/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz వయనాడ్ ఘటనపై స్పందించిన రాహుల్.. తీవ్ర ఆవేదనకు గురయ్యా Raghu ram reddy
తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 13:16

వయనాడ్ ఘటనపై స్పందించిన రాహుల్.. తీవ్ర ఆవేదనకు గురయ్యా

కేరళలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వయనాడ్‌ను అయితే వరదలు చుట్టుముట్టాయి. దీంతో పెను ప్రమాదకరంగా మారాయి. కేరళలోని వాయనాడ్‌ ప్రాంతంలో భారీగా వరదలు వచ్చాయి.

కేరళలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వయనాడ్‌ను అయితే వరదలు చుట్టుముట్టాయి. దీంతో పెను ప్రమాదకరంగా మారాయి. కేరళలోని వాయనాడ్‌ ప్రాంతంలో భారీగా వరదలు వచ్చాయి. దీంతో కొండచరియలన్నీ విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. మృతులకు 2 లక్షలు, గాయపడిన వారికి 50 వేల పరిహారాన్ని ప్రధాని మోదీ కార్యాలయం ప్రకటించింది. వాయనాడ్ ఘటనపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. వాయనాడ్‌లోని మెప్పాడి సమీపంలో భారీగా కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర వేదనకు గురయ్యానని తెలిపారు. తమ వాళ్ళను కోల్పోయిన కుటుంబాలకు రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇంకా చిక్కుకున్న వారిని త్వరలోనే సురక్షిత ప్రాంతాలకు తీసుకువస్తారని ఆశిస్తున్నానని రాహుల్ అన్నారు

కేరళ ముఖ్యమంత్రితో పాటు వయనాడ్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడానని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. కావల్సిన సాయం అందజేస్తామని తనకు హామీ ఇచ్చారని రాహుల్ పేర్కొన్నారు. అన్ని ఏజెన్సీలతో సమన్వయం ఉండేలా చూసుకోవాలని, కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేయాలని సహాయక చర్యలకు అవసరమైన ఏదైనా సహాయం గురించి మాకు తెలియజేయాలని కోరానని తెలిపారు.

తాను కేంద్ర మంత్రులతో మాట్లాడి వాయనాడ్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కోరతానన్నారు. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో అడ్మినిస్ట్రేషన్‌‌కు సహాయం చేయాలని తాను కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కోరుతున్నానని రాహుల్ పేర్కొన్నారు

వాయనాడ్‌లోని ముండకై, మెప్పాడి, చురల్‌మల ప్రాంతాల్లో భారీగా వరదలు వచ్చాయి. రాత్రి ఒంటి గంట సమయంలో ముండకై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఉదయం 4:10 గంటలకు ముండకై ప్రాంతంలో కొండ చరియలు విరిగి పడ్డాయి.

భారీగా వరదలు, కొండచరియలు విరిగి పడడంతో అనేక ఇళ్లు కొట్టుకు పోయాయి. భారీ వరదలతో రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. రహదారులు, వంతెనలు కొట్టుకు పోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. కొండ చరియలు విరిగి పడడం, ఇళ్లు కొట్టుకుపోవడంతో భారీ ప్రాణనష్టం వాటిల్లింది.

ఇప్పటి వరకూ 19 మంది మృతి, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇళ్లు కొట్టుకుపోవడంతో అనేక మంది గల్లంతయ్యారు. సహాయక చర్యలను అగ్నిమాపక, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రారంభించాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 13:04

ఒకే గ్రామం నుంచి 20 వేల మంది జవాన్లు!

35 మంది కర్నల్స్‌, 42 మంది లెఫ్టినెంట్‌ బ్రిగేడియర్‌ స్థాయి అధికారులు, 20 వేల మంది జవాన్లు.. వీరంతా ఒకే గ్రామానికి చెందినవారంటే నమ్మగలరా? అవును.

ఇది నిజమే. ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌లో ఉన్న గహ్మర్‌.. భారత సైన్యంలోకి అత్యధిక మంది సైనికులను పంపిన గ్రామంగా నిలుస్తున్నది.

 35 మంది కర్నల్స్‌, 42 మంది లెఫ్టినెంట్‌ బ్రిగేడియర్‌ స్థాయి అధికారులు, 20 వేల మంది జవాన్లు.. వీరంతా ఒకే గ్రామానికి చెందినవారంటే నమ్మగలరా? అవును. ఇది నిజమే. ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌లో ఉన్న గహ్మర్‌.. భారత సైన్యంలోకి అత్యధిక మంది సైనికులను పంపిన గ్రామంగా నిలుస్తున్నది. ఇక్కడి యువతకు భారత సైన్యంలో చేరటం తప్ప.. మరో లక్ష్యం లేదు.

