/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz కనిష్టానికి పడిపోయిన ఇండియన్ రూపాయి.. ఇంకా తగ్గనుందా Raghu ram reddy
తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 05 2024, 19:52

కనిష్టానికి పడిపోయిన ఇండియన్ రూపాయి.. ఇంకా తగ్గనుందా

ఈ ఏడాది ప్రారంభంలో ఆసియాలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న భారత కరెన్సీ రూపాయి(Indian rupees) నేడు అత్యంత దారుణమైన స్థాయికి పడిపోయింది.

ఈ క్షీణత ఇంకా కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంటున్నాయి. అయితే అమెరికా మాంద్యం భయాందోళన కారణంగా స్టాక్ మార్కెట్లలో(stock market) సూచీలు మొత్తం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఈ ఏడాది ప్రారంభంలో ఆసియాలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న భారత కరెన్సీ రూపాయి(Indian rupees) నేడు అత్యంత దారుణమైన స్థాయికి పడిపోయింది. ఈ క్షీణత ఇంకా కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంటున్నాయి. అయితే అమెరికా మాంద్యం భయాందోళన కారణంగా స్టాక్ మార్కెట్లలో(stock market) సూచీలు మొత్తం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీంతోపాటు ఆసియా మార్కెట్లు కూడా తీవ్ర నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఈ క్రమంలో సోమవారం US డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. మధ్యాహ్నం 12.18 గంటలకు ఈ నివేదికను దాఖలు చేసే సమయానికి రూపాయి 83.85 వద్ద ట్రేడైంది. గ్లోబల్ మార్కెట్ బలహీనత, అమెరికా మాంద్యం భయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు అనుగుణంగా రూపాయి పతనం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

అంతేకాదు ఇది మున్ముందు 84కి చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. ఈక్విటీ పన్నులు పెరగడం, దిగుమతిదారుల నుంచి డాలర్ డిమాండ్(dollar demand) కారణంగా కరెన్సీ ఇటీవలి రోజుల్లో వరుసగా కనిష్ట స్థాయిలను తాకింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 8న సెంట్రల్ బ్యాంక్ పాలసీలో అనుకూల వైఖరికి సంబంధించిన ఏదైనా సంకేతాలు రూపాయి పెరిగేందుకు దారితీయవచ్చన్నారు.

ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే 84కి చేరుకునే అవకాశం ఉందన్నారు. మోర్గాన్ స్టాన్లీ ఒక సంవత్సరంలో డాలర్-రూపాయి విలువ 85.2 కంటే తక్కువగా లక్ష్యాన్ని అంచనా వేసింది. రూపాయి శుక్రవారం నాడు 83.75 వద్ద ముగిసింది. మార్చిలో 2024 గరిష్ట స్థాయి నుంచి 1.3 శాతం తగ్గింది.

U.S. మాంద్యం ఆందోళనలు భారతదేశం(bharat) అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి విదేశీ ప్రవాహాల గురించి ఆందోళనలకు దారితీశాయని ఆర్థిక సేవల సంస్థ ప్రతినిధి కెడియా అన్నారు. శుక్రవారం విడుదల చేసిన బలహీనమైన U.S. ఉద్యోగాల నివేదిక కూడా ప్రభావం చూపినట్లు తెలిపారు. జులైలో అగ్రరాజ్యంలో కేవలం 114,000 ఉద్యోగాలను మాత్రమే ఇచ్చినట్లు నివేదిక వచ్చింది. అయితే 175,000 మార్కెట్ అంచనాల కంటే గణనీయంగా తక్కువగా చూపించడం గందరగోళానికి దారి తీసుకుంది. దీంతో నిరుద్యోగిత రేటు ఊహించని విధంగా 4.3 శాతానికి పెరిగింది. మరోవైపు వేతన వృద్ధి కూడా ఊహించిన దాని కంటే మందగించింది. మరోవైపు అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు కూడా రూపాయి పతనానికి కారణమని ఆర్థిక నిపుణులు అంటున్నారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 05 2024, 15:08

ఐఐటీ మద్రాసుకు తెలుగు తేజం కృష్ణ చివుకుల భారీ విరాళం

అమెరికాలో స్థిర‌ప‌డ్డ తెలుగుతేజం కృష్ణ చివుకుల మ‌రోసారి తన ఉదారతను చాటుకున్నారు. తాను ఇంజినీరింగ్ చ‌దివిన ఐఐటీ మద్రాస్‌కు ఆయ‌న‌ ఏకంగా రూ. 228 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఇలా కృష్ణ ఈ ఐఐటీకి విరాళం ఇవ్వ‌డం ఇదే తొలిసారి కాదు. ఇంత‌కుముందు కూడా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ప‌లు విధాలుగా ఈ విద్యా సంస్థ‌కు ఆయ‌న సాయం చేశారు. 

