/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png StreetBuzz వందేండ్లు బతికినోళ్ల జీన్​తో గుండె ఏజ్​ పదేండ్లు వెనక్కి TS breaking
వందేండ్లు బతికినోళ్ల జీన్​తో గుండె ఏజ్​ పదేండ్లు వెనక్కి

చర్మ కణాలను గుండె కణాలుగా మార్చే ప్రొటీన్లు

అభివృద్ధి చేసిన ఐఐటీ గౌహతి సైంటిస్టులు

మస్క్యులర్ డిస్ట్రోఫీ రోగుల గుండె కణాల లైఫ్​ టైం పెంచే ప్రొటీన్​

హార్ట్​ ఎటాక్​ వచ్చినప్పుడు మన గుండె కండరాల్లోని కార్డియో మయోసైట్స్​ అనే కణాలు డ్యామేజ్​ అవుతాయి. ఇలా దెబ్బతినే గుండె కణాలు మళ్లీ రికవర్​ కావడం అసాధ్యం. జీబ్రా ఫిష్​ వంటి వాటిలోనైతే హార్ట్​ ఎటాక్​ వల్ల దెబ్బతిన్న గుండె కణాల స్థానంలో కొత్తవి 20% రెండు నెలల్లోపే మళ్లీ ఉత్పత్తి అవుతాయి. మనుషుల్లో మాత్రం దెబ్బతిన్న గుండె కణాలను కొత్తవి రీప్లేస్​ చేయవు. ఇక గుండె మార్పిడి చేసుకుందామన్నా .. అది చాలా కష్టం. ఒకవేళ అది చేసుకున్నా.. అమర్చిన గుండె ఎలా పనిచేస్తుందో చెప్పలేం. ఈనేపథ్యంలో శాస్త్రవేత్తల ముందున్న ఏకైక మార్గం.. మనిషి శరీర కణాలను గుండె కణాలుగా మార్చడం. వాటిని వినియోగించి దెబ్బతిన్న గుండెకు పూర్వపు శక్తిని అందించడం !! ఈ దిశగా ఇటీవల జరిగిన కొన్ని పరిశోధనల వివరాలతో కథనమిది. 

మన చర్మ కణాలను గుండె కణాలుగా మార్చే సరికొత్త పద్ధతిని అస్సాంలోని ఇండియన్​ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ – గౌహతి (ఐఐటీ–జీ) పరిశోధకులు కనుగొన్నారు. 6 ప్రొటీన్లతో కూడిన ‘రీకాంబినంట్​ ప్రొటీన్​ టూల్​ బాక్స్’ ను వారు అభివృద్ధి చేశారు. ఇవి ఆరు కూడా రీకాంబినంట్​ డీఎన్ఏ టెక్నాలజీతో తయారుచేసిన రీకాంబినంట్​ ప్రొటీన్లు. మనిషి చర్మ కణాల్లోకి ఈ ప్రొటీన్లను ప్రవేశపెట్టి.. వాటికి గుండె కణాల లక్షణాలు వచ్చేలా చేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే చర్మ కణాల్లోకి 6 ప్రొటీన్లు వెళ్లి వాటి డీఎన్ఏను రీ వైరింగ్​ చేస్తాయి. శాస్త్రవేత్తలు సూచించిన విధంగా, గుండె కణాలుగా మారేందుకు అనువుగా ఉండేలా చర్మ కణాల లోపల మార్పులు, చేర్పులు చేస్తాయి.  

మస్క్యులర్ డిస్ట్రోఫీ రోగుల గుండె కణాలకు ఎనర్జీ

మస్క్యులర్ డిస్ట్రోఫీ అరుదైన వ్యాధి. దీని బారిన పడిన వారు నడవలేరు. కొంతమందికి పుట్టుకతోనే ఈ ప్రాబ్లమ్​ వస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా జన్మిస్తున్న ప్రతి 5వేల మంది పిల్లల్లో ఒకరు డ్యూచెన్​ మస్క్యులర్​ డిస్ట్రోఫీ సమస్యతో బాధపడుతున్నారు. శరీర కండరాలు సంకోచ, వ్యాకోచాలకు గురైనప్పుడు గాయాలు కాకుండా రక్షణ కల్పించే ప్రొటీన్లలో ‘డిస్ట్రోఫిన్’​ ఒకటి. ఇది లోపించిన వారికి మస్క్యులర్​ డిస్ట్రోఫీ సమస్య వస్తుంది. దీనివల్ల కండరాలు బలహీనం అవుతాయి. చివరకు గుండె సమస్యలతో ఈ వ్యాధిగ్రస్తులు ప్రాణాలు కోల్పోతుంటారు. వారి ఆయుష్షును పెంచే దిశగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న స్టాన్​ ఫర్డ్​ మెడిసిన్​ సంస్థ సైంటిస్టులు జరిపిన రీసెర్చ్​లో ఆశాజనక ఫలితాలు వచ్చాయి. ఇందులో భాగంగా మస్క్యులర్​ డిస్ట్రోఫీ రోగుల నుంచి సేకరించిన గుండె కణాలపై ప్రయోగాలు చేశారు. మనుషుల క్రోమోజోమ్​ల చివరన టెలోమెర్స్ ఉంటాయి. శరీరంలో కణాల విభజనలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. కణాల విభజన జరిగే కొద్దీ.. టెలోమెర్స్ బలహీనపడి సైజులో తగ్గిపోతూ మనిషిలో ముసలితనానికి దారితీస్తుంది. టెలోమెర్స్ అంచుల్లో ఉండి.. వాటిని రక్షించే ఒక ప్రోటీన్​ పేరు ‘టీఆర్ఎఫ్​2’. ఇప్పుడు దీనితోనే మస్క్యులర్​ డిస్ట్రోఫీ రోగుల గుండె కణాలను సైంటిస్టులు బూస్ట్​ చేశారు. వాటి జీవితకాలాన్ని పెంచి, పనితీరును మెరుగుపర్చారు. 

హార్ట్ ఎటాక్ 

  ఏటా ప్రపంచంలో ఎక్కువమంది దీనివల్లే చనిపోతున్నారు

  ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు1.79 కోట్ల మంది హార్ట్​ ఎటాక్​తో ప్రాణాలు విడుస్తున్నారు.

  ప్రపంచంలోని హృద్రోగుల్లో 60 శాతం మంది ఇండియాలోనే ఉన్నారు. 

