/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz KTR: సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా భారీ సభ.. జనసమీకరణపై నేతలతో కేటీఆర్‌ భేటీ Yadagiri Goud
KTR: సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా భారీ సభ.. జనసమీకరణపై నేతలతో కేటీఆర్‌ భేటీ

హైదరాబాద్‌: ఈనెల 17న సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించనున్న సభకు భారీ జనసమీకరణ చేయాలని గ్రేటర్‌ నేతలకు మంత్రి కేటీ రామారావు(KTR) దిశానిర్దేశం చేశారు.

అసెంబ్లీ కమిటీ హాల్‌లో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 10వేల మంది హాజరయ్యేలా చూడాలని నేతలకు సూచించారు.

ఈనెల 13న గ్రేటర్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలన్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఇతర జిల్లాలకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇన్‌ఛార్జిలుగా నియమించనున్నట్టు కేటీఆర్‌ తెలిపారు. ఈనెల 13 నుంచి 17వరకు ఇన్‌ఛార్జిలు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోనే ఉండి జనసమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని చెప్పారు.

దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టినందున అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేకకార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్‌ సూచించారు. సచివాలయం ప్రారంభోత్సవం, పరేడ్‌గ్రౌండ్‌ సభను అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభకు తమిళనాడు, ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రులు స్టాలిన్‌, హేమంత్‌ సోరెన్‌, బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ తదితరనేతలు హాజరుకానున్నారు.

పార్టీ బలోపేతం దిశగా భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ సమావేశం

•నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం వెంబాయి గ్రామంలో

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం వెంబాయి గ్రామంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నల్గొండ జిల్లా కార్యదర్శి చిట్యాల మండల ఇంచార్జ్ వేదాంతం గోపీనాథ్ గారు మరియు బిజెపి జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు గారు పాల్గొన్నారు.

ఈ బూత్ కమిటీ సమావేశాన్ని ఉద్దేశించి గోపీనాథ్ గారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మనదేశంలో ఎంత చిన్న గ్రామమైన పట్టణాలకు చిట్టచివరిలో ఉన్న ప్రతి చిన్న గ్రామాలను కూడా దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ పథకాలు కిందిస్థాయి వరకు అందే విధంగా నరేంద్ర మోడీ గారు పథకాలను ప్రవేశపెట్టారు.

ఇట్టి కేంద్ర ప్రభుత్వ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలాగా ప్రతి బిజెపి కార్యకర్త ప్రతినిత్యం ప్రజలతో మమేకమై వారికి ఏ రకమైన పథకాలు అందుతున్నాయి తెలుసుకొని కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి సవివరంగా తెలియపరచి వారికి అందే విధంగా చూడాలని చెప్పారు. వేంబాయి గ్రామంలో బిజెపి బూత్ కమిటీ ని ఏర్పాటు చేసుకొని పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరు పని చేయాలని తెలంగాణలో రానున్నది

బిజెపి ప్రభుత్వం అని ప్రతి ఒక్కరూ కసితో పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు ఉయ్యాల ప్రశాంత్ గౌడ్, పామనగుండ్ల వెంకన్న గౌడ్, గురిజ వెంకన్న గౌడ్, కొంపెల్లి శివ, సిద్ధగోని అశోక్, గుండు లింగస్వామి, పంతంగి బిక్షం, లింగస్వామి గౌడ్, చింతకాయల రాము, పవన్, పాలకూరి వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Nadendla Manohar: జనసేన కుటుంబం అని గర్వంగా చెప్పుకొందాం

అమరావతి: మనది జనసేన కుటుంబం (Janasena Family) అని గర్వంగా చెప్పుకొందామని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Janasena PAC Chairman Nadendla Manohar) అన్నారు.

గురువారం కేంద్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదు ప్రక్రియ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. క్రియాశీలక సభ్యత్వం ఓ భావోద్వేగ ప్రయాణమన్నారు. ఆపదలో ఉన్న తోటి కార్యకర్తకు సాయంగా నిలవాలన్నదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) సంకల్పమని స్పష్టం చేశారు. మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.

మొదట్లో 90 వేల మంది క్రియాశీలక సభ్యులను జాయిన్ చేశామని... కోవిడ్ సమయంలోనూ రూ.500 కట్టి పార్టీ సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. రెండో విడతలో ఏకంగా 3 లక్షల 30వేల మంది క్రియాశీల సభ్యులుగా చేరారన్నారు. ఈసారి ఈ కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.

