తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 23 2024, 18:41

భారత్‌కు గుడ్ న్యూస్.. ఆ సంపదను తిరిగిచ్చేస్తున్న అమెరికా..

 4 వేల పురాతన వస్తువులను అమెరికా.. భారత్‌కు ఇచ్చేయడానికి సిద్ధమైంది. భారత్ నుంచి అక్రమంగా తరలించిన అత్యంత విలువైన పురాతన వస్తువులను తిరిగిచ్చేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది.

 4 వేల పురాతన వస్తువులను (4 Thousand Antiques) అమెరికా (America).. భారత్‌ (India)కు ఇచ్చేయడానికి సిద్ధమైంది. భారత్ నుంచి అక్రమంగా తరలించిన అత్యంత విలువైన పురాతన వస్తువులను తిరిగిచ్చేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) అమెరికా పర్యటన (America Tour) సందర్భంగా ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో 2వేలు బీసీఈ (BCE) – 19వేల సీఈ (СЕ) - వరకు అంటే 4వేళ ఏళ్ల పరిధిలోని యాంటిక్విటీస్ ఉన్నాయని భారత్ అధికారులు తెలిపారు. ఇండియాకు రానున్న తూర్పు భారతంలోని టెర్రకోట బొమ్మలు, కళాకృతులు; ఇతర ప్రాంతాల్లోని రాతి, లోహ, కలప, ఐవరీ శిల్పాలు.. త్వరలోనే వీటిని భారత్‌కు తరలించనున్నట్లు విదేశాంగ శాఖ అధికారులు ప్రకటించారు.

కాగా ‘‘క్వాడ్‌ కూటమి ఏ దేశానికీ వ్యతిరేకం కాదు. అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం. భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, వాతావరణ మార్పులు, సామర్థ్య నిర్మాణమే మా లక్ష్యం. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడమే క్వాడ్‌ అభిమతం. మేం(క్వాడ్‌ కూటమి) నిలబడతాం.. బలపడతాం’’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ స్వస్థలమైన విల్మింగ్టన్‌లో ఆదివారం జరిగిన క్వాడ్‌ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడారు. నాలుగేళ్లక్రితం ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో స్వేచ్ఛాయుత వాణిజ్యం, భద్రత వంటి అంశాలతో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, భారత్‌ కలిసి క్వాడ్‌ కూటమిగా ఏర్పడ్డ విషయం తెలిసిందే..! ఈ కూటమి ఏర్పడి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన సదస్సులో మోదీ, బైడెన్‌తోపాటు.. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనెస్‌, జపాన్‌ ప్రధాని కిషిదా పాల్గొన్నారు.

క్వాడ్‌కు వ్యతిరేకంగా చైనా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో.. మోదీ ఆ దేశం పేరును ప్రస్తావించకుండా తాము అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తామని, ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తమ సందేశం ఒక్కటేనని, బలంగా నిలబడి, సభ్యదేశాల సహకారానికి కృషిచేస్తామని పేర్కొన్నారు. ‘‘ప్రపంచంలో ఉద్రిక్తతలు, సంఘర్షణలు చోటుచేసుకుంటున్న సమయంలో క్వాడ్‌ కూటమి ఏర్పాటైంది. మానవాళి శ్రేయస్సుకు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కంకణబద్ధమైంది. క్వాడ్‌ సదస్సులో ఫలవంతమైన చర్చలు జరిగాయి.

ప్రపంచానికి మేలు జరిగేలా ఇంకా సమర్థంగా పనిచేయాలని నిర్ణయించాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి సహకరించేందుకు భారత్‌ కట్టుబడి ఉందన్నారు. అంతకు ముందు ఆయన ‘క్వాడ్‌ క్యాన్సర్‌ మూన్‌షాట్‌ ఈవెంట్‌’లో మాట్లాడుతూ.. ఇండో-పసిఫిక్‌ రీజియన్‌ దేశాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ పరీక్షలు, గుర్తింపు, చికిత్సకు భారత్‌ తరఫున రూ.62.61 కోట్ల(7.5 మిలియన్‌ డాలర్లు)ను అందజేస్తామని ప్రకటిస్తూ.. తమ లక్ష్యం ‘ఒక భూగోళం.. ఒక ఆరోగ్యం’ అంటూ నినదించారు. ఈ రీజియన్‌లోని దేశాలకు 4 కోట్ల డోసుల క్యాన్సర్‌ టీకాలను అందజేస్తామన్నారు.