  గత నాలుగేళ్లుగా మన దేశంలో ఏటా సగటున 28వేల మంది హార్ట్​ఎటాక్​ తో ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది దీనివల్ల చనిపోయిన ఇండియన్స్ లో 70 శాతం (19వేల) మంది 30 నుంచి 60 ఏళ్లలోపు వారే ఉండటం గమనార్హం. 

 ఈవిధంగా భారీగా మరణాలకు కారణమవుతున్న హార్ట్​ ఎటాక్​ సమస్యపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. హార్ట్​ ఎటాక్​ ముప్పు నుంచి 

బయటపడేసే మార్గం కోసం అలుపెరగని అన్వేషణ కొనసాగుతోంది.

వందేళ్ల వారి జీన్​తో..

గుండె వయసును తగ్గించగలిగితే.. మనిషి జీవితకాలం దానంతట అదే పెరిగిపోతుంది. ఇంగ్లండ్​లోని బ్రిస్టల్​ యూనివర్సిటీ, ఇటలీకి చెందిన మల్టీ మెడికా గ్రూప్​ సైంటిస్టులు కలిసి ఈ దిశగా జరిపిన పరిశోధనల్లో ముందడుగు పడింది. దాదాపు వందేళ్లు వయసు కలిగిన కొంతమంది నుంచి సేకరించిన ఒక జీన్​తో ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చాయి. నడి వయసు, పెద్ద వయసులకు చెందిన ఎలుకల్లోకి బీపీఐఎఫ్​బీ4 అనే జీన్​ను ప్రవేశపెట్టగా.. చాలా కాలంపాటు వాటి గుండె ఆరోగ్యంలో ఎలాంటి క్షీణత రాలేదని, హార్ట్​ ఎటాక్​ వంటివి సంభవించలేదని సైంటిస్టులు గుర్తించారు. ఈ జీన్​ ఎలుకల శరీరం లోపలికి వెళ్లి గుండె బయొలాజికల్​ క్లాక్​ వయసును దాదాపు పదేళ్లు తగ్గిస్తోందని వెల్లడించారు. గత మూడేళ్లుగా సాగుతున్న ఈ ప్రయోగంలో భాగంగా ఇటలీకి చెందిన మల్టీ మెడికా గ్రూప్​ సైంటిస్టులు ఈ జీన్​ ను టెస్ట్​ ట్యూబ్​ లోని మనుషుల గుండె కణాల్లోకి ప్రవేశపెట్టారు. హృద్రోగాలతో బాధపడుతున్న వృద్ధులు, ఆరోగ్యంగా ఉన్న వృద్ధుల నుంచి సేకరించి గుండెకణాలను ఈ ప్రయోగం కోసం వాడారు. ప్రవేశపెట్టిన జీన్స్​ ప్రభావంతో హృద్రోగాలు కలిగిన వృద్ధుల గుండె కణాల పనితీరు మునుపటి కంటే మెరుగుపడినట్లు తేలింది. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక ‘కార్డియో వాస్క్యులర్​రిసెర్చ్’ జర్నల్​లో ప్రచురితమైంది. - V6

ఎమ్మెల్యే కోటా 3, గవర్నర్​ కోటా 2 సీట్లకు వారంలో షెడ్యూల్

కేసీఆర్​ హామీ ఇచ్చినోళ్లే 20 మందికిపైన

కేటీఆర్​ మాటిచ్చినోళ్లు అంతకన్నా ఎక్కువే

తమకు చాన్స్ ఇవ్వాలని కోరుతున్న ఆశావహులు

 రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి షురువైంది. హైదరాబాద్​ లోకల్​ బాడీస్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగియనుంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయ్యే 3, గవర్నర్​ కోటాలో ఇంకో 2 సీట్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈ వారంలోనే ఈసీ షెడ్యూల్​ ప్రకటించే అవకాశం ఉంది. 

తమకు చాన్స్ ఇవ్వాలని ఆశావహులు మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు, ఇతర ముఖ్య నేతల ద్వారా సీఎం కేసీఆర్​కు పేర్లు చెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2018 అసెంబ్లీ, 2019 లోక్​సభ​ఎన్నికల సమయంలో టికెట్​ ఇవ్వలేకపోయిన పలువురు నేతలకు ఎమ్మెల్సీలుగా చాన్స్​ ఇస్తామని కేసీఆర్​ స్వయంగా మాటిచ్చిన నేతలు 20 మందికిపైనే ఉండగా, మంత్రి కేటీఆర్​హామీ ఇచ్చినోళ్ల సంఖ్య అంతకన్నా ఎక్కువే ఉంది. వారిలో కొందరికి కార్పొరేషన్​ చైర్మన్లుగా అవకాశం ఇవ్వగా ఇంకా పదవుల కోసం ఆశపడుతున్న వాళ్ల సంఖ్య భారీగానే ఉంది. వీరిలో ఎవరిని అదృష్టం వరిస్తుందో ఇంకొన్ని రోజుల్లో తేలనుంది.

ఆశావహుల లిస్ట్​ పెద్దదే..

తెలంగాణ ఏర్పాటు నుంచి కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్​కు మండలి బెర్త్​ఖాయమని ప్రచారం జరగడం, చివరి నిమిషంలో ఇంకొకరికి చాన్స్​ ఇవ్వడం పరిపాటిగా మారింది. ఈసారి తనకు చాన్స్​ దక్కొచ్చని ఆయన ఆశిస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్​లో చేరిన ఆలంపూర్​ నియోజకవర్గానికి చెందిన చల్లా వెంకట్​రెడ్డికి అవకాశం ఇవ్వొచ్చని ప్రచారంలో ఉంది. ఆయన ప్రభావం గద్వాల జిల్లాతోపాటు ఏపీలోని కర్నూల్​ జిల్లాపై ఉంటుందని అందుకే చాన్స్​ ఇవ్వొచ్చని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ ఏడాదే అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 

ఎమ్మెల్యేలుగా గతంలో అవకాశం ఇవ్వలేకపోయిన, సిట్టింగులకు టికెట్లు ఇస్తే మళ్లీ చాన్స్​ రాదని భావిస్తున్న పలువురు నేతలు తమకు చాన్స్​ వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లా నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు పదవి ఆశిస్తున్నారు. పొంగులేటి వెంట వెళ్తున్న లీడర్లలో ఒకరిద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోతే ఎమ్మెల్సీగా చాన్స్​ ఇవ్వాల్సి ఉంటుంది. 

