వివాహానికి 10,000 రూ. ఆర్థిక సహాయం చేసిన  ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు...
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం ఎర్రగుంట గ్రామంలో నివాసముంటున్న J చెన్నప్ప కుమారుడు J నవీన్ కుమార్ వివాహనికి ₹10000 ఆర్థిక సహాయన్ని అందజేసిన *నిరుపేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి మన శింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు* మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో సంతోషకరం వారి వైవాహిక జీవితం ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో *EX MPTC ఈశ్వరయ్య మాజీ మండల కన్వీనర్ కోటంక జయరాం పరంధామయ్య శ్రీరామ్ * నాయకులు కార్యకర్తలు* పాల్గొన్నారు.
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా రూపొందించిన వాల్ పోస్టర్ ను పరిశీలించిన.. అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న..
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మరో ఉద్యమం..

అనంతపురం: సమాజాభివృద్ధికి ప్రతిబంధకంగా మారిన బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లాలో ఉద్యమ స్థాయిలో ప్రచారానికి ఐసీడీఎస్ శాఖ శ్రీకారం చుట్టింది. * అనంతపురం కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న ఆలోచన, ఆదేశాలకనుగుణంగా ఐసీడీఎస్ శాఖ ఈ కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపట్టింది.  ఐసీడీఎస్ పీడీ డాక్టర్ బీఎన్ శ్రీదేవి, డీసీపీఓ మంజునాథ ఆధ్వర్యంలో వంద రోజుల ప్రణాళిక రూపొందించుకొని ఊరూరా, వాడవాడలా విస్తృత ప్రచారానికి నడుం బిగించారు. * బ్యానర్లు, వాల్ పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు, జనసమ్మర్ధం కలిగిన ప్రదేశాలు, బస్సులు, ప్రార్థనా మందిరాలు, విద్యా సంస్థల్లో వీటిని ప్రదర్శిస్తూ, సదస్సులు నిర్వహిస్తూ చైతన్యం తెస్తున్నారు. * బాల్య వివాహాలు లేని జిల్లాగా చూడలన్నదే కలెక్టర్ వినోద్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న సంకల్పం. వాటిని సాకారం చేసే దిశగా ఐసీడీఎస్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.
చేతికొచ్చిన కాకర పంట ఈదురు గాలుల భారీ వర్షానికి నేలమట్టం.. రెండు లక్షల పైబడి పంట నష్టం వాటిల్లిందని రైతు బ్యాల్ల సుదర్శన్ ఆవేదన..
అనంతపురం జిల్లా సింగమల మండలం గుమ్మేపల్లి గ్రామంలో రాత్రి కురిసిన ఈదురు గాలుల భారీ వర్షానికి గ్రామానికి చెందిన రైతు బ్యాల్ల సుదర్శన్ సాగు చేస్తున్న కాకర పంట రెండు ఎకరాల్లో నేలమట్టం అయిందని, రైతుకు రెండు లక్షల పైబడి నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని రైతు కోరారు..
ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవను మర్యాదపూర్వకంగా కలసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు..
అనంతపురం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ గారిని మర్యాదపూర్వకంగా కలసిన అనంతపురం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులుగారు, రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు వెంకటప్ప ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దాసరి గంగాధర్ మాజీ ఎంపీటీసీ కుల్లాయప్ప పార్లమెంట్ బీసీ సెల్ అధికార ప్రతినిధి బండి పరశురాం సింగనమల నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు బెస్త నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు
తుంగభద్ర నీటి వ్యధ..
