కూడా నోటీసులు ఇచ్చింది.

ఒక్కో ఎకరాలో 200 కోట్లు విలువ చేసే గ్రానైట్ నిల్వలు ఉన్నాయని అంచనా ఉండగా.. రైతులకు తెలియకుండానే ఎన్‌వోసీ ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.. ఇక, దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, వచ్చేనెల 10 వ తేదీకి కేసు విచారణ వాయిదా వేసింది.. అప్పటి వరకు స్టేటస్ కో ఉత్తర్వులు. కౌంటర్ లు దాఖలు చేయాలని మంత్రి, ఇతరులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.

శ్రీశైలంలో మహా కుంభాభిషేకం.. ప్రధాని, సీఎంకు ఆహ్వానాలు..!

ప్రఖ్యాత శైవ క్షేత్రాలలో ఒకటైన శ్రీశైలంలో మహా కుంభాభిషేకం నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. శ్రీశైలంలో మే 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది.. ఇప్పటికే సీఎం జగన్‌కు ఆహ్వానం అందగా.. ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఇక, మహా కుంభాభిషేకంలో భాగంగా శివాజీ గోపురం కలిశా ప్రతిష్టాపన చేయనుంది దేవస్థానం.. మహా కుంభాభిషేక సమయంలోనే పంచమఠ లింగాల ప్రతిష్టాపన చేయనున్నట్టు శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ శివాచార్య స్వామీజీ వెల్లడించారు. వీర శైవ ఆగమ శాస్త్రం, బ్రాహ్మణ ఆగమ శాస్త్రం ప్రకారం కలశ ప్రతిష్ట పనులు నిర్వహించాలన్నారు.. బ్రాహ్మణ, వీరశైవులకు సమాన అవకాశం ఇవ్వాలని ఈవోని కోరుతున్నాం అన్నా జగద్గురు పీఠాధిపతి.

ఇక, మహా కుంభాభిషేకానికి సీఎం జగన్ ను ఆహ్వానించాం.. ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నాం అన్నారు శ్రీశైల జగద్గురు పీఠాధిపతి. కాగా, దేశంలోనే ప్రఖ్యాత శైవ క్షేత్రాలలో శ్రీశైలంలో ఒకటి.. నల్లమల ఫారెస్ట్‌లో కృష్ణానది ఒడ్డున.. శ్రీశైలం డ్యామ్‌ పరిసరాల్లో ఈ ఆలయం ఉంది.. శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రంగా గుర్తింపు పొందింది. అంతేకాదు.. ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలం రెండవది కావడం విశేషం.. అలాగే అష్టాదశ శక్తి పీఠాలలో ఆరోది కూడా శ్రీశైలమే… దీంతోపాటు దశ భాస్కర క్షేత్రాల్లో ఆరోది. అందుకే శ్రీశైలాన్ని శ్రీగిరి, సిరిగిరి అని భక్తులు పిలుస్తుంటారు. శ్రీశైలం అంటే సంపద్వంతమైన పర్వతమని పండితులు పేర్కొన్నారు.. ఇక, ఈ క్షేత్రంలో మే 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.

వైఎస్ వివేక హత్య కేసు.. తులసమ్మ వాంగ్మూలం రికార్డ్ చేసిన కోర్ట్

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ 5 నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలాన్ని పులివెందుల కోర్టు నమోదు చేసింది. తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని, కేసు విచారణలో సిబిఐ ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ తులసమ్మ కోర్టులో పిటిషన్ వేశారు.

వివేక హత్య కేసులో సిబిఐ చేస్తున్న విచారణ తీరుపై పులివెందులలో ఫిబ్రవరిలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దేవిరెడ్డి శంకర రెడ్డి భార్య తులసమ్మ. ఈ నేపథ్యంలో నేడు పులివెందుల కోర్టులో వివేక పిఏ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ నమోదు. ఈ సందర్భంగా దేవి రెడ్డి శంకర్ రెడ్డి భార్య తులసమ్మ న్యాయవాది కోదండరామిరెడ్డి మాట్లాడుతూ..

“వివేకానంద రెడ్డి రెండవ వివాహం చేసుకున్నారు. ఆయన రెండవ భార్య షమీం కు ఒక కుమారుడు ఉన్నారు. వారికి ఆస్తి పోతుందని వివేకానంద రెడ్డితో ఆయన కుటుంబ సభ్యులు గొడవపడేవారు. వివేకానంద రెడ్డి కుమార్తె సునీతతో పాటు ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి వివేకతో గొడవ పడేవారు. హత్యానంతరం అక్కడ లభించినవంటి లేఖను ఆయన మొబైల్ ను పోలీసులకు ఇవ్వకుండా అడ్డుకున్నారని కోర్టులో పిఏ కృష్ణారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు ” అని తెలిపారు కోదండరామిరెడ్డి.