ఐఐటీ మ‌ద్రాస్‌కు చెందిన‌ 60 ఏళ్ల నాటి హాస్టళ్లను ఆధునికీకరించడానికి రూ.5.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. అలాగే 2014లో ఐఐటీ-ఎంశాట్ పేరుతో విద్యార్థులు శాటిలైట్ రూపొందించేందుకు రూ.1.5 కోట్ల సాయాన్ని ప్ర‌క‌టించారు. క్యాంపస్‌లో స్పేస్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు.

దీంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులకు ‘స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌ అడ్మిషన్‌ ప్రోగ్రాం’ పేరుతో విరాళాలు అందిస్తున్నారు. బెంగళూరులో ప్రభుత్వ పాఠశాలల్లోని 2,200 మంది పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, బెంగళూరులో బాప్టిస్ట్‌ ఆసుపత్రిలో పేద పిల్లల వైద్యానికి సహకారం అందిస్తున్నారు. 

అలాగే మైసూర్ ప‌రిధిలోని చామరాజనగర్ లో ఆయ‌న ఓ పాఠ‌శాల‌ను దత్తత తీసుకున్నారు. ఆ పాఠశాలలో 380 మంది పేద, అనాథ పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇక కృష్ణ సేవలకు గుర్తింపుగా 2015లో ఐఐటీ మద్రాస్, 2016లో ఐఐటీ బాంబే ప్రతిష్ఠాత్మక అలుమ్నస్‌ అవార్డు అందజేయ‌డం జ‌రిగింది. 

డాక్టర్‌ కృష్ణ చివుకుల ఏపీలోని బాపట్లకు చెందిన‌వారు. ఆయ‌న‌ది మధ్య తరగతి విద్యావంతుల కుటుంబం. ఐఐటీ బాంబేలో బీటెక్ పూర్తి చేసిన ఆయ‌న‌ ఐఐటీ మద్రాస్‌లో 1970లో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ ప‌ట్టా పొందారు. ప్ర‌ముఖ‌ హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఎంబీఏ చ‌దివారు. అలాగే తుముకూర్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 

37 ఏళ్ల వ‌య‌సులోనే అమెరికాలోని ప్రముఖ హాఫ్‌మన్‌ ఇండస్ట్రీస్ కి తొలి భారతీయ గ్రూప్ అధ్య‌క్షుడిగా, సీఈఓగా ప‌ని చేశారు. కొంత‌కాలం ఈ సంస్థ‌లో ప‌ని చేసిన త‌ర్వాత బయటకొచ్చి న్యూయార్క్ లో ‘శివ టెక్నాలజీస్ అనే సంస్థ‌ను స్థాపించారు. మాస్‌ స్పెక్ట్రోస్కోపిక్‌ సాంకేతికతను అందించడంలో ఈ సంస్థను ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్ది శభాష్ అనిపించుకున్నారాయ‌న‌. ఇదే కంపెనీని క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగళూరులోనూ ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. 

భారత్‌లో మొదటిసారి 1997లో మెటల్‌ ఇంజెక్షన్‌ మౌల్డింగ్‌ (ఎంఐఎం) సాంకేతికతను పరిచయం చేసింది కృష్ణానే కావడం విశేషం. కొన్నాళ్లకు బెంగళూరు కేంద్రంగా ‘ఇండో ఎంఐఎం’ సంస్థను ప్రారంభించిన ఆయన... తర్వాత ‘ఇండో యూఎస్‌ ఎంఐఎం టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో మరో సంస్థను నెలకొల్పారు. ప్రస్తుతం ఈ సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. భారత్‌లో ఈ సంస్థ వార్షిక టర్నోవర్‌ రూ.1000 కోట్లకు పైనే. అంతేకాదు, 2009లో చిత్తూరు జిల్లా రేణిగుంట కేంద్రంగా గౌరి వెంచర్స్‌ను కూడా స్థాపించారు.

కాగా, ఐఐటీ నిబంధనల ప్రకారం విరాళాలు ఇచ్చే వ్యక్తులు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 6న జరిగే ఒప్పంద కార్యక్రమంలో పాల్గొనేందుకు కృష్ణ చివుకుల అమెరికా నుంచి చెన్నైకి వస్తున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 05 2024, 15:07

పవన్‌కు పెద్ద బాధ్యత అప్పగించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మొక్కలు నాటే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు. ఏపీ సచివాయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో చంద్రబాబు చేపట్టిన సమావేశం కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మొక్కలు నాటే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు.