క్వాడ్‌ దేశాధినేతల తదుపరి సదస్సు వచ్చే ఏడాది భారత్‌లో జరగనుంది. నాలుగేళ్ల క్రితం ఈ సంస్థ ఆవిర్భవించగా.. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, భారత్‌లలో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. నిజానికి ఈ సంవత్సరం భారత్‌ వంతు కాగా.. తన పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో తన స్వస్థలంలో సమ్మిట్‌కు అనుమతించాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ విజ్ఞప్తి చేశారు. దాంతో.. వచ్చే ఏడాది సదస్సును భారత్‌లో ఏర్పాటు చేయాలని తీర్మానించారు

విల్మింగ్టన్‌లో శనివారం బైడెన్‌-మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపిన విషయం తెలిసిందే..! ఈ చర్చల్లో భాగంగా మోదీపై బైడెన్‌ పొగడ్తల వర్షం కురిపించినట్లు విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో మోదీ పర్యటన.. శాంతికోసం ఆయన చేస్తున్న కృషిని అభినందించినట్లు వివరించారు. కొవిడ్‌ సమయంలో ‘టీకా మైత్రి’ మొదలు.. ఇటీవలి జీ20 సమ్మిట్‌ వరకు ప్రపంచ క్షేమం కోసం భారత్‌ చేస్తున్న కృషిని కొనియాడినట్లు పేర్కొన్నారు. ఇరువురు నేతల భేటీలో.. సెమీకండక్టర్లు మొదలు.. అంతరిక్షం దాకా పలు అంశాలపై చర్చలు జరిగినట్లు తెలిపారు. భారత్‌-అమెరికా మధ్య కీలకమైన రక్షణ, క్లీన్‌ ఎనర్జీ, గ్లోబల్‌ హెల్త్‌పై ఒప్పందాలు కుదిరినట్లు వెల్లడించారు. ఐక్య రాజ్య సమితి(ఐరాస)లో భారత్‌ శాశ్వత సభ్యత్వానికి కృషిచేస్తానని బైడెన్‌ పేర్కొన్నట్లు వివరించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 23 2024, 18:34

బీహార్‌‌లా తెలంగాణను మారుస్తున్నారు.. హరీష్ ఆగ్రహం

పోలీసు అధికారులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి.. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఏనాడైనా ఎమ్మెల్యేల ఇంటిపైన దాడి జరిగిందా.. ఫిర్యాదు ఇచ్చిన 24 గంటల్లో ఎఫ్ఐఆర్ చేసిన సందర్భాలు ఉన్నాయి

సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి (Former Minister Sunitha Laxma reddy) ఇంటిపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్‌రావు (Former Minister Harish Rao) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా పాలన కాదు గూండా రాజ్యం నడుస్తోందన్నారు. ప్రజల హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయని మండిపడ్డారు. ‘‘మొన్న సిద్దిపేటలో తన కార్యాలయం మీద దాడి కావచ్చు, హైదరాబాదులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి కావచ్చు, నిన్న సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద దాడి కావచ్చు, రాష్ట్రంలో గుండాల రాజ్యాన్ని తలపించే విధంగా పరిపాలన సాగుతోంది’’ అని విమర్శించారు. తెలంగాణకు ఉన్న మంచి పేరును మంటగలిపి ఈరోజు బీహార్ లాగా తెలంగాణను మారుస్తున్నారన్నారు.

సునీత లక్ష్మారెడ్డి మీద జరిగిన దాడి కాంగ్రెస్ నాయకత్వం ప్రోత్సాహంతో జరిగిన దాడి అని ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలను ప్రతిపక్షాల మీద దాడి చేసే విధంగా ప్రోత్సహించినట్లుగా సీఎం రేవంత్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే నివాసంలో లేనప్పుడు ఉద్దేశపూర్వకంగా దాడి చేశారన్నారు. ‘‘ఎమ్మెల్యే ఇంటి ముందు టపాయలు కాల్చడం, ఇంట్లోకి టపాకాలయు విసరడం, ఇంట్లో ఉన్న వారిపై దాడి చేయడం హేయమైన చర్య’’ అని అన్నారు. ఈ విషయంపై ఎస్పీ, ఐజీతో మాట్లాడానని.. వెంటనే కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు దాడి చేశారన్న విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అంతే కాకుండా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్‌పై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారన్నారు. హెడ్ కానిస్టేబుల్ చేతులోని ఫోన్ లాక్కోని నెట్టేస్తే కింద పడిపోయారన్నారు. పోలీసులపై దాడి జరిగినా కేసు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ నేతలు ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. దేశంలో తెలంగాణ పోలీసులు అంటే మంచి పేరు ఉండేదని... కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పోలీసులను చెడగొడుతున్నారన్నారు. ‘‘పోలీసు అధికారులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి.. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఏనాడైనా ఎమ్మెల్యేల ఇంటిపైన దాడి జరిగిందా.. ఫిర్యాదు ఇచ్చిన 24 గంటల్లో ఎఫ్ఐఆర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ గుండాల రాజ్యంలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయరు. వెంటనే గోమారంలో దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలి. దాడిని ప్రోత్సహించిన వారిపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు కూడా వెళ్తాం. దాడి చేసిన వారికి శిక్ష పడేదాకా వదిలిపెట్టం. ఇది ప్రజా పాలన కాదు గూండాల పాలన. మా ఓపికకు కూడా ఒక హద్దు ఉంటది. పోలీసులు ఇలాంటి దాడులను కట్టడి చేయడంలో విఫలమైతే రాయలసీమ లాంటి ఫ్యాక్షన్ పరిస్థితులు తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉంది. హింసాత్మక ఘటనలు జరగకుండా మేం జాగ్రత్తలు తీసుకుంటుంన్నాం. అదే విధంగా ప్రభుత్వం, పోలీసులు కూడా వ్యవహరిస్తే మంచిది. ఇంట్లో చొరబడి దాడి చేసిన వారిని అరెస్టు చేసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉందని నిరూపించుకోవాలి. డీజీపీ ఉన్నతమైన పదవిలో ఉన్నారు. మీరు ఆ పదవికి గౌరవం తెచ్చే విధంగా చట్టానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్లిన వారిని ఉపేక్షించవద్దు అని సూచిస్తున్నాను. రాష్ట్ర డీజీపీ వెంటనే ఈ ఘటనపై స్పందించి దాడి చేసిన వారిని అరెస్ట్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ అరెస్టు చేయనట్టయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి డీజీపీ ఆఫీస్‌ను ముట్టడిస్తాం’’ అని హరీష్‌ రావు స్పష్టం చేశారు.