ఆ గ్రామంలోని 15వేల మందికిపైగా రిటైర్డ్‌ జవాన్లే వారికి స్ఫూర్తి. ‘కార్గిల్‌ విజయ్‌ దివస్‌’ సందర్భంగా, అత్యధిక సంఖ్యలో జవాన్లను పంపిన గ్రామంగా ‘గహ్మర్‌’ పేరు మీడియాలో మారుమోగుతున్నది.

ప్రస్తుతం ఈ గ్రామానికి చెందిన 5 వేల మంది సైన్యంలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నారు.. గ్రామాన్ని 22 ప్రాంతాలుగా విడగొట్టి.. ప్రతి ఒక్క ఏరియాకు ఓ జవాన్‌ పేరు పెట్టారు.

ఆర్మీలో ఎంపికయ్యేందుకు, ఊళ్లో ఉన్న యువత అంతా తెల్లవారుజామున 4 గంటలకు మేల్కొని..

కసరత్తు మొదలుపెడతారు. వీరి శిక్షణ కోసం గ్రామంలోని రిటైర్డ్‌ జవాన్లు 1,600 మీటర్ల రన్నింగ్‌ ట్రాక్‌ను నిర్మించారు. గొప్ప సైనిక వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని ఆ గ్రామస్థులపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 12:56

గుంటూరు – విజయవాడ మధ్య మళ్లీ నిర్మాణాల జోరు !

గుంటూరు , విజయవాడ నగరాలు దాదాపుగా కలిసిపోయాయి. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి లో కంటే.. గుంటూరు, విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారి పక్కన నిర్మాణాలు శరవేగంగా సాగాయి. బడా రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ తమ ప్రాజెక్టులు ప్రారంభించాయి.

కానీ వాటికి 2019లో గ్రహణం పట్టేసింది. నిర్మాణాలు కొనసాగిస్తే కొంటారా లేదా అన్న విషయం కాదు.. ఏదో ఓ రూల్ పెట్టి కూల్చేస్తారన్న భయంతో ఆపేశారు. ఫలితంగా బడా కంపెనీలు కూడా నిర్మాణాలు ఆపేసి పరారయ్యాయి.

కొన్ని వేల కోట్ల సంపద అలా.. అక్కడ జంగిల్‌గా మారిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మళ్లీ కళ ప్రారంభమయింది. తమ ప్రాజెక్టుల్లో పెద్ద పెద్ద కంపెనీలు జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించాయి. పిచ్చి మొక్కలు తొలగించి మళ్లీ ఆకర్షణీయంగా చేసుకుని నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి.

వచ్చే ఒకటి, రెండు నెలల్లో దాదాపుగా అన్ని భారీ ప్రాజెక్టులు మళ్లీ ఊపందుకునే అవకాశం ఉంది. నిర్మాణాలు ప్రారంభమైతే ఇక ఆ జోరు ఆపడం కష్టమే. విజయవాడ – గుంటూరు మధ్య హైవే.. కు రెండు వైపులా అతి పెద్ద వ్యాపార కేంద్రాలకు అవకాశం ఉంది

గతంలో అనేక సంస్థలు తమ ప్రాజెక్టులను సిద్ధం చేసుకున్నాయి. కొన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశాలు వచ్చి పడ్డాయి.. కానీ ఐదేళ్ల పాటు వారంతా సైలెంట్ అయిపోయారు.

ఇప్పుడు అమరావతిలో ప్రభుత్వం జంగిల్ క్లియరెన్స్ నిర్వహిస్తోంది. అది పూర్తయిన వెంటనే నిర్మాణాలు పూర్తవుతాయి.

ప్రభుత్వ పరంగా నిర్మాణాలు ప్రారంభిస్తే.. ప్రైవేటు ప్రాజెక్టులు కూడా ఊపందుకునే అవకాశం ఉంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 12:52

మరింత దిగిన బంగారం

బంగారం ధరలు మరింత దిగాయి. దేశీయంగా ఆభరణాలకు డిమాండ్‌ పడిపోవడంతో తులం ధర మరో వెయ్యి రూపాయల వరకు దిగొచ్చింది.

బంగారం ధరలు మరింత దిగాయి. దేశీయంగా ఆభరణాలకు డిమాండ్‌ పడిపోవడంతో తులం ధర మరో వెయ్యి రూపాయల వరకు దిగొచ్చింది.

ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో తులం బంగారం ధర రూ.950 తగ్గి రూ.71,050కి తగ్గింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం పుత్తడి ధర శనివారం రూ.72 వేల స్థాయిలో ఉన్నదని ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ వెల్లడించింది.

పసిడితోపాటు వెండి ఏకంగా రూ.4,500 తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి రూ.84,500కి దిగింది. ధర తగ్గకముందు ఇది రూ.89 వేల స్థాయిలో ఉన్నది.

ప్రస్తుత సంవత్సరంలో ఒకేరోజు ఇంతటి స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం.

బడ్జెట్‌లో కస్టమ్స్‌ సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించిన నాటినుంచి ఇప్పటి వరకు బంగారం, వెండి ధరలు దిగువముఖంగానే పయనిస్తున్నాయి.

అయినప్పటికీ అంతర్జా తీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 10.60 డాలర్లు పెరిగి 2,438.50 డాలర్లకు చేరు కోగా, వెండి 28.28 డాలర్ల వద్ద ఉన్నది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 12:47

విధేయతకే పట్టం..పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ట్విస్ట్..!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. అనేక సంప్రదింపులు.. సమాలోచనల తర్వాత తెలంగాణ పీసీసీ బాస్ ఎవరనే దానిపై అధిష్టానం తుది నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.

సామాజిక సమీకరణాలు.. విధేయత ఆధారంగా కొత్త అధ్యక్షుడి నియామకం పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.

పీసీసీ చీఫ్ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు గత కొద్ది రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి తీవ్రస్థాయిలో లాబియింగ్ కొనసాగించారు. బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కీలు పోటీ పడగా.. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్..

ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ పేర్లు ప్రధానంగా వినిపించాయి. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతోన్న మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారు అయిందని ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది.

మహేష్ కుమార్ గౌడ్ అభ్యర్థిత్వాన్ని రేవంత్ సైతం బలపర్చారని దాంతో కొద్ది రోజుల్లోనే అధిష్టానం అధికారిక ప్రకటన చేయనుందని వార్తలు వచ్చాయి. కానీ , అధిష్టానం మాత్రం పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చింది.

ఎంపీ బలరాం నాయక్ వైపు హైకమాండ్ మొగ్గు చూపిందని తెలుస్తోంది. గతంలో కేంద్రమంత్రిగా కూడా పని చేసిన బలరాం నాయక్ కు కాంగ్రెస్ పెద్దలతో మంచి సత్సంబంధాలు ఉండటంతోపాటు పార్టీకి విధేయుడిగా ఆయనకు పేరుంది.

ఆయన విధేయతను పరిగణనలోకి తీసుకొని దాదాపుగా బలరాం నాయక్ పేరును ఖరారు చేశారని.. రేవంత్ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాక ఈ నెల 15న అధికారిక ప్రకటన ఉంటుందని అంటున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 27 2024, 15:14

జులై 30 న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ రాష్ట్రస్థాయి మౌన దీక్ష

బడ్జెట్లో కార్శికుల, ఉద్యోగుల, పెన్షనర్ల సంక్షేమం మాటేది

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనివ్వాలి 

కేటాయించిన బడ్జెట్ ను ఖర్చు చేయాలి 

పెండింగ్ డీఏలు, పీఆర్సీ బకాయిల విడుదల, నగదు రహిత ఆరోగ్య పధకంలో మార్పులు తదితరాల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జులై 30 న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర పెన్షనర్ల ఐకాస ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి భారీ మౌన దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసీయేషన్‌ (టాప్రా) రాష్ట్ర కార్యదర్శి వి. కృష్ణ మోహన్ వెల్లడించారు.

 సంక్షేమ పథకాలకు అర్హులుకాని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పెండింగ్ లోనున్న

నాలుగు డీఏల చెల్లింపు, 2023 జులై ఒకటో తేదీ నుంచి అమలు కావాల్సిన రెండో పీఆర్సీ రిపోర్టును వెంటనే తెప్పించుకొని అమలు పరుస్తారని, ఫిట్ మెంట్ గురించి బడ్జెట్లో ప్రకటిస్తారని ఆశించినప్పటికీ భంగపాటు ఎదురైంది. జీపీఎఫ్, మెడికల్ రీయింబర్స్మెంట్ తదితర బిల్లులు ఈ- కుబేర్ లో పెండింగ్ లో ఉన్నాయి. అధికారంలోకి వస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) ను పునరుద్ధరిస్తామంటూ మ్యానిఫెస్టోల్లో ప్రకటించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కానీ, కేంద్రంలో 01.01.2004 నుంచి నూతన పెన్షన్ స్కీమ్ (ఎన్ పీఎస్) ను అమలు పరచి వృద్ధాప్య భద్రత లేకుండా చేసిన బిజెపి ప్రభుత్వం కానీ తమ బడ్జెట్ ప్రసంగాల్లో ఓపీఎస్ ను అమలు చేస్తామనే ప్రస్తావన కూడా చేయలేదు. మొదటి తారీఖున జీతాలు, పెన్షన్లు ఇస్తున్నామనే మాట తప్ప ఇతర సమస్యలను బడ్జెట్లో ప్రస్తావించక పోవడం ఆందోళనకరం.

