/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పై విచారణ జరపాలి : AISF జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ Vijay.S
VijayaKumar

Jun 09 2024, 14:59

నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పై విచారణ జరపాలి : AISF జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్

భువనగిరి.: నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై విచారణ జరపాలి.* *ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి , ఉప్పుల శాంతి కుమార్
దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలపై అనేక అనుమానాలు వెలువడుతున్న తరుణంలో పరీక్ష నిర్వహించిన తీరుపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని, మే 5న పరీక్షను నిర్వహించడం జరిగింది.దాదాపు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు పరీక్షను రాశారు. ప్రకటించిన ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని విద్యార్థులు, విద్యార్ధి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.వారి అనుమానాలకు సజీవ సాక్ష్యం ఆరుగురు విద్యార్థులకు 720 మార్కులకు 720 మార్కులు రావడం మరల వారి యొక్క పరీక్ష కేంద్రం ఒకటే కావడం వలన వారి అనుమానాలకు బలాన్నిస్తుంది. కావున తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి పరీక్ష రాసిన మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే నీట్ పరీక్షను రద్దు చేయాలనీ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి చెప్పిన కూడా వారి మాటని పెడచెవిన పెట్టి, నిర్లక్ష్యం చేయడం ద్వారా వేలాది మంది ప్రతిభగల విద్యార్థులు మెడికల్ విద్యకు దూరమవుతున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై, పేపర్ లీకేజీలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచేతవిచారణ జరిపించాలని ఉప్పుల శాంతి కుమార్ డిమాండ్ చేయడం జరిగింది.

VijayaKumar

Jun 08 2024, 19:12

నీర్నెముల గ్రామములో తాటి చెట్టు నుండి ప్రమాదవశాత్తు కింద పడి గీతా కార్మికునికి గాయాలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామానికి చెందిన సురవి మురళి గౌడ్, 48 సంవత్సరాలు తన వృత్తిరీత్యా శనివారం సాయంత్రం నాలుగు గంటలకు తాటి చెట్టు ఎక్కి దిగే క్రమంలో ప్రమాదవశాత్తు జారి పడటం జరిగింది. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు , బంధువులు ప్రధమ చికిత్స కోసం రామన్నపేట హాస్పిటల్ కు 108 లో తీసుకెళ్లారు.

VijayaKumar

Jun 08 2024, 19:08

అక్షర యూధుడు రామోజీరావుకు ఘన నివాళులు అర్పించిన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు షానూర్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని స్థానిక ప్రీన్స్ చౌరస్తాలో అక్షరయోధుడు ,ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత ,పద్మ విభూషణ్ గ్రహీత,చెరుకూరి  రామోజీరావు చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించిన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్షరమే ఆయుధంగా తెలుగు జాతికి వెలుగులు నింపిన, పత్రిక రంగంలో నూతన ఒరవడి సృష్టించి , ఈనాడు గ్రూప్ సంస్థల స్థాపించి  ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి కల్పించారని, మరియు పత్రిక మీడియా రంగానికి ఆయన మృతి తీరనిలోటని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపరాజు వెంకన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టికొప్పుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 08 2024, 19:04

జూన్ 15న ఇంద్ర పార్క్ వద్ద మహాధర్నా ను జయప్రదం చేయాలి : బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ పిలుపు
జూన్ 15న *ఇందిరాపార్కు దగ్గర తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్* పిలుపునిచ్చారు. శనివారం ఉదయం భువనగిరిలోని SV హోటల్ లో వివిధ బీసీ కుల, సంఘాలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం..కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రాష్టంలో సమగ్ర కులగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకోవాలని కాంగ్రెస్ పెద్దలు చూడటం అత్యంత దుర్మార్గం అన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కులగణన చేసి, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్తే బీసీలు కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెబుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని రాహుల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పినందుకే..కాంగ్రెస్ పార్టీకి 99 ఎంపీ సీట్లు దక్కిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో బీసీలను మోసం చేసినందుకే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

VijayaKumar

Jun 07 2024, 21:55

వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టపత్తుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు

నల్లగొండ జిల్లా: మూడు రోజుల ఉత్కంఠ కౌంటింగ్ కు తెరపడింది.. బిఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు.. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలేక పోవడంతో సెకండ్ ప్రాధాన్యత ఓట్లు లెక్కించి టిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని ఎలిమినేట్ చేసిన అధికారులు.. ఎలిమినేట్ పద్ధతిలో తీన్మార్ మల్లన్నను మరి కాసేపట్లో విజేతగా ప్రకటించనున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన.. మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం.. బాణసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్న తీన్మార్ మల్లన్న వర్గీయులు.