ఏపీ సచివాయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో చంద్రబాబు చేపట్టిన సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా వచ్చే వందరోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను వ్యవసాయ, ఆక్వా, ఫిషరీస్, ఉద్యానవన, అటవీ శాఖల అధికారులు సీఎంకు వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ రంగంపై అధికారులు సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.." ఏపీలో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలి. ఒకేసారి 5నుంచి 10లక్షల మెుక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టాలి.

దీనికి డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ బాధ్యతలు తీసుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా హైదరాబాద్‌లో భారీఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. అటవీ సంపద పెంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనమందరం వనభోజనానికి వెళ్దాం

ఫుడ్ హ్యాబిట్స్ మారుతుంటే ప్రోడెక్షన్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి. 20లక్షల హెక్టారుల్లో 20లక్షల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం దిశగా ముందుకు వెళ్తున్నాం. హై ప్రోటీన్ ప్యాడీకి మార్కెట్‌లో డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు వ్యవహరించాలి.

ఎక్కడికక్కడ భూసార పరీక్షలు చేయాలి. ప్రతి రంగంలోనూ సాంకేతికతను ఉపయోగించుకోవాలి. గత ప్రభుత్వ విధానాల వల్ల ఫైబర్ నెట్ పరిస్థితి ఏంటో తెలియడం లేదు. సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో క్లారిటీ లేదు" అని చెప్పారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 05 2024, 14:25

కవిత బెయిల్ పిటిష‌న్ విచార‌ణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది.

నేడు విచార‌ణ ప్రారంభ‌మైన వెంట‌నే సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేనందున మరో రోజుకు విచారణ వాయిదా వేయాలని కవిత తరఫు లాయర్ కోరారు.

దీంతో కోర్టు తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. మరోవైపు తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను రేపు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలు నేడు కలవనున్నారు.

SB news

SB news

SB news

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 05 2024, 14:19

వరద వదిలేసి.. ఉన్న నీళ్లు ఒడగొట్టి!.. మేడిగడ్డ నుంచి వృథాగా పోతున్న గోదావరి జలాలు

భవిష్యత్తు అవసరాలకు నిల్వ ఉంచుకోవాల్సి న నీటిని ఒడగొట్టి.. ఎత్తిపోసే అవకాశం ఉన్నా.. వందలాది టీఎంసీల వరదను మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వం సముద్రానికి వదిలేస్తున్నది. మొండికి పోయి కన్నెపల్లి పంప్‌హౌస్‌లను నడుపకుండా ఎగువ ప్రాజెక్టులను, వాటి కింద ఆయకట్టును ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నది.

ఇటీవల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇచ్చిన అల్టిమేటానికి దిగొచ్చిన సర్కార్‌, ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను మధ్యమానేరుకు ఎత్తిపోస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎల్లంపల్లి పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.4247 టీఎంసీల నీరే నిల్వ ఉన్నది. ఈ నీటిని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంపుహౌస్‌ నుంచి ఏడు మోటర్ల ద్వారా ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా నాలుగైదు మోటర్లతోనే సరిపెడుతున్నది.

ఒక్కో మోటర్‌ సామ ర్థ్యం 3,150 క్యూసెక్కులు కాగా, ఈ లెక్కన ఏడు పంపుల ద్వారా రోజుకు 22,050 క్యూసెక్కుల నీటిని కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలంలోని గాయత్రి పంపుహౌస్‌కు ఎత్తిపోయవచ్చు. అక్కడి నుంచి ఏడు బాహుబలి మోటర్ల ద్వారా రోజుకు 22,050 క్యూసెక్కుల నీటిని మధ్యమానేరుకు ఎత్తిపోయవచ్చు.

అంటే దాదాపు రోజుకు రెండు టీఎంసీల నీటిని సులువుగా ఎత్తిపోసుకునేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతానికి ఎల్లంపల్లిలో నీళ్లు అందుబాటులో ఉన్నా మొత్తం మోటర్లు ఆన్‌ చేయకుండా ప్రభుత్వం నాలుగైదు మోటర్లే నడుపుతున్నది. వరద ఉన్నప్పుడే ఎత్తిపోసుకునే అవకాశాన్ని ‘చే’జేతులా జారవిడుస్తున్నది.