ఈరోజు మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారంలోని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసానికి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, స్థానిక నాయకులు చేరుకున్నారు. దాడి వివరాలను ఎమ్మెల్యే‌ను అడిగి తెలుసుకున్న హరీష్.. సునీత లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోలీస్ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి దాడికి కారకులైన వారిని అరెస్టు చేయాలని మాజీ మంత్రి కోరారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో హరీష్‌రావు ఫోన్లో మాట్లాడారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 23 2024, 10:57

హైడ్రా ఇంత ఆగం ఎందుకు.. గంట కూడా టైమ్ ఇవ్వలేరా..!

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను రక్షించే లక్ష్యంతో హైడ్రాను ఏర్పాటు చేసింది. కమిషనర్ గా ఐపీఎస్ రంగనాథ్ ను నియమించింది. దీంతో హైడ్రా చెరువుల్లోని బఫర్, ఎఫ్టీఎల్ లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేశాయి. అయితే కొంత మంది బిల్డర్లు.. చెరువులు కబ్జా చేసి అపార్ట్ మెంట్లు కట్టారు. వాటిని మధ్యతరగతి వారికి విక్రయించారు. దీంతో వారు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటన చేశారు.

బఫర్, ఎఫ్టీఎల్ ఉన్న మధ్యతరగతి వారి నిర్మాణాలను ముట్టుకోమని చెప్పారు. చెరువు బఫర్, ఎఫ్టీఎల్ లో ఉన్న వాణిజ్య కట్టడాలు, కొత్తగా నిర్మిస్తూన్న నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు. తాజాగా ఆదివారం కూకట్ పల్లిలోని నల్ల చెరువు బఫర్, ఎఫ్టీఎల్ లో ఉన్న వాణిజ్య కార్యాకాలాపాలు కొనసాగిస్తున్న నిర్మాణాలను హైడ్రా పడగొట్టింది. ఇవన్నీ తాత్కాలిక నిర్మాణాలే. అయితే ఇక్కడే నివాసం ఉంటున్న ఇళ్లను మాత్రం హైడ్రా ముట్టుకోలేదు. కేవలం కమర్షియల్ కాంప్లెక్స్ మాత్రమే హైడ్రా కూల్చివేసింది.

అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ హైడ్రా కాస్త మానవత్వంతో వ్యవహరిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. నల్ల చెరువును కొంత మంది రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు ఆక్రమించారు. భూములు తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చిన్న వ్యాపారాలు చేసుకుని ఉపాధి పొందడం కోసం మధ్య తరగతి ప్రజలు సదరు ఓనర్ల వద్ద భూమిని లీజ్ కు తీసుకున్నారు. అందులో లక్షలు పెట్టి తాత్కాలిక షేడ్లు వేసుకున్నారు. వ్యాపారం చేసుకుంటూ పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇందులో చాలా మంది అప్పులు చేసి, బ్యాంకు లోన్లు తీసుకుని వ్యాపారం ప్రారంభించారు.