VijayaKumar

Jun 07 2024, 21:45

గ్రూప్ - 1 అభ్యర్థులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే

టీజీపీఎస్సీ గ్రూప్ -1 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే అభ్యర్థులకు నేడు మరొకసారి సూచించారు. ఈ నెల 9 వ తేదిన ఉదయము 10.30 గంటల నుండి మద్యాహ్నం 01.00 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, పరీక్ష కేంద్రము లోనికి ప్రవేశించడానికి ఉదయము 09.00 గంటల నుండి 10.00 గంటల వరకు అనుమతి ఉంటుందని, ఉదయం 10.00 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైననూ పరీక్ష హాలు లోనికి అనుమతించబడరని, పరీక్ష కేంద్రము మెయిన్ గేట్ ఉ.10.00 గం.లకు మూసివేయబడుతుందని తెలిపారు.పరీక్ష కేంద్రాల గురించి, హాల్ టికెట్ డౌన్ లోడ్ గురించి జిల్లా స్థాయి హెల్ప్ లైన్ నెం. 8331997006, 8331997037 సంప్రదించాలని, హాల్ టికెట్ ను http://www.tspsc.gov.in వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలని, హాల్ టికెట్ ను A4 పేపర్ నందు ప్రింట్ తీసుకోవాలని తెలిపారు. హాల్‌టికెట్‌లోని నిర్దేశిత స్థలంలో అభ్యర్థి లేటెస్ట్ ఒరిజినల్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను గమ్‌తో అతికించాలని, అభ్యర్దులు పరీక్షహాలుకు హాల్ టికెట్ తో పాటుగా ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, పాన్ కార్డ్, ఓటరు ఐడి కార్డు, ఇతర ప్రభుత్వ ఫోటో గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి , బ్లూ / బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ను తప్పనిసరిగా తీసుకెళ్లాలని, ఒకవేళ హాల్ టికెట్ లో ఫోటో సరిగా ముద్రణ కాకపోయినా, లేదా కనిపించనట్లయితే అభ్యర్థి గెజిటెడ్ అధికారి/ అభ్యర్ది చివరగా చదివిన సంస్థ ప్రిన్సిపాల్ చేత ధృవీకరించబడిన మూడు (3) పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను, అండర్‌టేకింగ్ ఫామ్ (TSPSC వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఫార్మాట్‌తో) తో పాటుగా తీసుకురావాలి. అట్టి ఫోటోలు, అండర్‌టేకింగ్ ఫామ్ ను పరీక్ష హాల్‌ లోని ఇన్విజిలేటర్‌కు సమర్పించినట్లయితే అభ్యర్థి పరీక్షకు అనుమతించబడతారని, లేనట్లయితే అభ్యర్దిని పరీక్ష హాల్ లోకి అనుమతించబడరని తెలిపారు. అభ్యర్థులు పరీక్ష సమయం పూర్తయ్యే వరకు పరీక్ష హాలు నుండి బయటకు వెళ్ళేందుకు అనుమతించబడరని, పరీక్ష హాలును వదలి వెళ్ళే ముందు, అభ్యర్థి ఓ ఎం ఆర్ ఆన్సర్ షీట్ ను ఇన్విజిలేటర్‌కు అందజేయాలని, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ ద్వారా అభ్యర్థి తన బయోమెట్రిక్‌ ను క్యాప్చర్ చేసే వరకు పరీక్ష హాలు నుండి బయటకు అనుమతించబడరని, అభ్యర్థి ఎవరైనా తన బయోమెట్రిక్‌ ను ఇవ్వకపోతే వారి ఓఎంఆర్ షీట్ మూల్యాంకనం చేయబడదని తెలిపారు. చేతులకు మెహంది, టాటూలతో పరీక్షకు వెళ్లకూడదని, ఒకవేళ ఉంటే బయోమెట్రిక్ చేయుటకు తంబ్ ఇంప్రెషన్ పడకపోవచ్చునని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్దులు షూస్, సాక్స్ ధరించరాదని, కేవలము చెప్పులు మాత్రమే ధరించాలని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్దికి ఒకవేళ చేతులు లేకపోతే సహాయకులు కావాలి అని ముందుగానే దరఖాస్తు చేసినవారికి మాత్రమే పరీక్ష కేంద్రము వారు స్క్రైబ్ ను ఇస్తారని, అనుమతి లేకుండా ఎవరూ సహాయకులను తీసుకురాకూడదని తెలిపారు. అభ్యర్థులు పరీక్షకు కనీసం ఒకరోజు ముందుగా తమ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, పరీక్షా కేంద్రం యొక్క ఖచ్చితమైన ప్రదేశాన్ని తెలుసుకోవాలని కోరారు. పరీక్ష కేంద్రము లోకి వాటర్ బాటిల్ అనుమతించరని, పరీక్ష కేంద్రం వారే త్రాగు నీటి సౌకర్యము కల్పిస్తారని, పరీక్ష కేంద్రము లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైలు ఫోన్ లు, కాలిక్యులేటర్లు, చేతి గడియారాలు , హాండ్ బ్యాగ్ లు, బ్లూటూత్ డివైస్ లు, పెన్ డ్రైవ్ లు, రైటింగ్ ప్యాడ్ లు, తెల్ల కాగితాలు అనుమతించబడవని అన్నారు. పరీక్ష కేంద్రము వద్ధ వస్తువులు భద్రపరచడానికి కమిషన్ ఎలాంటి క్లోక్ రూమ్/ స్టోరేజీ సౌకర్యం కల్పించలేదని, కాబట్టి అభ్యర్డులు ఇట్టి విషయాన్ని గమనించాలని సూచించారు. పరీక్ష వ్రాసే అభ్యర్థుల సౌలభ్యం కోసం, సమయాన్ని అంచనా వేయడానికి ప్రతి అరగంట పూర్తయిన తర్వాత హెచ్చరిక బెల్ మోగించబడుతుందని తెలియచేస్తూ అభ్యర్దులు ఇట్టి సూచనలు పాటించాలని కోరారు.