బాధితులకు బీమా క్లైయిమ్ కూడా 60 రోజుల్లో అందేలా పార్టీ లీగల్ విభాగం ప్రయత్నిస్తోందని తెలిపారు. సభ్యత్వ నమోదు కోసం కేవలం పార్టీ కార్యకర్తలే కాదు.. సగటు కూలీలు, పేదలు కూడా ఎదురుచూడటం గొప్ప విషయమని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

గ్రామ గ్రామాన పార్టీ పటిష్టత కోసం బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి

•భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి చిట్యాల మండల ఇంచార్జ్ వేదాంతం గోపీనాథ్

•బూత్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసిన బీజేపీ జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామం లో ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి చిట్యాల మండల ఇంచార్జ్ వేదాంతం గోపీనాథ్ గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి బీజేపీ జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన బిజెపి సమావేశానికి హాజరైనారు. బిజెపి చిట్యాల మండలం ఇంచార్జ్ గోపీనాథ్ గారు మాట్లాడుతూ

గ్రామ గ్రామాన పార్టీ పటిష్టత కోసం బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ప్రతి కార్యకర్త కంకణ బద్ధులై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి ఆ పథకాల పైన అవగాహన కల్పిస్తూ బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ బూత్ కమిటీ సమావేశంలో తెలియజేశారు. అన్ని వర్గాల ప్రజలకు మన యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలను అందేలాగా ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ

వారి యొక్క సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా మన బిజెపి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఉరుమడ్ల భారతీయ జనతా పార్టీ 91వ బూత్ కమిటీ అధ్యక్షులుగా ఉయ్యాల లింగస్వామి, 92వ బూత్ కమిటీ అధ్యక్షులుగా ఈదుల పవన్, 93వ బూత్ కమిటీ అధ్యక్షులుగా బొమ్మకంటి రాము ముదిరాజ్ గార్లను నియమించడం జరిగింది ఈ బూత్ కమిటీలు 22 మందితో సభ్యులతో అన్ని వర్గాల వారిని కలుపుకొని కమిటీలు వేసి పూర్తి చేయడం జరిగింది.

భారతీయ జనతా పార్టీలో కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. ఇట్టి బూత్ కమిటీలు ఉరుమడ్ల గ్రామ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అనునిత్యం ప్రజలతో ఉంటూ వారి సమస్యల పట్ల పరిష్కార దిశగా అడుగులు వేస్తూ కమిటీ సభ్యులు తోడ్పాటు అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పల్లపు ఇస్తారు, పల్లపు బజారు, పాలకూరి వెంకన్న, జన్నపాల జగన్, పాకాల అర్జున్, పల్లపు లింగయ్య, గుంటోజు పవన్, పల్లపు వెంకటేష్, బొడ్డు రాము, కొండ మహేష్, పల్లపు లక్ష్మమ్మ, పల్లపు ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు..

ఎమ్మిగనూరు మార్కెట్‌లో భారీగా పతనమైన టమాట ధర

కిలో రూపాయి పలుకుతున్న టమాట ధర

టమాటాను రోడ్లపై పారబోస్తున్న రైతులు

కర్నూలు

ఎమ్మిగనూరు మార్కెట్ లో టమోటా ధర భారీగా పతనమైంది. గత 10 రోజులుగా ఎమ్మిగనూరు మార్కెట్ లో టమోటాకు ధర లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కిలో రూపాయి పలకడంతో టమోటా రైతులు రవాణా ఖర్చు కూడా రావడం లేదని వాపోతున్నారు. కొందరు తెచ్చిన టమోటా బాక్స్ లను మార్కెట్ లోనే వదిలి వెళ్లిపోతుండగా.. కొందరు రోడ్డుపైనే పారబోస్తున్నారు. ఇప్పటికైనా గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని టమోటా రైతులు కోరుతున్నారు.

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం..

మూడు గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్...

టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు:

1. ప్రకాశం నెల్లూరు చిత్తూరు

2. కడప అనంతపురం కర్నూలు

పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలు:

1. ప్రకాశం- నెల్లూరు -చిత్తూరు

2. కడప- అనంతపురం- కర్నూలు

3. శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం

ఫిబ్రవరి 16న నోటిఫికేషన్

మార్చి 13న పోలింగ్

మార్చి 16న కౌంటింగ్

ISRO: మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధం! రోదసీలోకి దూసుకెళ్లనున్న మూడు ఉపగ్రహాలు..