ఆదివారం సడెన్ గా హైడ్రా అధికారులు వచ్చి నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో బాధితులు తమకు కాస్త సమయం ఇచ్చి ఉంటే బాగుండేదని.. నిర్మాణాల్లోని వస్తువులను తీసుకునే వారమని బాధితులు చెబుతున్నారు. ఓ మహిళ కన్నీరు పెట్టుకుంటూ.. కనీసం గంట సమయం ఇవ్వాలని అడిగినా.. హైడ్రా అధికారులు సమయం ఇవ్వలేదని చెప్పారు. తమకు శనివారం సాయంత్రమే సమాచారం ఇచ్చారని వాపోయారు. మరోవైపు తము నోటీసులు ఇచ్చామని హైడ్రా పేర్కొంది. ఈ ఘటనలో చెరువు కబ్జా చేసి లీజ్ కు ఇచ్చిన ఓనర్లు లాభం పొందారు. కష్టాన్ని నమ్ముకున్నవారు అన్యాయం అయిపోయారు.వారికి ప్రభుత్వం న్యాయం చేయడంతో పాటు.. బడా బాబులకు భూమి రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 23 2024, 10:51

తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

నైరుతి రుతుపవనాల తిరోగమనంలోనూ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వానలు పడుతున్నాయి. రాష్ట్రంలో నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది.

ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్ జారీచేసింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఏర్పడగా, మయన్మార్ తీరం, దాని పరిసర ప్రాంతాల్లో రెండో ఆవర్తనం కొనసాగుతోందని, వీటి ప్రభావంతో నేడు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి అక్కడి సమీపంలోని అండర్‌పాస్‌లో హైదరాబాద్ నుంచి వెళ్తున్న కారు చిక్కుకుపోయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి చెందారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 23 2024, 10:48

రికార్డు క్రియేట్ చేసిన హైడ్రా..

హైడ్రా రికార్డు క్రియేట్ చేసింది. అమీన్ పూర్‌లో హైడ్రా బిగ్ ఆపరేషన్ చేపట్టింది. 17 గంటలపాటు నాన్ స్టాప్‌గా ఇళ్లులు, భవనాలు, అపార్టుమెట్లు కూల్చివేసింది. అలాగే ఓ హాస్పిటల్, రెండు అపార్ట్ మెంట్లు కూల్చివేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. పటేల్ గుడాలో 16 విల్లాలు కూల్చివేసింది.

హైడ్రా రికార్డు క్రియేట్ (Hydra Record) చేసింది. అమీన్ పూర్‌లో హైడ్రా బిగ్ ఆపరేషన్ (Big Operation) చేపట్టింది. 17 గంటలపాటు నాన్ స్టాప్‌ (Non Stop)గా ఇళ్లులు, భవనాలు, అపార్టుమెట్లు కూల్చివేసింది. అలాగే ఓ హాస్పిటల్, రెండు అపార్ట్ మెంట్లు కూల్చివేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. పటేల్ గుడాలో 16 విల్లాలు కూల్చివేసింది. సోమవారం తెల్లవారుజాము ఒంటిగంట వరకు కూల్చివేతలు కొనసాగాయి. హైడ్రా ఏర్పాటు తర్వాత తొలిసారిగా డే అండ్ నైట్ కూల్చివేతలు జరిగాయి. అక్రమ నిర్మాణాలకు అనుకొని ఉన్న పక్క ఇళ్లకు డ్యామేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. హైడ్రా 17 గంటలపాటు హైరిస్క్ ఆపరేషన్ కొనసాగించి రికార్డు క్రియేట్ చేసింది.

కాగా గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో రెండు వారాలపాటు కూల్చివేతలకు తాత్కాలిక విరామం ప్రకటించిన హైడ్రా.. తిరిగి తన పనిని మొదలుపెట్టింది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలపై మరోసారి కొరడా ఝుళిపించింది. ఏకకాలంలో కూకట్‌పల్లిలో, అమీన్‌పూర్‌ మునిసిపాలిటీలోని కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలో ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలను నేలమట్టం చేసింది. కూకట్‌పల్లి శాంతినగర్‌లోని నల్లచెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో, కిష్టారెడ్డిపేటలోని ఎకరంపైగా, పటేల్‌గూడలోని మూడు ఎకరాలకుపైగా విస్తీర్ణంలోని నిర్మాణాలను కూల్చివేసింది.

రెవెన్యూ, నీటి పారుదల, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కలిసి హైడ్రా బృందం కూల్చివేతలు చేపట్టింది. మూడు ప్రాంతాల్లోని 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణలు, భవనాలు తొలగించినట్టు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. అయితే తమ సామాన్లను కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా నిర్మాణాలు నేలమట్టం చేశారని బాధితులు లబోదిబోమన్నారు. అప్పులు చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తాము హైడ్రా చర్యతో రూ.లక్షల్లో నష్టపోయి రోడ్డున పడ్డాయని ఆవేదన చెందారు.

