తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 25 2024, 11:34

బంగాళాఖాతంలో అల్పపీడనం..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

తెలంగాణ లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 27 వరకు ఆదిలాబాద్‌, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, కామారెడ్డి,నిర్మల్‌ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్‌ ను జారీ చేసింది.

తెలంగాణ లోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్‌, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, కామారెడ్డి,నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడా గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

ఈనెల 26, 27 తేదీల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 27 వరకు వాతావరణశాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ను జారీ చేసింది. కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు ప్రకటించింది. కాగా, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు పడ్డాయి. వరంగల్‌ జిల్లా ఖిల్లా వరంగల్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 9.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 

అలాగే, ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో 8.53, నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలో 8.35, నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరులో 7.8, రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్‌మెట్‌ మండలం తాటివనంలో 7.78, రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో 8.95, మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేటలో 7.2 నిర్మల్‌ జిల్లా భైంసాలో 7.4 సెం.మీ. వర్షపాతం రికార్డయ్యింది.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. వరద నీరు ముంచెత్తడంతో మేడ్చల్‌ జిల్లా మేడ్చల్‌ పట్టణంలోని జాతీయ రహదారిపై, ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డులో మంఖాల్‌, హర్షగూడ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 25 2024, 11:30

బీఆర్ఎస్ దూకుడు.. ఇవాళ ఉదయం 9 గంటలకు..

బీఆర్ఎస్ దూకుడు పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు ఇటీవల జోరు పెంచిన బీఆర్ఎస్ పార్టీ ఇవాళ (బుధవారం) మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ సిటీలో పర్యటించనున్నారు.

బీఆర్ఎస్ దూకుడు పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు ఇటీవల జోరు పెంచిన బీఆర్ఎస్ పార్టీ ఇవాళ (బుధవారం) మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ సిటీలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ నుంచి ఎమ్మెల్యేలతో కలసి ఫతేనగర్‌కు కేటీఆర్ వెళ్లనున్నారు. బీఆర్ఎస్ బృందంతో కలిసి ఫతేనగర్ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన ఎస్‌టీపీ ప్లాంట్‌ను ఆయన పరిశీలించనున్నారు. ఇక ఉదయం 11 గంటలకు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు ఆఫీస్‌లో జరగనున్న ప్రెస్ మీట్‌లో పాల్గొని మాట్లాడనున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ‘‘ఎత్తు కుర్చీల్లో కూర్చోవడం కాదు-కన్నేత్తి రైతుల గోస చూడు ముఖ్యమంత్రి’’ అని మండిపడ్డారు. ‘‘మాఫీ కాని రుణమాఫీ- పత్తా లేని పాల బిల్లులు. వేస్తావన్న భరోసా లేని రైతు భరోసా - బోనస్ పేరుతో బోగస్ మాటలు. ఒకటా రెండా అన్నింట్లో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.

రైతు రోడ్డెక్కితే జంకిన మీరు రూ.150 కోట్ల పాల బిల్లుల బకాయిలకు రూ.50 కోట్లు విడుదల ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు. మీ పుణ్యమా అని ఈ దసరా రైతులకు మునపటి దసరాలా ఉండేలా లేదు. బోగస్ హామీలతో రైతుల గొంతు నొక్కి గద్దెనెక్కి ఎత్తు కుర్చీల్లో రాచరిక దర్పాన్ని ప్రదర్శిస్తున్న మీరు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు’’ అని కేటీఆర్ విమర్శించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 25 2024, 11:25

రైలు విస్తరణ- ఈ రూట్‌లోమెట్రో

హైదరాబాద్‌లో మెట్రో రైలు మార్గాల విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దృష్టి సారించింది. జంటనగరాలు శరవేగంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి అనుగుణంగా మెట్రో రైలు సర్వీసులను కూడా ఆయా ప్రాంతాలకు చేరువ చేయడానికి చర్యలు చేపట్టింది.

కొత్తగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకుని రావాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీనిపై పూర్తిస్థాయి నివేదిక (డీపీఆర్‌)ను సిద్ధం చేయాలంటూ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులను ఆదేశించారు. దసరా నాటికి డీపీఆర్ సిద్ధం చేయాలని, దీన్ని కేంద్ర ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుందని అన్నారు.

హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, హైడ్రా కార్యకలాపాలపై మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆమ్రపాలి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలను జారీ చేశారు.

హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో విస్తరణ పనులను వేగవంతం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. మెట్రో రైలు మార్గాల విస్తరణకు సంబంధించిన భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. విస్తరణకు సంబంధించి పనుల్లో జాప్యం ఉండకూడదని అన్నారు. అడ్డంకులు ఉంటే అధికారులు వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

మహాత్మా గాంధీ సెంట్రల్ బస్ స్టేషన్-చాంద్రాయణగుట్ట-ఫలక్‌నుమా మీదుగా ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైల్ అలైన్‌మెంట్‌ రూపొందించాలంటూ గతంలో రేవంత్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్‌పల్లి లేదా, చాంద్రాయణగుట్ట, బార్కాస్‌, పహాడీ షరీఫ్‌, శ్రీశైలం రోడ్ మార్గంలో మెట్రో రైలును నడిపించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలంటూ అప్పట్లో ఆదేశించారు.

ఈ రెండింట్లో ఏ రూట్‌లో ఖర్చు తక్కువ అవుతుందో.. దాన్నే ఖరారు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనివల్ల అటు పాతబస్తీ ప్రజలకూ మెట్రో రైలు అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. దీనికి పొడిగింపుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొత్తగా నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకుని రావాలని ఆయన నిర్ణయించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 25 2024, 09:42

2 రెమ్మలు.. 2 వేలు.. నాణ్యత, బరువులో తేడా రాకుండా సరఫరా

పార్సిల్‌ చూస్తే.. టిఫిన్‌ సెంటర్‌లో దోశ మాదిరిలా ఉంటుంది. విప్పితే రెండు గంజాయి రెమ్మలు ఉంటాయి. పోలీసుల తనిఖీల నేపథ్యంలో విక్రయదారులు వినూత్న పంథాను అనుసరిస్తున్నారు. కిలోల లెక్కన కాకుండా, 20 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు చిన్న చిన్న పొట్లాలుగా చేసి అమ్ముతున్నారు.

పార్సిల్‌ చూస్తే.. టిఫిన్‌ సెంటర్‌లో దోశ మాదిరిలా ఉంటుంది. విప్పితే రెండు గంజాయి రెమ్మలు ఉంటాయి. పోలీసుల తనిఖీల నేపథ్యంలో విక్రయదారులు వినూత్న పంథాను అనుసరిస్తున్నారు. కిలోల లెక్కన కాకుండా, 20 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు చిన్న చిన్న పొట్లాలుగా చేసి అమ్ముతున్నారు. ఈనెల 22న హెచ్‌న్యూ (హైదరాబాద్‌ నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌) పోలీసులకు చిక్కిన అనంతయ్య ఫ్యామిలీని పోలీసులు విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆటోడ్రైవర్‌ అనంతయ్య, అతని భార్య నీరజ, కొడుకు రవికాంత్‌, ఆదిలాబాద్‌(Adilabad) నుంచి గంజాయి సరుకు సరఫరా చేస్తున్న గంగన్నలను హెచ్‌న్యూ పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆదిలాబాద్‌కు చెందిన గంగన్న మహారాష్ట్ర, చత్తీస్ ‏గఢ్‌(Maharashtra, Chhattisgarh) ప్రాంతాలకు చెందిన రైతుల వద్ద మేలురకం గంజాయిని సేకరించి దాన్ని నగరంలోని ప్రధాన స్మగ్లర్లకు సరఫరా చేస్తున్నాడు. ధూల్‌పేటలో ఉంటున్న రజినీ చెల్లెలు, మరిది గంజాయి విక్రయాల్లో ఆరితేరారు. గంగన్న వారికి గంజాయి సరఫరా చేసేవాడు.

గంజాయి దందా లో సులభంగా డబ్బు సంపాదించొచ్చు అని చెల్లెలు ద్వారా గుర్తించిన రజినీ తాము కూడా అదే దందా చేయాలని నిర్ణయించుకుంది. అందుకు భర్త, ఇద్దరు కొడుకుల సహకారం తీసుకుంది. గంగన్న ఆదిలాబాద్‌ నుంచి సరుకు హైదరాబాద్‌కు తెచ్చిన వెంటనే గుట్టుచప్పుడు కాకుండా అనంతయ్య ఎంజీబీఎ్‌సకు వెళ్తాడు. ఆయన్ను ఒక చుట్టంలా ఇంటికి తీసుకెళ్తాడు. సరుకు లెక్క చూసుకొని గంగన్నకు డబ్బులిచ్చి, మర్యాద చేసి పంపిస్తారు. ఆ తర్వాత రజినీ గంజాయి రెమ్మలను జాగ్రత్తగా తీసుకొని రెండు మూడు రెమ్మలను కలిపి దోశ ప్యాకింగ్‌లా చేస్తుంది. గంజాయి రెమ్మ విరగకుండా, నలగకుండా జాగ్రత్త తీసుకుంటుంది