మునుగోడు ఉప ఎన్నికకు ముందు పార్టీలో చేరిన మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్‌, మాజీ ఎంపీ రాపోల్‌ ఆనందభాస్కర్‌, మరో నేత పల్లె రవి కుమార్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని కేసీఆర్​ హామీ ఇచ్చారు. మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, ఇనుగాల పెద్దిరెడ్డి తమకూ పదవి వస్తుందని ఆశ పడుతున్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్​ వెంట ఉన్న ఎంబీసీ కార్పొరేషన్​చైర్మన్​ తాడూరి శ్రీనివాస్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కోదాడ మాజీ ఇన్​చార్జ్​ శశిధర్​రెడ్డి, మధిరకు చెందిన బొమ్మెర రామ్మూర్తి, పార్టీ జనరల్ సెక్రటరీ శ్రావణ్​కుమార్​రెడ్డి, బీఆర్ఎస్​ఎల్పీ సెక్రటరీ రమేశ్​రెడ్డి, పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నాయినేని రాజేశ్వర్​రావు(రాజేశ్), శాట్స్​ మాజీ చైర్మన్​వెంకటేశ్వర్​రెడ్డి తదితరులు ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్నారు.

ముగ్గురు లేదా నలుగురికే చాన్స్!

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న రాజేశ్వర్ రావు, ఫారూఖ్​ హుస్సేన్ పదవీకాలం మే 27న, ఎమ్మెల్యే కోటాలో ప్రాతినిథ్యం వహిస్తున్న కూర్మయ్యగారి నవీన్​కుమార్, వొల్లాల గంగాధర్​గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి కాల పరిమితి మార్చి 29న ముగియనుంది. ఈ ఐదు సీట్లు అధికార బీఆర్ఎస్​కే దక్కనున్నాయి. మేడ్చల్​లోక్​సభ సీటు ఇవ్వలేకపోవడంతో నవీన్​కుమార్​కు 2019లో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. నిత్యం ప్రగతి భవన్​ పెద్దలతో టచ్​లో ఉండటంతో ఆయనకు మళ్లీ చాన్స్​ దక్కవచ్చని బీఆర్ఎస్​ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఆయనతో పాటు మరొకరికి కూడా రెన్యువల్​ కావొచ్చని చెప్తున్నారు. 

ఈ లెక్కన రెండు స్థానాలను పక్కన పెడితే మూడు సీట్లు మాత్రమే వేరేవారికి ఇవ్వడానికి అవకాశం ఉంది. నవీన్​ ఒక్కరికే చాన్స్​ఇస్తే మరొకరికి అదనంగా చాన్స్​ దక్కుతుంది. ఈ ఐదు సీట్లకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

కలుషిత నీరు తాగి బాలిక మృతి.. ఆస్పత్రి పాలైన మరో 9మంది.. ఆందోళనలో గ్రామస్తులు..

నారాయణ్ పేట్ జిల్లా మద్దూరు మండలం మోమిన్ పూర్ గ్రామంలో కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురై ఒక బాలిక మృతి చెందింది. మరో తొమ్మిది మంది ఆస్పత్రి పాలయ్యారు. నిన్న రాత్రి అనిత అనే బాలిక పదకొండు గంటల సమయంలో అస్వస్తతకు గురైంది. వాంతులు, విరేచనాలు ఎక్కువ కావడంతో.. ఆమెను హుటాహుటిన నారాయణ్ పేట్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరో తొమ్మిది మంది కూడా అస్వస్తకు గురవడంతో కొందర్ని మద్దూరు ఆస్పత్రికి మరికొందర్ని మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి వైద్య సేవల కోసం తరలించారు. అనిత అనే ఈ బాలిక చనిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందారు. ఒకే కాలనీకి చెందిన వారు కూడా అస్వస్థతకు గురి కావడంతో.. ఇక్కడున్న బోరు నీరు కలుషితమైనట్టు అనుమానిస్తున్నారు. దీంతో గ్రామంలో వైద్య సిబ్బంది హెల్త్ క్యాంప్ నిర్వహించారు.

ఈరోజు ఉదయం అనిత అనే అమ్మాయి మృతి చెందడంతో గ్రామస్తులు అందరూ ఆందోళనకు గురయ్యారు ఒకే కాలనీ చెందిన వారు అస్వస్తత కు గురి కావడం తో అక్కడ వున్న బోరు పంపు నీరు కలుషితం కావడం ఈ సంఘటన జరిగినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. దీనితో గ్రామం లో వైద్య సిబ్బంది హెల్త్ క్యాంప్ నిర్వ హిస్తున్నారు.

వచ్చే 48 గంటల్లో నివేదిక వచ్చాక గానీ అసలు విషయం తెలీదని అంటున్నారు అధికారులు. ఇప్పికైతే అందరూ ఇక్కడ నీటి కాలుష్యం వల్లే.. బాలిక మృతి చెందిందని అంటున్నారు.

ఉద్యోగులకు ఆరుశాతం వడ్డీ చెల్లించాల్సిందే.. హైకోర్టు ఉత్తర్వులు

కరోనా టైంలో ఆపిన ఉద్యోగుల జీతాలకు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్ల బకాయిలపై 6శాతం వడ్డీ చెల్లించాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. కరోనా సమయంలో ఉద్యోగులు, పెన్షనర్లకు 50శాతం చెల్లింపులను వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 27కు వ్యతిరేకంగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర హైకోర్టు విశ్రాంత అధికారులు, ఉద్యోగుల సంక్షేమ సంఘం నేతలు, తెలంగాణ పింఛనర్ల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ప్రతినిధులతో పాటు మరికొందరు రిట్‌ పిటిషన్లు, పిల్‌ దాఖలు చేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది సత్యంరెడ్డి రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా స్వీకరించింది. వీటన్నింటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది చిక్కుడు చైతన్య మిత్ర వాదనలు వినిపించారు.