అడుగడుగునా అలసత్వం

కాళేశ్వరం జలాల కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతులు, ప్రజల నుంచి డిమాండ్‌ పెరుగుతున్నది. ఎగువన ప్రాజెక్టులు నీళ్లు లేక బోసిపోతుండగా వాటి పరిధిలో భూగర్భ జలాలు అడుగంటి నీరందక నార్లు ముదురుతున్నాయి. మరోవైపు రోజుకు 70 టీఎంసీల నీళ్లు లక్ష్మీ బరాజ్‌ మీదుగా సముద్రం పాలవుతున్న తీరు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. ప్రాజెక్టుల్లోకి నీరు వస్తుందన్న ఉద్దేశంతో ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ సాగర్‌ వరకు, ఎల్‌ఎండీ నుంచి ఎస్సారెస్పీ వరకు రైతులు ఇప్పటికే నార్లు పోసుకున్నారు. కొన్ని చోట్ల నాట్లు వేసుకున్నారు. మరికొన్ని చోట్ల నాట్లు వేసుకునేందుకు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సారి ఎత్తిపోసుకునేందుకు కావాల్సినన్ని కాళేశ్వరం జలాలున్నా వివిధ సాకులు చూపుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకుండా దాటవేస్తున్నది. కేటీఆర్‌ ఇచ్చిన అల్టిమేటంతో దిగొచ్చిన సర్కారు, ఈ నెల 27 నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎత్తిపోతల పక్రియ చేపట్టింది. ఎల్లంపల్లి నుంచి ప్రస్తుతం రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోసుకునే అవకాశమున్నా పంపులు నడపడం లేదు.

ఎల్లంపల్లిలో నీరు తగ్గితే పరిస్థితేంటి?

నిజానికి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చే ఇన్‌ఫ్లో అంతంత మాత్రమే ఉంటుంది. ప్రాజెక్టులో వివిధ అవసరాల కోసం 10 నుంచి 12 టీఎంసీల దాకా నీటిని నిల్వ ఉంచాలి. ఇవి అయిపోతే ఎత్తిపోతలకు అందుబాటులో ఉండేనీటి శాతం తక్కువ అవుతుంది. ప్రస్తుత ఇన్‌ఫ్లోను బట్టి చూస్తే మరో మూడు నాలుగు రోజులకు మించి పంపులు నడిచే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లిలో నీళ్లు తగ్గితే ప్రభు త్వం నీటి ఎత్తిపోతలకు మంగళంపాడే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అదే జరిగితే లక్షలాది మంది రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్టవుతుంది. అందుకే బీఆర్‌ఎస్‌ స్పష్టమైన డిమాండ్‌ చేసింది. కన్నెపల్లి నుంచి ఎత్తిపోస్తే తప్ప కాళేశ్వరం ప్రాజెక్టులు నింపడం అసాధ్యమనే విషయాన్ని సుస్పష్టం చేసింది. నార్లు ముదురుతున్న నేపథ్యంలో కాళేశ్వరం జలాల ఎత్తిపోతలకు డిమాండ్‌ పెరుగుతున్నది. మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ ద్వారా ఒక్కో టీఎంసీ చొప్పున కూడవెళ్లి, హల్దీ వాగుల్లోకి సాగునీటిని విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఇప్పటికే డిమాండ్‌ చేశారు. లేదంటే ఆగస్టు 2న వేలాది మంది రైతులతో రాజీవ్‌ రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు.

ఎగువన వెలవెల.. దిగువన వృథా

ప్రస్తుతం రాష్ట్రంలో మేడిగడ్డకు ఎగువన ఉన్న ప్రాజెక్టులు వెలవెలబోతుంటే అదే మేడిగడ్డ బరా జ్‌ నుంచి రోజుకు దాదాపు 70 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. ఈ సీజన్‌లో దాదాపు 700కు పైగా టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ముందుచూపుతో అధ్యయనం చేసి గోదావరి జలాల ఎత్తిపోతలకు కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే, దానిద్వారా నీటిని తీసుకునేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్ష పూరితంగా మొండిగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా రాజకీయ ప్రయోజనాలను వదిలి ప్రజలు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కన్నెపల్లి పంప్‌హౌస్‌ నుంచి నీటిని ఎత్తిపోయాలనే డిమాండ్‌ సర్వత్రా వినిపిస్తుండగా తాడోపేడో తేల్చుకునేందుకు రైతాంగం సైతం సమాయత్తమవుతున్నది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 05 2024, 14:08

నాగార్జునసాగర్ 13, 14 గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. వరద నీరు అధికంగా పోటెత్తడంతో గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ఈరోజు ఉదయం సాగర్ గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్న కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 13, 14 గేట్లను ఎత్తివేశారు. ఈ రెండు గేట్లను దాదాపు ఐదు అడుగుల మేర ఎత్తేవేసి నీటిని విడుదల చేశారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు (Nagarjuna Sagar Project) భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. వరద నీరు అధికంగా పోటెత్తడంతో గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ఈరోజు ఉదయం సాగర్ గేట్లను ఎత్తివేశారు.

ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్న కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 13, 14 గేట్లను ఎత్తివేశారు. ఈ రెండు గేట్లను దాదాపు ఐదు అడుగుల మేర ఎత్తేవేసి నీటిని విడుదల చేశారు. ఒక్కో గేటు నుంచి 5 నుంచి 10 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే వరద ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికి మరికొన్ని గేట్లు ఎత్తనున్నట్లు సమాచారం. దాదాపు 6 నుంచి 8 గేట్ల వరకు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం సాగర్ ఇన్ ఫ్లో 2, 79,000 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 30, 000 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 580 అడుగులకు చేరుకుంది.

అలాగే సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 280 టీఎంసీలుగా కొనసాగుతోంది. నేటి మధ్యాహ్నం 2 గంటలకు ప్రాజెక్టు 6 క్రస్ట్‌ గేట్లను ఎత్తి సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు నల్లగొండ జిల్లా (తెలంగాణ)కు చెందిన సీఈ నాగేశ్వరరావు తెలిపారు.

2 లక్షల క్యూసెక్కులను విడుదల చేసి అనంతరం ఇన్ ఫ్లోను బట్టి పెంచే అవకాశం ఉంది. కృష్ణా లోతట్టు పరివాహక ప్రాంతాల ప్రజలను జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు.

వరద పెరిగితే ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీసు అధికారులను కలెక్టర్‌ అరుణ్‌బాబు, ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. సాగర్‌ జలాశయానికి 4,27,711 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 05 2024, 14:07

అక్షరం తేడా ఉన్నా.. మాఫీ కాని రుణం!

అర్హత కలిగిన రైతులందరికీ రూ.2 లక్షల్లోపు పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టగా.. పథకం అమలుకు సాంకేతిక సమస్యలు ఇబ్బందికరంగా మారాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని అర్హతలున్న రైతులకు కూడా రుణమాఫీ జాబితాలో చోటు దక్కడంలేదు

అర్హత కలిగిన రైతులందరికీ రూ.2 లక్షల్లోపు పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టగా.. పథకం అమలుకు సాంకేతిక సమస్యలు ఇబ్బందికరంగా మారాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని అర్హతలున్న రైతులకు కూడా రుణమాఫీ జాబితాలో చోటు దక్కడంలేదు. రేషన్‌కార్డు ఆధారంగా రైతు కుటుంబాల ఎంపిక, ఆధార్‌ సీడింగ్‌లో దొర్లిన తప్పులతో అర్హులకు అన్యాయం జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేరు, ఇంటి పేరులో ఒక్క అక్షరం తేడా ఉన్నా, ఆధార్‌ కార్డుపై ఉన్న చిరునామా, బ్యాంకు ఖాతా వివరాల్లో చిన్న, చిన్న తేడాలున్నా.. లబ్ధిదారుల జాబితాలో పేర్లు తీసేశారు.

బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎ్‌స)లో రూపొందించిన రైతుల జాబితాలు, నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ)లో ప్రాసెసింగ్‌ లోపాలు ఇందుకు కారణమవుతున్నాయి. రుణమాఫీ లబ్ధిదారుల జాబితా తయారీ, డేటా ప్రాసెసింగ్‌, రేషన్‌కార్డు ఆధారంగా కుటుంబాన్ని ఎంపిక చేయడంలో తప్పులు దొర్లాయి. బ్యాంకులు, పీఏసీఎ్‌సలలో తయారుచేసిన రుణమాఫీ జాబితాలు తప్పుల తడకగా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఓ రైతుకు రూ.లక్ష అప్పు ఉంటే.. రూ.21 వేలు మాత్రమే మాఫీ అయింది. వ్యవసాయాధికారిని అడిగితే, బ్యాంకుకు వెళ్లి అడగాలని చెప్పారు. బ్యాంకుకు వెళ్తే.. ప్రభుత్వం నుంచి ఇంతే మంజూరైందన్నారు.

