NLG: వైద్యం వికటించి వ్యక్తి చనిపోయాడని, ఆస్పత్రి పై విచారణ చేపట్టి.. న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు
నల్గొండ కలెక్టరేట్:
దేవరకొండ పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పటల్ లో ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న వైద్య సేవల పై విచారణ జరపాలని, వైద్యం వికటించి తన తండ్రి చనిపోయాడని ఆరోపిస్తూ.. తనకు న్యాయం చేయాలని బాధిత కుటుబీకుడు బుర్రి వెంకన్న జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
పిఏ పల్లి మండలం దుగ్యాల గ్రామానికి చెందిన బాధిత కుటుంబీకుడు బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. సంజీవి ని హాస్పిటల్లో డాక్టర్స్ బుర్రి మట్టయ్య అను తన తండ్రి కి సక్రమంగా వైద్య సేవలు అందించలేదని, వైద్య సేవల లోపం వల్ల, ఆపరేషన్ వికటించి ఇన్ఫెక్షన్ అయినందున మరణించాడని, తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ సేవలు పేద ప్రజలకు వరం లాంటిది, కానీ ఆరోగ్యశ్రీ సేవలలో పేదలకు సరైన వైద్యం చేయకుండా నిర్లక్ష్య ధోరణితో ఇంటికి పంపిస్తున్నారని వాపోయారు. ఇటీవల దుగ్యాల గ్రామానికి చెందిన బుర్రి మట్టయ్య తన తండ్రి కి తుంటి వద్ద కాళు కు ఆరోగ్యశ్రీ ద్వారా దేవరకొండ లోని ప్రవేట్ హాస్పటల్లో ఆపరేషన్ చేయడం జరిగిందని.. కానీ ఆపరేషన్ ల్యాబ్ లో వాడిన పరికరాల ప్రాబ్లమా, ల్యాబ్ లో పరిశుభ్రత ప్రాబ్లమా ఏమో గానీ, వైద్యం వికటించి అనారోగ్య పాలై ఆపరేషన్ చేసిన 20 రోజులకే మరణించడం జరిగిందని చెప్పారు.
ఇప్పటికైనా పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్ అయ్యే వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా లేదా ఒకసారి పరిశీలించ వలసిందిగా, ఆస్పత్రి ద్వారా జరిగినటువంటి ఈ నిర్లక్ష్యపు ఆపరేషన్ వైద్యం పై విచారణ జరపాలని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
ఆరోగ్యశ్రీ బిల్లుల కోసం ఇష్టానుసారంగా ఆపరేషన్ చేయొద్దని ఇలాంటి హాస్పిటల్ పైన జిల్లా యంత్రాంగం విచారణ చేయాలని పేదలకు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా మెరుగైన సేవలు అందించి ప్రజల ప్రాణాలను వారు కాపాడాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తగు న్యాయం చేయాలని ఆస్పత్రి వివరాలు కలెక్టర్ కు తెలిపారు.
ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేస్తానని తన కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పత్రికముఖంగా చట్టబద్ధంగా ఆ ఆస్పత్రి యాజమాన్యం పైన న్యాయ పోరాటం చేస్తానన్నారు.సంబంధిత జిల్లా అధికారులు విచారణ జరిపి, తన కుటుంబాన్ని ఆదుకోవాలని బుర్రి వెంకన్న అన్నారు.

నల్గొండ కలెక్టరేట్:
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ సేవలు పేద ప్రజలకు వరం లాంటిది, కానీ ఆరోగ్యశ్రీ సేవలలో పేదలకు సరైన వైద్యం చేయకుండా నిర్లక్ష్య ధోరణితో ఇంటికి పంపిస్తున్నారని వాపోయారు. ఇటీవల దుగ్యాల గ్రామానికి చెందిన బుర్రి మట్టయ్య తన తండ్రి కి తుంటి వద్ద కాళు కు ఆరోగ్యశ్రీ ద్వారా దేవరకొండ లోని ప్రవేట్ హాస్పటల్లో ఆపరేషన్ చేయడం జరిగిందని.. కానీ ఆపరేషన్ ల్యాబ్ లో వాడిన పరికరాల ప్రాబ్లమా, ల్యాబ్ లో పరిశుభ్రత ప్రాబ్లమా ఏమో గానీ, వైద్యం వికటించి అనారోగ్య పాలై ఆపరేషన్ చేసిన 20 రోజులకే మరణించడం జరిగిందని చెప్పారు.