ప్రభుత్వాలు సీనియర్ సిటిజన్లకు కల్పించే సంక్షేమ కార్యక్రమాల్లో 107 దేశాలలో భారత దేశం 101 గా ఉన్నా సార్వత్రిక పెన్షన్ అమలు చేసేందుకు, కోవిడ్ సమయంలో రద్దు చేసిన రైలు రవాణా రాయితీని పునరుద్ధరించేందుకు కేంద్రం తిరస్కరించింది. 

పెరుగుతున్న అంతరాలు 

పెన్షన్ జీవన భృతి మాత్రమే అయినప్పటికీ ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఇవ్వడానికి అంగీకరించలేదు. ఓల్డ్ టాక్స్ రిజైమ్ లో నున్న వారికి గత దశాబ్దంలో ఎటువంటి పన్ను మినహాయింపులు ఇవ్వలేదు. స్థూల పన్ను రాబడి (జీటీఆర్) లో కార్పొరేట్ పన్ను వాటా 2014-15 లో 34.5 శాతం ఉండగా 2024- 25 బడ్జెట్ అంచనాల్లో 26.6 శాతానికి తగ్గింది. అదే కాలంలో ఆదాయపు పన్ను వాటా 20.8 శాతం నుంచి 30.9 శాతానికి పెరిగింది. గత పది సంవత్సరాల కాలంలో జీడీపీలో కార్పొరేట్ పన్నుల వాటా 3.4 శాతం నుంచి 3.1 శాతానికి పడిపోగా ఆదాయపు పన్ను వాటా 2.1 శాతం నుంచి 3.5 శాతానికి పెరిగింది. ఆదాయపు పన్ను ద్వారా ప్రభుత్వానికి 19 శాతం ఆదాయం సమకూరుతుండగా కార్పొరేట్ సంస్థల నుంచి వస్తున్నది కేవలం 17 శాతం మాత్రమే. 2019 లో కార్పొరేట్ సంస్థలకు కల్పించిన రాయితీల వల్ల ఏటా రూ. 1.45 లక్షల ఆదాయాన్ని కోల్పోతుంది. ప్రస్తుత బడ్జెట్ లో కూడా కార్పొరేట్ పన్ను రేట్లను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది. ఇండక్సేషన్ సౌకర్యం కూడా రద్దు చేశారు.