ఒక కుటుంబంలో భార్య, భర్త, తల్లి ముగ్గురు ఉంటే.. వారికి వేర్వేరుగా పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్నాయి. తల్లి చనిపోవటంతో రెవెన్యూ శాఖ పాస్‌బుక్కును రద్దు చేసింది. భార్యాభర్తలకు పాస్‌బుక్కులు అలాగే ఉన్నాయి. అయితే తల్లితోపాటు ఒకే రేషన్‌కార్డులో వీరిద్దరి పేర్లు ఉండటంతో.. కొడుకు, కోడలు రుణమాఫీని కూడా ఆపేశారు. ఇక అన్నదమ్ములు ఇద్దరు వేర్వేరుగా ఉంటే... వారిని ఒకే ఆధార్‌ నెంబరు కింద తీసుకొని పెండింగ్‌ పెట్టారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లికి చెందిన అక్కల దివ్యవాణి ఏడాది క్రితం రూ.62 వేల అప్పు తీసుకోగా.. రుణమాఫీ జాబితాలో ఆమె పేరు రాలేదు. తన భర్త తిరుపతి, ఇతర కుటుంబ సభ్యులెవరూ పంటరుణం తీసుకోలేదు

అయినా దివ్యవాణికి రుణమాఫీ కాలేదు. నిజామాబాద్‌ జిల్లా ఐలాపూర్‌కు చెందిన ఎర్రటి సావిత్రికి రూ.65 వేల అప్పు ఉంది. ఈమె ఆధార్‌ నెంబరు వేరే కుటుంబం పరిధిలో ఉంది. ఆ కుటుంబంతో సావిత్రికి ఎలాంటి సంబంధంలేదు. అయినా.. తప్పుడు ఆధార్‌ నమోదు కారణంగా సావిత్రి పేరు రుణమాఫీ జాబితాలో రాలేదు. ఇదే జిల్లాలోని ఎత్తొండ గ్రామానికి చెందిన సాగి చంద్రశేఖర్‌ పేరు ఆధార్‌లో అక్షర దోషాలు ఉండటంతో రుణమాఫీ రాలేదు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్‌కు చెందిన కట్కూరి సుధాకర్‌కు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.50 వేల అప్పు ఉంది. ఏటా రెన్యువల్‌ చేస్తున్నారు. వడ్డీతో కలిపి రూ. 50-60 వేలకు మించదు. అయినా మాఫీ కాలేదు.

నిర్మల్‌ జిల్లా బాసర గ్రామంలో డొప్పోల్ల సురేష్‌, రామ్‌, సుభాష్‌ అనే సోదరులకు సహకార బ్యాంకులో తలో రూ.50 వేల క్రాప్‌ లోన్‌ ఉంది. వీరికి ఒకే రేషన్‌ కార్డు ఉంది. పట్టాదారు పాస్‌పుస్తకాలు వేర్వేరుగా ఉన్నాయి. వీరిలో సుభాష్‌ కొంతకాలం క్రితం చనిపోయారు. చనిపోయిన రైతులకు కూడా రుణ మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ సుభాష్‌ పేరు లేదు. బ్రతికి ఉన్న సురేష్‌, రామ్‌ సోదరుల పేర్లు కూడా జాబితాలో లేవు. రంగారెడ్డి జిల్లా కందుకూరు సహకార సంఘంలో పంట రుణాలు తీసుకుంటే.. మేడ్చల్‌, శామీర్‌పేట, ఘట్కేసర్‌ సహకార సంఘాల్లో మాఫీ జాబితాలో పేర్లు వచ్చాయి. ఆధార్‌ నెంబర్లు వేరే పీఏసీఎ్‌సలో నమోదు చేయటంతో తప్పు జరిగింది.

ఉదాహరణకు కందుకూరుకు చెందిన ఎడ్ల నర్సింహ ఆధార్‌ నెంబరును మేడ్చల్‌ సొసైటీలోని పుట్టు సత్తయ్య పేరుమీద నమోదు చేశారు. దీంతో నర్సింహకు రూ.55 వేలు మాఫీ కాలేదు. సత్తయ్యకు రూ.13,834 మాఫీ అయ్యాయి. రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన తలసాని యశోదమ్మ 2018లో కెనరా బ్యాంకులో రూ.41,500 అప్పు తీసుకున్నారు. అసలు, వడ్డీ కలిపినా రూ.లక్ష లోపే ఉంటుంది. కానీ, ఆమెకు రేషన్‌ కార్డు లేకపోవడంతో రుణమాఫీ కాలేదు. ఇలాంటి వారు రాష్ట్రంలో 6 లక్షలకు పైగా ఉన్నారు.

