Mane Praveen

Sep 01 2024, 14:13

భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జమ్ముల వెంకటేష్ గౌడ్
నల్లగొండ జిల్లా:
భారీ వర్షాల పట్ల  మర్రిగూడ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జమ్ముల వెంకటేష్ గౌడ్ అన్నారు.

ఆదివారం మర్రిగూడ మండలంలో వారు మాట్లాడుతూ.. భారీ వర్ష సమయంలో ప్రతి ఒక్కరూ వీలైనంతవరకు ఇంట్లోనే ఉండండి, అత్యవసరమైతేనే బయటకు వెళ్ళండి, వర్షాల వల్ల తడిసిన కరెంటు స్తంభాలు, విద్యుత్ తీగలు, ఇనుప స్తంభాలు తాగకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

ఇంట్లో ఉండే విద్యుత్ పరికరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.ముఖ్యంగా పిల్లలు, వృద్దులు బయటకు రాకుండా చూసుకోవాలి. రైతులు పొలాల్లో విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా ఉండండి. ఉదృతంగా ప్రవహిస్తున్న కాలువలు, చెరువుల వద్దకు వెళ్ల వద్దని మండల ప్రజలకు సూచించారు.

Mane Praveen

Sep 01 2024, 12:04

రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు చేపట్టిన ఆర్ అండ్ బి అధికారులు

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలవకుండా ఆర్ అండ్ బి అధికారులు చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఆర్ అండ్ బి ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి ఆదివారం గ్రామానికి విచ్చేసి సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై నిలిచిన నీరు మళ్లించడానికి తన సిబ్బందితో చర్యలు తీసుకున్నారు.

Mane Praveen

Sep 01 2024, 10:26

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:దళిత రత్న నాగిల్ల మారయ్య
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం:
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాల మహానాడు నాయకులు దళిత రత్న అవార్డు గ్రహీత నాగిల్ల మారయ్య అన్నారు.

మర్రిగూడ మండల కేంద్రంలో ఆదివారం మారయ్య మాట్లాడుతూ.. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో, నల్గొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. భారీ వర్షాల సమయంలో ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండండి, అత్యవసరమైతేనే బయటికి రావాలని తెలిపారు.

వర్షాల వల్ల తడిసిన కరెంటు స్తంభాలు, విద్యుత్ తీగలు, ఇనుప స్తంభాలు తాగకుండా జాగ్రత్తగా ఉండండి.
ఇంట్లో విద్యుత్ పరికరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
ముఖ్యంగా పిల్లలు, వృద్దులు బయటకు రాకుండా చూసుకోవాలన్నారు.

రైతులు పొలాల్లో విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా ఉండండి. ఉదృతంగా ప్రవహిస్తున్న కాలువలు, చెరువుల వద్దకు ప్రజలు వెళ్లకండని సూచించారు.  జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కావున అనారోగ్యానికి గురైతే  వెంటనే వైద్యులను సంప్రదించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Mane Praveen

Sep 01 2024, 08:57

అంధకారం లో కోదాడ పట్టణం.. రోడ్లన్ని జలమయం

సూర్యాపేట జిల్లా:

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా శనివారం కోదాడ పట్టణం జలమయం అయింది. రోడ్ల మీద నీళ్ళు ప్రవహించాయి. పట్టణంలోని రంగా థియేటర్, ఖమ్మం చౌరస్తా లలో భారీ వరద చేరడంతో కార్లు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

నీటి వరదలో చిక్కుకున్న వాహనాలు, ద్విచక్ర వాహనాల సైలెన్సర్ ల లోకి నీరు ప్రవేశించి వాహనాలు స్టార్ట్ కాకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్డణంలోని శ్రీరంగాపురం రోడ్డు మద్యలో డివైడర్ల మీద నుండి నీరు ప్రవహించి జలపాతంలా మారింది.

ఖమ్మం వైపు వెళ్లే రోడ్డు మీద తమ్మర వద్ద ఉన్న వాగు బ్రిడ్జి పైనుండి మోకాళ్ళ లోతులో నుండి నీరు ప్రవహిస్తున్నది.

బారీగా కురిసిన వర్షానికి కరెంట్ సబ్ స్టేషన్ లోకి కూడా బారీగా నీరు చేరింది, దీంతో సాయంత్రం నుండే పట్డణం మొత్తం కరెంట్ లేని పరిస్థితి. 

