నాంపల్లి: సన్నరకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సింగిల్ విండో చైర్మన్
నల్లగొండ జిల్లా:
నాంపల్లి మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సన్న రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం సింగిల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని మార్కెట్ యార్డ్ కు తెచ్చేటప్పుడు తేమ శాతం 17% ఉండేటట్టు చూసుకోవాలని,తాలు లేకుండా కల్లాల వద్దనే వరి ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకురావాలని రైతులను కోరారు.
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఉంటుందని తెలిపారు. రైతులందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు.అదేవిధంగా దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్, అగ్రికల్చర్ ఏఓ, మానేటింగ్ ఆఫీసర్ మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డీ, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, పెద్దిరెడ్డి సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ చంద్రారెడ్డి, పానగంటి వెంకటయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంజాచారి, పూల గిరి, పిఎసిఎస్ సిబ్బంది, రైతులు శేఖరు, నరసింహ, కిషన్, రాములు, శ్రీను, యాదమ్మ, రాజు, శివ, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లా:

డీఎస్సీ-2024 ఎంపికైన అభ్యర్థులకు మంగళవారం నల్లగొండ డైట్ కళాశాలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి తెలిపారు. డీఎస్సీ లో ఎంపికైన అభ్యర్థులు లేటెస్ట్ రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒరిజినల్ సర్టిఫికెట్ లతో హాజరుకావాలని సూచించారు.
నల్లగొండ జిల్లా:
HYD: త్వరలోనే దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో దివ్యాంగుల జాబ్ పోర్టల్ ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు.
నల్లగొండ:
నల్గొండ పట్టణంలోని మణికంఠ నగర్ అయ్యప్ప దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సందర్బంగా 9 రోజులు దుర్గా మాతకు నిర్వాహకుల ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈరోజు నాగుల శీను జ్యోతి దంపతులు దాతల సహకారంతో భవాని మతాలకు అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. అదేవిధంగా లెప్రసీ కాలనీలో ఉన్న నిరుపేద ప్రజలకు అన్నదానం నిర్వహించారు.
నల్లగొండ జిల్లా:
Oct 15 2024, 19:33
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.3k