ఆ ప్యాకింగ్‌లను భర్త, ఇద్దరు కుమారులకు అందజేస్తుంది. పెద్ద కొడుకు క్యాబ్‌డ్రైవర్‌ కావడంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులతో(Software employees) మంచి పరిచయాలు ఉన్నాయి. తమ వద్ద మేలు రకం గంజాయి ఉందని చెప్పి గుట్టుగా విక్రయిస్తున్నారు. అలా తండ్రి, ఇద్దరు కొడుకులు నగరంలోని పలు ప్రాంతాల్లో కస్టమర్స్‌కు ఒక్కో పార్శిల్‌లో రెండు లేదా మూడు రెమ్మలు పెట్టి రెండు వేలకు విక్రయిస్తున్నారు. నాణ్యత, బరువులో తేడా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ డిమాండ్‌ను బట్టి రూ. 3వేల వరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేజీ మేలు రకం గంజాయిని రూ.10వేల చొప్పున కొనుగోలు చేస్తున్న నిందితులు.. దాన్ని విక్రయించడం ద్వారా రూ.40వేలు సంపాదిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. రెండేళ్లుగా ఫ్యా మిలీ మొత్తం ఇదే దందా కొనసాగిస్తుండడం గమనార్హం.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 24 2024, 17:53

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణకు హాజరు కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది.

ఓటుకు నోటు ఈడీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణకు హాజరు కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ రోజు జరిగిన విచారణకు మత్తయ్య ఒక్కరే హాజరయ్యారు. రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ హాజరు కాలేదు. ఈడీ కేసు విచారణలో నిందితులు హాజరు కాకపోవడంపై నాంపల్లి ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ రోజు విచారణకు మినహాయింపు ఇచ్చేందుకు అంగీకరించింది. తదుపరి విచారణకు తప్పకుండా హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. వచ్చేనెల 16వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ఆ రోజు సీఎం రేవంత్ సహా నిందితులు అందరూ కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీపెన్ సన్‌కు రేవంత్ రెడ్డి డబ్బులు ఎర చూశారని ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. ఏసీబీ కేసు నమోదు చేయడంతో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లారు. తర్వాత బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసే సమయంలో ఆయన వద్ద ఉన్న బ్యాగులో రూ.50 లక్షల నగదు ఉంది. ఆ నగదు అక్రమంగా చలామణి జరిగిందని ఏసీబీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి రిఫర్ చేసింది. ఓటుకు నోటు కేసులో ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.

ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారణతోపాటు ఈడీ విచారణ కూడా జరుగుతోంది. ఏసీబీ కేసును ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు అంగీకరించలేదు. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి సీఎం అయినందున కేసు దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోవద్దని రేవంత్ రెడ్డికి స్పష్టం చేసింది. ఓటుకు నోటు కేసులో జెరూసలెం మత్తయ్య ఒక్కరే ఏసీబీ కేసు, ఈడీ కేసులో విచారణకు హాజరవుతున్నారు. మిగతా నిందితులు గైర్హాజరు అవుతున్నారు. విచారణ మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈడీ కేసులో నాంపల్లి కోర్టు తాజా ఆదేశాలతో అక్టోబర్ 16వ తేదీన ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 24 2024, 14:43

డెలివరీ లొకేషన్‌ షేర్‌ చేయమంటూ సందేశం పంపి..

ఇప్పటి వరకు ఫెడెక్స్‌, సీబీఐ, ఈడీ వంటి సంస్థల పేరుతో కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్లు(Cyber criminals) ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌ పేరును కూడా దుర్వినియోగం చేస్తున్నారు. మీ పార్సిల్‌ డెలివరీ చేసేందుకు లొకేషన్‌ షేర్‌ చేయమంటూ సందేశం పంపిన సైబర్‌ నేరగాళ్లు బాధితుడి క్రెడిట్‌ కార్డు నుంచి రూ. 1.55 లక్షలు కాజేశారు. మీకు వచ్చిన పార్సిల్‌ కోసం డెలివరీ లొకేషన్‌ షేర్‌ చేయమని, లేకపోతే పార్సిల్‌ రిటర్న్‌ అవుతుందని నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి ఫోన్‌కు సందేశం వచ్చింది.