ఆధార్‌ కార్డుమీద ఇంటిపేరుతో కలిపి నా పేరు సండ్రాస్‌ భగవంత్‌ అని ఉంది. బ్యాంకు ఖాతాలో ఎస్‌.భగవంత్‌ అని ఉంది. దీంతో రుణమాఫీ జాబితా నుంచి తీసేశారు. నా పేరుమీద రూ. 38 వేలు, భార్య మంగమ్మ పేరుమీద రూ. 30 వేల రుణం ఉంది. వడ్డీతో సహా ఇద్దరిదీ కలిపి రూ.1 లక్ష లోపే ఉంటుంది. అయినా మాకు రుణమాఫీ కాలేదు.

నాకు 18 గుంటల భూమి ఉంది. గీసుకొండ పీఏసీఎ్‌సలో రూ.30 వేలు అప్పు తీసుకున్నా. నాకు ఒక సోదరుడు ఉన్నాడు. వేర్వేరుగా నివాసముంటున్నాం. రేషన్‌ కార్డులు కూడా వేర్వేరుగా ఉన్నాయి. అయినా రుణమాఫీ జాబితాలో నా పేరులేదు. పీఏసీఎస్‌ నుంచి ప్రభుత్వానికి పంపిన జాబితాలోనే నాపేరు రాయలేదు

కెనరా బ్యాంకులో పంట రుణాలు తీసుకున్న చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదు. బ్యాంకులో రైతుల పేరుమీద సాధారణ ఖాతా వేరుగా ఉంటుంది. ఒకవేళ ఆ రైతు రుణం తీసుకుంటే... లోన్‌ అకౌంట్‌ను వేరుగా తెరుస్తారు. రుణాన్ని రెన్యువల్‌ చేసినప్పుడు లోన్‌ అకౌంట్‌ను క్లోజ్‌ చేస్తారు. ఆ తర్వాత మళ్లీ కొత్త లోన్‌ అకౌంట్‌ తీస్తారు.

అయితే కెనరా బ్యాంకులో రైతుల రుణాలు రెన్యువల్‌ చేసిన సమయంలో లోన్‌ అకౌంట్లు మార్చలేదు. పాత లోన్‌ అకౌంట్లతోనే రెన్యువల్‌ చేశారు. ఇప్పుడు పాత లోన్‌ అకౌంట్లు రుణమాఫీ జాబితాలోకి రాలేదు. కేవలం కటాఫ్‌ తేదీ లోపల కెనరా బ్యాంకులో కొత్తగా క్రాప్‌ లోన్‌ తీసుకున్న రైతులకే రుణమాఫీ వర్తించింది. బ్యాంకులో ఆరాతీస్తే.. పాత ఖాతాదారులకు రుణమాఫీ వర్తించలేదని తేలింది.

ఉదాహరణకు కామారెడ్డి జిల్లా బాన్సువాడ కెనరా బ్యాంకులో పంటరుణాలు తీసుకున్న అర్హులైన రైతులకు రూ.16 కోట్లు మాఫీ కావాల్సి ఉండగా.. రూ.90 లక్షలు మాత్రమే మాఫీ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా కెనరా బ్యాంకులో లోన్‌ తీసుకున్న 52,211 మంది రైతులకు మొదటి విడతలో రూ.294 కోట్ల మాఫీ వచ్చింది. రెండో విడతలో 24,285 మంది రైతులకు రూ. 256 కోట్ల మాఫీ వచ్చింది. వీరంతా కటాఫ్‌ తేదీ లోపు కొత్తగా రుణాలు తీసుకున్న రైతులే కావటం గమనార్హం.

రెన్యువల్‌ చేసిన వారికి మాత్రం భంగపాటు ఎదురైంది. బ్యాంకర్ల తప్పిదంతో జరిగిన ఈసమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 05 2024, 13:20

జగన్‌వి ఫేక్ పనులు.సాక్షి’వి ఫేక్ రాతలు: మంత్రి లోకేశ్

టీడీపీ కార్యకర్త ఎస్సై చొక్కా పట్టుకున్నట్టుగా సాక్షి దినపత్రికలో ఫొటో

తప్పుడు రాతలకు చర్యలు తప్పవని లోకేష్ హెచ్చరిక

బాపట్ల జిల్లా భట్టిప్రోలులో ఓ టీడీపీ కార్యకర్త ఎస్ఐ చొక్కా పట్టుకుని దౌర్జన్యం చేశారంటూ ఆదివారం సాక్షిలో వచ్చిన కథనంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు.