ఇస్రో(ISRO) మరో ప్రయోగానికి సిద్ధమైంది. సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(SHAR)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రేపు స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ను ప్రయోగించేందుకు ఇస్రో సైంటిస్టులు రెడీ అయ్యారు..

రేపు ఉదయం 9.18 గంటలకు ఎస్ఎస్‌ఎల్‌వీ-డీ2(PSLVD2) రాకెట్‌ మూడు ఉపగ్రహాలను మోసుకొని రోదసీలోకి దూసుకెళ్లనుంది. ఈ సిరీస్‌లో ఇది రెండో ప్రయోగం. గతేడాది ఆగస్టు 7న మొదటిసారిగా పంపిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ1 ప్రయోగం విఫలమవడంతో.. ఈసారి ఆ పొరపాట్లు జరగకుండా సైంటిస్టులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సారి ప్రయోగం 13.2 నిమిషాల్లో పూర్తి కానుంది. ప్రయోగవేదికపై సిద్ధంగా ఉన్న రాకెట్‌కు అన్ని పరీక్షలను పూర్తిచేస్తున్నారు..

నింగిలోకి దూసుకెళ్లనున్న మూడు ఉపగ్రహాలు:

సుమారు 34 టన్నుల బరువున్న 120 మీటర్ల పొడవైన ఈ రాకెట్ రేపు మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. దీనికి సంబంధించి రిహార్స్‌ల్స్‌ను, మధ్యాహ్నం 1 గంటలకు మిషన్‌ సంసిద్ధత సమావేశం నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. ఈఓఎస్-07, జానస్-1, అజాదీశాట్-2 అనే మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడమే ఈ సారి టార్గెట్‌.

ల్యాబ్‌ చైర్మన్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఈ రాకెట్‌ను ఫైనల్‌గా టెస్ట్‌ చేస్తారు. తుది విడత తనిఖీలు తర్వాత ప్రయోగానికి 7 గంటల ముందు కౌంట్‌డౌన్‌ను స్టార్ట్ చేస్తారు. అంటే రేపు వేకువజామున 2.18 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తారు. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన 13 నిమిషాల్లోనే రాకెట్ తొలి ఉపగ్రహం ఈఓఎస్-07ను కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఆ తర్వాత మరో రెండింటిని నిమిషం వ్యవధిలో కక్ష్యలోకి ప్రవేశపెడతారు. వీటన్నింటినీ 450 కిలోమీటర్ల ఎత్తులో 15నిమిషాల ప్రయాణంలో భూమి చుట్టూ సర్క్యూలర్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. ఇక ఎస్ఎస్‌ఎల్‌వీ ప్రయోగంతో ప్రారంభమయ్యే ప్రయోగాల పరంపర ఈ ఏడాది షార్‌లో కొనసాగనుంది.

హైదరాబాద్ లో నేటి నుంచి వివేకా కేసు విచారణ-సీబీఐ కోర్టు ముందుకు ఐదుగురు నిందితులు..

హైదరాబాద్ సీబీఐ కోర్టులో జరిగే వైఎస్ వివేకా కేసు విచారణకు హాజరు కావాలని ఐదుగురు నిందితులకు సీబీఐ కోర్టు ఆదేశాలు పంపింది. ఇందులో ఇప్పటికే జైల్లో రిమాండ్ లో ఉన్న ముగ్గురు నిందితులు సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి ప్రొడక్షన్ వారంట్ జారీ చేసిన సీబీఐ కోర్టు.. బెయిల్ పై ఉన్న మరో ఇద్దరు నిందితులుఎర్ర గంగిరెడ్డి, దస్తగిరికి సమన్లు జారీ చేసింది. దీంతో ఈ ఐదుగురు సీబీఐ కోర్టు ముందు హాజరుకాబోతున్నారు. వీరంతా హైదరాబాద్ సీబీఐ కోర్టు ముందు తొలిసారి హాజరవుతున్నారు..

వివేకా కేసు సీబీఐ విచారణ మారిన నేపథ్యంలో సీబీఐ దూకుడు కూడా పెంచింది. ఇంతకాలం ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని హైదరాబాద్ పిలిపించి ప్రశ్నించిన సీబీఐ..

ఆ తర్వాత పులివెందులకు సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ భారతి సహాయకుడు నవీన్ ను పిలిపించి విచారించింది. ఇవాళ సీబీఐ కోర్టు విచారణ ఆధారంగా మరిన్ని చర్యలకు సీబీఐ సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అసలే ఈ కేసుతో తమను రాజకీయంగా టార్గెట్ చేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ వైసీపీ నేత సజ్జల వంటి వారు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సీబీఐ కోర్టు విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.