తుంగభద్ర నీటి వ్యధ Aug 16,2024 నీటి రంగ నిపుణులు వి. రాంభూపాల్‌, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తుంగభద్ర జలాశయం 19వ గేటు ఆగస్టు 10వ తేదీ అర్ధరాత్రి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. సుమారు 60 టిఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి వదిలేయాల్సి వస్తుందని అధికారులు ప్రకటించడంతో…ఈ డ్యాంపై ఆధారపడిన కరువు పీడిత ప్రాంతాల రైతుల గుండెలు అవిసిపోతున్నాయి. ఈ ఖరీఫ్‌కు అవసరమైన వర్షాలు జులై నెలలో రాకపోవడంతో రాయలసీమ జిల్లాల్లో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయిందని అధికార లెక్కలు చెబుతున్న స్థితిలో. కర్ణాటక ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల తుంగభద్రకు వరద పోటెత్తడంతో ఎగువ, దిగువ కాలువల కింద వున్న రైతుల్లో చిగురించిన ఆశలు అడియాసలు అవుతున్నాయి. తెగిన గేటు చూసేందుకు కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల పాలక పార్టీల నాయకుల పర్యటనల హోరు ఉధృతంగా సాగుతున్నది. ఈ ఆపత్కాలాన్ని కూడా తమ రాజకీయాలకు ఉపయోగించుకుని రెండు రాష్ట్రాల మధ్య తగువు పెట్టడానికి బిజెపి ప్రయత్నిస్తున్నది. కొట్టం కాలి ఒకడు ఏడుస్తుంటే, మరొకడు చుట్ట అంటించుకోవడానికి నిప్పడిగినట్లు వుంది పరిస్థితి. మొన్నటి వరకు తమ ఏలుబడిలోనే కర్ణాటక వుందని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ఇప్పుడు తాము భాగస్వాములమని, తుంగభద్ర డ్యాం కేంద్ర జలవనరుల శాఖ కింద వుంటుందనే విషయాన్ని మరచి మాట్లాడుతున్నారు. వృధా అవుతున్న నీటిని అరికట్టడానికి స్టాప్‌ లాగ్‌ను అమర్చేందుకు నిపుణులు చేస్తున్న తక్షణ ప్రయత్నాలు త్వరగా ఫలవంతం కావాలని ఆశిద్దాం. శాశ్వతంగా చేపట్టాల్సిన చర్యల కోసం ప్రభుత్వాలను డిమాండ్‌ చేద్దాం. దప్పిక అయినప్పుడు బావి తవ్వితే ఎలా? ఎంతటి నిపుణతతో, సమర్థతతో నిర్మించిన ప్రాజెక్టు అయినా నిర్వహణ సక్రమంగా లేకపోతే కన్నీటి వ్యధగానే మిగులుతుంది. ప్రకృతిలోని సమస్త భౌతిక వస్తువులు మార్పు చెందడం సహజం. తుంగభద్ర జలాశయపు గేటు విరిగిపోవడం అసహజమేమీ కాదు. అయితే ప్రతి సంవత్సరం వర్షాలకు ముందుగానే జలాశయపు గేట్లు, లాకుల లాంటి వాటన్నింటి పనితీరును సక్రమంగా పరీక్షించాలి. గేటు కొట్టుకు పోయే పరిస్థితి వచ్చిందంటే పర్యవేక్షణ సరిగా లేదని అర్థం. కనీసం గ్రీజు కూడా సకాలంలో పూయకపోవడంతో షెట్టర్లు మొరాయించిన పరిస్థితిని చూస్తున్నాము. కాలువల్లో పెరిగిపోయిన కంప చెట్లు, తెగిపోయిన కల్వర్టులు, ప్రతి సంవత్సరం పడుతున్న గండ్లు పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనాలు. దప్పిక వేసినప్పుడు బావులు తవ్వడం మన ప్రభుత్వాలకు అలవాటయ్యింది. ఈ ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన నిధులు ఇవ్వడంలో, సిబ్బందిని నియమించడంలో విఫలమైన ప్రభుత్వాలు, వీటి నిర్వహణను గాలికి వదలి ప్రభుత్వాధినేతల ప్రాపకం కోసం వెంపర్లాడే ఉన్నతాధికారులు ఈ పరిస్థితికి బాధ్యులు. గతంలో పులిచింతల, గుండ్లకమ్మ గేట్లు విరిగిపడడం, రెండు సంవత్సరాలకు ముందు అన్నమయ్య ప్రాజక్టు, బి.