ఇప్పటి వరకు ఫెడెక్స్‌, సీబీఐ, ఈడీ వంటి సంస్థల పేరుతో కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్లు(Cyber criminals) ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌ పేరును కూడా దుర్వినియోగం చేస్తున్నారు. మీ పార్సిల్‌ డెలివరీ చేసేందుకు లొకేషన్‌ షేర్‌ చేయమంటూ సందేశం పంపిన సైబర్‌ నేరగాళ్లు బాధితుడి క్రెడిట్‌ కార్డు నుంచి రూ. 1.55 లక్షలు కాజేశారు. మీకు వచ్చిన పార్సిల్‌ కోసం డెలివరీ లొకేషన్‌ షేర్‌ చేయమని, లేకపోతే పార్సిల్‌ రిటర్న్‌ అవుతుందని నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి ఫోన్‌కు సందేశం వచ్చింది. పార్సిల్‌ కోసం ఎదురుచూస్తున్న అతడు లింక్‌ ఓపెన్‌ చేశాడు.

ఇండియన్‌ పోస్టల్‌ పేరుతో ఉన్న వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేశాడు. డెలివరీ కోసం రూ. 25 క్రెడిట్‌ కార్డు నుంచి చెల్లించాడు.

కొద్దిసేపటి తర్వాత మీ ఖాతా నుంచి డబ్బులు బదిలీ అయ్యాయన్న సందేశం రాగానే క్రెడిట్‌ కార్డును బ్లాక్‌ చేశాడు. బ్యాంకు అధికారులను సంప్రదించగా.. గుర్తుతెలియని వ్యక్తులు అతడి క్రెడిట్‌ కార్డు నుంచి రూ. 1.55 లక్షలు కాజేసి దుబాయ్‌లో ఉన్న ఖాతాలో జమ చేశారు. సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారని తెలుసుకున్న బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 24 2024, 14:38

రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో కీలక పరిణామం..

తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులపై కేసు నమోదు చేయాలని గుంటూరులో రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన గుంటూరు నగరపాలెం పోలీసులు.. విజయపాల్‌తో పాటు అప్పటి సీఎం జగన్, సీఐడీ డీజీ సునీల్, ప్రభుత్వాసుపత్రి.. సూపరింటెండెంట్‌ డాక్టర్ ప్రభావతిని నిందితులుగా పోలీసులు చేర్చారు. కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయపాల్‌ కోర్టులో పిటిషన్ వేశారు.

అప్పటి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (RaghuramaKrishnam Raju)పై థర్డ్ డిగ్రీ (Third Degree) ప్రయోగించిన కేసు (Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పటి దర్యాప్తు అధికారి విజయ పాల్‌ (Vijay Paul)కు హైకోర్టు (High Court)లో చుక్కెదురైంది. ఆయనకు ముందస్తు బెయిల్ (Anticipatory Bail) ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును.. సీఐడీ కస్టడీలో విజయ్‌పాల్‌ చిత్రహింసలు పెట్టారు.

తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులపై కేసు నమోదు చేయాలని గుంటూరులో రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన గుంటూరు నగరపాలెం పోలీసులు.. విజయపాల్‌తో పాటు అప్పటి సీఎం జగన్, సీఐడీ డీజీ సునీల్, ప్రభుత్వాసుపత్రి.. సూపరింటెండెంట్‌ డాక్టర్ ప్రభావతిని నిందితులుగా పోలీసులు చేర్చారు. కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయపాల్‌ కోర్టులో పిటిషన్ వేశారు. విజయ్‌పాల్ తరఫున సుప్రీంకోర్టు కౌన్సిల్‌ సిద్ధార్థ లూథ్రా, పీపీ లక్ష్మీనారాయణ,.. రఘురామ కృష్ణంరాజు తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. న్యాయస్థానం విజయపాల్‌కు బెయిల్ నిరాకరించడంతో మిగతా అధికారుల్లో వణుకు మొదలైంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. విజయ్‌పాల్‌ తన ఆరోగ్యం బాగోలేదని ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్‌ వేశారని.. ఈరోజు విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించడం శుభపరిణామమని అన్నారు. తనను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టడానికి అనువైన వాతావరణాన్ని విజయ్‌పాల్‌ సృష్టించారని అన్నారు. ఇలాంటి పనికిమాలిన పనులన్నీ విజయ్‌పాల్‌ చేశారని మండిపడ్డారు. త్వరలో రిటైర్డ్‌ ఎస్పీ మహిపాల్‌ అరెస్ట్‌ అవుతారని, అలాగే సునీల్‌కుమార్‌ కూడా అరెస్ట్‌ అవుతారని.. విచారణ వేగవంతమవుతుందనే ఆశాభావంలో ఉన్నానని రఘురామకృష్ణంరాజు ఏబీఎన్‌తో పేర్కొన్నారు.