మహిళలు మసీదుకి వచ్చి ప్రార్థనలు చేయడానికి అనుమతిస్తారు

మహిళలు మసీదులో నమాజ్ చేయవచ్చని ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టులో పేర్కొంది

మహిళలు మసీదుకు వచ్చి ప్రార్థనలు చేయకూడదా? ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) ప్రకారం, మసీదులో ప్రార్థనలు చేయడానికి మహిళలకు అనుమతి ఉంది. వాస్తవానికి మసీదులోకి ప్రవేశించి ప్రార్థనలు చేసేందుకు మహిళలకు అనుమతి ఉందని ఏఐఎంపీఎల్‌బీ బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ముస్లిం మహిళలు ప్రార్థనలు చేసేందుకు మసీదులోకి ప్రవేశించడానికి స్వేచ్ఛ ఉందని, మసీదులో ప్రార్థనలు చేసే హక్కును వినియోగించుకోవాలా వద్దా అనేది వారి ఇష్టం అని బోర్డు పేర్కొంది. దీనితో పాటు, ఇస్లాంలో మహిళలు రోజుకు ఐదుసార్లు సామూహికంగా ప్రార్థన చేయవలసిన అవసరం లేదని కూడా చెప్పబడింది.

AIMPLB కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా ఈ సమాచారం ఇచ్చింది. ముస్లిం మహిళలు ప్రార్థనలు చేసేందుకు మసీదుకు వెళ్లేందుకు సంబంధించిన పిటిషన్‌కు సంబంధించి ఈ అఫిడవిట్ దాఖలు చేయబడింది. న్యాయవాది MR శంషాద్ ద్వారా దాఖలు చేయబడిన అఫిడవిట్, ప్రార్థనా స్థలాలు (ప్రస్తుత కేసులో ఉన్న మసీదులు) పూర్తిగా ప్రైవేట్ సంస్థలు మరియు మసీదుల 'ముత్తవలీలు' (నిర్వాహకులు) నియంత్రణలో ఉన్నాయని పేర్కొంది.

AIMPLB అనేది నిపుణుల సంఘం అని, దానికి ఎలాంటి అధికారాలు లేవని, ఇస్లాం సూత్రాలపై సలహాలు మాత్రమే జారీ చేయగలదని అఫిడవిట్ పేర్కొంది. ఇస్లాం అనుచరుల మత గ్రంథాలు, సూత్రాలు, మత విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుంటే మసీదులోకి ప్రవేశించి ప్రార్థనలు చేసేందుకు మహిళలకు అనుమతి ఉందని అఫిడవిట్ పేర్కొంది. ఇస్లాం సూత్రాల ప్రకారం ముస్లిం మహిళలు ఇంట్లో నమాజ్ చేసినా లేదా మసీదులో నమాజ్ చేసినా వారికి సమానమైన సవాబ్ (మెరిట్) లభిస్తుందని పేర్కొంది.

భారతదేశంలోని మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశంపై ఆరోపించిన నిషేధానికి సంబంధించి ఆదేశాలు ఇవ్వాలని మరియు దీనిని చట్టవిరుద్ధం మరియు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఫరా అన్వర్ హుస్సేన్ షేక్ 2020లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని మీకు తెలియజేద్దాం. ఈ పిటిషన్ మార్చిలో విచారణకు వచ్చే అవకాశం ఉంది.

పెను విషాదం..ఏడుగురు కార్మికులు దుర్మరణం..

ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రాగంపేటలోని అంబటి సుబ్బన్న ఫ్యాక్టరీలో ఉన్న ఆయిల్ ట్యాంకర్ ను శుభ్రం చేస్తుండగా అందులోకి జారి పడి ఏడుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు.

మొదట ఒక వ్యక్తి ట్యాంక్ లోకి దిగి శుభ్రం చేయడానికి దిగగా..కాలు జారి లోపల పడ్డాడు.

దానిని గమించిన మిగతా కార్మికులు ఒక్కొక్కరు ట్యాంక్ లోకి దిగారు. దీనితో ట్యాంకర్ లో ఊపిరాడకపోవడంతో వీరంతా మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇక మృతి చెందిన వారిలో ఐదుగురు పాడేరు వాసులు కాగా ఇద్దరు పెద్దాపురం మండలం పులివేరు వాసులుగా తెలుస్తుంది.