TeluguCentralnews

Sep 05 2024, 15:05

నలుగురిని కాపాడి.. వరదల్లో కొట్టుకుపోయి చనిపోయిన వ్యక్తి

విజయవాడకు చెందిన చంద్రశేఖర్(32) సింగ్ నగర్‌లో డెయిరీఫాంలో పనిచేస్తుండగా వరద పోటెత్తింది.

చంద్రశేఖర్ తనతో పనిచేస్తున్న తన ఇద్దరు సోదరులు, మరో ఇద్దరిని కాపాడి షెడ్డు పైకప్పు మీదకు ఎక్కించి, తాళ్లతో కట్టేసిన ఆవులనూ వదిలేశాడు.

తాను పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా కాలు జారి వరదలో కొట్టుకుపోయడు. చంద్రశేఖర్ భార్య 8 నెలల గర్భవతిగా ఉంది.

TeluguCentralnews

Sep 05 2024, 10:40

TTD: శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇక ఈ కేంద్రాల్లోనూ లభ్యం..!!

Srivari Laddu Prasadam: శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇక ఎంపిక చేసిన కేంద్రాల్లోనూ అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.

తాజాగా టీటీడీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇక నుంచి దర్శనం టికెట్‌ లేకుండా తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చే వారికి గరిష్ఠంగా రెండు లడ్డూలు మాత్రమే ప్రసాదంగా అందించాలని నిర్ణయం తీసుకుంది. అయితే, భక్తుల నుంచి వస్తున్న వినతులతో లడ్డూ పలు కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకొస్తోంది.

తగ్గిన రద్దీ

తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. తిరుమలలో శ్రీవారి ప్రసాదం లడ్డూ పంపిణీలో తాజాగా టీటీడీ మార్పులు చేసింది. ఇక నుంచి దర్శనం టికెట్‌ లేకుండా తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చే వారికి గరిష్ఠంగా రెండు లడ్డూలు మాత్రమే ప్రసాదంగా అందించాలని.. అదీ కూడా ఆధార్​కార్డు చూపించి మాత్రమే రెండు లడ్డూలు కొనుగేలా చేసేలా టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేసారు.

ఇదే సమయంలో లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారని ఈవో శ్యామలా రావు తెలిపారు.

లడ్డూ ప్రసాదం

గతంలో నెయ్యి సరఫరాదారులు నాణ్యత, రుచి, వాసన లేని ఆవు నెయ్యి సరఫరా చేశారన్నారు. టీటీడీలో నెయ్యి నాణ్యత పరిశీలించేందుకు సరైన ల్యాబరెటరీ లేదని, ప్రయివేటు ల్యాబరెటరీ సౌకర్యం ఉన్న పరిశీలించలేదన్నారు.

టీటీడీలో నూతనంగా అత్యాధునిక ల్యాబరెటరీ ఏర్పాటు చేస్తునట్లు ఈవో వెల్లడించారు. ఇదే సమయంలో మరో నిర్ణయం తీసుకున్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు టీటీడీ స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాలలో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్నట్లు చెప్పారు.

TeluguCentralnews

Sep 05 2024, 08:27

వర్షాలతో మరో 16 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 594 రైళ్లు రద్దు.

పలు ప్రాంతాల్లో వర్షం నీరు చేరడంతో 15 రైళ్ల దారి మళ్లింపు.

పలు ప్రాంతాల్లో ట్రాక్‌లు సిద్ధం కావడంతో 8 రైళ్లు పునఃప్రారంభం.

యథావిథిగా మరో 4 రైళ్ల రాకపోకలు.

TeluguCentralnews

Sep 05 2024, 08:05

నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పాడే అవకాశం..

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

పల్నాడు, ఎన్టీఆర్ఎర్, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి..

కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్..

40కి.మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం..

TeluguCentralnews

Sep 05 2024, 08:04

తప్పుడు ప్రచారం చేసిన వారిని అమరావతిలో పూడ్చేస్తాం: చంద్రబాబు

AP: అధికారులను బురదలో దించి పని చేయిస్తుంటే కొంతమంది ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని CM చంద్రబాబు ఫైర్ అయ్యారు.

తప్పుడు ప్రచారం చేస్తున్నవారిని అమరావతిలో పూడ్చేస్తామని విరుచుకుపడ్డారు.

'బాధితులకు రాజకీయ, సినీ ప్రముఖులు సాయం చేస్తున్నారు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు.