SPO ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాక పోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను - PDSU అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు : మల్లెల ప్రసాద్

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం

PDSU రాయదుర్గం డివిజన్ కార్యదర్శి : మల్లెల ప్రసాద్

 రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన  SPO లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలి  రాష్ట్రంలో ఎస్ పి ఓ ఉద్యోగాలు తొలగించడం వల్ల చెక్ పోస్ట్ వద్ద భద్రత లేక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా కర్ణాటక మద్యం మాదకద్రవ్యాలు గుట్కా ప్యాకెట్లు విచ్చలవిడిగా గ్రామస్థాయిలో కూడా మద్యపానం మాదకద్రవ్యాలు గుట్కా అన్ని కూడా సరఫరా అవుతున్నాయి, వీటిని నిలువరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది

 రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్పీఓ ఉద్యోగాలను ఎలాంటి సమాచారం వారికి ఇవ్వకుండా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తూ ఉత్తర్వులు ప్రకటించడం దారుణం ఎంతోమంది యువకులకు ఉపాధి లేకుండా చేసేటటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలి ప్రభుత్వ సలహాదారులు సజ్జాల రామకృష్ణ SPO లకు మళ్ళీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి ఇప్పుడు సంవత్సరం అవుతున్నా కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా యువకులకు పూర్తిగా ఉపాధి లేకుండా చేస్తూ యువకుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారు చెక్ పోస్టులు వద్ద SPO లు లెక్క పోవడం తో కర్ణాటక రాష్ట్రము నుంచి మద్యం గుట్కా మాధక ద్రవ్యలు విచ్చలవిడిగా వస్తున్నపటికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు ఎవరికి వారే యమునా తీరే అనేటువంటి ఈ SPO ఉద్యోగాలపై సరైన వంటి పద్ధతి కాదు మీ ధోరణి మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నాము మరి అదేవిధంగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన ఎస్పీఓ ఉద్యోగాలను భర్తీ చేయాలిలేని పక్షంలో చలో అసెంబ్లీ ముట్టడి కూడా పిలుపునిస్తామని ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తరుపున నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అసెంబ్లీ లో SPO ఉద్యోగాలు గురించి చర్చించి నిర్ణయం తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష కు సిద్ధం,

        ఇట్లు

PDSU అనంతపురం జిల్లా ఉపాధ్యాక్షుడు : మల్లెల ప్రసాద్

 ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం,

GVL Narasimha Rao: 2017లో టీడీపీ చేసిన తప్పే ఇప్పుడు వైసీపీ చేస్తోంది

దళిత క్రిస్టియన్‌లకు ఎస్సీ హోదా కల్పించాలనే వైసీపీ ప్రభుత్వ ఆలోచన రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. ఇవన్నీ ఓటు బ్యాంక్ కోసం చేస్తున్న రాజకీయాలని.. ఇలాంటి రాజకీయ ప్రయత్నాలను బీజేపీ వ్యతిరేకిస్తోందని అన్నారు. 2017లో టీడీపీ చేసిన తప్పే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీలు కూటమి కట్టి.. నైతికత లేకుండా పోరాటాల పేరుతో రోడ్డెక్కుతున్నాయని విమర్శించారు. రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై కోర్టు తీర్పును రాజకీయ పార్టీలు వక్రీకరిస్తున్నాయని విరుచుకుపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ఎప్పుడైనా ముప్పు వాటిల్లిందంటే.. అది కాంగ్రెస్ పార్టీ హయాంలోనేని ఆరోపణలు చేశారు. పరాజయాన్ని జీర్ణించుకోలేకే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. నోటి దురుసు, అహంకారంతో కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్లుగా దూషణలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సామాజిక వర్గమంతా దొంగలు అనడం.. రాహుల్ అహంకారపూరిత వైఖరికి నిదర్శనమని చెప్పుకొచ్చారు.

అంతకుముందు.. ఈసారి తమకు అవకాశం ఇస్తే, సమస్యలను ప్రధాని మోడీకి చూపించి అభివృద్ధి చేస్తామని జీవీఎల్ ప్రకటించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక్క బీజేపీతోనే సాధ్యం అవుతుందన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతమని.. ఇక్కడి నుంచి పొట్టకూటి కోసం ప్రజలు వలస వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో గెలిచిన ఎంపీలు.. ఇక్కడి సమస్యలపై పార్లమెంట్‌లో గానీ, సంబంధిత మంత్రులు గానీ కలిసిన దాఖలాలు లేవన్నారు. అపారమైన వనరులు ఉన్నప్పటికీ.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. ఈ ప్రాంతం నుంచి పెద్దపెద్ద నాయకులు ఎన్నుకోబడినా.. ప్రయోజనం మాత్రం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోతున్నారని, ఇది దురదృష్టకరమని జీవీఎల్ పేర్కొన్నారు.

