రైతుల కోసం రంగంలోకి కేసీఆర్..?


హైదరాబాద్,ఆగస్టు 30:బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి రానున్నా రు. తెలంగాణలోని రైతుల సమస్యలపై మరోసారి బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతోంది. 

రాష్టంలో పూర్తి రుణమాఫీ, రైతు భరోసాపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకు న్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రత్యక్షంగా రంగంలోకి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ దిగనున్నారు. 

ఈ బీఆర్ఎస్ పోరాటంపై రేపు సాయంత్రం షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోం ది. సభలు లేదా కార్నర్‌ మీటింగ్‌లు పెట్టాలని కేసీ ఆర్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 

సెప్టెంబర్ మొదటి వారంలో గులాబీ బాస్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. అటు కాంగ్రెస్, ఇటు ఎన్డీఏ సర్కార్‌పై కేసీఆర్ సమర శంఖారావాన్ని పూరించను న్నారు. 

కాగా, ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్ రావు, కేటీఆర్ రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలతో పార్టీ శ్రేణులు కొంత ఉత్సా హం పెరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు తెలిసింది.

ప్రమాదవశాత్తు కల్వర్ట్ ను ఢీ కొని పూర్తిగా కాలిపోయిన కారు

కొమురం భీం అసిఫాబాద్ జిల్లా :కొమురం బీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలం ప్రదాన రహదారి వేంపల్లి గ్రామ‌ సమీపంలో అర్ధ రాత్రి 2:30 గంటల ప్రాంతంలో కాగజ్‌నగర్‌ నుండి‌ కౌటల మండలం‌ రవీంద్ర నగర్ కు వెళ్లే క్రమంలో ప్రమాదం 

ఒకరి గాయాలు ఆసుపత్రి కి తరలింపు

 సకాలంలో రాత్రి ‌స్పందించి మంటలు‌ ఆర్పిన ఫైర్‌ సిబ్బంది తప్పిన ప్రమాదం

రామ్ నగర్ లో హైడ్రా కూల్చివేతలు..?


హైదరాబాద్ఆగస్టు 30 ;హైదరాబాద్‌లోని అడిక్ మెట్ డివిజన్ రాంనగర్ చౌరస్తాలోని మణెమ్మ కాలనీ లో హైడ్రా ఈరోజు కూల్చివేతలు ప్రారంభించింది.. 

నగరవాసుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. హైడ్రా బుల్డోజర్లు ఎక్కడ వచ్చి తమ నిర్మాణా లపై పడుతా యోనని భయాందోళనలకు గురవుతున్నారు. 

ప్రతి శుక్ర, శనివారాల్లో అక్రమ కట్టడాలను నేల మట్టం చేస్తున్న హైడ్రా.. తాజాగా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో కలిసి రామ్‌నగర్‌లోని మణెమ్మ కాలనీలోఈరోజు అడుగు పెట్టారు. 

శుక్రవారం తెల్లవారుజాము నుంచే మణెమ్మ కాలనీలోని నాలాపై నిర్మించిన కట్టడా లను కూల్చివేస్తున్నారు. రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ అక్రమ నిర్మాలను పరిశీలించారు...

ఉన్నతాధికారులు అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలి: మంత్రి సీతక్క


ఉన్నతాధికారులు అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలి: వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సీతక్క 

 గుడ్డును రెండు ముక్కలు చేసి పిల్లలకివ్వండి

విధుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు, మొదట వార్నింగ్ ఇచ్చి తర్వాత విధుల నుంచి తప్పిస్తాం

TG: అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్డును రెండు ముక్కలు చేసి పిల్లలకివ్వాలని.. అంగన్వాడీల్లో అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరిచేలా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంగన్వాడీ టీచర్లకు ప్రతి నెలా ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను ఆయాలకు కూడా వర్తింపజేయడం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో తలెత్తే సమస్యలను పరిష్కరించవచ్చని సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై సచివాలయం నుంచి జిల్లా అధికారులతో గురువారం మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో సేవలను మరింత విస్తృతం చేయాలని సూచించారు.