పది సంవత్సరాల కొకసారి కేంద్ర వేతన సంఘం (సీపీసీ) సిఫార్సులు అమలయ్యే కేంద్ర, రాష్ట్ర, అటానమస్ సంస్థల ఉద్యోగులు, పింఛన్ దారులకు 8‌వ సీపీసీ నియమించేందుకు తిరస్కరించింది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఫ్ ల విషమ షరతులకు తలొగ్గి వేతన / పెన్షన్ స్థంభనకు పాల్పడుతున్నది. కరోనా కాలంలో కోత విధించిన 18 నెలల డీఏ / డీఆర్ లను చెల్లించేందుకు అంగీకరించలేదు. కరువు భత్యం లెక్కించేందుకు ఆధారమైన వినిమయ ధర సూచీ (సిపిఐ) లెక్కల్లోనే దగా జరుగుతుంది. వడ్డీ రేట్లు అత్యధికంగా నున్నప్పుడు నిర్ణయించిన కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ కాలపరిమితిని 15 సంవత్సరాల నుండి తగ్గించేందుకు నిరాకరించింది. గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికల ముందు టీచర్లు, ఉద్యోగులు, పెన్షనర్లందరూ ఐక్యంగా తమ సమస్యల పరిష్కారానికై నిరంతరం ఆందోళనలు చేస్తూ నిరవధిక సమ్మెకు నోటీసులిచ్చినప్పుడు ప్రభుత్వం దిగివచ్చి సీఓపీ కాలపరిమితిని 13 ఏళ్ళకు తగ్గించింది. కానీ కేంద్రంలోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ తగ్గించేందుకు నిరాకరిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ లో ఐక్య ఉద్యమాలతో 65 ఏళ్ళకే అదనపు పెన్షన్, ఓపీఎస్ సాధించుకున్నారు. కానీ కేంద్రంలోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ 65 ఏళ్ళ నుంచి అదనపు పెన్షన్ ఇచ్చేందుకు, 110వ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను అమలు జరపడానికి అంగీకరించలేదు. బెంగాల్, త్రిపుర, కేరళలలో వామపక్ష ప్రభుత్వాలున్నప్పుడు డిఫైన్డ్ బెనిఫిట్ ఓపీఎస్ నే కొనసాగించారు. కాని త్రిపురలో బిజెపి అధికారంలోకి వచ్చాక పాత పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి అతి తక్కువ పెన్షన్ వచ్చే ఎన్ పీఎస్ ను బలవంతంగా రుద్దారు. కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం ఓపీఎస్ ను రద్దు చేసి గ్యారంటీ లేని ఎన్ పీఎస్ ను అమలు పరిచారు. దేశవ్యాప్తంగా పారా మిలటరీ పెన్షనర్లతో సహా కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆఫీసర్లు, పెన్షనర్లు స్వతంత్రంగానూ, ఐక్య ఉద్యమాల ద్వారానూ చేస్తున్న పోరాటాల మూలంగా ఇండియా బ్లాక్ అధికారంలోకి వచ్చిన కొన్ని రాష్ట్రాల్లో పాత పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించారు. కానీ కేంద్ర ప్రభుత్వం కేవలం నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్ పీ ఎస్) పరిధిలోనే ఇంప్రూవ్మెంట్స్ చేస్తామని భీష్మించుకుని ఉన్నది.

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రస్తావన కానీ, ఉపాధి కల్పన, రిక్రూట్మెంట్ పాలసీ విధానాన్ని కానీ బడ్జెట్లో ప్రస్తావించలేదు. బీడీ కార్మికులకు "చేయూత" జీవిత బీమా, ఈఎస్ఐ, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, దీనికి బడ్జెట్లో కేటాయింపులు, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, స్వీగ్గి జోమాటో వంటి గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తూ రాజస్థాన్ తరహా చట్టాన్ని మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసిన విషయం మర్చిపోయినట్లున్నారు. చిరు వ్యాపారులు, ఫుట్ పాత్ వ్యాపారులకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తామన్న హామీని గాలి కొదిలేసారు.

పెరిగిన ధరల కనుగుణంగా కనీస వేతనాల జి.వోల సవరణ ప్రస్తావనే లేదు. అభయ హస్తం పేరిట వీధి వ్యాపారులకు ప్రత్యేక జోన్స్ ఏర్పాటు, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు, హెల్త్ కార్డులతో సహా ప్రతి మండలంలో "హమాలీ నగర్" ఏర్పాటు చేస్తామని చెప్పినా వాటి గురించి ప్రస్తావనే లేదు. మిషన్ భగీరథ కార్మికులకు కనీస వేతనాలు, గ్రామ పంచాయతీ కార్మికుల, మధ్యాహ్న భోజన కార్మికుల బకాయి వేతనాలు చెల్లింపునకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పథకాల్లో పని చేస్తున్న స్కీం వర్కర్లకు కనీస వేతనాలు, చట్టబద్ధ హక్కులు కల్పించే చర్యలే లేవు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనివ్వాలని, కేటాయించిన బడ్జెట్ ను ఖర్చు చేయాలని, రైతు భరోసా కౌలు రైతులకు కూడా ఇవ్వాలని, వాగ్ధానాలు అమలు పరుస్తూ బడ్జెట్ సమావేశాలు ముగిసే లోపు పునర్ పరిశీలన చేయాలని ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి. కృష్ణ మోహన్ ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. వివిధ తరగతుల ప్రజలు తమ సమస్యల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పరిష్కరించుకునేందుకై పోరాటాలకు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 27 2024, 13:34

మీడియాని ఎదుర్కొనే ధైర్యం లేక‌పోతే ఎట్లా జ‌గ‌న్‌?