టి (భైరవాని తిప్ప) ప్రాజెక్టు గేటు లీకేజి ద్వారా నీరు వృధా కావడం, ఇప్పుడు ఏకంగా గేటే ప్రవాహంలో కొట్టుకుపోవడం చూస్తున్నాము. ప్రభుత్వ నేతలు, సాగునీటి ఉన్నతాధికారులు వీటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం అలవాటుగా మారింది. వీటి బాధ్యతారాహిత్యం ఫలితంగా రైతాంగానికి జరిగిన ఘోరమైన అన్యాయాన్ని కప్పిపుచ్చుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో గత సంవత్సరం ఖరీఫ్‌లో మొత్తం 31 మండలాల్లో 28 మండలాలు, రబీలో 18 మండలాలను కరువు మండలాలుగా గత ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఖరీఫ్‌లో 4.5 లక్షల హెక్టార్లు సాగు కావలసి వుండగా జులై చివరి నాటికి కేవలం 80 వేల హెక్టార్లలో మాత్రమే సాగు అయ్యిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా వుందో అర్థమవుతుంది. రాయలసీమ వ్యాప్తంగా తరతమ తేడాలతో ఇదే పరిస్థితి వుంది. డ్రిప్‌ ద్వారా చుక్క చుక్క నీటితో పంటలు సాగు చేస్తున్న సీమ రైతుల కళ్ళ ముందు పదుల టియంసీల నీరు వృధాగా పోతుంటే వారు అనుభవించే మానసిక వ్యధను పాలకులు గుర్తించడంలేదు. ఎన్నికలకు ముందు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని, రాయలసీమను సశ్యశ్యామలం చేస్తామని పాలక, ప్రతిపక్షాలు పోటీలు పడి వాగ్దానాలు చేస్తున్నాయి. వున్న ప్రాజెక్టులను కూడా సక్రమంగా పర్యవేక్షించడం, నిర్వహించడం చేతకాని పాలకులు ప్రతి ఎకరాకు ఎలా, ఎక్కడి నుండి నీళ్ళు ఇస్తారని ప్రజలు నిలదీస్తారనే భయం, సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతూనే వున్నారు. తుంగభద్ర డ్యాం చరిత్ర తుంగభద్ర నది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. తుంగ-భద్ర నదులు కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ప్రారంభమై షిమోగా ‘కూడాలి’ వద్ద కలిసి అక్కడి నుండి తుంగభద్రగా మారుతుంది. అక్కడి నుండి 531 కిలోమీటర్లు ప్రవహించి మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. రాయలసీమ, పల్నాడు ప్రాంతాలలో 1867-1905 మధ్య తీవ్ర కరువులు వచ్చి లక్షల మంది చనిపోయారు. కరువుల నుండి ప్రజలను కాపాడలేకపోతే తమ పాలనకే ముప్పు వస్తుందని గ్రహించిన బ్రిటీష్‌ వలస పాలకులు ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్మాణానికి అనేక ప్రయత్నాలు చేశారు. విజయనగర రాజుల కాలంనాడే తుంగభద్ర నదిపై నిర్మించిన 17 ఆనకట్టలను పరిశీలించిన బ్రిటీష్‌ చీఫ్‌ ఇంజనీర్‌ కల్నల్‌ స్మార్ట్‌ తుంగభద్ర డ్యాం నిర్మాణంపై 1902లో భారత ప్రభుత్వపు మొదటి నీటిపారుదల శాఖ కమిషన్‌కు రిపోర్టు పంపారు. ఆ తర్వాత 1906లో లార్డ్‌ మెకంజీ సమగ్ర నివేదికను పంపారు. అనేక మార్పులు, చేర్పుల తర్వాత 1930లో మద్రాసు-హైదరాబాద్‌ (నిజాం ప్రభుత్వం) ప్రభుత్వాలు జాయింట్‌ ప్రాజెక్టుగా తుంగభద్ర జలాశయ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించాయి. 