చిన్నారులకు ఇస్తున్న కోడి గుడ్డును రెండు ముక్కలుగా చేసి ఇస్తే.. చిన్నారులకు తినేందుకు అనువుగా ఉండటంతో పాటు, గుడ్డులో ఏదన్నా నలత వున్నా గుర్తించి పడేయవచ్చని అన్నారు. కోడిగుడ్లను, వస్తువులను భద్రపరచుకునే వ్యవస్థను గత ప్రభుత్వం ఏర్పాటు చేయలే లేకపోయిందని తెలిపారు. ఆహార పదార్థాలను నిల్వ చేసుకునే పాత్రలను, కోడిగుడ్లను భద్రపరిచే రాక్‌లను త్వరలోనే అందజేస్తామని తెలిపారు. టేక్ హోం రేషన్‌లో భాగంగా ఇస్తున్న వస్తువుల నాణ్యతను లబ్ధిదారుల నుంచి లికిత పూర్వకంగా ధ్రువీకరించుకోవాలని సూచించారు. ప్రతికూల పరిస్థితులను ప్రాంతాల్లో టేక్ హోం రేషన్‌ను వారింటికి తీసుకువెళ్లి ఇవ్వాలని సూచించారు. తద్వారా ఎక్కడైనా సమస్యలు ఏర్పడితే బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని అన్నారు.

ఉన్నతాధికారులు అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని, మొదట వార్నింగ్ ఇచ్చి తర్వాత విధుల నుంచి తప్పిస్తామని హెచ్చరించారు. పిల్లలకు నాణ్యమైన భోజనం అందేలా చూసే బాధ్యత సంబంధిత అధికారులదేనని, ఇక్కడ తప్పు జరిగిన అక్కడి అధికారులపై చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. ఇకపై అంగన్వాడీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలుంటాయని, సీఎం, మంత్రులు సైతం అంగన్వాడీ కేంద్రాలను సందర్శిస్తారని ఆమె స్పష్టం చేశారు.

వచ్చే నెల 4 నుంచి జిల్లాల్లో పర్యటించి శాఖా పరంగా అమలవుతున్న పథకాల అమలు తీరు, పనుల పురోగతిని సమీక్షిస్తానని స్పష్టం చేశారు. పూర్వ ప్రాథమిక పాఠాలను బోధించేలా అంగన్వాడీ కేంద్రాలను సమాయత్తం చేయాలని ఆదేశించారు. దేశానికి ఆదర్శంగా మన అంగన్వాడీ పాఠశాలలు ఉండాలని.. ఆ దిశగా టీచర్లకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కాంతి వెస్లీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ర్యాగింగ్ చేస్తే జైలుకే..!

తెలంగాణ : ఏడిపించడం, హేళన చేయడం, ఇతర ఇబ్బందులకు గురిచేయడం లాంటివాటికి ఆరు నెలల జైలుశిక్ష పడుతుంది. శారీరకంగా వేధించినా, బలప్రయోగం చేసినా ఏడాది జైలుశిక్ష పడుతుంది. అడ్డుకున్నా, గాయపర్చినా రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తారు. అపహరణ, అత్యాచారం, తీవ్రంగా గాయపర్చడానికి అయిదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా వేస్తారు. ర్యాగింగ్‌ వేధింపులతో మృతి చెందినా, ఆత్మహత్యకు కారణమైనా జీవితకాలం జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది.

కాసేపట్లో పెళ్లి..మటన్ కోసం లొల్లి..!

బంధువుల పరస్పర దాడుల్లో 8 మంది ఆసుపత్రిపాలు.

చిలికిచిలికి గాలివానలా మారిన మటన్ గొడవ.