మీడియాను ఎదుర్కొనే ధైర్యం వైఎస్ జ‌గ‌న్‌కు లేద‌ని గ‌త ఐదేళ్లుగా ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తూ వ‌చ్చాయి. ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష స్థానంలో ఉన్నారు. ఇప్పుడు కూడా మీడియాని ఎదుర్కొనేందుకు సిద్ధ‌ప‌డ‌క‌పోతే ఎట్లా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

తాను ప్ర‌శ్నించే స్థానంలో ఉన్నాన‌ని జ‌గ‌న్ గుర్తించిన‌ట్టు లేరు. అందుకే ఇప్ప‌టికీ ఇంకా తాను ఎంచుకున్న మీడియా ప్ర‌తినిధుల‌తో మాత్ర‌మే ఆయ‌న మాట్లాడుతున్నారు

పైపెచ్చు జ‌గ‌న్ మీడియా స‌మావేశానికి రావాల‌ని ఆహ్వానించి, తీరా అక్క‌డికి వ‌చ్చిన త‌ర్వాత లోప‌లికి అనుమ‌తించ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా జ‌గ‌న్ కోట‌రీ దుర్మార్గ‌పు చ‌ర్యే అని మీడియా ప్ర‌తినిధులు మండిప‌డుతున్నారు.

ఈ విష‌యంలో లోకేశ్‌ను జ‌గ‌న్ ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని జ‌ర్న‌లిస్టులు సూచిస్తున్నారు. లోకేశ్ మీడియా స‌మావేశాన్ని గ‌మ‌నిస్తే… సాక్షి, ఎన్‌టీవీ, టీవీ9 ప్ర‌తినిధులు రాలేదా? ఏం బ్ర‌ద‌ర్స్ ప్ర‌శ్న‌లేవీ లేవా? అని ప్ర‌శ్నించ‌డాన్ని గుర్తు చేస్తున్నారు.

టీడీపీ అనుకూల మీడియా ప్ర‌తినిధుల్ని కూడా ఆహ్వానించి, వారి ఆరాధ్య పాల‌కుడి ప్ర‌జావ్య‌తిరేక విధానాల్ని గురించి జ‌గ‌న్ చీల్చి చెండాడొచ్చు. ఆ ప‌ని ఆయ‌న ఎందుకు చేయ‌డం లేదో ఎవ‌రికీ అర్థం కాదు.

ప్ర‌తి మీడియా ప్ర‌తినిధి జ‌గ‌న్ స‌మావేశానికి హాజ‌ర‌య్యేలా ఆయ‌న చుట్టూ ఉన్న కోట‌రీనే చొర‌వ చూపాలి. కానీ కోట‌రీ ప‌నితీరు ఇప్ప‌టికీ జ‌గ‌న్‌ను మీడియా వ్య‌తిరేకిగానే నిల‌బెడుతోందన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

మీడియా విష‌యంలో జ‌గ‌న్, ఆయ‌న కోట‌రీ తీరు మారాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది. ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను చూసిన త‌ర్వాతైనా నెగెటివ్ విధానాల్ని మార్చుకోక‌పోతే, రాజ‌కీయంగా నష్ట‌పోతూనే వుంటారు. ఏది కావాలో తేల్చుకోవాల్సింది వైసీపీ పెద్ద‌లే.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 27 2024, 13:26

చేతులెత్తేసిన ఎల్‌అండ్‌టీ.. ఓల్డ్‌సిటీ మెట్రోకు చిక్కుముళ్లు

పాతనగర మెట్రో కారిడార్‌ (Old City Metro) నిర్మాణానికి స్థానికులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నా, సంస్థాగతంగా ఎన్నో చిక్కుముళ్లు నెలకొన్నాయి. 2011 నాటికే మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులోనే జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ మీదుగా ఫలక్‌నుమా వరకు 15 కి.మీ మెట్రో కారిడార్‌ నిర్మాణానికి డీపీఆర్‌ సిద్ధమై, కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉన్నాయి.