కూకట్‌పల్లిలో 16 షెడ్లు నేలమట్టం..

ఎప్పటిలానే ఆదివారం ఉదయం 5గంటలకే యంత్రాలతో సహా వివిధ విభాగాల అధికారులు, హైడ్రా బృందాలు ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. కూకట్‌పల్లి శాంతినగర్‌లోని నల్లచెరువు 27 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లోని దాదాపు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో కొందరు వ్యక్తులు షెడ్లు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కేటరింగ్‌ కోసం కిచెన్‌లు ఏర్పాటు చేశారు. ఇతరత్రా వ్యాపారాలూ సాగుతున్నాయి. వాటిలో పనిచేసే కార్మికులు ఉండేందుకు తాత్కాలిక నివాసాలు నిర్మించారు. ఫిర్యాదుల నేపథ్యంలో పలుమార్లు చెరువును పరిశీలించిన హైడ్రా అధికారులు.. నిర్మాణాలు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు.సర్వే నంబర్లు 66, 67, 68, 69లోని 16 వాణిజ్య షెడ్లు, ప్రహరీ గోడలను నేలమట్టం చేశారు. ఇందులో ఐదు కేటరింగ్‌ షెడ్లు, మూడు ఫ్లెక్సీ ప్రింటింగ్‌ నిర్మాణాలు, రెండు టెంట్‌ హౌస్‌లు, ఆరు గోడౌన్లు ఉన్నాయి. ఒక టెంట్‌హౌ్‌సకు చెందిన గోడౌన్‌లో సామాను బయటకు తీయకుండానే నేలమట్టం చేశారు. కూల్చివేతలను ప్రారంభించగానే వ్యాపారులు, అక్కడ నివసించేవారు అడ్డుకునే ప్రయత్నం చేశారు.తమకు అన్యాయం చేయొద్దంటూ అధికారులకు మొర పెట్టుకున్నారు. అయితే అధికారులు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తూనే కూల్చివేతలను కొనసాగించారు. కాగా, భారీ ఎత్తున కేటరింగ్‌ నిర్వహించే ఓ వ్యక్తి అక్కడే స్థిర నివాసం ఏర్పాటుచేసుకొని ఉంటున్నారు. కూల్చివేతల నేపథ్యంలో ఆయనతోపాటు కుటుంబ సభ్యులు రోదిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. హైడ్రా అధికారులు మాత్రం.. నివాసేతర నిర్మాణాలను మాత్రమే కూల్చామని చెప్పారు. చెరువు స్థలాన్ని చెరబట్టిన కొందరు వ్యక్తులు.. అక్కడ షెడ్లు వేసుకొని వ్యాపారం చేస్తున్న పలువురి నుంచి అద్దె వసూలు చేస్తున్నారని తెలిపారు.

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడ గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా ఆదివారం కూల్చివేసింది. కిష్టారెడ్డిపేట గ్రామ పరిధిలో సర్వే నంబర్‌ 164లోని ప్రభుత్వ భూమిలో మూడు బహుళ అంతస్తుల భవనాలను హైడ్రా నేలమట్టం చేసింది. వీటిలో ఒకటి ఐదంతస్తుల భవనం కాగా, మరో రెండు భవనాలు నాలుగు అంతస్తులుగా నిర్మించారు. ఇవన్నీ నివాసేతర నిర్మాణాలు కాగా.. వీటిలో ఓ భవనాన్ని ఆస్పత్రి కోసం నిర్మించారు.అమీన్‌పూర్‌ మునిసిపాలిటీలో ఇటీవలే విలీనమైన కిష్టారెడ్డిపేటలో గ్రామ పంచాయతీ అనుమతులతో ఈ భవనాల నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణాలపై గతంలోనే అనేకసార్లు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ సర్వే నంబర్‌లో నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు అందినా అధికారులు పట్టించుకోలేదు. రెవెన్యూ సిబ్బంది ఇక్కడ పలుమార్లు సర్వేలు నిర్వహించి మూడు భారీ భవనాలు ప్రభుత్వ భూమిలో ఉన్నాయని తేల్చడంతో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. భవన యజమానులు తమవద్ద ఉన్న పత్రాలను, పంచాయతీ ఇచ్చిన అనుమతులను చూపించి కూల్చొద్దంటూ అధికారులను వేడుకున్నారు. పోలీసులు వారికి నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు.వీటి కూల్చివేత ద్వారా దాదాపు ఎకరం స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు. మరోవైపు ఇటీవలే మునిసిపాలిటీలో విలీనమైన పటేల్‌గూడ పంచాయతీ పరిధిలోని బీఎ్‌సఆర్‌ కాలనీ పక్కన ప్రభుత్వ భూమిలో నిర్మించిన 24 వరుస ఇళ్లను కూల్చివేశారు. ప్రభుత్వ సర్వే నంబర్‌ విస్తరించి ఉన్న 12 సర్వే నంబర్‌ భూమి పక్కనే ఉన్న సర్వే నంబర్‌ 6లోని పట్టా భూమిలో బిల్డర్లు ఇళ్లను నిర్మించారు. సర్వేలో ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం తేలడంతో హైడ్రా కూల్చివేతలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో కొన్ని కుటుంబాలు నివాసం ఉంటుండగా వారికి హైడ్రా అధికారులు, పోలీసులు నచ్చజెప్పి ఖాళీ చేయించారు. కూల్చివేతల సమయంలో కొందరు భవనాల యజమానులు, బిల్డర్లు అధికారులతో వాగ్వాదానికి దిగారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 22 2024, 19:06