కాగా నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు కేసులో ఎట్టకేలకు పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఆయనపై హత్యాయత్నం, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన పోలీసు అధికారులు, సిబ్బందిని త్వరలోనే అరెస్టు చేయనున్నారు. అప్పటి సీఎం జగన్మోహన్‌రెడ్డిపై రఘురామరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2021లో ఆయనపై దేశద్రోహం కింద కేసు నమోదుచేసిన సీఐడీ అధికారులు.. ఆ ఏడాది మే 14న జన్మదినం రోజున ఆయన్ను హైదరాబాద్‌ నుంచి బలవంతంగా గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆరోజు రాత్రి కస్టడీలో తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడినట్లు రఘురామరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఏడాది జూలై 11న గుంటూరు నగరంపాలెం పోలీసు సేషన్లో కేసు నమోదైంది.

నాటి సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌ కుమార్‌(ఏ-1), అప్పటి నిఘా విభాగం అధిపతి పీఎస్ఆర్‌ ఆంజనేయులు (ఏ-2), మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి (ఏ-3), సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్‌(ఏ-4), అప్పటి జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతి (ఏ-5)తదితరులపై ఐపీసీ 120బీ, 166, 167, 197, 307, 326, 465, 506(34) తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే రోజులు గడుస్తున్నా కేసులో ఎటువంటి పురోగతీ లేదంటూ రఘురామరాజు పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. నేరుగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్‌కుమార్‌ను కలిసి దర్యాప్తు వేగవంతం చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 24 2024, 14:24

తెలంగాణా ప్రజలకు అదిరిపోయే శుభవార్త!

తెలంగాణా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ 2వ తేదీన తేదీ నుండి తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ హెల్త్ కార్డులను ఇచ్చేందుకు రెడీ అయ్యింది . ఇక ఇదే విషయాన్ని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా, వైద్యం, అభివృద్ధి, సంక్షేమం పై ప్రత్యేక దృష్టి సారించిన్నట్లు మంత్రి తెలిపారు.

ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డులు

వరంగల్ పట్టణంలోని ఎల్బీ నగర్ క్రిస్టల్ గార్డెన్స్ లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిధిగా పాల్గొని 454 మంది లబ్ధిదారులకు రూ. 3,97,96,308 రూపాయల సీఎం ఆర్ ఎఫ్, కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీనుండి డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డులను ప్రతి కుటుంబానికి అందించనున్నట్లు మంత్రి తెలిపారు.

హైదరాబాద్ కు ధీటుగా వరంగల్

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, 104, 108 వాహనాల ద్వారా లక్షల మంది ప్రాణాలను రక్షించడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరమైన వరంగల్ పై ప్రత్యేక దృష్టి సారించి హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు.త్వరలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తామని మంత్రి అన్నారు.

వరంగల్ మాస్టర్ ప్లాన్ పై స్పెషల్ ఫోకస్

వరంగల్ నగరం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపడుతున్నామని, వరంగల్ లో ఎయిర్ పోర్టు నిర్మాణానికి కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. 2050 వరకు జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా వరంగల్ నగర అవసరాలకు సరిపోయేలా మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తున్నామన్నారు.

ఈ అంశాలతో వరంగల్ మాస్టర్ ప్లాన్

ఫార్మా సిటి, ఐటి సర్వీసెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్టేడియం, ఎయిర్ పోర్టు, మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఎకో టూరిజం, లాజిస్టిక్స్ పార్కు, టూరిజం వంటి అంశాలు ప్రధానంగా ఉండేలా మాస్టర్ ప్లాన్ ను తయారు చేస్తున్నామని అన్నారు. కోటి మంది మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు.

బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి

అందులో భాగంగా వరంగల్ నగరంలో కూడా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరుగుతోందని మంత్రి తెలిపారు. ఇది ప్రజా ప్రజా ప్రభుత్వమని, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 24 2024, 14:17

హైకోర్టులో క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య‌కు షాక్!

ముడా' కుంభ‌కోణం కేసులో క‌ర్ణాట‌కు ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌కు ఆ రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది.

ద‌ర్యాప్తు కోసం గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన ఆదేశాల‌కు వ్య‌తిరేకంగా సిద్ధ‌రామ‌య్య దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టివేసింది. మైసూరు ప‌ట్ట‌ణాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) భూ కేటాయింపుల విష‌యంలో ఖ‌రీదైన భూముల‌ను త‌న భార్య పార్వ‌తికి ద‌క్కేలా సిద్ధ‌రామ‌య్య కుట్ర చేశార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌పై విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ ఆదేశాలు జారీ చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 24 2024, 14:15

మెట్ల మార్గాన తిరుమలకు.. డిప్యూటీ సీఎం పవన్ నిర్ణయం

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మెట్ల మార్గాన తిరుమలకు వెళ్లనున్నారు. అక్టోబర్ 1న అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 2న శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. ఇక 3న తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యిని వాడారని నిర్ధారణ అయిన నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఆయన.. దీక్ష విరమణ కోసం తిరుమల కొండకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

మెట్ల మార్గాన ఆయన తిరుమలకు వెళ్లనున్నారు. అక్టోబర్ 1న అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. 2న శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. ఇక 3న తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు.

కాగా తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. అపచారం జరిగిపోవడంతో 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు ఆయన పూనుకున్నారు. గుంటూరు జిల్లాలోని నంబూరులో ఉన్న శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దీక్ష తీసుకున్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రమైన నేపథ్యంలో క్షమించమని వెంకటేశ్వర స్వామిని కోరుతూ ఆయన దీక్ష మాలధారణ తీసుకున్నారు.

ఇవాళ ఇంద్రకీలాద్రికి పవన్..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ (మంగళవారం) ఇంద్రకీలాద్రికిి వెళ్లనున్నారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా కనకదుర్గమ్మ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం చేపట్టనున్నారు.

దీక్ష తీసుకునే సందర్భంలో పవన్ కల్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చర్చికి, మసీదులో జరిగితే జగన్ ఊరుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. మరి హిందూ ధర్మానికి జరిగితే ఎందుకు వెనుకేసుకొస్తున్నారని నిలదీశారు. కేబినెట్, అసెంబ్లీలో దీనిపై చర్చ జరగాలని, సీబీఐ విచారణకు ఇవ్వాలో లేదో సీఎం నిర్ణయం తీసుకోవాలని డిప్యూటీ సీఎం అన్నారు. ప్రజలంతా ఆయన వెనుకే ఉంటారని అభిప్రాయపడ్డారు. నెయ్యి తక్కువ ధరకు ఇస్తారని చెప్పిన మధ్యవర్తి ఎవరో తేలాలని పవన్ అన్నారు.‘‘స్వామి వారి పూజా విధానాలను మార్చేశారు.శ్రీవాణి ట్రస్ట్ పేరుతో టిక్కెట్లు అమ్ముకున్నారు. వైసీపీ పాలనలో 300 ఆలయాలను అపవిత్రం చేశారు. ఏ మతమైనా కావచ్చు. ఏ ప్రార్థనా మందిరం కావచ్చు. మనోభావాలు దెబ్బతినకూడదు. ప్రసాదాలు కల్తీ జరుగుతోంది, నాణ్యత లేదని ముందు నుంచి చెబుతున్నాం. టీటీడీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతున్నాం. ఈ స్థాయిలో కల్తీ జరుగుతోందని అనుకోలేదు. దారుణం ఏంటంటే అయోధ్యకి లక్ష లడ్డూలు పంపించారు. రాజకీయ లబ్ది కోసం చేస్తున్నామని వైసీపీ అంటుంది. రామతీర్థం దేవుడి విగ్రహం ధ్వంసం చేసినప్పుడే రోడ్డు మీదకు వచ్చేవాడిని. ఆరోజు రాజకీయం చేయలేదు’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.