కోదాడ నుండి మేళ్ళచెరువు వెళ్ళే మార్గం కూడా బ్లాక్ అయింది. కోదాడ నుండి చుట్డు ప్రక్కల గ్రామాలకు వెళ్ళ లేని పరిస్థితి నెలకొన్నది.

పట్టణంలో‌ని పురపాలక సంఘం కార్యాలయంలోకి వచ్చిన వరద నీరుతో కార్యాలయ సంబంధించిన సామాగ్రి ఫైల్స్ పూర్తిగా తడిసిముద్దయ్యాయి.

కోదాడలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో నీరంతా రోడ్డు మీదనే ప్రవహిస్తూ రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కోదాడ నుండి మేళ్ళచెరువు వైపు, ఖమ్మం వైపు , విజయవాడ వైపు వెళ్ళ లేని పరిస్థితి ఆ వైపు గ్రామాలకు వెళ్ళాల్సిన ప్రజలు ఎటు వెళ్ళాలో తెలియక పట్టణంలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Mane Praveen

Sep 01 2024, 08:27

HYD - VIJAYAWADA హైవేపై నందిగామ వద్ద పోటెత్తిన వరద
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద శనివారం భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

నందిగామ వద్ద వాగు పొంగడం తో హైవే పైకి వరదనీరు వచ్చి చేరింది.

కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను ఖమ్మం వైపు మళ్ళించారు.

Mane Praveen

Aug 31 2024, 21:28

NLG: భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు
నల్గొండ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల నల్గొండ పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్ కోరారు.

నల్గొండ పట్టణంలో వర్షాలు వల్ల ఏదైనా సమస్య వస్తే నల్గొండ పురపాలక సంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన కాల్ సెంటర్ 086822 20100 ను సంప్రదించాలని తెలిపారు.

ఈ కాల్ సెంటర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

Mane Praveen

Aug 31 2024, 20:43

NLG: భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు
నల్లగొండ: రానున్న 3 రోజులపాటు భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం తో పాటు, ముఖ్యమైన కార్యాలయాలలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు.

వర్షాలకు సంబంధించి అత్యవసర సమాచారం, సహాయం కోసం
(1). కలెక్టర్ కార్యాలయం- 18004251442
(2).ట్రాన్స్కో నల్గొండ సర్కిల్ -  9440813326
(3).నల్గొండ డివిజన్ ట్రాన్స్కో కంట్రోల్ రూమ్* నెంబర్ 9542451160
(4).మిర్యాలగూడ ట్రాన్స్కో కంట్రోల్ రూమ్ నంబర్ 9493951399
(5).దేవరకొండ ట్రాన్స్కో కంట్రోల్ రూమ్ నెంబర్ 9440203717


(6).నీటిపారుదల శాఖకు సంబంధించిన నల్గొండ కంట్రోల్ రూమ్ నెంబర్ 9989997950
(7).నాగార్జునసాగర్ హిల్ కాలనీ డివిజన్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8465080694
(8).జివి గూడెం కంట్రోల్ రూమ్ నెంబర్ 9948042977
(9).మాల్ డివిజన్ కు సంబంధించి కంట్రోల్ రూమ్ నెంబర్ 9912534475
(10).పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన కంట్రోల్ రూమ్ నంబర్ 9059834706

ప్రజలు వర్షం కారణంగా ఇబ్బందులకు గురైనా, లేదా ఏదైనా అత్యవసర సమాచారాన్ని తెలియజేసేందుకు సంబంధించి పైన పేర్కొన్న కంట్రోల్ రూమ్ నెంబర్లకు ఫోన్ చేయవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు.

Mane Praveen

Aug 31 2024, 20:28

NLG: జిల్లా క్రీడల అధికారికి ఘనంగా వీడ్కోలు
నల్గొండ: గత 25 సంవత్సరాలుగా  జిల్లాలో హాకీ కోచ్ గా మరియు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారిగా సమర్థవంతంగా పనిచేస్తూ శనివారం రిటైర్మెంట్ పొందిన మక్బూల్ మొహమ్మద్ ను జిల్లా క్రీడల కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ.. జిల్లాలో క్రీడల అభివృద్ధిని సమర్థవంతంగా నిర్వహించి మంచి అధికారిగా గుర్తింపు సాధించారని తెలిపారు.