కోవిడ్‌ సమయంలో ఉద్యోగుల వేతనాలతో పాటు పింఛన్లు కూడా మూడు నెలలపాటు ఆపారన్నారు. 50 శాతం వేతనాలు, పింఛన్లు నిలిపేయడంతో వారు ఇబ్బందులు పడ్డారని నివేదించారు. మూడు నెలలు ఆపిన మొత్తాన్ని కూడా ఒకేసారి చెల్లించలేదని, వాటిని కూడా విడతల వారీగా చెల్లించారని చెప్పారు. ఈ మొత్తానికి 12 శాతం వడ్డీ చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. కోవిడ్‌ సమయంలో ఆపిన వేతనాలు, పింఛన్లకు 6 శాతం వడ్డీ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇంటి పన్ను కట్టకుంటే కరెంట్ కట్!

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం లక్ష్మీపతి గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటి పన్ను కట్టుకుంటే కరెంట్​కట్ చేస్తున్నారు. బొల్లారం మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో ఇంటికి ఒక్కో రకంగా పన్నులు వసూళ్లు చేస్తున్నారు. అటు పంచాయతీ పాలకవర్గం తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ.. ఇటు పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ఇదీ పరిస్థితి.. 

లక్ష్మీపతి గూడెంలో వందశాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని టార్గెట్​ పెట్టుకున్న పంచాయతీ పాలకవర్గం పన్ను బకాయిదారుల ఇంటి విద్యుత్ కనెక్షన్, పెన్షన్​ తొలగించాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి పెన్షన్​ జోలికి వెళ్లకుండా కరెంట్ కనెక్షన్​ కట్​ చేస్తున్నారు. దీనిని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంటి పన్నుకు కరెంట్ కు సంబంధమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఇళ్లకు కరెంట్ కట్ చేయగా రాజకీయ ఒత్తిడితో ఒకటి, రెండు ఇళ్లకు ప్రాపర్టీ టాక్స్ కట్టకుండానే తిరిగి కరెంట్ సరఫరా చేశారు. ముందస్తు దండోరా వేయించకుండా పాలకవర్గం ఇష్టారీతిగా వ్యవహరించడం పట్ల మండిపడుతున్నారు. ఇంటింటికీ తిరిగి పన్నులు వసూలు చేయకుండా కరెంట్ కట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని వాపోతున్నారు. బొల్లారం మున్సిపాలిటీలో భారీగా ప్రాపర్టీ టాక్స్ లు పెంచడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. గతంతో పోలిస్తే నాలుగు రేట్లు పన్నులు పెరిగినట్టు తెలుస్తోంది. ఈ బలియాలో కార్మికులు, పేదలు, మధ్యతరగతి వారే ఎక్కువ. పట్టణంలో ఎక్కువగా రేకుల ఇండ్లు, 100 గజాల లోపు ఇండ్లు ఉన్నాయి. గతంలో రెండు గదుల రేకుల ఇంటికి రూ.500 పన్నులు ఉండగా ప్రస్తుతం అదే ఇంటికి రెండు రూ.2 వేలు పెంచినట్టు బాధితులు తెలిపారు. పక్క పక్కనే ఉంటున్న ఇండ్లకు వేర్వేరుగా పన్నులు విధిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పన్నులు పెంచడాన్ని అధికార పార్టీ కౌన్సిలర్లు, ప్రజలు వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. ఆస్తుల విలువలు పెరగడంతోనే పన్నులు కూడా పెంచినట్టు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.

వసూళ్ల కోసమే ఈ నిర్ణయం.. 

గ్రామ పంచాయతీలో ఆస్తి పన్నులు చాలాకాలంగా పెరిగిపోయాయి. పన్నులు చెల్లించాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. అందుకే పెండింగ్ పన్నులు వసూలు చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ల ఇంటికి కరెంట్ కట్ చేయాలని పంచాయతీ తీర్మానించింది. ప్రజల నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా ప్రస్తుతానికి దానిని వాయిదా వేశాం.

– లావణ్య, సర్పంచ్ లక్ష్మీపతి గూడెం

జీవో ప్రకారమే వసూలు.. 

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల మాదిరిగానే బొల్లారం మున్సిపాలిటీలో పన్నులు వేస్తున్నాం. ఎవరికీ అన్యాయం చేయడం లేదు. అందరికీ ఒకేలా ప్రభుత్వ జీవో ప్రకారం పన్నులు వసూలు చేస్తున్నాం. 

– రాజేంద్ర కుమార్, బొల్లారం మున్సిపల్ కమిషనర్

గ్రేటర్​లో నిర్మించిన రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్​ ల వినియోగంపై సర్వే

స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్(ఎస్ఆర్ డీపీ)లో భాగంగా గ్రేటర్​లో నిర్మించిన రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్​ ల వినియోగంపై సర్వే చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సర్వే బాధ్యతలను వరంగల్ ఎన్ఐటీకి అప్పగించేందుకు జీహెచ్ఎంసీ అంతా రెడీ చేసింది. మార్చిలో సర్వే ప్రారంభించేందుకు బల్దియా అధికారులు కసరత్తు చేస్తున్నారు. సర్వేలో భాగంగా వాహనదారుల ఫీడ్​బ్యాక్​తీసుకోనున్నారు. అలాగే సలహాలు, సూచనలు తీసుకుని ప్రభుత్వానికి పూర్తి స్థాయి రిపోర్టు పంపనున్నారు. టూవీలర్, ఫోర్ వీలర్లతోపాటు ఆటోలు, హెవీ వెహికల్స్​ఇలా అన్నింటి డ్రైవర్ల నుంచి మాన్యువల్​గా అభిప్రాయాలు సేకరిస్తారు. ఈ సర్వే ఆధారంగా ఎస్ఆర్​డీపీ ఫేజ్–2పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఫేజ్– 2కు సంబంధించి జీహెచ్ఎంసీ ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపింది. వాటికి ప్రభుత్వం నుంచి పాజిటివ్ రెస్పాన్స్​వచ్చింది. కానీ ఇంకా ఆర్డర్ రాలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ మంత్రి కేటీఆర్ సెకండ్ ఫేజ్ పనులు మొదలుపెడతామని ప్రకటించారు. సర్వే తర్వాత సెకండ్ ఫేజ్ పనులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ వర్గాల ద్వారా తెలిసింది. 