పాతనగర మెట్రో కారిడార్‌ (Old City Metro) నిర్మాణానికి స్థానికులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నా, సంస్థాగతంగా ఎన్నో చిక్కుముళ్లు నెలకొన్నాయి. 2011 నాటికే మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులోనే జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ మీదుగా ఫలక్‌నుమా వరకు 15 కి.మీ మెట్రో కారిడార్‌ నిర్మాణానికి డీపీఆర్‌ సిద్ధమై, కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉన్నాయి. పీపీపీ విధానంలో ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైలు హైదరాబాద్‌ సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైలు సంస్థ మాత్రం నిర్మాణానికి ముందుకు రావడం లేదు. ఇప్పటికే మూడు కారిడార్‌లలో నిర్మించిన మెట్రో మార్గాల నిర్వహణ సంస్థకు భారంగా మారడమే కాకుండా, లాభాలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో పాత నగరం పెండింగ్‌లో ఉన్న 5.5 కి.మీ (ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా) మెట్రో మార్గాన్ని నిర్మించలేమని చేతులెత్తేసింది. ప్రభుత్వం తరపున హైదరాబాద్‌ మెట్రో రైలు లిమిటెడ్‌(హెచ్‌ఎంఆర్‌ఎల్‌) పలుమార్లు సంప్రదింపులు జరిపినా ఫలితం లేకుండా పోయింది. ముఖ్యంగా నిర్ణీత సమయంలో ప్రాజెక్టు చేపట్టేందుకు రైట్‌ ఆఫ్‌ వే ఇవ్వకపోవడం, ఈలోగా సంవత్సరాలు గడిచిపోవడంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. అదే సమయంలో మెట్రో ప్రాజెక్టు నిర్వహణ అంటేనే ఎల్‌ అండ్‌టీకి ఏమాత్రం కనబర్చడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే పాత నగరానికి సంబంధించిన 5.5 కి.మీ మార్గానికి హెచ్‌ఎంఆర్‌ కొత్త డీపీఆర్‌ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది.

కేంద్రం ఒప్పుకుంటేనే..

పాతనగరంలో మెట్రో కారిడార్‌ నిర్మాణానికి ఎల్‌ అండ్‌టీ మెట్రో ముందుకు రాకపోవడంతో కొత్తగా డీపీఆర్‌ రూపొందించి దాని ప్రకారం ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త డీపీఆర్‌ను రాష్ట్ర కేబినెట్‌ ఆమోదించినా, కేంద్ర ప్రభుత్వం ఆమోదించే పరిస్థితి లేదు.

ఎందుకంటే పాతనగరంలో నిర్మించే 5.5 కి.మీ మెట్రో మార్గానికి గతంలో కేంద్ర అనుమతులు ఇవ్వడంతో పాటు వయా గ్యాప్‌ ఫండ్‌(వీజీఎఫ్‌)ను మంజూరు చేసింది. ఏదేమైనా ఆ ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీతో పూర్తి చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్‌ఎంఆర్‌పై ఉంది. ప్రస్తుతం హెచ్‌ఎంఆర్‌ రూపొందిస్తున్న పాతనగరం మెట్రో డీపీఆర్‌ను అంత సులువుగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించే పరిస్థితి లేదని ప్రాజెక్టు నిపుణులు పేర్కొంటున్నారు.

కొత్త డీపీఆర్‌ను కేంద్రం ముందుకు తీసుకువెళితే… పాత నగరం మెట్రో మార్గాన్ని ఎల్‌ అండ్‌ టీ ఎందుకు పూర్తి చేయలేదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. వాళ్ల నుంచి ఏమైనా రికవరీ చేయాల్సి ఉందా? ఇంత కాలం ఎందుకు జాప్యం జరిగింది.. 2011లోనే అనుమతులు వచ్చిన మొదటి దశ మెట్రోను 2017 నాటికి పూర్తి చేయాల్సి ఉన్నా, ఎందుకు ఆలస్యమైంది అని అడిగే పరిస్థితి ఉంది. వీటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానాలు ఇస్తేనే పాతబస్తీ మెట్రో ప్రాజెక్టు ముందుకు కదిలే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

9-10 నెలలు గడిస్తే కానీ..

పాత నగరంలో మెట్రో కారిడార్‌ నిర్మించే అలైన్‌మెంట్‌ ప్రకారం మెట్రో ప్రాజెక్టును చేపట్టాలంటే 1000కి పైగా ఆస్తులను సేకరిస్తే గానీ మెట్రోకు రైట్‌ ఆఫ్‌ వే దొరకదు. ఈ మార్గంలో ఆస్తుల సేకరణకే రూ.600-రూ.800 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా. దీనికి తోడు పాతబస్తీ అంటే చాలా రకాల మౌలిక వసతులు మెట్రో కారిడార్‌ వెళ్లే మార్గంలో ఉంటాయి. వీటన్నింటినీ మరో చోటుకు తరలించాల్సి ఉంటుంది.

ఇలా ఎన్నో అంశాలు పాత నగరంలో మెట్రో మార్గంతో ముడిపడి ఉన్నాయి. రెండో దశలో ప్రతిపాదించిన మార్గాలకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా, పాతనగరానికి సంబంధించిన 5.5 కి.మీ మెట్రో కారిడార్‌ నిర్మాణానికి చాలా చిక్కు ముళ్లు ఉన్నాయని, వాటన్నంటినీ పరిష్కరించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరగాలి. అదే సమయంలో ఎల్‌ అండ్‌ టీ మెట్రో సంస్థ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 27 2024, 13:19

సాగర్‌ నీటి విడుదలకు మా సమ్మతి అక్కర్లేదా?