అన్నపూర్ణ కాలనీ మండే మార్కెట్లో భిక్షపతి ప్రైవేటు క్లినిక్ నడుపుతున్నాడు. ఎంబీబీఎస్ డాక్టర్గా ‘మణికంఠ పాలీ క్లినిక్’ని భిక్షపతి ఐదేళ్లుగా నడుపుతున్నాడు.

నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం:
వెంటనే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కి ఫోన్ చేసి భూములు కోల్పోతున్న నిర్వాసితుల వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేసి ప్రభుత్వానికి పంపించాలని ఎమ్మెల్యే కోరారు. వీలైనంతగా రైతులకు న్యాయం చేయడానికే పాటు పడాలన్నారు.
ఈ రోజు చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మ గా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమ కారిణి వీరవనిత వర్ధంతి సందర్భంగా.. మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. 
వరంగల్ జిల్లా:
అనంతరం వరంగల్ జిల్లాలోని నాయకులకూ కార్యకర్తలకు దిశా - నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రమశిక్షణ సంఘం మెంబర్ మారుతీనేని ధర్మారావు, ఎస్సీమోర్చా రాష్ట్ర అధ్యక్షులు Ex MLA కొండేటి శ్రీధర్,Ex MLA ఆరూరి రమేష్, సభ్యత్వ నమోదు ఇంచార్జీ పొనుగోటి పాపారావు, ఎడ్ల అశోక్ రెడ్డి, మరియు జిల్లా పదాధికారులు,నియోజకవర్గ కన్వీనర్లు, వివిధ మోర్చాల అధ్యక్షులు, జిల్లా నాయకులు, మండల /డివిజన్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్చార్జ్ లు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నల్లగొండ: గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆర్డీవో రవి, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్ అన్నారు. గణేష్ ఉత్సవాలలో భాగంగా పానగల్లు వద్ద ఉన్న వల్లభరావు చెరువు వద్ద గంగా హారతి కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో గంగా పూజ నిర్వహించి నీటి శుద్ధి నిర్వహించారు.
ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం కోసం గంగా హారతి నిర్వహించి నీటి శుద్ధి చేశామని తెలిపారు. మూడు, నాల్గవ రోజు నుంచి నిమజ్జనం చేసుకునే విధంగా గంగా హారతి నిర్వహించామన్నారు. వల్లభ రావు చెరువు తో పాటు నాగర్జున సాగర్ ఎడమ కాలువ 14 వ మైలురాయి వద్ద నిమజ్జనం చేసే విధంగా క్రేన్లు, బారికేడ్లను, లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
నల్లగొండ జిల్లా:
దాసరి వెంకటయ్య సత్తెమ్మ కుటుంబం 3వ రోజు పూజ కార్యక్రమాలు నిర్వహించగా, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వినాయకుడికి పూజలు నిర్వహించారు.
నల్లగొండ జిల్లా:
రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి రూ.2 లక్షలు, రూ.1.5 లక్షలు, రూ.1 లక్ష చొప్పున బహుమతులు ఉంటాయని వెల్లడించారు. తదుపరి జాతీయ స్థాయి క్విజ్ పోటీలకు సెలక్ట్ అయిన వారికి కూడా నగదు బహుమతులు అందజేస్తారని తెలిపారు.
విజయనగరం: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి.

Sep 10 2024, 21:33
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.2k