ఎన్ని వచ్చినా తగ్గని ట్రాఫిక్

ఎస్ఆర్​డీపీలో భాగంగా నిర్మిస్తున్న రోడ్లతో సిటీలో ట్రాఫిక్ తగ్గిందని, జనానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని మంత్రులు పలు సందర్భాల్లో చెబుతున్నారు. కానీ రోడ్ల పేరుతో వేలాది కోట్లను అప్పులు చేసి వృథాగా ఖర్చు చేస్తున్నారని పలు విమర్శలు కూడా ఉన్నాయి. సిటీ సెంటర్​లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతోందని చాలా మంది మండిపడుతున్నారు. కోట్లు ఖర్చు చేస్తున్నా విమర్శలు ఎందుకు వస్తున్నాయనేది చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అసలు కొత్త ఫ్లైఓవర్లు, అండర్​పాస్​లు, రోడ్లపై ప్రయాణిస్తున్న వారు ఏమనుకుంటున్నారు? వారికి ఎంత మేరకు ఉపయోగపడుతున్నాయనేది తెలుసుకునేందుకు ప్రభుత్వం సర్వే చేయాలని నిర్ణయించింది. ప్రయాణికుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని ప్లాన్​చేసింది. త్వరలో వరంగల్​ఎన్ఐటీ అధికారులు సిటీలోని వేర్వేరు లొకషన్లలో ఫీడ్​బ్యాక్​తీసుకోనున్నారు.

ఫస్ట్​ఫేజ్​లో 34 పనులు పూర్తి

ఎస్ఆర్​డీపీ ఫస్ట్ ఫేజ్​లో భాగంగా ఇప్పటివరకు రూ.5,937 కోట్లతో మొత్తం 47 పనులు మొదలుపెట్టగా ఇంకా 13 మేజర్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలో వీటిని పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ.. ఆ మేరకు పనులు జరగడం లేదు. వీఎస్టీ వద్ద నిర్మిస్తున్న పెద్ద ప్రాజెక్టు(స్టీల్​బ్రిడ్జి) పనులు స్లోగా సాగుతుండడంతో ఆ ఏరియాలో ట్రాఫిక్​సమస్య ఎక్కువగా ఉంటోంది. ప్రాజెక్టు మొదలుపెట్టక ముందే అందుబాటులో తీసుకొచ్చే తేదీలను ప్రకటిస్తున్నారే తప్ప, పనులు చేయడం లేదు. సెకండ్ ఫేజ్ పనులు మొదలుపెడితే చెప్పిన టైమ్ కు పనులు పూర్తయ్యేలా చూడాలని జనం కోరుతున్నారు.

తెలంగాణ గడ్డపై మరాఠా కల్చర్‌.. ఓటు బ్యాంకుగా శివాజీ.. పోటీపడుతున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌..

ఛత్రపతి శివాజీకి కూడా రాజకీయ రంగు పులిమారా. పొలిటికల్‌ మైలేజీ కోసం మరాఠా వీరుడిని వదలడం లేదా. తెలంగాణలో మరాఠా కల్చర్‌ దేనికి సంకేతం? ఎన్నికల టైమ్‌లో శివాజీ విగ్రహాల ఏర్పాటు ఎవరికి ప్లస్‌ పాయింట్‌. శివాజీ కేంద్రంగా మాటల తూటాలు పేలుతున్నాయి. వివాదాలు ముసురుకుంటున్నాయి. బీజేపీ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌కు బీజమేసిన శివాజీ భజన కార్యక్రమం చివరకు ఎటు దారి తీయనుంది.

పొలిటికల్‌ ఫ్రేమ్‌లో దేవుళ్లు, వీరులు..

పొలిటికల్‌ ఫ్రేమ్‌లో దేవుళ్లు.. వీరాధి వీరులను సైతం వదలని పార్టీలు.. నిన్నా మొన్నటి దాక టిప్పు సుల్తాన్‌ పే రచ్చ.. లేటెస్ట్‌గా ఛత్రపతి శివాజీ వైపు మళ్లింది. నెక్ట్స్‌ ఎవరో. తెలంగాణ గడ్డపై కొత్తగా ఈ మరాఠా కల్చర్‌ ఏంటి.. దీని వెనుక మర్మమేంటి.. ఊరూరా శివాజీ విగ్రహాలు పెట్టడమేంటి.. హోరాహోరీగా ర్యాలీలు తీయడమేంటి..అంతా ఎన్నికల స్టంటా. పొలిటికల్‌ మైలేజీ కోసమేనా. నిజంగానే శివాజీ అంటే వీర భక్తా..అల్రెడీ జై శ్రీరామ్‌, జై హనుమాన్‌ నినాదాలతో పొలిటికల్‌ అజెండా తెరపైకి రానే వచ్చింది. లేటెస్ట్‌గా జై శివాజీ.. కేంద్రంగా బీజేపీ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ మాటల యుద్ధం హీటెక్కిస్తోంది. గతేడాది బోధన్‌లో శివాజీ విగ్రహావిష్కరణ వివాదం రీసెంట్‌గా శివాజీ ర్యాలీపై రచ్చ.. ఇవే ఇప్పుడు హాట్‌ హాట్‌ తెలంగాణ పాలిటిక్స్‌.

పొలిటికల్‌ సీన్‌ను తలపిస్తున్న శివాజీ జయంతి ఉత్సవాలు..

శివాజీ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం తెలంగాణలో పరిపాటే. కానీ ఈసారి సీన్‌ పొలిటికల్‌ ఫైటింగ్‌ను తలపిస్తోంది. చరిత్ర నీడలో ఎవరికి వారు వాజీ వాజీ అంటూ శివాజీ జపం చేస్తున్నారు. శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించడం ఎంత నిజమో.. తెలుగు రాష్ట్రాలతో ఆయనకున్న అనుబంధం కూడా అంతే నిజం. అందుకు నిదర్శనమే చారిత్రక ఆనవాళ్లు.

ఒక యోధుడు.. స్వాభిమాన ధీరుడు.. స్వరాజ్య స్థాపకుడు.. మరాఠా సామ్రాజ్యాధీశుడు.. హిందుత్వ అస్తిత్వానికి ప్రతీక.. ఆత్మగౌరవ పతాక.. అందుకే శివాజీ జయంతి అంటే వేడుక..అసేతు హిమాచలం వేదిక అని నేటి మరాఠాలు కూడా పొగుడుతూ ఉంటారు. ఉగ్గుపాలతోనే వీరత్వాన్ని.. విప్లవ భావాలను పుణికిపుచ్చుకున్న వీరాధి వీరుడు ఛత్రపతి శివాజీ. మొగల్‌ చక్రవర్తులను గడగడ లాడించిన హిందుత్వ పరిరక్షకుడు. ప్రజలను కన్నబిడ్డలుగా భావించి పాలించిన మనసున్న మారాజు. ప్రతీ అమ్మ తన బిడ్డలకు చెప్పే సజీవ చరిత్ర శివాజీ.