మాయమాటలు చెప్పి గదిలోకి తీసుకెళ్ళి ఇద్దరు బాలికలపై బాలుడి(17) లైంగిక దాడి

నిందితుడు, బాధితులంతా ఒకే కులం వారు కావడంతో విషయం బయటకు పొక్క కూడదని కుల పెద్దలు తీర్మానం..

ఎవరికైనా ఫిర్యాదు చేస్తే కుల బహిష్కరణ చేస్తాం అని హుకుం..

భద్రాద్రి జిల్లా ఇల్లెందులో ఘటన 

వ్యసనాలకు బానిసైన ఓ బాలుడు(17) 

ఇల్లెందుకు చెందిన ఆరేళ్ల వయసు కలిగిన ముగ్గురు బాలికల పై కన్నేశాడు.. ఇళ్లవద్ద ఆడుకుంటుండగా ఆ బాలికలకు మాయమాటలు చెప్పి ఆ ముగ్గురిని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి ఇద్దరిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

తప్పించుకున్న మరో బాలిక ఈ దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఈ ఘటనపై కుల పెద్దలు అదేరోజు రాత్రి పంచాయితీ నిర్వహించారు. 

నిందితుడు, బాధితులంతా ఒకే కులం వారు కావడంతో విషయం బయటకు పొక్క కూడదని తీర్మానించారు. 

ఎవరికైనా ఫిర్యాదు చేస్తే కుల బహిష్కరణ చేస్తామని బాధిత కుటుంబాలనే హెచ్చరించారు. కానీ, విషయం బయటికి రావడంతో ఐసీడీఎస్ అధికారులు శనివారం విచారణకు రాగా స్థానికులు సహకరించలేదు. 

కులపెద్దల హెచ్చరికలతో మౌనంగా ఉన్న బాధిత కుటుంబాలు ఇల్లెందు పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 22 2024, 14:47

సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉండాలి.. కేటీఆర్ సంచలన కామెంట్స్.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి పదవిని ఊడబీకటానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప ఉద్యోగాలు పోయినట్లే రేవంత్ కూడా తన ఉద్యోగం కోల్పోబోతున్నాడని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

తన బావమరిదికి అక్రమంగా టెండర్లు కట్టబెట్టిన వ్యవహారం రేవంత్ మెడకు చుట్టుకుంటుందని కేటీఆర్ అన్నారు. భార్య సోదరుడు బావమరిది కాకుండా ఏమవుతారు? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి తరచుగా చెప్తున్న ఫోర్త్ సిటీ కాదని.. ముచ్చర్ల ఫోర్ బ్రదర్స్ సిటీ అని ఆరోపించారు. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన తమకు ఎక్కడ అవినీతి జరుగుతుందో తెలియదా? అని అన్నారు. కొడంగల్ లిఫ్ట్ కథ సహా.. సీఎం కుటుంబ సభ్యుల అవినీతిని తేలుస్తామని కేటీఆర్ అన్నారు. బావమరిది వ్యవహారంలో ఇరికిపోయానని సీఎంకు కూడా తెలుసునని అన్నారు. చట్టాలే కాదు.. చుట్టరికాలు కూడా ప్రభుత్వ పెద్దలకు తెలియనట్లుందని కేటీఆర్ విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు సీజే వద్దకు మంత్రి పొంగులేటి తనతో కలిసి రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు.