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..కరెంట్ ఛార్జీలపై కీలక నిర్ణయం

2023-24కి సంబంధించిన విద్యుత్‌ టారిఫ్‌ను రిలీజ్‌ చేశారు ఏపీ ఈఆర్సీ ఛైర్మన్‌ , రిటైర్డ్‌ జస్టిస్‌ సీవి. నాగార్జునరెడ్డి. ఆర్థిక అవసరాలపై డిస్కంలు ఇచ్చిన టారిఫ్‌ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి టారిఫ్‌పై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 3 డిస్కంలకు(రైతులకు ఫ్రీ కరెంట్, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లు వరకు ఇస్తున్న సబ్సిడీ.. ఆక్వా రంగం, నాయీ బ్రాహ్మణలకు ఇస్తున్న విద్యుత్ రాయితీలు) కలిపి ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చే విద్యుత్‌ వల్ల 10,135 కోట్ల ఆదాయ లోటు వచ్చిందన్నారు.

సాధారణ, పారిశ్రామిక వినియోగదారుల కేటగిరిలో ఎవరిపై అదనపు ఛార్జ్‌లు ఉండబోవన్నారు రిటైర్డ్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డి. ఈ ఏడాది విద్యుత్ వినియోగదారులు ఎటువంటి భారం మోపడంలేదన్నారు. ఎనర్జీ ఇంటెన్సివ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలకు ఇచ్చే హెచ్‌టీ వినియోగదారులకు మాత్రం కిలోవాట్‌కు 475 రూపాయల అదనపు డిమాండ్‌ ఛార్జ్‌ల ప్రతిపాదనను అంగీకరించామన్నారు. వీటి టారిఫ్‌ దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తక్కువేనన్నారు. మిగతా పెంపు ప్రతిపాదనలు తిరస్కరించామన్నారు.

జనసేనానితోనే నా ప్రయాణం.. ఆదేశిస్తే సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్తా.. ఆ నియోజక వర్గం నుంచి ఎన్నికల బరిలోకి పృథ్విరాజ్

గత ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ అధినేతకు సినీ పరిశ్రమ నుంచి బహిరంగంగా మద్దతు ప్రకటించిన నటుడు పృథ్విరాజ్.. 30 ఇయర్స్ ఇండస్ట్రీగా ఫేమస్ అయిన పృథ్వి రాజ్ జగనన్న వెంటే నేను, ఈ జీవితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంకితం అంటూ ఆంధ్రపదేశ్ లో ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించారు. అప్పటి ప్రతిపక్ష పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాలక్రమంలో అనుకోని పరిణామాల మధ్య వైసీపీ కి గుడ్ బై చెప్పారు.. జనసేనకు దగ్గరయ్యారు. అంతేకాదు తన ప్రయాణం ఇక నుంచి జనసేన పార్టీతోనే అని చెబుతున్నారు. అంతేకాదు తాను నెక్స్ట్ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేస్తానని.. పోటీ చేయనున్న నియోజక వర్గాన్ని కూడా ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో ప్రకటించారు.

వాస్తవానికి పృథ్వి సొంత ఊరు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెం. అయితే తాను ఎన్నికల బరిలో అనకాపల్లి జిల్లాలోని చోడవరం నుంచి దిగనున్నానని వెల్లడించారు. తాను గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డానని.. తనపై వచ్చిన లైంగిక ఆరోపణల విషయంలో ఏ మాత్రం విచారణ జరపకుండా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మన్ పదవి నుంచి తప్పించారంటూ గుర్తు చేసుకున్నారు. మరి వైసీపీలో మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీ వంటి వారిపై కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చినా ఎటువంటి చర్యలు పార్టీ తీసుకోలేదని .. నా పై మాత్రమే చర్యలు తీసుకున్నారంటూ ఆరోపించారు.

తాను కరోనా సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కనీసం వైసీపీ ఏ విధంగా స్పందించలేదని.. సహాయం చేయలేదని చెప్పారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు నా స్థితి తెలుసుకుని వెంటనే స్పందించారు. చికిత్స అందించడం కోసం ఏర్పాట్లు చేశారని.. అప్పటి మా నుంచి ఇన్సూరెన్స్ ఇప్పించారని గుర్తు చేసుకున్నారు. తనకు అప్పటి నుంచి మెగా ఫ్యామిలీని వదిలి తప్పు చేసినట్లు అనిపించిందన్నారు పృథ్వి.