అమ్మ జిజియాబాయ్‌ మలిచిన ఉక్కు ఖడ్గం శివాజీ. అంతేకాదు భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడాలనే శివాజీ సత్య సంకల్పానికి సాక్షాత్‌ అమ్మలగన్న అమ్మే మురిసిపోయింది. వీరఖడ్గంతో అనుగ్రహించింది. కుల, మతం బేధం లేకుండా అన్ని వర్గాలను ఆదరించిన గొప్ప రాజు శివాజీ. మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించిన శివాజీకి మన తెలుగు నేలతో ఎంతో అనుబంధం వుంది. శివాజీ తన తపోదీక్షతో భ్రమారాంబిక మాతను ప్రసన్నం చేసుకుంది మన శ్రీశైలంలోనే. అలనాటి ఘట్టాలను కళ్లకు కడుతుంది శ్రీశైలంలోని శివాజీస్మారకం.

కర్మాన్‌ ఘాట్‌ను శివాజీ సందర్శించినట్లు శాసనాలు..

హైదరాబాద్‌ గోల్కొండ కోట సహా కర్మాన్‌ ఘాట్‌ను శివాజీ సందర్శించినట్టు చారిత్రక శాసనాలున్నాయి. అయితే అంతకన్నా ముందే ఆయన పాలమూరులోని నారాయణ్‌ పేట్‌లో తన సైన్యంతో బస చేశారనే ఆధారాలున్నాయి. గోల్కొండ కోటను ఆక్రమించాలని కుట్ర పన్నిన ఔరంగజేబు.. అక్కడ శివాజీ ఉన్నాడని తెలిసి తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడంటారు. నారాయణపేట కేంద్రంగానే శివాజీ సైనిక కార్యకలాపాలను నిర్వహించాడనటానికి ఇప్పటికీ అక్కడ ఆనవాళ్లున్నాయి. అంతేకాదు ఇప్పటికీ నారాయణపేట పరిసర ప్రాంతాల్లో మహారాష్ట్రీయులు అధిక సంఖ్యలో ఉండడం మరో నిదర్శనం. శివాజీ జయంతి సందర్భంగా నేటికీ నారాయణపేటలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.

మహారాష్ట్రలో మరాఠాల్లో శివాజీ ఒక ఉత్ర్పేరకం..

శివాజీ ప్రస్థానం.. యావత్‌ దేశానికి ఓ ప్రేరణ. మహారాష్ట్రలో మరాఠాల్లో శివాజీ ఒక ఉత్ర్పేరకం. అందుకే ప్రతియేటా శివాజీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో శివాజీ పాత్ర ప్రముఖంగా వినిపిస్తోంది. ఒకవైపు బీజేపీ మరోవైపు బీఆర్‌ఎస్‌.. రెండు పార్టీలు పోటాపోటీగా శివాజీ విగ్రహావిష్కరణలు, ర్యాలీలు చేపట్టడం సంచలనం రేపింది. ఎన్నికల టైమ్‌లో ఇరు పార్టీలు వాజీ వాజీ అంటున్నారు.

శివాజీని ఓన్‌ చేసుకునే ప్రయత్నంలో బీజేపీ, బీఆర్ఎస్..

స్వాతంత్ర్య సంగ్రామంలో హిందువులను ఐక్యం చేసేందుకు తిలక్‌ గణేష్‌ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అదే బాటలో హిందూత్వ భావజాలంలో భాగంగా ఇప్పుడు శివాజీని తెరపైకి తెస్తున్నారని పొలిటికల్‌ టాక్‌. తెలంగాణపై బీజేపీ ఫోకస్‌ పెట్టినప్పటి నుంచి శివాజీ పేరు మార్మోగుతోంది. శివాజీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం మొదలు మూడేళ్లుగా ఊరూర శివాజీ విగ్రహాల ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు బీజేపీకి ధీటుగా బీఆర్‌ఎస్‌ కూడా శివాజీని ఓన్‌ చేసుకునే దిశగా విగ్రహావిష్కరణలు చేస్తోంది. లేటెస్ట్‌గా మంత్రి హరీష్‌రావు మెదక్‌ జిల్లాలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గతేడాది బోధన్‌లో శివాజీ విగ్రహావిష్కరణ సందర్భంగా వివాదం చెలరేగింది. శివాజీ పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని అప్పట్లో సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాజీని అందరికంటే తామే ఎక్కువగా గౌరవిస్తున్నామన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో ర్యాలీలు..

ఇక, శివాజీ జయంతి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఇటు బీఆర్‌ఎస్‌ అటు బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. అయితే కర్మాన్‌ ఘాట్‌లో తమ ర్యాలీని కావాలనే అడ్డుకున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తే.. శివాజీ అందరివాడు. కానీ బీజేపీ శివాజీ తమవాడని క్లెయిమ్‌ చేసుకోవడం తప్పన్నారు బీఆర్‌ఎస్‌ నేతలు.

శివాజీ కూడా ఓటు బ్యాంకే..

ఎన్నికలొస్తున్నాయి. శివాజీ డంప్‌లో కూడా చాలా ఓట్లున్నాయి. అవన్నీ కొల్లగొట్టే ప్లానే బీజేపీ, బీఆర్‌ఎస్‌ది. మొత్తానికి ఢిల్లీ జేఎన్ యూలో ఏబీవీపీ ఏర్పాటు చేసిన శివాజీ చిత్రపటం ధ్వంసం కావడం పై వివాదం చెలరేగింది. వామపక్ష విద్యార్థి సంఘం నేతలే ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపించింది ఏబీవీపీ. దీంతో, ఇరు వర్గాల మధ్య గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. ఢిల్లీలో అలా.. తెలంగాణలో ఇలా..శివాజీయం..రాజకీయం..భగ్గుమంటోంది.. మున్ముందు ఇంకేం జరుగుతుందో చూడాలి మరి. - TV9

TS : మిగులు బడ్జెట్తో అలరారిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎందుకు దిగజారింది?