నవీపేట: బలగం సినిమాలో నల్లిబొక్కల గొడవలాగే నిజ జీవితంలో ఓ ఘటన జరిగింది. అప్పటి వరకు వివాహ వేడుక కళకళలాడింది. వధూవరులను పెళ్లికి వచ్చిన అతిథులు నిండు మనస్సుతో ఆశీర్వదించారు. అంత వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత ' మొదలైంది 'ముక్కల' లొల్లి. భోజనంలో మటన్ ముక్కలు తక్కువ వచ్చాయంటూ జరిగిన గొడవలో ఇరు పక్షాలకు చెందిన ఎనిమిది మందికి గాయాలైన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో మండల కేంద్రానికి చెందిన వధువుకు నందిపేట మండలంలోని బాద్గుణకు చెందిన వ రుడితో పెళ్లి జరిగింది. తర్వాత జరిగిన పెళ్లి భోజనంలో తమకు మటన్, చికెన్ సరిగ్గా వడ్డించడం లేదని వరుడి తరఫు బంధువులు గొడవకు దిగారు. ముక్కలు తక్కువగా వేస్తున్నారంటూ పెళ్లి కూతురు తరపు బంధువులతో వాదనకు దిగారు. చిన్నగా మొదలైన గొడవ కాస్త ఒక్కసారిగా పెద్దగా మారింది. దీంతో అటు వధువు, ఇటు వరుడు తరఫు చెందిన వారు ఒకరినొకరు పిడిగుద్దులు కురి పించుకున్నారు. దొరికిన వాటితో దొరికినట్లుగా.. అంతటితో ఆగకుండా వంట గంటెలు, కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనలో రెండు వర్గాలకు చెందిన 8 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని మొదట నవీపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఫంక్షన్ హాల్ బయట ఉన్న రోడ్డుపై సైతం ఇరు పక్షాలు దాడులు చేసుకుని న్యూసెన్స్ చేయడంతో అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ రాజేష్ ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలకు చెందిన 19 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వినయ్ తెలిపారు.
పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి.
మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లా తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఒక మామిడి తోటలో రహస్యంగా పేకాట ఆడుతున్న 8 మందిని  టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.రూ 19100/-(పంతొమ్మిది వేల ఒక వంద) నగదు, 8 సెల్ ఫోన్లు, 7 బైక్ లు స్వాధీనం రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా తాళ్ళ గురిజాల పోలీస్ స్టేషన్ పరిధి బుగ్గ గుట్ట సమీపం లోని మామిడి తోటలో రహస్యంగా డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న సిబ్బందితో కలిసి పేకాట స్థావరం పైన రైడ్ చేసి 8 మంది వ్యక్తులు, మరియు 19100/- రూపాయల నగదు, ఎనిమిది మొబైల్ ఫోన్లు, ఏడు బైక్ లు, పేక ముక్కలు పట్టుకోవడం జరిగింది. నిందితుల వివరాలు 1) తొంగల వెంకటేష్ s/o హనుమంతు, వయస్సు : 45 సంవత్సరాలు, కులం: పెరిక, occ: సింగరేణి ఉద్యోగి, R/o బెల్లంపల్లి ,కన్నాల గేట్ ఏరియా 2)చింతల రాజేందర్ s/o యాదగిరి వయస్సు: 46 సంవత్సరాలు, కులం: బుడగజంగం, occ: కూలీ, r/o గంగారాం నగర్ , బెల్లంపల్లి 3) ఉపేందర్ s/o ఐల్లయ్య, వయస్సు: 36, కులం: యాదవ్, occ: ప్రైవేట్ ఉద్యోగి, r/o బెల్లంపల్లి 4) ఎం.డి హకీం s/o రహీం, వయస్సు: 38 సంవత్సరాలు, కులం: ముస్లిం, occ: డ్రైవింగ్, r/o సుభద్ర కాలనీ, తాండూరు. 5) Sd. ఉస్మాన్ s/o జానిమియా, వయస్సు: 53, కులం: ముస్లిం, occ: సింగరేణి ఉద్యోగి, R/o.బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ దగ్గర. 6)మాచర్ల గట్టయ్య s/o నారాయణ, వయస్సు: 38 సంవత్సరాలు, కులం: యాదవ్, Occ: వ్యవసాయం, R/o గాంధీనగర్ , బెల్లంపల్లి. 7) నాగనవేని నరేష్ s/o చంద్రయ్య, వయస్సు: 33 సంవత్సరాలు, కులం: యాదవులు, occ: కూలీ, r/o గాంధీనగర్ ,బెల్లంపల్లి. 8) శ్రీనివాస్ s/o ఎర్రయ్య, వయస్సు : 50 సంవత్సరాలు, కులం : మాల, Occ: కూలి, R/o.బెల్లంపల్లి. పట్టుబడిన వ్యక్తులను స్వాధీనం చేసుకున్న నగదు, బైక్ లు, సెల్ ఫోన్లు మరియు పెకముక్కలను తదుపరి విచారణ నిమిత్తం తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్‌ ఎస్ఐ కి అప్పగించడం జరిగింది.