1944 జూన్‌లో ఆ రెండు ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందం ప్రకారం మల్లాపురం (ప్రస్తుతం డ్యాం వున్న స్థలం) వద్ద ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 1945లో ప్రారంభించిన పనులు 1948లో హైదరాబాద్‌లో నైజాం ప్రభుత్వం పతనమైన తర్వాత, ప్రముఖ ఇంజనీర్‌ ఎం.విశ్వేశ్వరయ్య బోర్డు ఆఫ్‌ చీఫ్‌ ఇంజనీర్‌గా ఎన్నిక కావడంతో వేగవంత మయ్యాయి. 1958 జూన్‌ నాటికి ప్రాజెక్టు పూర్తయింది. ఈ జలాశయంలో 131.30 టియంసీల నీరు నిల్వ వుండేటట్లు నిర్మించారు. ఈ ప్రాజెక్టు నుండి సుమారు 230 టియంసీల నీరు ప్రవహిస్తుంది. 1953 జులై 1న కుడి, ఎడమ కాలువలకు మొదటిసారిగా నీరు వదిలారు. బిజెపి కపటత్వం అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు జీవనాడి తుంగభద్ర ప్రాజెక్టు. డ్యాం నుండి ఎగువ (హెచ్‌.ఎల్‌.సి) కాలువ కర్ణాటకలో 105.437 కి.మీ ప్రవహించి, 4200 క్యూసెక్కుల సామర్థ్యంతో అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఈ జిల్లాలో 84.243 కి.మీ ప్రవహించి మిడ్‌ పెన్నార్‌ ప్రాజెక్టులోకి చేరుతుంది. ఈ కాలువ ద్వారా కర్ణాటక 17.50 టియంసీలు, ఆంధ్రప్రదేశ్‌ 32.5 టియంసీలు వినియోగించుకోవాలి. దిగువ (ఎల్‌ఎల్‌సి) కాలువ కర్ణాటకలో 25.58 కి.మీ ప్రవహించి కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఈ కాలువ ద్వారా కర్ణాటక 22.5, ఆంధ్ర 29.50 టియంసీల నీరు వినియోగించుకోవాలి. 131 టియంసీల సామర్థ్యంతో నిర్మించిన తుంగభద్ర డ్యాం పూడిక వల్ల నేడు వంద టియంసీలకు మించి నిలువ పెట్టే పరిస్థితి లేదు. దీనికితోడు ఈ రెండు కాల్వలకు ఎగువ ప్రాంతంలో కర్ణాటక వుండడంతో కిందకు నీరు రాకుండా అనేక ఆటంకాలు కలుగుతున్నాయి. కర్ణాటకలో మరోసారి బిజెపి అధికారంలోకి రావడం కోసం భద్ర నదిపై ‘భద్ర ఆనకట్ట’ను నిర్మించాలని అప్పటి కర్ణాటక ప్రభుత్వం తీర్మానించడం, వెనువెంటనే జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించి 2022 కేంద్ర బడ్జెట్‌లో రూ.5,500 కోట్లను కేటాయించడం ఆగమేఘాల మీద జరిగిపోయాయి. తుంగభద్ర ప్రాజెక్టుకు ప్రధాన నీటి ఆధారం భద్రా నదే. ఈ ప్రాజెక్టు వల్ల తుంగభద్ర ప్రాజెక్టులోకి నీరు పూర్తిగా తగ్గిపోతుంది. దీనివల్ల నిత్య కరువు పీడిత ప్రాంతంగా వున్న రాయలసీమ ప్రాంతం ముఖ్యంగా అనంతపురం జిల్లా తీవ్రంగా నష్టపోతుంది. ఈ జిల్లాకు వుండే ఒకే ఒక నికర సాగు నీటి వనరు హెచ్‌.ఎల్‌.