ప్రజలకు, పాలకులకు సంక్షేమ పథకాలే సర్వస్వం అయినప్పుడు ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసే మిగతా అన్ని విషయాలు చాలా చిన్నగా కనిపిస్తాయి. తమకు విద్య, వైద్యం, ఉపాధి నైపుణ్యాలు అవసరం అనే స్పృహ ప్రజలు విస్మరిస్తే, పాలకులు తాత్కాలిక తాయిలాలతో ప్రజలను ఏమార్చి, పబ్బం గడుపుకుంటారనే విషయం తెలంగాణ రాష్ట్రంలో రుజువైంది. ఉద్యమ ఫలాలను అందుకోవడంలో తెలంగాణ సమాజం దారుణ పరాభవాన్ని రుచి చూసింది. తెలంగాణ రాష్ట్రం సాకారమైతే ప్రజల జీవితాలు గణనీయంగా పురోభివృద్ధి సాధిస్తాయని నమ్మబలికిన నాయకత్వమే గత 9 ఏండ్లుగా పాలక పక్షంలో కూర్చొని తెలంగాణను ఏలుతున్నది. అపారమైన సహజ వనరులు, బహుళ ఆదాయ మార్గాలు, మిగులు బడ్జెట్ తో తులతూగిన తెలంగాణ ఖజాన నేడు లోటుతో కునారిల్లుతున్నది. చిన్నచిన్న బిల్లులు మొదలు ఉద్యోగుల వేతనాలు, సంక్షేమ పెన్షన్లు కూడా చెల్లించలేని పరిస్థితులు దాపురించినట్లు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం కనిపిస్తున్నది.

దుబారా, ఆధిపత్యం..

మిగులు బడ్జెట్ తో అలరారిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎందుకు దిగజారింది? అప్రధాన, అనుత్పాదక వ్యయాలకు విపరీతమైన నిధులు కేటాయించడం ఒక ముఖ్యమైన తప్పిదంగా చెప్పవచ్చు. కుల, మతాల వారీగా కేటాయింపులు జరిపి అనాలోచితంగా ఖర్చులు చేయడం, అనవసర హంగులు, ఆర్భాటాలకు పోయి ప్రచారాలు నిర్వహించడం, ప్రజలు కోరుకున్న వాటి కంటే కూడా, కోరని వాటిని ముందుగా నెరవేర్చడం వల్ల ప్రత్యేకత చాటుకునే ప్రయత్నాలు చేశారు. అంతటితో ఆగకుండా ఉద్యోగులు అడిగిన దానికంటే కూడా పక్క రాష్ట్రాలతో పోల్చుకొని ఒక శాతం ఎక్కువ ఇచ్చే ‘ఆధిక్యత, ఆధిపత్య భావం’ కూడా ఈ పరిస్థితులకు కారణం. ప్రణాళిక లేకుండా పనులు చేపట్టి వాటిని మధ్యలోనే ఆపి, కొత్త పనులు మొదలు పెట్టడం వల్ల అనేక వనరులు వృథా అయ్యాయి. అవసరం ఉన్న దానికంటే పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టడం తద్వారా రాష్ట్రం మొత్తంలో జరగాల్సిన నిర్మాణాలను, అభివృద్ధిని, నిధులను తనకు నచ్చిన ప్రాంతానికే కేంద్రీకృతం చేయడం జరిగింది. ఉదాహరణకు గజ్వేల్ స్వయానా సీఎం నియోజకవర్గం కావడం అనే ఒకే ఒక్క అర్హత వల్ల విశృంఖల, విధ్వంసక అభివృద్ధి ప్రణాళికలు రచించారు. విచక్షణ లేకుండా అమాంతం నిధులు కేటాయించారు. దాదాపు రూ. 500 కోట్ల వ్యయంతో ఎడ్యుకేషనల్ హబ్ నిర్మాణం జరిపారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రభుత్వ విద్యాలయాలు, కాలేజీలు కనీస అవసరాలకు దూరంగా మౌనంగా రోదిస్తున్నాయి. అదే గజ్వేల్ పాత బస్టాండ్ ను రూ. 50 లక్షలతో అధునాతనంగా మార్చి, వారం రోజులు తిరగకముందే కూల్చివేయడం, అదే స్థలంలో మార్కెట్ యార్డును నిర్మించడం.. రాజు తలచుకుంటే ప్రజాధనం ఎలా దుబారా చేయగలడో రుజువుచేస్తున్నది. 

ఇప్పుడేం చేయాలి?

చేతులు కాలాకనైనా ఆకులు పట్టుకోవడం విజ్ఞత అనిపించుకుంటుంది. యుద్ధ ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. అది ముందుగా రాష్ట్రంలో అత్యున్నత ప్రజాప్రతినిధులుగా ఉన్న వారితోనే మొదలు కావాలి. ఎమ్మెల్యేల, మంత్రుల జీతభత్యాలు హేతుబద్ధీకరించాలి. కాంట్రాక్టుల్లో భారీ ఎత్తున జరుగుతున్న అవినీతిని అరికట్టే శాశ్వత ఏర్పాట్లు చేయాలి. సంక్షేమ పథకాల పేరిట జరుగుతున్న ఖర్చులను, ఎన్నికల గెలుపు కోసమే ప్రవేశపెట్టిన పథకాలను వీలైనంత త్వరగా వెనక్కుతీసుకోవాలి. ప్రజలు ఎదిగే సంక్షేమ పథకాలు మాత్రమే కొనసాగించాలి. ప్రజలు తమ సొంత కాళ్ల మీద నిలబడే అవకాశాలను కల్పించాలి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం లో జరుగుతున్న విపరీతమైన ఖర్చు స్థానంలో ‘దక్షిణ కొరియా మార్గం’లో వివిధ రకాలుగా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ రాకముందే ఈ చర్యలు చేపట్టడం అనివార్యం. పొరపాట్లు చేయడం కంటే వాటిని దిద్దుకునే ధైర్యం, నిజాయితీ గొప్పవి. మరి ఆ సత్తా మన ప్రభుత్వానికి ఉందా? అనేదే అంతిమ ప్రశ్న.