VijayaKumar

Jun 07 2024, 21:07

ఉపాధి హామీ చట్ట రక్షణకై ఈనెల 10న జరుగు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి: వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి సిర్పంగి స్వామి

ఉపాధి హామీ చట్ట రక్షణ కోరుతూ ఈనెల 10వ తేదీన హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేక పోరాటాల ద్వారా ఏర్పడిందని అలాంటి చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలను చేస్తుందన్నారు చట్ట రక్షణ కోసం మరియు తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు రాష్ట్రస్థాయి సదస్సును నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ సదస్సుకు రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సహాయ కార్యదర్శి రాజ్యసభ సభ్యులు శివ దాసన్ అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ ముఖ్య వక్తలుగా హాజరవుతారని తెలిపారు ఉపాధి హామీ చట్టంలో గతంలో ఉన్న పద్ధతులను తీసివేస్తూ నూతన పద్ధతులను అవలంబిస్తూ కూలీలు పనులకు రాకుండా కొర్రీలు పెడుతున్నది రెండు పూటలా ఫోటోలు అప్లోడ్ చేస్తేనే వేతనాలు ఇస్తామని వేధింపులకు గురిచేస్తుంది పనిచేసిన కూలీలకు వారం వారం డబ్బులు ఇవ్వకుండా నెలల తరబడి పెండింగ్లో ఉంచడంతో కూలీలు తగ్గడం వల్ల చట్టాన్ని రద్దు చేయాలని దురుద్దేశంతో ప్రభుత్వం ఉన్నది రోజు కూలి 600 రూపాయలు ఇచ్చి 200 పని దినాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది ఈ సదస్సులో వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వ్యవసాయం సంఘం మండల కార్యదర్శి కలుకూరి రామచందర్ వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు కందగట్ల సాయి రెడ్డి, కొండూరి సత్తయ్య, గండికోట నరసింహ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 07 2024, 20:08

శ్రీ చైతన్య పాఠశాలలో అడ్మిషన్లు తీసుకుని మోసపోకూడదు: వేముల నాగరాజు ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి

వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించగా ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి వేముల నాగరాజు పాల్గొని మాట్లాడుతూ ఎలాంటి పర్మిషన్లు లేకుండా వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల అనే పేరుతో అడ్మిషన్లకు తిరుగుతా ఉన్నారు ఈ చైతన్య పాఠశాలకు ఎలాంటి అడ్మిషన్లు తీసుకొని మోసపోవద్దని అన్నారు 20 రోజుల క్రితం వలిగొండ మండల కేంద్రంలో శ్రీ చైతన్య పాఠశాల అనే బోర్డు పెట్టి అడ్మిషన్లు తీసుకున్న పరిస్థితి. దీన్ని వెంటనే జిల్లా విద్యాధికారి గారి దృష్టికి తీసుకుపోగా వారు స్పందించి ఈ పాఠశాలకు ఇలాంటి గుర్తింపు పర్మిషన్లు లేవు అడ్మిషన్లు వేసి తల్లిదండ్రులు మోసపోవద్దు అని చెప్పి జిల్లా విద్యాధికారి గారు సూచించారు ఆ తర్వాత మండల విద్యాధికారి శ్రీ చైతన్య పాఠశాలపై కేసు నమోదు చేశారు ఇలాంటి పాఠశాలల్లో మీ మీ పిల్లలను చేర్చి అడ్మిషన్ల పేర్ల ఫీజులు కట్టి మోసపోవద్దని ఇలాంటి స్కూల్లో పూర్తిగా నడుస్తాయో మధ్యలో ఆగిపోతే తెలియని పరిస్థితి ఇలాంటి పాఠశాలలో మీ పిల్లల అడ్మిషన్లు వేసి వాళ్ళ భవిష్యత్తులో ఖరాబు చేయొద్దని ఎస్ఎఫ్ఐ గా తెలియజేస్తూ అదేవిధంగా నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో అన్ని పాఠశాలలో ఇష్టానుసారంగా ఫీజులు తీసుకుంటా ఉన్నారు ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టం అమలు చేసి పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు చదువుకునేలా ఈచట్టం అమల్లోకి తీసుకురావాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వేముల జ్యోతిబాసు మండల అధ్యక్షులు SK ఫర్దిన్, మైసోల్ల నరేందర్, వేములకొండ వంశీ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 06 2024, 22:31

మొగిలిపాక లో బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మామిడి సత్తిరెడ్డి- మంజుల వివాహ వార్షికోత్సవం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని మొగిలిపాక గ్రామంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ నాయకులు మామిడి సత్తిరెడ్డి - మంజుల వివాహ వార్షికోత్సవాన్ని బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పెండ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ యూత్ అధ్యక్షులు మధు యాదవ్ ,ఉపాధ్యక్షులు శివకుమార్ గౌడ్ ,గౌరవ అధ్యక్షులు సాయికుమార్ యాదవ్ మరియు యాస ఉదయ్ కుమార్ రెడ్డి ,గుండాల సాయి, టి బాలచందర్, కార్తీక్ గౌడ్, శ్రీకర్ గౌడ్ ,మహేష్ తదితరులు పాల్గొన్నారు.


VijayaKumar

Jun 06 2024, 20:40

విత్తనాలు ఎరువులు సకాలంలో అందేలా క్షేత్రస్థాయిలో అన్ని చర్యలు తీసుకోవాలి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా క్షేత్రస్థాయిలో అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లకు సూచించారు. గురువారం నాడు ఆమె రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రూప్ -1 పరీక్షల నిర్వహణ, విత్తనాలు, ఎరువుల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు స్కూల్ డ్రెస్సుల అందజేత కార్యక్రమాలను సమీక్షించారు. రైతులందరికీ విత్తనాలు, ఎరువులు సకాలంలో ప్రతి ఒక్కరికి అందేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని, నకిలీ విత్తనాలు, ఎరువులను అరికట్టాలని, పోలీసు, వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించాలని, కంట్రోల్ రూముల ఏర్పాటుతో నిఘా పఠిష్టంగా నిర్వహించాలని సూచించారు. విత్తన డీలర్ల రిజిష్టర్లను తనిఖీ చేయాలని, ప్రతి రోజూ డీలర్ల నుండి రిపోర్టులు పరిశీలించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా సందర్భంగా జూన్ 11 లోగా విద్యార్ధులకు అందించే డ్రైస్సులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. *జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగే విత్తనాలు, ఎరువుల గురించి వివరిస్తూ జిల్లాలో ఇప్పటి వరకు 78,345 పత్తి విత్తనాల ప్యాకెట్స్ అమ్మడం జరిగిందని, ఇంకా 66,858 పత్తి విత్తనాల ప్యాకెట్స్ అందుబాటులో వున్నాయని, అలాగే ఎరువులకు సంబంధించి 14,117 మెటిక్ టన్నుల యూరియా, 829 మెటిక్ టన్నుల డిఎపి, 4160 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 375 మెటిక్ టన్నుల పొటాష్, 186 మెట్రిక్ టన్నుల సూపర్ఫాస్టేట్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీకి సంబంధించి క్షేత్రస్థాయిలో అని చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె.నారాయణరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అనూరాధ, జిల్లా పంచాయితీ అధికారి సునంద, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.