NLG: ఉన్నత విద్య -పరిశోధన విధానం పై పుస్తకావిష్కరణ
నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల లో "ఉన్నత విద్య -పరిశోధన విధానం" పై పుస్తకావిష్కరణ కళాశాల గ్రంథాలయ సమాచార కేంద్రం, గ్రంథ పాలకులు డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ రచించిన పుస్తకాలు పరిశోధన విధానం, మరియు ఉన్నత విద్యలో ఎలక్ట్రానిక్ సమాచార వనరులు పై పుస్తకాలు రచించి ప్రచురించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మరియు అధ్యాపకుల చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరిగింది.
పుస్తక రచయిత డాక్టర్ ఆనంద్ దుర్గాప్రసాద్, కళాశాల గ్రంథపాలకులు మాట్లాడుతూ.. పరిశోధన విధానం పుస్తకం విద్యార్థులకు పరిశోధన, వివిధ రంగాలలో నూతన మార్పులు- సమస్యలకు పరిశోధన ఎలా చేయాలనేటువంటి అంశాలపై పూర్తిగా సమాచారం ఈ రీసెర్చ్ మెథడాలజీ అనే పుస్తకంలో ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్క భారతీయుడు కంప్యూటర్, మొబైల్ ద్వారా ఇంటర్నెట్లో ఉచితంగా సమాచారాన్ని ఎలా వెతకాల్లో, ఏవిధంగా ఉపయోగించుకోవాలో వెబ్సైట్లు, ఎలక్ట్రానిక్ బుక్స్,ఎలక్ట్రానిక్ జర్నల్స్ సమాచార వనరులు ముఖ్యంగా ఉన్నత విద్యలో సాహిత్యం, సాంకేతికత, పరిశోధన వ్యాసాలపై సమాచారము ఈ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్-పరిశోధన విధానం అనే పుస్తకాలలో విపులంగా సమాచారం అందుబాటులో ఉన్నదని తెలిపారు.
ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కళాశాల గ్రంథ పాలకులు డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్, అకాడమిక్ కోఆర్డినేటర్ వెంపటి శ్రీనివాసులు , పరీక్షల నియంత్రణ అధికారి బి.నాగరాజు, డాక్టర్.కృష్ణ కౌండిన్య, డాక్టర్ దీపిక, డాక్టర్ నారాయణరావు, డాక్టర్ బాలస్వామి, డాక్టర్ యాదగిరి, డాక్టర్ యాదగిరిరెడ్డి, యాదగిరిరావు, నాగిరెడ్డి, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, డాక్టర్ నారాయణ రావు, ముత్తయ్య, నాగరాజు, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మల్లేష్, చంద్రయ్య, అసిస్టెంట్ లైబ్రేరియన్ మణెమ్మ, గ్రంథాలయ రికార్డ్ అసిస్టెంట్ సూదిని వెంకటరెడ్డి తదితరులు కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
![]()

నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల లో "ఉన్నత విద్య -పరిశోధన విధానం" పై పుస్తకావిష్కరణ కళాశాల గ్రంథాలయ సమాచార కేంద్రం, గ్రంథ పాలకులు డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ రచించిన పుస్తకాలు పరిశోధన విధానం, మరియు ఉన్నత విద్యలో ఎలక్ట్రానిక్ సమాచార వనరులు పై పుస్తకాలు రచించి ప్రచురించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మరియు అధ్యాపకుల చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరిగింది.
పుస్తక రచయిత డాక్టర్ ఆనంద్ దుర్గాప్రసాద్, కళాశాల గ్రంథపాలకులు మాట్లాడుతూ.. పరిశోధన విధానం పుస్తకం విద్యార్థులకు పరిశోధన, వివిధ రంగాలలో నూతన మార్పులు- సమస్యలకు పరిశోధన ఎలా చేయాలనేటువంటి అంశాలపై పూర్తిగా సమాచారం ఈ రీసెర్చ్ మెథడాలజీ అనే పుస్తకంలో ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్క భారతీయుడు కంప్యూటర్, మొబైల్ ద్వారా ఇంటర్నెట్లో ఉచితంగా సమాచారాన్ని ఎలా వెతకాల్లో, ఏవిధంగా ఉపయోగించుకోవాలో వెబ్సైట్లు, ఎలక్ట్రానిక్ బుక్స్,ఎలక్ట్రానిక్ జర్నల్స్ సమాచార వనరులు ముఖ్యంగా ఉన్నత విద్యలో సాహిత్యం, సాంకేతికత, పరిశోధన వ్యాసాలపై సమాచారము ఈ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్-పరిశోధన విధానం అనే పుస్తకాలలో విపులంగా సమాచారం అందుబాటులో ఉన్నదని తెలిపారు.
ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కళాశాల గ్రంథ పాలకులు డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్, అకాడమిక్ కోఆర్డినేటర్ వెంపటి శ్రీనివాసులు , పరీక్షల నియంత్రణ అధికారి బి.నాగరాజు, డాక్టర్.కృష్ణ కౌండిన్య, డాక్టర్ దీపిక, డాక్టర్ నారాయణరావు, డాక్టర్ బాలస్వామి, డాక్టర్ యాదగిరి, డాక్టర్ యాదగిరిరెడ్డి, యాదగిరిరావు, నాగిరెడ్డి, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, డాక్టర్ నారాయణ రావు, ముత్తయ్య, నాగరాజు, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మల్లేష్, చంద్రయ్య, అసిస్టెంట్ లైబ్రేరియన్ మణెమ్మ, గ్రంథాలయ రికార్డ్ అసిస్టెంట్ సూదిని వెంకటరెడ్డి తదితరులు కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ ధ్వజస్తంభ పునః నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని, సిపిఎం చిట్యాల రూరల్ మండల కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం డిప్యూటీ తాహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. మే నెలలో కురిసిన వర్షం, ఈదురుగాలుల వల్ల ధ్వజస్తంభం కూలిపోయిందని వినతిపత్రంలో పేర్కొన్నారు.
శ్రీశైలం వద్ద కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది పొంగి ప్రవహిస్తోంది. శ్రీశైలం డ్యామ్ లో నీటిమట్టం పెరుగుతోంది. మొత్తం 5 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
కాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు 1 వ తేదీ న శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు రానున్నారు. కృష్ణమ్మకు ఆయన జలహారతి ఇవ్వనున్నారని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇప్పటికే కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు జలకళతో తొణికిసలాడుతున్నాయి.
ఆయా ప్రాజెక్టుల్లో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో వస్తోంది.
చౌటుప్పల్ నాగారం గ్రామాల మధ్య, వలిగొండ- రామన్నపేట రైల్వే స్టేషన్ లో మధ్యలో ఉన్న రైల్వే గేటు ( గేట్ నెంబర్ 16) వద్ద పనులు జరుగుతున్నందున రైల్వే గేట్ ను జూలై 31, ఆగస్టు 1 రెండు రోజులపాటు తాత్కాలికంగా మూసివేయడం జరుగుతుంది. సౌత్ సెంట్రల్ రైల్వే సెక్షన్ సెక్షన్ ఇంజనీరు తెలిపారు.
ఈ గేటు నుండి ఎలాంటి రాకపోకలు జరపబడవన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకొని ప్రయాణించాల్సిందిగా సూచించారు. గేటు లో పనులు జరుగుతున్నందున వాహనదారులు, ప్రజలు అందరూ సహకరించాల్సిందిగా వారు కోరారు.
.
హైదరాబాద్లోని యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ నెల 27, 28 తేదీలలో జరిగిన తెలంగాణ రాష్ట్ర తైక్వాండో క్యాడేట్ మరియు జూనియర్ ఛాంపియన్షిప్ 2024 విజయవంతంగా పూర్తయింది.
బంగారు పతక విజేతలు:
గోల్డ్ మెడల్ విజేతలు ఆగష్టు 18 నుండి 20 వరకు మహారాష్ట్ర (ఔరంగాబాద్) లో జరిగే జాతీయ స్థాయి ఛాంపియన్షిప్లో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా పథకాలు సాధించిన విద్యార్థులకు ది తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు పి.విఠల్ బాబు ప్రధాన కార్యదర్శి యం డి. యూనుస్ కమాల్, కోషాదికారి అంబటి ప్రణీత్ లు అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి A. ప్రవీణ్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు.
నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 54,438 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 6744 ఉంది. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 511.40 అడుగులకు చేరుకుందని డ్యాం అధికారులు సోమవారం తెలిపారు. ప్రస్తుతం నీటి నిల్వ 134.0598 టిఎంసి లుగా ఉందని తెలిపారు.


మరొక ముఖ్య అతిథి చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. బైకానీ శ్రీశైలం యాదవ్ ఉన్నత చదువులు చదువుకొని, కన్స్ట్రక్షన్ రంగంలో రాణిస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో కూడా ముందుంటాడని తెలియజేస్తూ ఎంతోమంది యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ తను ఎన్నుకున్నరంగంలో రాణిస్తున్నాడని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్టీ హాస్టల్ వార్డెన్ రామకృష్ణ, మారేపల్లి అర్జున్, మారేపల్లి మనోజ్, అక్కినపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
TG: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులకు ఉచిత కరెంటు కాన్సెప్ట్ ను మొదటిసారిగా ప్రవేశపెట్టింది వైయస్ రాజశేఖర్ రెడ్డి అని, ఇవాళ ఐదవరోజు అసెంబ్లీ సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ హయాంలోనే విద్యుత్ రంగం అభివృద్ధి చెందిందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. విద్యుత్ రంగాన్ని గత బిఆర్ఎస్ సర్కార్ నిర్వీర్యం చేసింది.యుపిఏ సర్కార్ ముందు చూపుతో రాష్ట్రంలో కరెంటు కష్టాలు తీర్చిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
హైద్రాబాద్ శివారుల్లో అద్భుత నగర నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలుష్య రహితం, కర్బన ఉద్గారాల రహితంగా ప్రతిపాదిత 'నెట్ జీరో సిటీ’ స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు.
ఆదివారం రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం మీర్ఖాన్పేట్ లో నెట్ జీరో సిటీని సీఎం సందర్శించారు. దీనిపై రూపొందించిన ప్రణాళికలను పరిశీలించి చేయాల్సిన మార్పుచేర్పులపై అధికారులకు సూచనలిచ్చారు.
Jul 30 2024, 21:31
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.5k