ఏకవ్యక్తి పాలనతో ఆర్థిక వ్యవస్థ అధోగతి

చిన్న రంధ్రమైనా పెద్ద పడవను ముంచిన చందంగా తెలంగాణ విషయంలో ఇలాంటి పొరపాట్లు పెద్ద ఎత్తున జరిగాయి. పొరపాట్లు కుప్పగా పేరుకున్న ఫలితంగా ఆర్థిక పరిస్థితి దుర్లభంగా మారింది. ఆర్థిక మాంద్యాలన్నీ మానసిక మాంద్యాలే. మానసికమైన అంశాలు ఆర్థిక వ్యవస్థను శాసిస్తాయి. అది కుటుంబ స్థాయి కావచ్చు, రాష్ట్ర, జాతీయ స్థాయి కావచ్చు. అహంకారం, ఆధిపత్య ధోరణి, కేంద్రీకృత పాలన, నియంతృత్వ ధోరణులు ఉన్నతస్థాయి నాయకత్వ మానసిక అంశాలు అయినప్పుడు ఆర్థిక వ్యవస్థ అధోగతి పాలుకావడం సహజమైన ప్రతిచర్య. ఏక వ్యక్తి పరిపాలన అంతా చివరికి అనేక రకాలైన సంక్షోభాలను సృష్టిస్తుంది. తాత్కాలిక తాయిలాలలో సమాజం మునిగిపోతే, ప్రశ్నించే గొంతులది కూడా అడవి రోదనగానే మిగిలిపోతది. ఓట్లను రాల్చే ప్రజాకర్షక పథకాలు వేరు, ప్రజలను ఆర్థికంగా ఎదిగించే పథకాలు వేరు. మొదటి కోవకు చెందినవి ప్రజలను తాత్కాలికంగా సంతోష పరుస్తాయి. తెలంగాణ పాలన మొదటి కోవలోనే నడుస్తున్నది. అవినీతి అంతం అంటూ వ్యవస్థ ప్రక్షాళన మొదలుపెట్టి ఆదిలోనే హంస పాదు చేశారు. అవినీతి విషయంలో దేశంలోనే అగ్ర స్థానాన్ని తెలంగాణ రాష్ట్రం అధిరోహించింది. ప్రభుత్వ పనుల్లో, కార్యకలాపాల్లో అవినీతి అంతం కాకపోతే, పాలకుల కమీషన్​లు ఆగకపోతే.. ఖజానా ఖాళీ కాకుండా ఉంటదా? - V6

– కె. శ్రీనివాసాచారి సోషల్​ ఎనలిస్ట్

మార్చి నుంచి అందుబాటులోకి TSRTC ఏసీ స్లీపర్‌ బస్సులు

తెలంగాణ ప్రయాణికులకు టీఎస్​ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఇక నుంచి దూరప్రాంతాలకు వెళ్లడానికి స్లీపర్ బస్సులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తమ ప్రయాణం హాయిగా సాగేలా ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తొలిసారిగా ఏసీ స్లీపర్‌ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతోంది. మార్చి నుంచి 16 బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. నమూనా బస్సు సోమవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌ ప్రాంగణానికి రాగా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, ఈడీ (ఆపరేషన్స్‌) పీవీ మునిశేఖర్‌లు పరిశీలించారు.

దూరప్రాంతాలకు, ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు చేసేవారికి ఈ బస్సులు సౌకర్యంగా ఉంటాయి. ప్రైవేటు ఆపరేటర్లు ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి పొరుగు రాష్ట్రాలకు భారీ సంఖ్యలో ఏసీ స్లీపర్‌ బస్సులను నడుపుతున్నారు. కొద్దిరోజుల క్రితం నాన్‌ ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సులను టీఎస్‌ఆర్టీసీ రోడ్డు ఎక్కించింది. నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సుల మాదిరే ఏసీ స్లీపర్‌ బస్సులకూ లహరి అని నామకరణం చేసింది. బస్సులను హైదరాబాద్‌ నుంచి పొరుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు, చెన్నై, హుబ్బళ్లి నగరాలకు నడిపించనున్నట్లు ఎండీ సజ్జనార్‌ తెలిపారు.

వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి.. ఎక్కడ?

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి బస్తీల్లో వీధి కుక్కల బెడద పెరిగిపోతోంది. తాజాగా జరిగిన ఓ దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. శునకాల దాడి నుంచి ఆ బాలుడు తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో చివరకు ప్రాణాలు వదిలాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు… నిజామాబాద్ జిల్లా ఇందల్‌‍వాయి మండల కేంద్రానికి చెందిన ముత్యం గంగాధర్ అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఆయన ఛే నెంబర్ చౌరస్తారో ఓ కారు సర్వీస్ సెంటరులో వాచ్‌మెన్‌గా పని చేస్తుండగా, భార్య జనప్రియ, 8 యేళ్ల కుమార్తె, 4 యేళ్ల కుమారుడు ప్రదీప్ ఉన్నారు. వీరంతా బాగ్ అంబర్‌పేటలోని ఎరుకల బస్తీలో నివాసం ఉంటున్నారు. 

అయితే, ఆదివారం సెలవు కావడంతో పిల్లలిద్దరినీ వెంటబెట్టుకుని తాను పనిచేస్తున్న సర్వీస్ సెంటరుకు గంగాధర్ తీసుకెళ్లాడు. కుమార్తెను పార్కింగ్ ఏరియాలో ఉంచి కుమారుడిని మాత్రం లోపలికి తీసుకెళ్లాడు. ప్రదీప్ అక్కడే ఆడుకుంటుండగా గంగాధర్ మాత్రం తన పనుల్లో నిమగ్నమయ్యాడు.

ఈ క్రమంలో బాలుడు అక్క కోసం క్యాబిన్ వైపు నడుచుకుంటూ వస్తుండగా, ఒక్కసారిగా వీధి కుక్కలు వెంటపడ్డాయి. దీంతో భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి అటూ ఇటూ పరుగెత్తాడు. కానీ, ఎంతకీవదలని శునకాలు మాత్రం ఒకదాని తర్వాత మరొకటి దాడి చేయడంతో ఆ బాలుడు కిందపడిపోయాడు. 

తమ్ముడు ఆర్తనాదాలు విన్న అక్క తండ్రికి విషయం చెప్పడంతో అతను పరుగెత్తుకుంటూ వచ్చి కుక్కలదాడిలో తీవ్రంగా గాయపడిన కుమారుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రదీప్ అప్పటికే మరణించినట్టు వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.