Mane Praveen

Aug 31 2024, 19:17

NLG: విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు ఆత్మీయ సన్మానం'
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలంలోని, తమ్మడపల్లి ప్రాథమిక పాఠశాలలో 2002 లో ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు చేపట్టి ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి 8 సం.లుగా  విద్యార్థులతో, గ్రామ ప్రజలతో మమేకమై విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రత్యేక చొరవ చూపించి విద్యార్థుల హృదయాలను గెలిచి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయురాలు శ్రీరేఖ వ్యక్తిగత పనిపై శనివారం గ్రామానికి వచ్చిన విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆమెను శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చేల్లం పాండురంగారావు, ఉపాధ్యాయులు ఉమా శంకర్ రావు, కొట్టం శ్రీనివాస్,శ్రీలత, పూర్వ విద్యార్థులు చేల్లం నర్సింగరావు, అనిల్, కొట్టం సరిత, శివ, హుస్సేన్, పవన్, రమేష్ పాల్గొన్నారు.

Mane Praveen

Aug 31 2024, 12:55

NLG: వర్షాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ నారాయణ రెడ్డి
నల్లగొండ: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల  జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి శనివారం తెలిపారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన చోట్ల సహాయ సహకారాలు అందించాలన్నారు.
మరో రెండు రోజులపాటు వర్షాలు  కురియనున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

మట్టి మిద్దెలు, కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇండ్లలో ఎవరు నివాసం ఉండొద్దని సూచించారు. మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారులకు తెలియజేస్తే అవసరమైతే తక్షణమే వసతి కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు, మూసి ప్రాజెక్టుల గేట్లు తెరిచినందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలు, నది పరివాహక ప్రాంతాలలో నీటిలోకి ఎవరు వెళ్లొద్దు. పశువులను సైతం నీటిలోకి తీసుకెళ్లొద్దు.ఈత కొట్టేందుకు యువత నదులు ప్రాజెక్టుల వద్ద నీటిలోకి దిగవద్దు.మత్స్యకారులు చేపలు పట్టేందుకు నీళ్లలోకి వెళ్ళవద్దు.పిల్లలు, పెద్దలు నీటి ప్రాంతాల వద్ద సెల్ఫీలు దిగేవారు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

వర్షం కారణంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల కు షార్ట్ సర్క్యూట్ వచ్చేందుకు అవకాశం ఉన్నందున వాటికి దగ్గరగా మనుషులు, పశువులు వెళ్లొద్దు.విద్యుత్ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.విద్యుత్ అధికారులు ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉన్న వాటిని గుర్తించి ముందే తొలగించాలి. వర్షం ,గాలుల కారణంగా  ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపోయిన, స్తంభాలు ఒరిగిపోయినచో తక్షణమే సరి చేయాలి.

మున్సిపల్ ప్రాంతాలు, గ్రామాలలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలి.ఎక్కడైనా నీరు నిలువ ఉంటే  తక్షణమే నీరు నిలువ లేకుండా చర్యలు తీసుకోవాలి. మున్సిపాలిటీలు, గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలి. కల్వర్టులు, రోడ్లు పొంగి పొర్లుతున్నట్లయితే వాటిని దాటే సాహసం ఎవరు చేయొద్దు.ఆర్ అండ్ బి ,పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు అలాంటి ప్రదేశాలలో తక్షణమే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి,బారికేడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.

మోటార్ బైకులు వాహన దారులు పొంగి పొర్లి ప్రవహించే కల్వర్టులు, వాగులను దాటే సాహసం చేయవద్దు.
వర్షం వల్ల రోడ్లపై చెట్లు విరిగిపడినట్లయితే తక్షణమే తొలగించాలి.నీటిపారుదల, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు వర్షాల కారణంగా చెరువులు, కుంటలు ఎక్కడైనా నిండి తెగిపోయేందుకు ఆస్కారం ఉన్నచోట తక్షణమే వాటిని గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

వర్షం వల్ల రైతులు పంటలు నష్టపోకుండా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సరైన సూచనలు, సలహాలు ఇవ్వాలి.వర్షాల కారణంగా సీజనల్ వ్యాధుల బారిన పడిన ప్రజలకు తక్షణ చికిత్స అందించేందుకు  వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి.అవసరమైన మందులు, మెడికల్ కిట్లు సిద్ధంగా ఉంచుకోవాలి.
రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన చోట్ల సహాయక చర్యలను చేపట్టాలని అన్నారు.జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు అందరూ జిల్లా యంత్రంగానికి అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.