సి మాత్రమే. దీనికింద 1,45,236 ఎకరాల ఆయకట్టు వుంది. డ్యాం చరిత్రలో ఏనాడు పూర్తి ఆయకట్టు సాగు కాలేదు. ఇప్పుడు తుంగభద్ర గేటు కొట్టుకుపోవడానికి కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కారణమని, ఆ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గట్టిగా వ్యవహరించాలని రెండు రాష్ట్రాల మధ్య తగాదాలు పెట్టేందకు ప్రయత్నిస్తున్నది. కొంపకు నిప్పు పెట్టి నీళ్ళతో ఆర్పమని సలహా చెప్పినట్లు వుంది బిజెపి తీరు. 131 టియంసీల సామర్థ్యంతో నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు వాలుగా వుండడంతో వరద నీటి ప్రవాహం వల్ల పూడిక పెరిగి ప్రతి సంవత్సరం 1/2 టియంసి తగ్గిపోతూ వస్తుంది. దీనివల్ల బచావత్‌, బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పుల కేటాయింపులకు, వాస్తవ నీటి వినియోగానికి చాలా వ్యత్యాసం వుంది. ఈ ప్రాంత రైతులు, మేధావుల ఒత్తిడితో గతంలో ఎన్‌.టి.రామారావు, ఆ తర్వాత వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి నీటి సామర్థ్యం పెంచడానికి, హెచ్‌.ఎల్‌.సి కి సమాంతర కాలువ నిర్మించడానికి కొన్ని ప్రయత్నాలు చేశారు. అయితే ఆ తర్వాతి కాలంలో అవేవీ కార్యరూపం దాల్చలేదు. హెచ్‌.ఎల్‌.సి ఆధునీకరణ పనులు చేపట్టి 15 సంవత్సరాలు కావస్తున్నా ఈ నాటికీ పూర్తి చేయకుండా పాలకులు చెలగాటమాడడం ఈ ప్రాంత ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. కేంద్రం1953 అక్టోబర్‌ 1న కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలతో జాయింట్‌గా తుంగభద్ర బోర్డును ఏర్పాటు చేసింది. పేరుకు ఉమ్మడి బోర్డుగా వున్నప్పటికి మన రాష్ట్రానికి వున్న అధికారాలు చాలా పరిమితం. హెచ్‌.ఎల్‌.సి సమాంతర కాలువ నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన కర్ణాటక ప్రభుత్వంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చలు జరపాలి. ఈ దిశగా పాలకుల మీద ఒత్తిడి తెచ్చేందుకు రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంత ప్రజలు ఉద్యమించాలి.
YSRCP కేంద్ర కార్యాలయంలో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ ముఖ్యమంత్రి Y.S జగన్మోహన్ రెడ్డి..
వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ ముఖ్యమంత్రి మరియు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైస్ జగన్ గారు కార్యక్రమానికి హాజరైన అనంతపురం వైఎస్సార్సీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డి గారు మరియు పార్టీ నేతలు..
78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జండా ఆవిష్కరించిన.. ఎంపీపీ దాసరి సునీత..
బుక్కరాయసముద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జండా ఆవిష్కరించి వందనం చేస్తున్న ఎంపీపీ దాసరి సునీత గారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది ఉపాధి హామీ సిబ్బంది మరియు నాయకులు పాల్గొన్నారు
78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, మాజీ ఎమ్యెల్యే కాపు రామచంద్రారెడ్డి..
78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, మాజీ ఎమ్యెల్యే కాపు రామచంద్రారెడ్డి ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు గారు హార్ ఘర్ తిరంగా రాయలసీమ జోనల్ ఇంచార్జ్ కాపు రామచంద్రారెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం స్వాతంత్రం రావడానికి అనేకమంది స్వాతంత్ర సమరయోధులు త్యాగదనుల యొక్క త్యాగాలతో ఈరోజు మన అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నామని అలాంటి త్యాగదనులందరినీ కూడా నేటి సమాజానికి వారి పోరాటాలు తెలియజేసే బాధ్యత మనకుందని, కొన్ని లక్షల మంది స్వాతంత్రం కోసం ప్రాణాలర్పిస్తే వచ్చిన స్వాతంత్రం భారతంలో మనం ఎంత స్వేచ్ఛగా ఈరోజు బతుకుతున్నామని అతి చిన్న వయసులోనే ప్రాణాలకు ఇచ్చిన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్,ఝాన్సీ లక్ష్మీబాయి, వీర సావర్కర్, సుభాష్ చంద్రబోస్ ఇలా అనేకమంది తమ జీవితాలను త్యాగం చేశారని స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల్లో గత పది సంవత్సరాలుగా మన దేశం ఎంతో గర్వపడే విధంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిరంతరం పనిచేస్తూ దేశాన్ని ప్రపంచ పటంలో ఉన్నత స్థాయిలో పెట్టాడని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశం విశ్వ గురువుగా నిలుస్తుందని మనందరం కూడా మన ప్రధానమంత్రి గారు చెప్పినట్లు విదేశీ వస్తువులు కొనుగోలు చేయకుండా స్వదేశీ వస్తువుల్ని కొనుగోలు చేసినట్లయితే ఆర్థికంగా కూడా మన దేశం మొదటి స్థానంలో ఉంటుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రత్మమయ్య, లలిత్ కుమార్, అల్లాడి రామచంద్రయ్య, ఆదిలక్ష్మమ్మ, పైల నరసింహయ్య బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, శ్రీధర్, నాగరాజు, ఆజేష్ యాదవ్, సూర్య ప్రకాష్ ,రంజిత్ ఇలియాజ్ ,అనంత కుమారి,మల్లీశ్వరి, రవికుమార్ ,చలపతి, వెంకటేష్, శివ, మండల అధ్యక్షులు అయ్యన్న, బోయ లక్ష్మణ్ ,వెంకటనారాయణ గౌడ్, గౌతమ్, సుధాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు
లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన మంత్రి పయ్యావుల కేశవ్
లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు అనంతపురం నగరం లోని అంబేద్కర్ భవనం వెనుక నూతనంగా నిర్మించిన ప్రైవేటు హాస్పిటల్ ప్రారంభానికి వచ్చిన మంత్రి కేశవ్ హాస్పిటల్ ప్రారంభించి, హాస్పిటల్ లిఫ్టు లో పై అంతస్తులో కి వెళ్తున్నప్పుడు లిఫ్టులో జనాభా ఎక్కువగా ఉన్నందున లిఫ్ట్ మద్యలోనే ఆగి పోవడంతో. ఊపిరి ఆడకుండా మంత్రి ఇబ్బందులు పడ్డారు.త్వరగా సగం తలుపులు తీయగా మద్యలో నుండి దూరి బయటికి రావడం జరిగింది.
ఎమ్మెల్యే బండారు శ్రావణి నీ మర్యాదపూర్వకంగా కలిసిన కొత్తగా ఎన్నికైన స్కూల్ చైర్మన్లు..
ఎమ్మెల్యే బండారు శ్రావణి నీ మర్యాదపూర్వకంగా కలిసిన కొత్తగా ఎన్నికైన స్కూల్ చైర్మన్లు..

మండల కేంద్రమైన నార్పల ఎస్సి కాలనీ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల చైర్మన్ పూజారి చైతన్య, గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రాథమిక చైర్మన్ షేక్ వలి,జ్యోతిరావు పూలే బాలికల పాఠశాల చైర్మన్ రవి పులసలనూతుల చైర్మన్ రామంజి శిoగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి గారి ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మా ఎన్నికలకు సహకరించిన టిడిపి ఎమ్మెల్యే బండారు శ్రావణి గారికి,రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు గారికి,జిల్లా నాయకులు టీడీపీ వెంకట నరసానాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.టీడీపీ కార్యాలయంలో పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణి మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధి కి,విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పి ఎల్ లక్మి నారాయణ, చంద్రబాబు,నడిమింటి రాము,గొల్లపల్లి దనుంజయ యాదవ్, ప్రసాద్,మహేష్,హరీష్,గణేష్,వడ్డే మహేష్ తదితరులు పాల్గొన్నారు.