ఇలాంటి సమయంలో అమరావతి మునిగిందని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారిని సంఘ బహిష్కరణ చేయాలి' అని CM మండిపడ్డారు.

TeluguCentralnews

Sep 04 2024, 16:53

Pawan Kalyan: వరద బాధితులకు పవన్ కళ్యాణ్ భారీ విరాళం..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు మరియు వరదల కారణంగా సంభవించిన భారీ వినాశనాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయత్ రాజ్ మంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భారీ విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.కోటి, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. పంచాయత్ రాజ్ మంత్రిగా ఉన్నందున,

ఆంధ్రప్రదేశ్, రాష్ట్రంలోని 400 పంచాయతీలకు (రూ. 4 కోట్లు) ఒక్కొక్కరికి రూ. 1 లక్ష విరాళం ఇవ్వాలని నిర్ణయించారు.

మొత్తంగా, అతను రెండు తెలుగు రాష్ట్రాలకు వ్యక్తిగతంగా రూ. 6 కోట్ల మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడు,

అతను ప్రతి పంచాయతీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ప్రభావిత ప్రాంతం వద్ద సహాయక చర్యలను విస్మరిస్తూ, తన ఆదర్శాలకు కట్టుబడి ఉన్నాడు.

TeluguCentralnews

Sep 04 2024, 10:26

ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండోె ప్రమాద హెచ్చరిక ఎత్తివేత.

ప్రస్తుతం బ్యారేజ్ వద్ద 5 లక్షల క్యూసెక్కుల వరద.

30 గంటల్లో 6.5 లక్షల క్యూసెక్కులు తగ్గిన వరద.

Streetbuzz News

TeluguCentralnews

Sep 03 2024, 17:04

బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్.

రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నందున రాష్ట్రంలో సమగ్ర కులగనణ చేపట్టి బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టమైన హామీ ఇచ్చినందున తక్షణమే సమగ్ర కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.

కులగణన చేపట్టడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 26ను విడుదల చేసి కులగణన చేపట్టడానికి రూ 150 కోట్ల బడ్జెట్ ను కూడా విడుదల చేసిందని గుర్తుచేశారు. కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచిన తర్వాతనే గ్రామపంచాయతీ, మండల, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు. కులగణన లేకుండా, బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు రాజకీయంగా తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం రావాలంటే జనాభా దామాషా ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ఆయన కోరారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు జరిగేవని కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మూలంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 18 శాతానికి తగ్గాయన్నారు. బీసీలకు అన్యాయం చేసిన పాపానికి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదింపి, బీసీ కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని బీసీలు విశ్వసించి రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఓటర్ లిస్ట్ ఆధారంగా అదేవిధంగా ఇతరత్రా లెక్కల ఆధారంగా ఎన్నికలకు వెళితే న్యాయ పరమైన చిక్కులు ఏర్పడి బీసీ రిజర్వేషన్లు శాశ్వతంగా పెంచకపోయే ప్రమాదం ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచాలంటే శాస్త్రీయబద్ధంగా బీసీ కులాల లెక్కలు తీయాల్సిందేనని ఇందుకు ఒకటి రెండు నెలల్లోనే బీసీ కులగణన మొత్తం చేసే అవకాశం ఉందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచకుండా ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీకి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఓటు అనే ఆయుధంతో సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఈ సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, అనిల్ చెర్రీ తదితరులు పాల్గొన్నారు.

TeluguCentralnews

Sep 03 2024, 13:52

శభాష్ సబ్ కలెక్టర్ భవానీ శంకర్ గారు!!

వరదలతో నూజివీడు సమీపంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

అక్కడ ఎనిమిది గంటల రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి సబ్ కలెక్టర్ భవాని శంకర్ 82 మంది ప్రాణాలు కాపాడారు.

తమ ప్రాణాలు కాపాడిన సబ్ కలెక్టర్ భవాని శంకర్ కు కృతజ్ఞతలు తెలిపిన నూజివీడు కు సంబంధించిన వరద బాధితులు.

TeluguCentralnews

Sep 03 2024, 12:56

తెలుగు రాష్ట్రాల్లో వరదల బీభత్సం.

విరాళాలు ప్రకటించిన పలువురు సినీ ప్రముఖులు.

రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.50లక్షల చొప్పున జూ.ఎన్టీఆర్‌ విరాళం.

ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు తన వంతుగా రూ. 25 లక్షలు విరాళం.

రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.5లక్షల చొప్పున విశ్వక్‌సేన్‌ విరాళం.