హాస్పిటల్స్‌ లో క్లినికల్, నాన్ క్లినికల్ స్టాఫ్ ప్యాటర్న్ ఉండాలి: ఆరోగ్యశాఖ మంత్రి
HYD: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) హాస్పిటళ్ల పనితీరు, టీవీవీపీ ని సెకండరీ హెల్త్ కేర్‌ డైరెక్టరేట్‌ గా బలోపేతం చేయడానికి అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి) రూపొందించిన ప్రతిపాదనలపై వైద్య,  ఆరోగ్యశాఖ మంత్రి దామోదర  రాజనర్సింహ రివ్యూ సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్‌ లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో హెల్త్ క్రిస్టినా జడ్ చొంగ్తూ, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, అధికారులు శ్రీనివాస్, పద్మజ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కి) కన్సల్టంట్స్‌ సుబోధ్‌, వీరభద్రయ్య, శ్రీదేవి, అభిషేక్‌ తదితరులు పాల్గొన్నారు.

వీవీపీని సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్‌గా మార్చడం కోసం రూపొందించిన ప్రతిపాదనలపై ఆస్కి కన్సల్టంట్స్‌ మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీవీవీపీ పరిధిలో ఉన్న జిల్లా, ఏరియా హాస్పిటళ్లలోనే ఎక్కువ మంది రోగులు చికిత్స పొందుతున్నారని, ఈ నేపథ్యంలో ఆయా హాస్పిటళ్లలో అన్ని రకాల వసతులు అందుబాటులో ఉండాలన్నారు. ప్రస్తుత అవసరాలకు మాత్రమే కాకుండా, భవిష్యత్ అవసరాలు, ఓపీ, ఐపీ, బెడ్‌ స్ట్రెంత్‌ ను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదనల్లో మార్పులు చేయాలని సూచించారు.

ఇండియన్ పబ్లిక్ హెల్త్‌ స్టాండర్డ్స్‌ (ఐపీహెచ్‌ఎస్‌) ప్రకారం హాస్పిటల్స్‌లో క్లినికల్, నాన్ క్లినికల్ స్టాఫ్ ప్యాటర్న్ ఉండాలన్నారు. ఈ మేరకు అవసరమైన అదనపు పోస్టులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డాక్టర్లు, ఇతర ఉద్యోగుల ప్రమోషన్లు, ఇతర సర్వీసు మ్యాటర్స్‌లో ఇబ్బందులు, లీగల్ చిక్కులు తలెత్తకుండా ప్రతిపాదనలు ఉండాలన్నారు.


దానా' తుపాను ఎఫెక్ట్‌.. 41 రైళ్లు రద్దు
సికింద్రాబాద్‌: 'దానా' తుపాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది.మొత్తం 41 రైళ్ల ను రద్దు చేసింది. ఈ నెల 23, 24, 25, 27 తేదీల్లో సర్వీసులందించే పలు రైళ్ల ను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

రద్దు చేసిన రైళ్ల వివరాలు 'ఎక్స్‌'లో పోస్ట్‌ చేశారు. రద్దయిన రైళ్లలో ఎక్కువగా భువనేశ్వర్‌, ఖరగ్‌పుర్‌, పూరీ తదితర చోట్ల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లే అధికంగా ఉన్నాయి.

దానా తుపాను ప్రభావంతో అక్టోబర్‌ 23 నుంచి ఒడిశాలోని తీర ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వర్షాలు కురుస్తాయని గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం అధికారులు ఇటీవల వెల్లడించారు. సముద్రంలో కెరటాల ఉద్ధృతి తీవ్రంగా ఉంటుందని, అందువల్ల మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
NLG: కంఠమహేశ్వర స్వామి దేవాలయం చుట్టూ సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన వెన్ రెడ్డి రాజు
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని వలిగొండ రోడ్డు 14వ వార్డులో శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం చుట్టూ నిర్మించే సిసి రోడ్డు నిర్మాణం పనులను మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు మంగళవారం ప్రారంభించారు.