సాక్షిలో తప్పుడు కథనం రాశారంటూ మండిపడ్డారు. మార్ఫింగ్ ఫొటోతో విష ప్రచారం చేస్తున్నారనీ, పోలీసులపై ఎటువంటి దాడి జరగలేదనీ అన్నారు.

యజమాని జగన్ ఫేక్ పనులు చేస్తుంటే .. ఆయన క్విడ్ ప్రోకో విష పుత్రిక సాక్షి ఫేక్ రాతలు రాస్తోందని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన దుయ్యబట్టారు.

శాంతి భద్రతలు కాపాడుతున్న పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా తప్పుడు రాతలు రాస్తే సాక్షిపై చర్యలు తప్పవు అంటూ లోకేశ్ హెచ్చరించారు.

SB news

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 04 2024, 21:19

నమ్మించి ముంచిన రియల్ రంగం ఐన జనని పుడమి

జనని, పుడమి పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించి, వేలాదిమంది ప్రజల వద్ద 200 కోట్లు రూ. మోసం చేసిన వారి నుండి మోసపోయిన బాధితులను ప్రభుత్వం రక్షించాలి_ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి అభ్యర్థన

 ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చిట్యాల, బొమ్మలరామారం, యాదాద్రి తదితర చోట్ల జనని, పుడమి పేర్లతో వెంచర్లను ఏర్పాటు చేసి ఒక్క రూపాయి డిపాజిట్ చేస్తే 3 రూపాయలు ఇస్తామని అంటే 5 లక్షలు డిపాజిట్ చేస్తే 15 లక్షలు అవుతుందని నమ్మాజుపి 200 కోట్ల రూ. జమ చేసుకొని జననిని ఎత్తివేసిన వారి నుండి ప్రజలను పోలీసు శాఖ రక్షించాలని ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అన్నారు.

 ఈరోజు యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో జనని, పుడమి సంస్థల ద్వారా మోసపోయిన బాధితుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

 ప్రస్తుతం పుడమి పేరుతో నూతన వ్యాపారం సాగిస్తున్న రియాల్టర్ల వ్యవహారంపై గత మూడు మాసాల క్రితం పోలీసు శాఖ ప్రత్యేక అధికారులను నియమించిందని, వారి యొక్క పరిశీలనను, విచారణను పూర్తి చేసి, అమాయక ప్రజల వద్ద వసూలు చేసిన 2 వందల కోట్ల రూపాయలను ప్రజలకు ఇచ్చి వేసే విధంగా పోలీసు శాఖ వ్యవహరించాలి. మోసం చేసిన రియల్టర్ల యొక్క ఆస్తులను, వారి యొక్క బినామీల పేరు మీద ఇటీవల కొనుగోలు చేసిన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసి, వెంటనే అమాయకులైన బాధితులను రక్షించాలన PRPS రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి కోరారు

 బాధితులంతా మూకుమ్మడిగా యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ను ముట్టడించడం, జిల్లా కలెక్టర్, జిల్లా SP కి మరియు రాష్ట్ర పోలీసు అధికారులకు సమాచారాన్ని అందజేసి న్యాయం పొందే వరకు సమైక్యంగా పోరాడాలని ఆయన కోరారు.

 పంతంగి గ్రామంలో జరిగిన బాధితుల సమావేశంలో BSP రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు రాజు తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 04 2024, 20:21

కేంద్రం నిర్ణయంపై అసదుద్దీన్ ఒవైసీ సీరియస్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్ఐఎమ్ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్త చేశారు. వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుకు కేంద్రం సన్నహాలు చేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు.

కేబినెట్‌లో భేటీలో 40 సవరణలు ప్రతిపాదించిందని అన్నారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులను లాక్కునే ప్రయత్నం జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు.

తాము బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు బిల్లుపై లీకులిచ్చి కేంద్రం సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని అన్నారు.

కాగా, వక్ఫ్ బోర్డుకు సుమారు 9.4 లక్షల ఎకరాల భూమి ఉందని తెలిపారు.

వక్ఫ్ ఆస్తులకు బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉందని అన్నారు.

వారికి హిందూత్వ అజెండా ఉందని.. వక్ఫ్ బోర్డు స్వయంప్రతిపత్తిని హరించేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

దేశంలో వక్ఫ్ బోర్డును చాలా చోట్ల దర్గాలు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు వారి చేతికి బోర్డు చిక్కితే నాశనం చేస్తారని అన్నారు.