తనను జనసేన అధినేత ఎన్నికల్లో ప్రచారం చేయమంటే పవన్ సిద్ధాంతాలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్తా.. చోడవరం నుంచి పోటీ చేయమన్నా తాను రెడీ అన్నారు. తనకు వైజాగ్ తో పాటు.. చోడవరం నియోజవర్గంలో బంధువులున్నారని.. తనకు తాతావరస అయ్యే బలిరెడ్డి సత్యారావు అని కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఈ నియోజవర్గంలో 44వేల మంది తన వాళ్ళు ఉన్నారంటూ వెల్లడించారు.

తిరుపతిలో కారు బీభత్సం..

తిరుపతిలో షోరూం నుంచి అప్పుడే కొనుగోలు చేసిన కారు బీభత్సం సృష్టించింది. కారును కొన్న వ్యక్తి డ్రైవ్ చేశాడు. అయితే బ్రేక్ వేయబోయే క్రమంలో అతను ఎక్సలేటర్ తొక్కాడు. దీంతో కారు రయ్యమంటూ రోడ్డు పక్కన షాప్ లోకి దూసుకుపోయింది. రోడ్డు పక్కనే ఉన్న మరో నాలుగు బైకులను ఢీకొట్టింది. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. 

  

షోరూం నుంచి కొత్త కారు తీసుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కారు కొనుగోలు చేసిన వ్యక్తికి డ్రైవింగ్ రాకపోవడంతో ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

ఏపీ లో ఈ రోజు నుంచి ‘వైఎస్సార్ ఆసరా’ పంపిణీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. వైయస్సార్ ఆసరా మూడో విడత కింద 78 లక్షల మంది డ్రాక్వా మహిళల ఖాతాల్లో ఏకంగా 6400 కోట్ల రూపాయలను సీఎం జగన్మోహన్ రెడ్డి జమ చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి ఇవాళే ముహూర్తం ఫిక్స్ చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇవాళ ఏలూరు జిల్లా దెందలూరు లో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాలలో ఆయా ఎంపీ మరియు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు.. ఈ వైయస్సార్ ఆసరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇందులో భాగం గానే ఇప్పటికే రెండు విడతల్లో వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసింది ఏపీ ప్రభుత్వం.

భీమవరంలో నిలబడితే జగన్ ను చిత్తుగా ఓడిస్తారు – రఘురామకృష్ణం రాజు

భీమవరంలో నిలబడితే జగన్ ను చిత్తుగా ఓడిస్తారని చురకలు అంటించారు రఘురామకృష్ణం రాజు.పులివెందులలో పులి అయిన జగన్ మోహన్ రెడ్డి గారు తమ ఊరు ఉండి, భీమవరంలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే స్థానికులు చిత్తుచిత్తుగా ఓడిస్తారని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. అక్కడ గెలిచిన ఎమ్మెల్యేను చులకనగా చూస్తే ఎలా?, మీ చేత తిట్టించుకోవడానికి, కొట్టించుకోవడానికి ఎమ్మెల్యేలు ఎవరు కూడా రాజకీయాలలోకి రాలేదని, ఎమ్మెల్యేలకు కూడా ఆత్మగౌరవం ఉంటుందని, వారిని గౌరవించడం ఇకనైనా నేర్చుకోవాలని, లేకపోతే పరిస్థితులు తిరగబడతాయి అని రఘురామకృష్ణ రాజు గారు హెచ్చరించారు.

నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి చుట్టూ ఢిల్లీలో విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పి ఎ రెడ్డిలు మాత్రమే ఉంటారని, వారంతా లోపల ఉంటే ఎస్సీ బీసీ ఎంపీలు మాత్రం షెడ్డు వంటి చోట కూర్చోవలసిన పరిస్థితిని కల్పించారని, తాను వెళ్ళాక సహచర ఎంపీలను చూసి ఇక్కడ కూర్చున్నారు ఏమిటని ప్రశ్నించగా, లోపల వారంతా ఉన్నారని… ముఖ్యమంత్రి గారి పిలుపు కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారన్నారు. తాను లోపలికి దూసుకు వెళ్ళగా లోపల సీఎం గారితో పాటు ఇతర రెడ్డి ప్రజా ప్రతినిధులు జీడిపప్పు తింటూ కూర్చున్నారని తెలిపారు. ఎవరైనా బీసీ, ఎస్సి నేతలు తాము కూడా ముఖ్యమంత్రి గారితో కలిసి జీడిపప్పు తిన్నామని చెబితే అదంతా ఉత్తి అబద్ధమేనని, అదే నిజమైతే ఒక ఫోటోను విడుదల చేయాలని అన్నారు.