తమను సంప్రదించకుండానే నాగార్జున సాగర్‌ కుడికాలువ నుంచి 3 టీఎంసీల నీటి విడుదలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) చైర్మన్‌ శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.

తమను సంప్రదించకుండానే నాగార్జున సాగర్‌ కుడికాలువ నుంచి 3 టీఎంసీల నీటి విడుదలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) చైర్మన్‌ శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.

ఏకపక్షంగా ఉత్తర్వులిచ్చే అధికారం చైౖర్మన్‌కు ఎక్కడిదంటూ ఆక్షేపించారు.

ప్రధానంగా నీటి విడుదలపై ఏ నిర్ణయం తీసుకోవాలన్నా త్రిసభ్య కమిటీకే అధికారం ఉంటుంది. ఈ కమిటీలో కృష్ణాబోర్డు సభ్య కార్యదర్శి కన్వీనర్‌గా.. తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలు సభ్యులుగా ఉంటారు.

ఈ కమిటీలో ఏ ఒక్కరు సమ్మతి తెలపకపోయినా.. నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేయడానికి వీల్లేదు. ఏకాభిప్రాయం కుదరకపోతే కృష్ణాబోర్డు సమావేశంలో చర్చించాలి.

అయినా అంగీకారం కుదరకపోతే కేంద్ర జలశక్తిశాఖ మంత్రి నేతృత్వంలోని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుండే అపెక్స్‌ కౌన్సిల్‌లోతేల్చుకోవాలి.

అవన్నీ పట్టించుకోకుండా ఉత్తర్వులిచ్చిన బోర్డు చైర్మన్‌ను నిలదీయాలని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 26 2024, 17:15

లేని అప్పు ఉన్నట్టుగా చంద్రబాబు చెబుతున్నారు

టీడీపీ ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఇవాళ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. 52 రోజులుగా రాష్ట్రం పురోగతి వైపు వెళ్తోందా అని, తిరోగమనంలో వెళ్తోందా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని, దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం జరుగుతోందన్నారు. ప్రశ్నించే స్వరం ఉండకూడదు అనే విధంగా ప్రభుత్వం అణిచివేత ధోరణితో ముందుకు వెళ్తోందని, బడ్జెట్ కూడా రెగ్యులర్ విధానంలో ప్రవేశ పెట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు జగన్‌. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ దారుణమైన పరిస్థితి అని, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ పెట్టే ధైర్యం కూడా చంద్రబాబు కి లేదన్నారు.

రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ పెడితే హామీల అమలుకు సంబంధించి కేటాయింపులు చూపాలని, మోసపూరిత హామీలపై నిధులను బడ్జెట్ లో చూపించక పోతే ప్రజలు రోడ్డు పైకి వచ్చి ఆందోళనకు దిగుతారు అని చంద్రబాబుకు తెలుసునన్నారు. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ పెడితే ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయని చంద్రబాబు ఇలా చేస్తున్నారని, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే హామీల్లో కేటాయింపులు చేయరు కాబట్టి ప్రజలకు తెలుస్తుంది అని ఇలా చేస్తున్నారన్నారు.

అంతేకాకుండా..’ప్రజలను భయానక వాతావరణంలో ఉంచటానికి దాడులు, ఆస్తుల ధ్వంసం వంటి ఘటనలు చేస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడు వంచెన, గోబెల్స్ ప్రచారం అనే విధానం ఫాలో అవుతారు.

రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందనే విధంగా ప్రస్తుతం చంద్రబాబు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచినపుడు, బీజేపీతో కలిసి వెళ్ళటానికి, బీజేపీ నుంచి విడిపోవటానికి ఇలా ప్రతిసారి చంద్రబాబు అనుసరించే విధానం ఇదే.

రాష్ట్రం ఆర్దికంగా ధ్వంసం అయిందనే కథని ఇటీవల చంద్రబాబు ఎక్కువగా చెబుతూ వస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి తప్పుకోవడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలు అయ్యాక అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు ఇదే ప్రయత్నం చేస్తున్నారు.

14 లక్షల కోట్లు ఉన్నాయి అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. లేని అప్పు ఉన్నట్టుగా చంద్రబాబు చెబుతున్నారు’ అని వైఎస్‌ జగన్‌ వ్యా్‌ఖ్యానించారు.