అదేవిధంగా రోడ్డు నంబర్ 3,గణేష్ నగర్ కాలనిలో డ్రైనేజీ నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, స్థానిక కౌన్సిలర్ సంధగల్ల విజయ్ సతీష్, బాబా షరీఫ్, కొయ్యడ సైదులు, కంఠమయ గుడి ఉపాధ్యక్షులు చెవ్వగోని వెంకటేష్, నాయకులు ఊడుగు శ్రీనివాస్, మునుకుంట్ల సత్యనారాయణ, రమేష్,వర్కాల రవి, ఉడుగు మల్లేష్, ఉష్కాగుల నాగరాజు, తొర్పునూరి బాబు, ఊడుగు ఇస్తారి, బొంగు రమేష్, తదితరులు పాల్గొన్నారు.
NLG: రీజినల్ రింగ్ రోడ్డు బాధితులకు హామీ ఇచ్చిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
రీజనల్ రింగ్ రోడ్డు వల్ల తమ భూములు కోల్పోతున్న చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు మరియు భువనగిరి నియోజకవర్గం లోని రాయగిరి ప్రజలు, గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు, ఇవాళ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిని హైదరాబాదులోని తన నివాసంలో కలిసి రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో తమ భూములు కోల్పోతున్నామని.. ప్రభుత్వంతో మాట్లాడి అలైన్మెంట్ మార్పించాలని లేదా బహిరంగ మార్కెట్ విలువ ద్వారా పరిహారమైనా చెల్లించాలని కోరారు.

ఈ సమస్య తన దృష్టిలో ఉందని త్వరితగతిన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యను చర్చిస్తానని రీజినల్ రింగ్ రోడ్డు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి  బాధితులకు హామీ ఇచ్చారు.
NLG: న్యాయం కోరుతూ ఆమరణ నిరాహారదీక్ష.. అసలు ఏం జరిగిందంటే!

నల్లగొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్ రోడ్డు సమీపంలో రావిరాల శ్రీనివాస్, రావిరాల సత్యం అన్నదమ్ములు ఇద్దరు కలిసి నిర్మించుకున్న ఇల్లు ఆర్థిక ఇబ్బందుల కారణంగా విక్రయించారు. కొనుగోలుదారు కొంత మొత్తం డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు విక్రయించిన అన్నదమ్ముల కుటుంబీకులు తెలిపారు.

సంవత్సరం గడిచినా మిగిలిన డబ్బులు చెల్లించకుండా కొనుగోలుదారు తమను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. తమకు న్యాయం చేయాలంటూ కోరుకుంటున్నారు.

ఈ దీక్షా కార్యక్రమంలో జై సూర్య, ఊమేష్, హేమ, కోనం రవి తదితరులు పాల్గొన్నారు.

NLG: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బాలు నాయక్

నల్లగొండ జిల్లా:

చింతపల్లి వ్యవసాయ మార్కెట్లో స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్, సోమవారం పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు, సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, వైస్ చైర్మన్ నక్క శ్రీను యాదవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

NLG: డిసెంబర్ 20, 21 తేదీలలో నల్లగొండలో జాతీయ సదస్సు
నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో అర్థ శాస్త్ర విభాగంలో డిసెంబర్ 20, 21 తేదీలలో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉపేందర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం  తమ కార్యాలయంలో అధ్యాపకులతో కలిసి సదస్సు బ్రోచర్ ను విడుదల చేశారు.

ఈ మేరకు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ‘స్థిరమైన అభివృద్ధి – అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై జరిగే ఈ జాతీయ సదస్సులో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి, వివిధ విశ్వవిద్యాలయాల నుండి అకాడమిషియన్లు, ఆర్థికవేత్తలు, ప్రొఫెసర్లు, వివిధ కళాశాలల అధ్యాపకులు పరిశోధక విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగు ఈ సదస్సులో జిల్లాలోని అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని  పిలుపునిచ్చారు.

ఆసక్తి గల అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు తగిన రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకొని సదస్సులో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.

