ఘనంగా గుర్రంపోడు జడ్పీహెచ్ఎస్ 2007-08 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. గుర్రంపోడు
ఘనంగా గుర్రంపోడు జడ్పీహెచ్ఎస్ 2007-08 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. గుర్రంపోడు:ఏప్రిల్ :
గుర్రంపోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2007-08 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పించిన అలనాటి గురువులను శాలువా, మెమెంటోలతో ఘనంగా సన్మానించారు.అనంతరం పూర్వ విద్యార్థులు వారి బాల్య స్మృతులను నెమరు వేసుకొని ఒకరి గురించి ఒకరు పరస్పరం వివరాలు తెలుసుకొని ఆనందోత్సాహాలతో ఉల్లాసంగా గడిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు లింగారెడ్డి,రాములు,జయప్రకాశ్ రెడ్డి,కౌసల్య,కవిత,విజయ, ఝాన్సీ,పూర్వ విద్యార్థులు గంగిరెడ్డి కరుణాకర్ రెడ్డి,వడ్డెగోని సైదులు గౌడ్,అమరేందర్,రవీంద్రా చారి,సురేష్,శివశంకర్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.




శాతం రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు నల్గొండ జిల్లా మంత్రివర్యులు బిసి మంత్రులు అందరికీ బీసీ రాజ్యాధికార సమితి కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఆమోదముద్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన విధంగా కేంద్రంలో కూడా మిత్రపక్షాల తోటి ప్రతిపక్షాలతోటి అందరిని ఏకతాటిపై తీసుకొచ్చి కేంద్రంలో కూడా బి సి రిజర్వేషన్ తీర్మానం చేయాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు కర్నాటి యాదగిరి గారు గౌరవ అధ్యక్షులు పున్న పవను గారు జిల్లా కార్యదర్శి మండల్ లింగయ్య యాదవ్ కార్యదర్శి దీకొండ నవీన్ జిల్లా ఉపాధ్యక్షులు గడగోజు విజయ చారి టౌన్ ప్రెసిడెంట్ చెన్నోజు రాజు బోగోజు వెంకటాచారి గడ్డం దశరథ జెల్లా దైవాదినం ఖమ్మం పాటి మురళి రావిరాల వెంకట్ పూల నాగేష్ పగిళ్ల ఆంజనేయులు జాల వెంకటయ్య అఖిలు నాగేంద్ర చారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

నెలలో ప్రకటించే అఖిల భారత యాదవ మహాసభ నల్లగొండ జిల్లా కమిటీలో గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన తగుల్ల యాదయ్యకు చోటు కల్పిస్తామని సోమవారం క్రాంతి ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటుచేసిన అఖిలభారత యాదవ మహాసభలో జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండలు హామీ ఇచ్చారు, ఈ సందర్భంగా తగుల్ల యాదయ్య యాదవ్ మాట్లాడుతూ.తనపై నమ్మకం ఉంచి తనకు ఈ పదవిని కేటాయించిన జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్ కు,జిల్లా కార్యవర్గానికి,మండల యాదవ సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మండలంలోని యాదవ కులస్తుల సమస్యలను పరిష్కరించడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని తెలియజేశారు.
వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని యువజన కాంగ్రెస్ గుర్రంపోడు మండల అధ్యక్షులు కొత్త నాగరాజు అన్నారు.ఆదివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే,ప్రతిపక్షంగా బిఆరెస్ పార్టీ నాయకులు సలహాలు, సూచనలు ఇవ్వాల్సింది పోయి సీఎం రేవంత్ రెడ్డి పై వ్యక్తిగత దూషణలకు పాల్పడడం దురదృష్టకరమని అన్నారు.మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అహంకారంతో దళితుడైన స్పీకర్ ని అవమానిస్తూ మాట్లాడి, ఇప్పటివరకు క్షమాపణలు చెప్పకపోవడం దారుణమన్నారు. తప్పు చేసిన జగదీష్ రెడ్డిని అసెంబ్లీ సమావేశాలకు సస్పెండ్ చేస్తే కార్యకర్తలతో ధర్నాలు చేయించడం దేనికి సంకేతం అని ఆయన ప్రశ్నించారు.
Jul 20 2025, 09:32
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.1k