అక్రమ నిర్మాణాన్ని వెంటనే తొలగించాలి.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా , కాగజ్‌నగర్‌, ఆగస్టు29: కాగజ్‌నగర్‌ రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ని వంజరికి వెళ్ళే దారిలో గల ఓ ప్లాట్లో(69/1/1) ఇటీవల అక్రమంగా నిర్మించిన దుకాణామును తొలగించాలని కోరుతూ గురువారం రోజున యజమానులు నగునూరి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ కు, గ్రామపంచాయతిలో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. అట్టి కలెక్టర్ ఆదేశాల మేరకు షాపు యజమానికి గ్రామపంచాయతి నుండి ‌పలుమార్లు నోటీసుకు జారీ చేసినా సదరు యజమాని షాపును తొలగించకుండా యజమానులపై దురుసుగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయమై ఎక్స్ సర్వీస్మెన్/ హుమెన్ రైట్ ప్రొటక్షన్ సభ్యులు శివకుమార్ అట్టి అక్రమ నిర్మాణం వద్ద పత్రికా సమావేశం నిర్వహించారు. రేపటి వరకు షాపును తొలగించని పక్షంలో తామే అట్టి దుకాణంను తొలగిస్తామని అన్నారు. అట్టి దుకాణంలో బెల్ట్ షాప్ కూడా నిర్వహిస్తున్నారని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్నా అధికారులు చూసి చూడనట్టు వదిలేయడం వెనుక కారణం ఏంటని ప్రశ్నించారు. సీఐ స్వయంగా తణిఖీ చేయగా మద్యం సీసాలు లభ్యం అయ్యాయని, అయినా వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమని అన్నారు. వెంటనే అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం రూరల్ ఎస్ఐ మహేందర్ ను కలిసి తమకు బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు.
యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ,కాగజ్ నగర్,ఆగస్టు29, : కాగజ్ నగర్ పట్టణంలోని న్యూ మారుతి నగర్ లో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ కు గురువారం రోజున సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు చేశారు.రూ‌.25 లక్షల అంచనాతో నిర్మించనున్న ఈ క్లినిక్ వలన కాగజ్ నగర్ పట్టణంలో ఉన్న కుక్కల బెడద నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపారు. కుక్కలకు ఈ క్లినిక్ లో స్టెరిలైజేషన్ నిర్వహించి వదిలేస్తారని, దాని వలన కుక్కల సంతతి పెంపు కాకుండా అరికట్టవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షాహిన్ సుల్తానా, కమిషనర్ అంజయ్య,స్థానిక కౌన్సిలర్లు, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు సిందం శ్రీనివాస్, దెబ్బటి శ్రీనివాస్, ముత్తు అశోక్ పాల్గొన్నారు.
విద్యార్థులకు అవసరమైన వైద్య సేవలు అందించాలి : జిల్లా అదనపు కలెక్టర్.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్ నగర్,ఆగస్టు 28 : విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. బుధవారం జిల్లాలోని కాగజ్ నగర్ మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్య సేవలు అందుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పూర్తి స్థాయి సదుపాయాలతో నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలలలో అభివృద్ధి, మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారిస్తూ పాఠశాల తరగతి గదులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తిని నివారించేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. త్రాగునీరు, ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలని, ఆహారం తినే ముందు చేతులను తప్పనిసరిగా శుభ్రపరచుకునేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఉపాధ్యాయులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేసి ఉన్నత ఫలితాల సాధన దిశగా కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉపవైద్యాధికారి సీతారాం నాయక్, వైద్య సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.