టెండర్లలో తప్పులేమీ జరగలేదంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. సీజే దగ్గరకు రావడం ఇష్టం లేదంటే.. ఢిల్లీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దగ్గరకైనా రావాలన్నారు. సీఎం ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని టెండర్లు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫిరాయింపులపై సీఎం, మంత్రులు.. న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్, బీజేపీ కలసి సింగరేణిని ప్రైవేటీకరించాలని ప్రయత్నిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణి వ్యవహారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఆధ్వరంలో జరిగి‌న వేలంపాటకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నవ్వుతూ వెళ్ళి మద్దతు తెలిపారని గుర్తు చేశారు. సింగరేణి లాభాల్లో కార్మికుల వాటాను ప్రభుత్వం తగ్గించిందని ఆరోపించారు. లాభాల్లో వాటాను 33శాతం కాకుండా.. 16.9శాతమే పంచుతున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. లక్షా 90వేలు కాదని.. రూ. 3లక్షల 70వేలు బోనస్‌గా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల వాటా తగ్గింపుపై గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్పందించాలన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తన అభిప్రాయం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వాటా పెంచాలని కార్మికులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలసి ఒత్తిడి చేయాలని సూచించారు. సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 22 2024, 12:47

సన్నాలపై మక్కువ..

జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో రైతులు ఎక్కువగా సన్న రకం వరి పంటనే సాగుచేశారు. ఈ సీజన్‌ నుంచి 32 సన్న రకాల వరిసాగు చేసే రైతులకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలో మున్నెన్నడూ లేని విఽధంగా ఈ సీజన్‌లో సన్నాలను సాగు చేశారు.

జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో రైతులు ఎక్కువగా సన్న రకం వరి పంటనే సాగుచేశారు. ఈ సీజన్‌ నుంచి 32 సన్న రకాల వరిసాగు చేసే రైతులకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలో మున్నెన్నడూ లేని విఽధంగా ఈ సీజన్‌లో సన్నాలను సాగు చేశారు. సన్నాలను కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వంపై అదనంగా 178 కోట్ల 92 లక్షల రూపాయల భారం పడనున్నది. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 2,09,562 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా, ఇందులో దొడ్డు రకం వరి 36,676 ఎకరాల్లో సాగు చేయగా, సన్న రకం 1,72,879 ఎకరాల్లో సాగు చేశారు. అంటే 78.79 శాతం సన్న రకం పంటను సాగు చేశారు. గతంలో సన్న రకం వరి ధాన్యం సాగు 35 శాతానికి మించలేదు. ఈసారి రికార్డు స్థాయిలో సన్నాలను రైతులు పండిస్తున్నారు. ఎక్కువగా బీపీటీ, సాంబమశూరి, జైశ్రీరాం, చిట్టి ముత్యాలు తదితర రకాల వరి ధాన్యాన్ని సాగు చేశారు.

జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన వరి సాగు వల్ల 4 లక్షల 49 వేల 554 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం వస్తుందని, ఇందులో దొడ్డు రకం 91 వేల 700 టన్నులు, సన్న రకం 3 లక్షల 97 వేల 615 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. సన్న రకం ధాన్యం దిగుబడిలో 10 శాతం తిండి అవసరాలకు పోనూ 3 లక్షల 57 వేల 853 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం కేంద్రాలకు వస్తే మాత్రం క్వింటాలుకు 500 రూపాయల చొప్పున 178 కోట్ల 92 లక్షల రూపాయల బోనస్‌ భారం ప్రభుత్వంపై పడనున్నది. ఈ ఏడాదికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల ప్రకారం కామన్‌ రకం వరి ధాన్యం క్వింటాలుకు 2300 రూపాయలు కాగా, గ్రేడ్‌ ఏ రకం 2,320 రూపాయలు. అయితే సన్న రకం ధాన్యాన్ని కామన్‌ గ్రేడ్‌ కిందనే తీసుకుంటున్నారు. 

దీంతో చాలా మంది రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకంటే ఎక్కువగా బహిరంగ మార్కెట్‌లోనే విక్రయించుకుంటున్నారు. ఈసారి సన్న రకం సాగు పెరగడంతో బహిరంగ మార్కెట్‌లో డిమాండ్‌ అంతంత మాత్రంగానే ఉండనున్నది. ప్రభుత్వమే క్వింటాలుకు 500 రూపాయల బోనస్‌ ఇవ్వనుండడంతో 2,800 రూపాయలు రానున్నాయి. ఎకరానికి 20 క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే 10 వేల రూపాయలు రానున్నాయి. ఈ లెక్కలను అంచనా వేసే రైతులు జిల్లాలో అధికంగా సన్నరకం ధాన్యాన్ని పండిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు 2800 రూపాయలకు పైగా ధర పలికితినే వారికి విక్రయించేందుకు మొగ్గు చూపుతారు. లేదంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించనున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 1.47 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడులు రానున్నాయని, ఇందులో 80లక్షల టన్నుల ధాన్యం కేంద్రాలకు రానున్నదని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. రైతులకు బోనస్‌ ఇచ్చేందుకు 2,500 కోట్ల రూపాయల బడ్జెట్‌ కేటాయిస్తూ శుక్రవారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

జనవరి నుంచే రేషన్‌ కార్డులపై సన్న బియ్యం..

రేషన్‌ షాపుల ద్వారా సన్న రకం బియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం రైతులతో సన్న రకాలను ప్రోత్సహిస్తున్నది. వానాకాలం సీజన్‌లో రైతులు పండించిన సన్న రకం పంటను క్వింటాలుకు 500 రూపాయల బోనస్‌ ఇచ్చి కొనుగోలు చేయనున్నది. ఆ ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లింగ్‌ చేసి నిల్వ చేయనున్నారు. వచ్చే జనవరి నుంచి రేషన్‌ కార్డులపై ఇచ్చే బియ్యాన్ని సన్నవి ఇవ్వనున్నారు. ఇప్పటివరకు దొడ్డు రకం బియ్యం ఇస్తున్నారు. ఈ బియ్యాన్ని తీసుకుంటున్న వినియోగదారులు వందకు 60 శాతం మంది ఆ బియ్యాన్ని బయట మార్కెట్‌లో విక్రయించుకుంటున్నారని గమనించిన ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తేనే వాటిని తిండి అవసరాలకు వినియోగించుకోనున్నారని, ప్రజలపై బియ్యం భారం పడకూడదని సన్న రకం వరి ధాన్యం సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 22 2024, 12:43

బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు వారం పాటు వర్షాలు

బంగాళాఖాతంలో సోమవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడిందని, థాయ్ లాండ్ కు ఉత్తరం వైపున మరో సర్క్యులేషన్ ఏర్పడిందని తెలిపింది.

ఈ రెండు సర్క్యులేషన్లు అల్పపీడనానికి దారితీస్తాయని అంచనా వేసింది. దీని ఫలితంగా తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఈ నెల 23 (సోమవారం) న ఆంధ్రప్రదేశ్, యానాంలో, 23 నుంచి 25 వరకు తెలంగాణలో, 24, 25న రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపగ్రహ అంచనాల ప్రకారం..

ఆదివారం మధ్యాహ్నం నుంచి తెలుగు రాష్ట్రాలు మేఘావృతం అయి ఉంటాయని చెప్పారు. సాయంత్రం 5 గంటల తర్వాత రెండు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వివరించారు. హైదరాబాద్ లో సాయంత్రం నుంచి రాత్రి వరకు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 22 2024, 12:40

కూకట్‌పల్లిలో హైడ్రా కూల్చివేతలు.. కన్నీరు మున్నీరవుతున్న పేదలు

భాగ్యనగరం హైదరాబాద్‌లో ఇవాళ (ఆదివారం) మరోసారి హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. కూకుట్‌పల్లి, అమీన్‌పూర్‌లలో మొత్తం 3 చోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.

భాగ్యనగరం హైదరాబాద్‌లో ఇవాళ (ఆదివారం) మరోసారి హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. కూకుట్‌పల్లి, అమీన్‌పూర్‌లలో మొత్తం 3 చోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయితే తమకు కనీసం నోటీసులు ఇవ్వకుండా, ఇంట్లోని విలువైన వస్తువులను కూడా బయటకు తీసుకెళ్లనివ్వకుండా కూల్చివేస్తున్నారంటూ పేదలు రోదిస్తున్నారు. కూల్చివేతల వద్ద కన్నీరు మున్నీరవుతున్నారు.

నల్ల చెరువు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిని హైడ్రా అధికారులు కూల్చివేయగా.. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నారంటూ బాధితులు చెబుతున్నారు. కనీసం సామాన్లు కూడా తీసుకొనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.50 లక్షలు పెట్టి ఫుడ్ క్యాటరింగ్ స్టాల్‌ను కట్టుకున్నానంటూ ఓ బాధితుడు విలపించాడు. కూకట్‌పల్లి శాంతి నగర్‌లో బాధితుల రోదనలు మిన్నంటాయి. కాగా ఈ ప్రాంతంలో 20కి పైగా కమర్షియల్ షటర్లు నేలమట్టమయ్యాయి.

పేదల పట్ల హైడ్రా కర్కశంగా వ్యవహరిస్తోందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్దలకు నోటీసులు ఇచ్చి టైం ఇస్తున్న హైడ్రా అధికారులు పేదల పట్ల మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న తమకు కనీసం టైం ఇవ్వకుండా ఆస్తితో పాటు అందులో ఉన్న వస్తువులను సైతం నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మా నిర్మాణాలు కూల్చేముందు మమ్మల్ని చంపేయండి’ అంటూ కొందరు బాధితులు ఏడవడం కనిపించింది. విలువైన సామాన్లు కూడా బయటకి తీసుకోకుండా.. ఏ మాత్రం సమయం ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.