కార్యక్రమంలో అకాడమిక్ కో ఆర్డినేటర్ డా. పరంగి రవికుమార్,  వైస్ ప్రిన్సిపాల్ డా. పిల్లి సురేష్ బాబు, సదస్సు కన్వీనర్ డా. డి. మునిస్వామి, నిర్వాహక సంచాలకులు ఎ. మల్లేశం, పరీక్షల నియంత్రణాధికారి బి. నాగరాజు, ఎన్ సి సి ఆఫీసర్ సిహెచ్ సుధాకర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డా. అనిల్ బొజ్జ, ఎన్. కోటయ్య, తెలుగు విభాగం అధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్, చరిత్ర విభాగం అధ్యక్షులు డా. భట్టు కిరీటం, తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.
NLG: 5కె రన్ లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం పొందిన ఎన్.జి కళాశాల విద్యార్థి
నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల బి. ఏ. తృతీయ సంవత్సరం చదువుతున్న వి. ధనుష్ తెలంగాణా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కె రన్ లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉపేందర్ తెలిపారు.

రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన ధనుష్ ను తెలంగాణా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ 35 వేల చెక్కు, మెమెంటో తో సత్కరించినట్లు తెలిపారు.

త్వరలో గోవాలో జరుగు జాతీయ స్థాయిలో 10 కే రన్ పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు ధనుష్ ను ఇవాళ కళాశాలలో ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో అకాడమిక్ కో ఆర్డినేటర్ డా. పరంగి రవికుమార్,  వైస్ ప్రిన్సిపాల్ డా. పిల్లి సురేష్ బాబు, వ్యాయామ అధ్యాపకులు మల్లేశం, పరీక్షల నియంత్రణాధికారి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డా. అనిల్ బొజ్జ, కోటయ్య, తెలుగు విభాగం అధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్, చరిత్ర విభాగం అధ్యక్షులు డా. భట్టు కిరీటం, అర్థశాస్త్ర విభాగం అధ్యక్షులు డా. మునిస్వామి ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.
NLG: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మండల కమిటీలు ఏర్పాటు
నల్లగొండ జిల్లా:
మునుగోడు: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో, రాష్ట్ర కమిటీ సూచనల మేరకు, ఈ రోజు ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఏడు మండలాలకు మండల కన్వీనర్ ను ఏర్పాటు చేశారు. మునుగోడు నియోజకవర్గ కన్వీనర్ గా అద్దంకి కిరణ్, కో కన్వీనర్ గా నాగిల్ల మారయ్య, మరియు మండల కన్వీనర్లను నియమించి జిల్లా కన్వీనర్ లకుమాల మధుబాబు నియామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బేరి గురుపాదం, ఎనమల అనిల్, జిల్లా వైస్ చైర్మన్ చింతపల్లి బాలకృష్ణ, అద్దంకి రవీందర్, సంద యాదగిరి, అంగ రాజు స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు.

మిషన్ భగీరథ కార్మికుల వేతనాలు పెంచాలి: పల్లా దేవేందర్ రెడ్డి
నల్లగొండ: పెరుగుతున్న దరలకు అనుగుణంగా మిషన్ భగీరథ కార్మికుల వేతనాలు పెంచాలని మిషన్ భగీరథ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి కోరారు. శనివారం AITUC ఆధ్వర్యంలో మిషన్ భగీరథ నల్గొండ SE వెంకటేశ్వర్లు కు మెమోరాండం ఇచ్చినారు.

ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి కానీ కార్మికుల వేతనాలు మాత్రం పెరగడం లేదని అన్నారు. జీవోలు, హామీలు కాగితాలకే పరిమితం అయిపోయాయి తప్ప.. కార్మికుల కడుపు నింపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం ఆగస్టులో కార్మికుల వేతనాలు పెరుగుతాయని కాని అక్టోబర్ వచ్చినా, నేటికీ నల్లగొండలో కాంట్రాక్టర్లు వేతనాలు పెంచకపోవడం విచారకరమని అన్నారు.

తక్షణమే ఏజెన్సీలతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి చర్చించాలని దేవేందర్ రెడ్డి ఎస్ఈ ని కోరారు. గత ఐదు నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించకపోతే వాళ్ళ కుటుంబాలు ఎలా బ్రతకాలని  ప్రశ్నించారు. కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని లేనియెడల కార్మికులు ఆందోళన చేపట్ట వలసి వస్తుందని తెలిపారు.

ఏజెన్సీ లతో త్వరలో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేపిస్తానని ఎస్ ఈ తెలపడం జరిగిందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి జానీ,ఆగు సైదులు, పెరపాక రాజ్ కుమార్, పులిపాటి విజయ్ కుమార్, నూకల సుందర్ రెడ్డి, అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు